Page:92
అనేక మట్టిగడ్డలు ఒకచోట ఉన్నాయనుకో... ఆ మట్టి గోడలన్నిటిలో ఉన్నది ఒకమట్టియే కదా! ఒకే చిద్వస్తువు అనేక ఆకారములుగాను, రూపములుగాను ఉదయిస్తోంది. "చిత్ రసఉల్లాసము”చే అనేక దృశ్యములుగా దృశ్యమానమగుచున్నదంతా పూర్ణప్రదమగు స్వస్వరూపమే! అటువంటివే..... ఈ జగత్ ఖండములు కూడా!
‘చైతన్యము' తన యొక్క సంకల్పముల ప్రభావంచేత నిర్మించబడుచున్న దృశ్యములను తానే స్వయంగా గాంచుచు, అనుభవించుచున్నది. జీవశక్తి ఈ దృశ్య ప్రపంచమును ఈ విధంగా పొందుతోంది. అనగా ఆత్మ తన యొక్క విస్తృత స్వరూపమును ఈ రూపముగా భావన చేయు చున్నది... అని విజ్ఞులు అవగాహన చేసుకుంటున్నారు.
ఇక సమానమైన ఆకారములు కలిగినట్టి వాసనలు ఉదయించటం చేత కొన్ని జగత్ ఖండములు పరస్పరం కలియటం జరుగుతోంది. అట్లు వివిధ జగత్తులు ఒకదానితో ఒకటి ప్రవర్తిస్తూ మరల ఎప్పుడో నశించుచున్నాయి. మరికొన్ని జగత్ ఖండములు ఒకదానితో మరొకటి
కలియటమే లేదు.
ఓ రామచంద్రా! నీవు 'పరమ సూక్ష్మదృష్టి’తో, 'జ్ఞానముతో కూడిన చిత్తముతో” ఇదంతా గమనించాలి. ఈ వేలాది ప్రపంచములను చూస్తున్నావా? చిత్తమునందు, ఆకాశము నందు, శిలల యందు, అగ్నిజ్వాల లందు, వాయువు నందు, అరణ్యము లందు, సముద్ర గర్భము లందు, ప్రతి పరమాణువు నందు వేలకొలది 'జగత్ సమూహములు” పొందబడుచున్నాయి.
ప్రతి నువ్వు గింజలోనూ నూనె ఉండి ఉన్నది కదా...! ఆరీతిగా, ప్రతి చిత్తమునందు లక్షల కొలది జగత్తులు ఉన్నాయి. ఈ చిత్తమునకు (అనగా ఈ చిత్తములోని జగత్తులకు) సిద్ధి కలిగినప్పుడు ఈ చిత్తమే 'చైతన్యముగా' అగుచున్నది.
అనుబంధములు, భేదభావనలు - శుద్ధము, సర్వవ్యాపకము అయిన “చైతన్యము” యొక్క అంతరము నందు పరస్పర సమ్మేళనము సిద్ధిస్తోంది. అట్టి సమ్మేళనమే ఈ జీవుల యొక్క అనుబంధములు - భేదభావములు కూడా. అట్టి అనుబంధత్వము కారణంచేత ఒక భ్రమలాగా బ్రహ్మ మొదలగు సృష్టిదేవతలచే కల్పించబడిన ఈ భౌతిక జగత్తు జీవులందు ప్రతిబింబిస్తోంది.
ఈ ప్రపంచము ఒక దీర్ఘ స్వప్నము వంటిది. కొందరు జీవులు ఒక స్వప్నము నుండి మరొక స్వప్నమును పొందుచున్నారు. ఇట్టి స్వప్న పరంపరల యొక్క పరిభ్రమణమే దృశ్యముగా అనుభవ మవుతోంది. వాసనల దార్ద్యము (density) చే అది దృఢరూపమును పొందుతోంది. చైతన్యము తన యొక్క వాసనలని అనుసరించి దేనిని ఎట్లు భావిస్తే అది అట్లే అనుభవరూపం పొందుతోంది. ఆ విధంగా చైతన్యము స్వప్న సదృశంగా అనుభవిస్తున్నదంతా అనుభవసమయంలో సత్యముగానే ఉంటోంది. ఒక బీజమునందు వృక్షతత్వమంతా దాగి ఉంటున్నట్లు, వాసనతో నిండియున్న చిదణువునందు సూక్ష్మ రూపమున ఈ జగత్తులన్నీ ఉంటున్నాయి.
Page:93
చిత్ పరమాణువులు, జగత్ పరమాణువులు - - “చిత్" అంటే 'ఎరుక' కదా! ఈ అనేక మంది జీవులు అనేక చిత్ పరమాణువులు. అట్టి ఈ చిత్ పరమాణువుల భావనా వైచిత్రమే జగత్పరమాణువు లందు ప్రవేశిస్తున్నాయి. ఈ “జగత్తు - - చిద్వస్తువు”... ల పరస్పర ప్రవేశము, పరస్పర సమావేశము ఎంతటి ఆశ్చర్యకరమైనది!
ఒక విధంగా ఇక్కడ చిదాకాశమే చిదాకాశమునందు జగత్తుగా ప్రదర్శనమవటం. అనగా, వాస్తవానికి లీనమవటం జరుగుతోంది.
ఈ చిదాకాశమునే భ్రమరూపమగు జగత్తుగా అందరు చూడటం జరుగుతోంది.
కాబట్టి రామా! నీవు “ద్వైతము - ఏకత్వము”... అను రెండు భ్రమలు త్యజించివేయి. ఈ జీవులు 'చిత్' అను అంశమును స్వభావముగా కలిగియున్నారు. అట్టి వీరు, 'చిదంశములే' అయినట్టి దేశ-కాల-క్రియా రూపములైన అణువులను ఏదో అన్యమైన బాహ్య వ్యవహారము వలె గాంచుచున్నారు.
వాస్తవానికి ద్రష్టకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ సంభవించదు. ద్రష్టయే దృశ్యరూపమున విస్తరిల్లుచూ...., ఆస్వాదిస్తున్నాడు.
బ్రహ్మదేవుని నుండి ఒక కీటకము వరకు ఈ సర్వప్రాణుల జీవన విధానము, భావన చేయు రీతి... అంతా కూడా వారి వారి అంతఃకరణోపాధి (మనస్సు - బుద్ధి - చిత్తము - - అహంకారము) చేతనే ప్రాప్తిస్తోంది. అయితే, 'జాగృత్' లోని సర్వవ్యవహారములు గాఢ నిద్రా సమయంలో మరుగునపడి ఉంటున్నట్లు, సంసార వ్యాపకము ఆశ్రయించు సమయంలో ఆత్మదృష్టి మరుగున పడుతోంది. ప్రళయకాలంలో జీవునిలో ఇదంతా 'అప్రకటితం'గా, సృష్టికాలంలో స్వప్నానుభవం లాగా 'ప్రకటితం'గాను, అగుచున్నది. అనగా, ఈ జగత్ వ్యవహారదృష్టి అంతఃకరణంలో ఉండి ఉంటోంది. భావించబడునదంతా అధిగమించి, భావించువాని తత్వమేమిటో పరిశీలించామా... బ్రహ్మ మొదలుకొని పురుగువరకు ఇక్కడ గల ప్రతి జీవుని స్వరూపము (దృశ్యరహిత ద్రష్టగా) నిత్యము, అఖండము, అప్రమేయము అయివున్నాయి.
ద్వైత భ్రాంతి, వ్యష్టి - ఓ రాఘవా! ఈ జగత్తు ఒక అనిర్వచనీయమైన 'స్ఫురణ'గా ప్రాప్తిస్తోంది. యథార్థమైన దృష్టిని పెంపొందించుకున్న మహనీయులకు ఇక్కడ 'అర్థవంతమైనది, సారవంతమైనది' - - అనునది ఏదీ లభించకున్నది. తీవ్రమైన జ్వరములో బాధింపబడు మానవుడు పరిసరములన్నీ తిరిగిపోతున్నట్లు భావిస్తూ ఉంటాడు. అట్లాగే ఈ 'జీవుడు' అని చెప్పబడుచున్న 'చిత్' స్వరూపుడు తనకుతానే ద్వైతమైన రూపాదులను అనుభవిస్తున్నాడు. స్వస్వరూపమగు ఆత్మనే అతడు అట్లు వివిధ రీతులుగా (అనేక జగత్ దృశ్యపరంపరల రూపంగా) పొందుచున్నాడు.
చైతన్యమే స్వరూపముగాగల ఈ చిత్ అణువు (జీవుడు) తనయొక్క 'అంతఃకరణము' (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము... అను ఉపాధి)చే ఈ ఇంద్రియములలో ప్రవేశిస్తోంది. వీటి ద్వారా ఇంద్రియజ్ఞానము వెడల గ్రక్కుతోంది. స్వయముగా విశాలమగు దృశ్య దేహరూపమున స్పురించుచున్నది.
Page:94
ఈ దృశ్యమునకు 'బీజభూతము' అని చెప్పదగ్గ చైతన్యము సర్వవ్యాపకము, నాశరహితము సుమా! ఒక చోట అనేక కుండలున్నాయి. అవి ఆయా సమయాలలో కుమ్మరిచేత నిర్మించ బడుతున్నాయి. కుండలన్నిటిలో ఉన్నది మట్టే కదా! వేరు వేరు సమయములలో తయారు చేయ బడిన వేరు వేరు కుండలు వేరువేరైన మట్టివలె కనిపిస్తాయి. వేరువేరు కుండలలో ఒక కుండ, వంటి ఈ వ్యష్టి జీవుడు స్థూలదేహంలో ప్రవేశించి ఇంద్రియముల ద్వారా తదితర స్థూల దేహములను గాంచుచున్నాడు. అతడు “నేను దేహమును” అను దృష్టి త్యజించినప్పుడు, తన యందు మరియు ఇతర కుండలలో (దేహములలో) కూడా ఘటాకాశము వలె అతి సూక్ష్మమైనట్టి 'ఆత్మాకాశము'ను గాంచగలడు.
"నేను నాశరహితమగు ఆత్మను” అని గ్రహించినప్పుడు అట్టి మహాత్ముడు సర్వుల యందలి నాశరహితత్వమును, అభేదత్వమును గాంచగలుగుచున్నాడు. తన యందు సర్వమును, సర్వము నందు తనను సర్వదా సందర్శించగలడు.
సమష్టి బ్రహ్మాండాత్మకుడు - “నేను ఈ సమష్టి - - తత్త్వమును' అను సమష్టి అహంకారమును ఆశ్రయించి యున్న మరొక జీవుడు తనయందే అనేక దోషములతో కూడిన ఈ జగత్తును గాంచుచున్నాడు. తాను చూస్తున్న సమష్టి వ్యవహారంలో దీర్ఘకాలంగా అభేదం పొంది, మునిగి తేలుతున్నాడు. అందులోనే “ఉత్పన్న - వినాశములు” అను స్వప్నం పొందుచున్నాడు. అట్టి స్వప్న రూపమగు జగత్తునందు అనేక రూపములైన "స్వప్నములలో స్వప్నములు" వంటివి ఒక పరంపరగా పొందుచున్నాడు. ఊహానిర్మితమైన పర్వతశిఖరం నుండి ఊహానిర్మితమైన జలపాతం వెంట ఊహానిర్మితమైన శరీరములను దొర్లించుచు, బీభత్సమంతా అనుభవిస్తున్నాడు. (సమష్టి సృష్ట్యహంకారి - బ్రహ్మదేవుడు).
విద్య, అవిద్య - ఓ రామచంద్రా! అసంఖ్యాకములైన ఉపాధులతో కూడిన ఈ విస్తారమైన ప్రపంచమును గమనిస్తున్నావా? ఇవన్నీ స్వకీయమైన కల్పనాచమత్కారము చేతనే స్ఫురిస్తున్నాయి.
ఈ దేహాలు... చూడు. వీటిలో కొన్ని దేహములు పరస్పరంగా అనేక భ్రమ విభ్రమములు కలిగి ఉంటున్నాయి. మరికొన్ని దేహములు సర్వభ్రమలు త్యజించివేసి ఆత్మయందు స్థితి కలిగి ఉంటున్నాయి. కొన్ని “వ్యాప్తమై, దృశ్యమానమగుచున్న ఈ ప్రపంచం అసత్తు, స్వప్నతుల్యం అయి వున్నది కదా?” అను ఎరుక కలిగియుండి, ఇక ఆపై, తదితర జీవుల వలెనే ఆయా దృశ్య వ్యవహారాలలో క్రీడామాత్రంగా పాల్గొనుచున్నాయి. అట్టి జీవులను 'సుజ్ఞానులు’ అని అంటున్నాం. శ్రీరాముడు : తండ్రీ! ఈ దృశ్యములలో విడివిడిగా వేరు వేరు సంస్కారములతో కూడి కనిపిస్తున్న ఈ జీవులంతా సత్యముగా ఉన్నారా? లేరా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ దృశ్యమంతటా ప్రసరించివున్నది ఆత్మయే. ఆత్మయే సర్వముయొక్క అధిష్ఠానము అయివుండుటచేత ఇందులో ప్రతిజీవుడు “సత్యమే” అయివున్నాడు.
అంతేకాదు...
Page:95
ఎచట సర్వవ్యాప్తియగు ఆత్మ కలదో, అచట సమస్తం వివర్తరూపమున ఉదయిస్తూనే ఉన్నది. జీవము, ఆ జీవము యొక్క ప్రతిభాస, ఆ ప్రతిభాసలో మరల జీవము... ఇట్లు, ఆత్మయే స్వస్వరూపముగా గల ప్రతి జీవియందు ఏర్పడి ఉంటోంది. జీవుడు... ఆ జీవునిలో మరొక జీవుడు... అందలి ప్రతిజీవునిలో మరికొంతమంది జీవులు... ఈ విధంగా అరటి మట్టలవలె ఒక జీవునిలో అసంఖ్యాకములగు జీవరూపములు ఉంటూనే ఉంటున్నాయి.
‘ప్రపంచం’ అనుదానితో కూడినవాడైనట్టి ఈ జీవునియందలి 'జీవసత్త'కు కారణం ఏమిటి? అవిద్యతో కూడుకున్నట్టి చైతన్యమే సుమా!
శ్రీరాముడు : అయితే, మహర్షీ! అతి దీర్ఘకాలంగా జన్మ కర్మల మధ్య చిక్కిన ఈ జీవునియందు పొరలుపొరలుగా ఏర్పడియున్న అల్పత్వము తొలిగేది ఎట్లు? ఎన్నటికి? ఇతనిలో ఆత్మకు సంబంధించిన అనుభవం ఏర్పడేది ఏ విధంగా?
దృశ్యబుద్ధిపరావృత్తా సమమే తదన న్తరమ్ | హేమ్నీవకటకాదిత్వం పరిజ్ఞాతవినశ్యతి ॥ (సర్గ 18, శ్లో 63)
శ్రీ వసిష్ఠ మహర్షి : జీవునియొక్క ఈ బుద్ధి దృశ్యపదార్థములవైపు అభిముఖమై ఉండి ఉంటోంది. ఇప్పుడీబుద్ధి, దృశ్యపదార్థముల నుండి వెనుకకు మరల్చబడి, ప్రత్యగాత్మవైపు అభిముఖం అయితే చాలు. ఆభరణత్వమునకు అతీతమైన దృష్టితో చూచువారికి దానియందు బంగారమే ప్రత్యక్షమై తీరుతుంది కదా! ఈ జీవుడు తనయందలి పదార్థత్వమును అధిగమించివేస్తే, అప్పుడు ప్రత్యగాత్మత్వముతో ప్రకాశించగలడు. అనగా తనయందలి 'ఆత్మలక్షణములు’ అయివున్నట్టి అఖండత్వము అప్రమేయత్వము, అశరీరత్వము, అద్వితీయత్వము, అకాలత్వము లను అతడు గ్రహించటం జరుగుతోంది.
అయితే ఆభరణములకు క్రొత్తగా ఏమైనా ప్రయత్నములచే సువర్ణత్వము వచ్చిపడుతోందా? శ్రీరాముడు : లేదు. ఆభరణములు (గాజులు, గొలుసు) మొదటే సువర్ణము, క్రొత్తగా సువర్ణత్వము రావలసిన పనిలేదు.
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. అదే విధంగా, "నేను స్వయముగా ప్రత్యగాత్మస్వరూపమునే...” అను భావన సుస్థిరమగుచుండగా, ఈ బాహ్య అభ్యంతర ప్రపంచమంతా అట్టి జీవుని దృష్టిలో స్వయముగా రహితమై పోతోంది. నేను స్వతఃగా సదా ప్రత్యగాత్మ స్వరూపుడనే”.... అని నిర్మల హృదయుడు గమనించుచూనే ఉన్నాడు.
విచారోయస్యనోదేతి కో_హంకిమిదమిత్యలమ్ | తస్యానర్నవిముక్తోసౌ దీర్ఘాజీవజ్వరభ్రమః ॥ (సర్గ 18, శ్లో 64)
ఎవనియందైతే, "నెనెవరిని? ఈ ప్రపంచమేమిటి?” అను విచారణ కలుగుతుందో, అట్టి వానికి మాత్రమే, "ప్రత్యగాత్మ అనేది నాయందలి నిత్యసత్యమే” అని తెలియవస్తోంది. అట్టి
Page:96
దర్శనము పొందినందుకు ప్రయోజనంగా గొప్ప రోగరూపంగా ప్రాప్తిస్తున్న 'సంసారము' అనబడే ఈ దీర్ఘకాల విభ్రమమంతా తొలగిపోతుంది.
అట్లా కాకుండా... ఎవని దృష్టిలో అయితే, "ఇది జగత్తు, ఇది నీవు. ఇది నేను. ఇది నాది. ఇది పొందవలసియున్నది...” అనుబుద్ధి తొలగదో, అట్టివాడు బంధము కలిగియే ఉంటున్నాడు. శ్రీరాముడు : ఈ జీవుడు తనయందలి పూర్ణత్వమును అనుభవపూర్వకంగా గ్రహించాలంటే తత్వవిచారణ ఒక్కటే శరణ్యమని నేను అనుకుంటున్నాను.
విచారఃసఫలస్తస్య విజ్ఞేయోయస్యసన్మతేః |
దినానుదినమాయాతి తానవం భోగగృధ్నుతా॥ (సర్గ 18, శ్లో 65)
శ్రీ వసిష్ఠమహర్షి : అవును నిజమే. అయితే సద్బుద్ధి గలిగినట్టి ఏ మనుజుడైతే ఒకవైపు విశ్లేషణ
- అవగాహనలను సంస్కరించుకుంటూనే, మరొకవైపు తనయందలి భోగలాలసత్వమును
క్షణక్షణం క్షీణింపజేసుకుంటూ ఉంటాడో... అట్టి వానిచే చేయబడుచున్న విచారణ మాత్రమే సఫలమగుచున్నదని గ్రహించు.
మంచి ఔషధం సేవిస్తే ఆరోగ్యం పొందుతాము కదా! "ఇంద్రియములను జయించుట” అనునది అభ్యసిస్తే వివేకము అనునది ఫలవంతమౌతూ ఉంటుంది.
అట్లా కాకుండా, కొందరి విషయంలో ఒక విచిత్రం జరుగుతోంది. వారిలో వివేకము కేవలం వచనామాత్రంగానే (కబుర్లవరకే ఉంటోంది. ఆ వివేకం వారి మనస్సునందు ఏర్పడుట లేదు. వారి అవగాహనలలో, కర్మలలో ప్రతిబింబించుటలేదు. చిత్రపటంలోని అగ్నితో నీళ్ళు కాచుకోగలమా? మనస్సునందు వివేకమును ప్రస్ఫుటం చేసుకోలేనివాడు, మాటలు చెప్పగలిగి నప్పటికీ, అవివేకిగానే శేషించుచున్నాడు. అయితే 'వివేకము' అనేది స్వగతమైన అవగాహనకు సంబంధించినదేగాని, బాహ్యగతమైన రూప-నామ-క్రియాదులకు సంబంధించినది కాదు.
“కోరికలు సన్నగిల్లుట” అను మార్గములో ప్రయాణం చేస్తూ ముందుకు పోతున్న మానవునికి మాత్రమే వివేకము వికసించుట జరుగుతోంది.
వాయువు యొక్క సత్త (The existence of air) ఎన్ని మాటలు వింటే ఎరుగగలం? ఆ వాయువు మనను స్పర్శించినప్పుడు క్షణంలో ఎరుగుతాం కదా! అన్నిటికన్నా ముఖ్యం అనుభవం.
ఒక చిత్రపటంలోని అగ్ని నిజమైనా అగ్నా? అందలి అమృతం నిజమైన అమృతమా? అందలి స్త్రీ నిజమైన స్త్రీయా? కాదు కదా! అట్లాగే “వాచావివేకము ఏర్పడినంతమాత్రంచేత నిజమైన వివేకం పొందినట్లు కాకపోవచ్చు" అని శ్రోతలకు జాగరూకత చెప్పుచున్నాను. “వాచా మాత్ర వివేకం (Not true discrimination), 'పరిమిత దృష్టి' ఉన్నచోట అవివేకమే అవుతుంది. అనుభవమే వివేకమునకు తార్కాణం.
xXx
Page:97
వసంతకాలం ప్రవేశించిన వనంలో కొన్ని విశేషాలు ఏర్పడుతాయి కదా! అట్లాగే వివేకము ఉదయిస్తున్నట్టి జీవునియందు కొన్ని విశేషాలు మనకు కనబడుతూ ఉంటాయి. వివేకము యొక్క ఆగమనముచే మొట్టమొదట రాగము సన్నగిల్లుతుంది. ఆ తరువాత వైరము సమూలముగా నశించిపోతుంది. అప్పుడు జ్ఞానము వికసిస్తూ ఉండగా, “ 66 ఇష్ట వస్తువు లభించుగాక! అయిష్ట వస్తువు తొలగు గాక”... అను ఆవేశ కావేశాలు కూడా క్రమంగా సన్నగిల్లుతూ ఉంటాయి.
కాబట్టి ఓ సభికులారా! సర్వజనులారా! అనుభవముతో కూడిన వివేకముగల మానవుడు ధన్యుడు. అతడు పరమపావనుడు. మీరంతా మీయొక్క అవివేకమును తొలగించుకోవటానికనే నియుక్తులు అవండి. ఈ ఉత్తమ మానవజన్మ పొందినందుకు గాను 'సార్థకత'కు ప్రయత్నించండి. ఉత్తిష్ఠ! ఉత్తిష్ఠ!
9. శుద్ధ చైతన్యము - ప్రాపంచిక క్లేశములు
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఒక వృక్షమునకు ప్రారంభస్థితి బీజమే అయివున్నది కదా! ఈ జీవునకు బీజము "బ్రహ్మము” అయి వున్నది. అట్టి బ్రహ్మము ఆకాశము వలె సర్వత్రా వెలయుచున్నది. ఈ జీవునిపట్ల మనకు కనిపించే జగత్తులో అనేక జగత్తులు అంతర్లీనమై ఉన్నాయి. అరటి మట్టలవలె, భూమిపైగల పెద్ద సంఖ్యలో ఉన్న కీటకములవలె ఈ జీవుని యందు అనేకమంది జీవులు ఉన్నారు. వేసవిలో చమటలో నుండి ఆయా క్రిమిజాలమంతా ఉత్పన్నమౌతుంది చూచావా? శుద్ధ చైతన్యము బాహ్య అభ్యంతరము లందు అనేక దృశ్య రూపములను ధరించుచు అనుభవించుచున్నది. అది ఎక్కడ దేనిని ఆశ్రయిస్తుందో అక్కడ అద్దానిగా అవశ్యము పరిణమిస్తూనే ఉంటుంది.
ఈ జీవులు అనేక విధములైన ఆరాటములతో ఏమేమి ప్రయత్నములు చేస్తున్నారో, అవన్నీ ‘స్వాత్మసిద్ధి' చేత మాత్రమే చివరికి పరిసమాప్తి పొందుచున్నాయి సుమా! అయితే వారు మధ్య మధ్యలో ఏ ఉపాసనాక్రమముచే ఏఏ విధంగా ప్రయత్నిస్తారో ఆయా విధంగా అట్లే ఆయా పరిణామాలు ప్రాప్తిస్తూ వస్తున్నాయి.
దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతారు. యక్షులను ఆరాధించేవారు యక్షులనే చేరుచున్నారు. హిరణ్యగర్భుడగు బ్రహ్మను ఆరాధించేవారు బ్రహ్మనే పొందుచున్నారు.
అఖండము, నిత్యము, సర్వము అగు బ్రహ్మమును ఆరాధించేవారు బ్రహ్మానుభవమునే పొందుచున్నారు. కాబట్టి రామా! ఏది ఉత్తమమైనదో అదియే నీచేత ఆరాధించబడుగాక!
మన శుక్రుడు మొట్టమొదట 'అప్సరస రూపము” అను దృశ్యమును చూచాడు. అట్లు చూస్తున్నప్పుడు, “మలిన చిత్తస్వభావము”చే బద్ధుడు అయినాడు. మరొక సమయంలో “నేను
Page:98
దుష్ట సాంసారిక స్వభావమును ఆశ్రయించానేమిటి?” అనే 'మెళుకువ'ను ఆశ్రయించాడు. మరల తపస్సును, ధ్యానమును నిర్వర్తించుటచే జ్ఞానమును సముపార్జించాడు. చిత్తము శుద్ధము అయింది. అట్టి చిత్తనిర్మలత్వము యొక్క ప్రభావముచే “ముక్తి”ని సంపాదించాడు.
వాస్తవానికి ఈ జీవుడు శుద్ధ చైతన్యస్వరూపుడే.
శుద్ధ తత్వానుభవమునందు ఉండి ఉండియే.... ఈ శుద్ధచైతన్యము ఒకప్పుడు కాకతాళీయంగా ప్రాపంచిక వ్యసన క్లేశములను స్వయముగా ఆశ్రయిస్తోంది. అయితే, ఒకడు ఆదమరచినంత మాత్రం చేత తననుతాను కోల్పోవుచున్నాడా? లేనే లేదు. అట్లాగే ఏ జీవుడూ కూడా ఎప్పుడూ కంటె 'ఆత్మత్వము'ను ఏ మాత్రం కోల్పోవుటయే లేదు.
10. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయములు
శ్రీరాముడు : హే మహర్షీ! మీరు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను గురించి కొన్ని విశేషాలు మాకు చెప్పారు. వీటికి ఒకదానితో మరొకదానికి గల సంబంధమేమిటో మరికొంత వివరించండి.
ఈ జాగ్రత్తు సత్యమువలె వ్యవహారహేతువై, కార్య - కారణములతో కూడినదై ఇట్లు ఎందుకు ప్రాప్తిస్తోంది?.... స్వప్నము భ్రమగాను అసత్యముగాను ఎందుకు ఉండి ఉంటోంది?... జాగ్రత్తు స్థిరంగాను, స్వప్నం అస్థిరంగాను ఎందుకు ఏర్పడి ఉంటోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ప్రతిజీవుని యొక్క శుద్ధ చిత్ స్వరూపమునకు ఆకారముగాని, వికారములు గాని లేవు. అది భావముకంటే మునుముందే ఉండుటచే భావాతీతమైనది. అది గుణములకు వేరై ఉండుటచే త్రిగుణరహితమైనది. అనిర్వచనీయమై ఉండి కూడా, “ఉండుట - గ్రహించుట - ఆనందించుట” అను మూడు ప్రకటనలు కలిగి ఉంటోంది. (సత్-చిత్-ఆనందం)
శుద్ధస్వస్వరూపం
భావములు
అనుభవములు
త్రిగుణములు
1
V
జాగ్రత్ స్వప్నము సుషుప్తి
స్వప్నము
Page:99
ఓ రాఘవా! జాగ్రత్తు స్థిరప్రత్యయయుక్తమైనది స్వప్నము అస్థిరమైనది... అనే అభిప్రాయం నీవు వెలిబుచ్చుచున్నావు కదా! అయితే స్వప్నము కూడా ఆ స్వప్నము అనుభవించ బడుచున్నట్టి సమయంలో “ఇది వాస్తవమే” అనే అభిప్రాయము కలుగజేస్తూనే ఉన్నది. అట్టి అభిప్రాయం కలిగించకపోతే 'స్వప్నము' అనే అనుభవమే ఉండేది కాదు. అంటే స్వప్నము కూడా ఆ స్వప్న సమయములో జాగ్రత్తు లక్షణములు కలిగి ఉంటున్నట్లే కదా!
అదే విధంగా ఈ 'జాగ్రత్తు' కూడా అనేక అస్థిరములైన విశేషములు కలిగి ఉండటం చేత ఇదంతా స్వప్నతుల్యమే అగుచున్నది. ఇక “అనుభవ విశేషం" (The process of experiencing) విషయానికి వస్తే.... “ఇది స్థిరము - ఇది అస్థిరము” అను భావన ప్రాప్తించటం తప్పించి, జాగ్రత్ స్వప్నములకు భేదమేమున్నది చెప్పు? ఆ రెండింటిలోని 'అనుభవం' అనునది మాత్రం సమమే అయి ఉన్నది. ఆ రెండూ కూడా ద్రష్ట యొక్క అనుభవములే కదా!
స్వప్నం కూడా స్వప్నకాలంలో కొంత స్థిరత్వమును జీవునకు పొందింపజేస్తూనే ఉన్నది. అందుచేత స్వప్నానుభవం జాగ్రత్ అనుభవమునకు సమానమైనదే.
అట్లాగే ఒకడు తనయొక్క బాల్యపు అనుభవములను, సంబంధములను, భావనలను గుర్తు తెచ్చుకుంటున్నప్పుడు అవన్నీ స్వప్నములాగానే హృదయాకాశంలో చూడబడుచూ ఉంటాయి. అసలు ఈ జాగ్రత్ - స్వప్నములను “అనుభవములు - అనుభవజ్ఞుడు... దృష్ట్యా చూచినప్పుడు ఏ అనుభవం ఎంతసేపు స్థిరంగా ఉంటోందో చెప్పు?
“స్వప్నము కూడా జాగ్రత్తువలెనే అనుభవం కాగలదు?" - అని చెప్పటానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. “హరిశ్చంద్రుడు” అను రాజుకు ఒక్క రాత్రి యందలి స్వప్నంలో 12 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ప్రాప్తించింది. "అసత్యము పలుకకుండుట"... అను అతని జాగ్రత్ సంస్కారం స్వప్నంలో కూడా ప్రతిభాసించింది. ఏ బుద్ధియొక్క “స్థైర్యాంశము” (That which tends to be constant) చే మనం ఈ జాగ్రత్తును చూస్తూ “ఇదంతా సుస్థిరమైనదే”... అని భావన చేయటం జరుగుతోందో, అదే బుద్ధియొక్క స్థైర్యాంశము కారణంగా స్వప్నములో కూడా స్వప్న సమయంలో అట్టి భావనయే మనం కలిగి ఉంటున్నాం. “స్వప్నము కూడా జాగ్రత్తువలెనే అన్ని విధములా అనుభవమునకు రాగలదు" అనే విషయం మనం ఉత్పత్తి ప్రకరణం లోని లవణోపాఖ్యానంలో గమనించాము కదా!
స్వప్నంలో కూడా జాగ్రత్తువలె 'జ్ఞానాంశ' స్థిరమైనదే. అయితే 'స్వప్నబుద్ధి' కలిగి ఉన్నప్పుడు మాత్రమే స్వప్న వ్యవహారం ప్రాప్తించటం జరుగుతోంది.
ఏది ఎంతవరకు స్థిరంగా తోస్తూ ఉంటూఉంటోందో అది అంతవరకు 'జాగ్రత్తు’తో సమానమే కదా!
జాగ్రత్తు - ఇక్కడ (జగత్తులో) కనిపిస్తున్న అనేక విశేషాలన్నీ “క్షణభంగురమే” అయి -
ఉండుటచే ఈ జాగ్రత్తు కూడా స్వప్నము వంటిదే.
Page:100
దేనిచేతనైతే ఈ శరీరము ఉజ్జీవించబడుతోందో, అట్టి శరీరాంతర్గత తత్త్వమునే, "తేజము, వీర్యము, జీవము, చైతన్యము” మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ఈ 'జీవించుట' అను కార్య క్రమమునకు హేతువు ఆ చైతన్యమే. ఈ శరీరం మనోవాక్కర్మలచే (by, thought, speech of action) వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పుడు... ప్రాణవాయువులచే ప్రేరితమైన జీవచైతన్యం హృదయం నుండి బయటకు వెడలుచున్నది. బాహ్య ప్రదేశాలలో సంచరిస్తోంది. జీవ చైతన్యం దేహాంతరంలో ఉన్న నాడులో సంచరిస్తున్నప్పుడు, శరీరమంతటా 'జ్ఞానం' లేక 'సంవిత్తు' ఉదయిస్తోంది.
ఆ జీవచైతన్యమే 'దృశ్యము’ వైపు ప్రసరించుచున్నప్పుడు “జగత్తును పొందుచున్నాను” అను భావన పొందుచున్నది. ఇట్టి అనుభవమునే 'చిత్తము' అని అంటున్నాం. అనగా జీవచైతన్యమే దృశ్యమునకు సంబంధించిన 'జగత్ భ్రమ’ను తన యందు అంతు లేకుండా దర్శించుచున్నది. అట్టి జగత్ భ్రమ అటు జాగ్రత్తులోను, ఇటు స్వప్నంలోను కూడా ఉదయిస్తుంది. విహారం సల్పుతోంది.
జాగ్రత్-స్వప్న దృశ్యాలు రెండూ చిత్తము యొక్క అంతర్గత అంతరాంతర విశేషాలే! శ్రీరాముడు : అయితే ఈ జగద్దర్శన వ్యవహారమంతా చిత్తము యొక్క అంతర్గతములో ఏర్పడి ఉంటున్న చమత్కారమేనంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఎట్లా అంటావా? ఈ జీవచైతన్యమే 'నేత్రములు’ మొదలైన 'ఇంద్రియ ఛిద్రములు' గుండా బాహ్య ప్రదేశములకు వ్యాప్తి చెందుచున్నది కదా! అట్లు వ్యాప్తి చెందుచు, వాయువీచికవలె తాను ప్రసరించిన చోటును ఆక్రమించుచు పలువిధ వికారములచే పూర్ణమగు రూపమును తనయందే తాను గాంచుచున్నది.
జీవచైతన్యము స్వతహాగా స్థిరత్వమును పొంది ఉంటున్నప్పుడు, స్వీయ లక్షణమైన స్థిరత్వమును బాహ్యమున దర్శిస్తోంది. అదేరీతిగా స్వతహాగా అస్థిరత్వము పొందుచున్నప్పుడు, అదే అస్థిరత్వమును అట్లే అంతరమున కూడా దర్శిస్తోంది.
ఈ జీవుని యొక్క 'ఇది స్థిరముగానే ఉన్నది' అను భావన అతని “స్వసత్త” యొక్క స్థిరత్వము నకు సంబంధించినదే కాని, మరింక దేనికో సంబంధించినది కాదు. బాహ్యమున ఏదీ స్థిరత్వం కలిగియుండుటలేదు. అట్లే అంతరమున కూడా!
నీ భావనను అనుసరించే సర్వము నీయందు ప్రవర్తించుచున్నది. చిత్తమును అనుసరించే జగత్తు దృశ్యమానమగుచున్నది. స్వసంకల్పములను అనుసరించే, ఈ కనబడే నిత్యానిత్య అనుభవములు ఏర్పడటం, ఉండటం జరుగుతోంది.
దేనిని ఎట్లు పొందుచున్నావో, అదంతా అట్లు నీ చిత్తము నందే ప్రాప్తించుచున్నది. స్వప్నం కూడా చిత్తము యొక్క 'జాగ్రత్తుకు వేరైనచోట' నిర్వర్తిస్తున్న స్వీయరచనా చమత్కృతియే!
Page:101
సుషుప్తి - మరొక సమయంలో ఈ శరీరం మనస్సు - వాక్కు - - కర్మలచే ఏ మాత్రం క్షోభ చెందకుండా ఉంటోంది. అనగా మనస్సు-వాక్కు-కర్మలు మౌనం లేక నిశ్శబ్ధం వహించి ఉంటాయి. అప్పుడిక జీవచైతన్యము శాంతముగాను, స్వస్థతగాను ఉంటోంది. ''సమత్వము’ చెందినట్టి ప్రాణవాయువుతో కూడి, అక్షుభితమై ఉంటోంది? గాలి వీచికలు లేనిచోట దీపం సంచలన రహితంగా ఉంటుంది చూచావా? “సుషుప్తి" అనబడు స్థితిని “నిశ్చలమగుచోట వెలిగే దీపం”తో పోల్చవచ్చు. ఈ సమయంలో అవయవములందలి నాడులయందు దృశ్య విషయ సంబంధమైన జీవప్రసారం ఉండదు. అనగా నేత్రములు మొదలైన ఇంద్రియముల ద్వారా బహిః ప్రసరణ (outward flowing) ఉండదు.
నువ్వులందు నూనె ఉన్నట్లు మంచునందు శీతలము ఉంటున్నట్లు, నెయ్యిలో తైలత్వము ఉంటున్నట్లు సుషుప్తిలోని జీవునియందు మనస్సు అంతర్గతమై మరుగునపడి ఉంటోంది. అట్టి సమయంలో, ఇంద్రియ విషయములేవీ ధ్యానింపబడుటలేదు. కనుక జీవ చైతన్యము బ్రహ్మాత్మ యందు సౌమ్యము వహించి ఉంటోంది. ఒకానొక “సౌమ్యప్రాణ సహిత స్థితి” అనుభవమౌతోంది. స్వప్న - జాగ్రత్తులకంటే వేరే ప్రత్యేకత గల మౌన స్థితిని పొంది ఉంటోంది.
అట్టి సుషుప్తదశలో జ్ఞాన అజ్ఞానములకు భేదం ఉండదు. కానీ 'ఎరుక' అనునది ఉండియే ఉంటుంది. ఆ ఎరుక సుషుప్తి సమయంలో 'మౌనము' అను అనుభవము పొందుచున్నది.
తురీయము - ఇది జాగ్రత్- స్వప్న సుషుప్తులకంటే విలక్షణమైనది. అయితే, అట్టి మూడు సమయములందు అది ప్రకాశించుచూనే ఉన్నది. ప్రజ్వరిల్లుతూ ఉంటున్నది. ఇది వేరైనట్టి ఒక అవస్థ కానేకాదు. మూడు అవస్థలయందు కూడా నిశ్చలముగా, మార్పు చేర్పులు పొందక ఉన్నట్టి నిత్యసాక్షిత్వమే "తురీయము”.
శ్రీరాముడు : మహర్షీ! ఈ తురీయావస్థ ఎప్పుడు ఎట్లు ఎట్టి వారిచే పొందబడుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి : ఒకడు అనేక ప్రయత్నముల ప్రయోజనంగా మరియు శాస్త్రసారమును ఎఱుగుటచే చైతన్యము యొక్క నిత్యసమత్వమును గ్రహించుచున్నాడు. తత్ప్రయోజనంగా, సమస్త దృశ్య వ్యవహారములనుండి 'ఉపరతి'ని పొందుచున్నాడు. ఈ రెండింటినీ సునిశితపరచుచున్నట్టి స్వప్రయత్నముల చేతనే బ్రహ్మ సాక్షాత్కారము ప్రాప్తించుచున్నది.
ఏకాగ్రత, విచారణ యోగి “సర్వ సమత్వము' అనెడి దృఢమైన 'బోధ'ను కలిగి ఉంటున్నాడు. అతడు జాగ్రత్తు నందు ఉండవచ్చు... లేదా... స్వప్నావస్థయో లేక సుషుప్తావస్థయో ఆశ్రయించ వచ్చు. వ్యవహారశీలుడై ఈ సంసారిక, లౌకిక కార్యక్రమములందు నిమగ్నుడై ఉండవచ్చు. లేదా, సర్వ కార్యక్రమములను త్యజించి ఏకాంత నిష్ఠుడై ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ అతని “నిశ్చలసర్వసమ-నిత్యోదిత” స్థితికి ఏమాత్రం లోటు ఉండటం లేదు. “ఈ నేను-నీవు-అతడు-జగత్తు అను వ్యవహారమంతా... సర్వపరిశేష్యము, స్వస్వరూపము అయినట్టి ఆత్మకంటే వేరే ఏమి కాదు”... అని గ్రహించియే, అతడు ఈ సర్వమును దర్శించుచున్నాడు.
Page:102
అట్టి స్థితినే మనం ‘తురీయావస్థ' అంటున్నాం. వాస్తవానికి తురీయస్థితి అనిర్వచనీయమైనది. మాటలకు అందనిది. అయితే, అనుభవముచే గ్రహించబడేదే! జాగ్రత్-స్వప్న సుషుప్తులకు కేవల సాక్షియై, అతీతమై,.... ఆ మూడు విశేషములను తన యందు కలిగియుండి ఉన్నట్టిది.
సుషుప్తి నుండి స్వప్న జాగ్రత్తులకు పునఃప్రయాణం - సుషుప్తి యందు జీవచైతన్యము సౌమ్యత్వమును పొందుచూ, ప్రాణములతో సంచలనరహితమైన ఏకత్వము పొందుతోంది కదా! అట్టి జీవచైతన్యము కొంత సమయమైన తరువాత మరల ప్రాణములచే సంచాలితమగుచున్నది. అప్పుడు అనుభవమునకు సంబంధించిన స్పందన పొందనారంభిస్తోంది. క్రమంగా ఇంద్రియ దృశ్య విశేషముల గురించిన చాంచల్యముచే చలనము పొందుతోంది. అప్పుడు భోగము పొందుటకు అనుకూలమైనట్టి ఇతఃపూర్వపు సంస్కారముల 'ఉద్బోధ' రూపుదిద్దుకుంటోంది. అట్టి ఉద్బోధయే 'చిత్తము' రూపమున ఉదయించుచున్నది.
సుషుప్తి నుండి స్వప్నములోనికి పునరాగమనం - స్వప్నస్థితి యొక్క పునఃప్రవేశ సమయంలో జీవచైతన్యము భావాభావముల రూపమున కల్పనా జగత్తును భ్రమగా పొందుతోంది. అట్టి భ్రమల యొక్క ఫలితంగా తన అంతఃకరణము నందే దృశ్యమును శీఘ్రంగా అవలోకించటం, తాను అద్దాని యందు పాల్గొన్నట్టి అనుభవం పొందటం జరుగుతోంది.
ఎప్పుడైతే జీవచైతన్యము ప్రాణవాయువుచే కొంచెము సంక్షుభితం అవుతుందో, అప్పుడు ‘భావనచేయుట’ అను స్థితిని పొందుచున్నది. ఇక ఎక్కువగా సంక్షుభితం అవటం జరిగితే అప్పుడు విపరీత భావనలను ఆ స్వప్న జగత్తునందే పొందటం జరుగుతోంది.
నాడులు ‘శ్లేష్మజలము’చే పూర్ణమై ఉండునప్పుడు, ఆ సమయంలో నిద్రావస్థలో ఉండే జీవుడు తన అంతఃకరణలోనే అనుభవములు, సంఘటనలు, సంభ్రమములు పొందుచున్నాడు. అదంతా "బాహ్యమున ఏర్పడే ఏవేవో సంఘటనలే” అనుకుని అతడు దర్శిస్తూ ఉంటాడు. స్వప్న సమయంలో నాడులు రక్తముచే పూర్ణమై ఉంటాయి. ధాతుమయమైన ప్రదేశమును, కల్పితమైన కాలమును జీవుడు తనయందు భావనాపూర్వకంగా జాగ్రత్తుతో సమానంగానే గాంచుచు, "ఇదంతా బాహ్యమునందే ఏర్పడుతోంది"... అని మాత్రం అనుకుంటూనే పొందుచున్నాడు.
స్వప్నానుభవం కూడా జాగ్రదనుభవం వంటిదే! - ఈ జీవుడు స్వప్నములో కూడా "నేత్రాదుల ద్వారా జాగ్రత్తులో బాహ్యము నందలి వస్తు జాలమును అవలోకించుట... అను అనుభవముతో సమానమైన వ్యవహారత్వమునే పొందుచున్నాడు. వాస్తవానికి అతడు భౌతికమైన నేత్రములను ఉపయోగించటమే లేదు. నేత్ర రహిత సందర్శనం కొనసాగుతోంది.
శ్రీరాముడు : స్వప్నంలో సంఘటనలు రచించుచున్నది స్వపద్రష్టయేనా? మరింకెవ్వరన్నానా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జీవుడు అనుభవములు అనునది స్వరూపముగా కలవాడే అయివున్నాడు కదా! ఇతడు తనయందు ఏ వాసనలు కలిగివుంటే స్వప్నములో ఆ వాసనలకు సంబంధించిన సంఘటనలనే గాంచుచున్నాడు. అయితే, ఆ స్వప్నము పొందుచున్న సమయంలో జీవచైతన్యము
Page:103
ఈ నేత్రములు మొదలైన ఇంద్రియములలోకి ప్రసరించకుండానే ఆలోచనా సంక్షుబ్దమును (Disturbance by coming across series of thoughts) మాత్రం పొందుచున్నది. అది తన అంతః కరణమునందే తన వాసనలను అనుసరించి ఆయా పదార్థములకు సంఘటనలకు సంబంధించిన అనుభవం కల్పించుకొనుచున్నది.
అందుచేత, ఈ జీవునియందు స్వప్నము బాహ్యము నుండి మరెవ్వరో కల్పించుటలేదు. అనాక్రౌన్హేన్దియచ్ఛిద్రో యతః క్షుభో న్తరేవసః |
సంవిదానుభవత్యాశు సస్వప్న ఇతి కథ్యతే ॥ I (సర్గ 19, శ్లో. 33)
స్వప్నం (నిర్వచనం) = జీవచైతన్యము యొక్క మందబుద్ధి వాసనలతో కూడినప్పటి భావ తరంగములు. అంటే భౌతికమైన ఇంద్రియములు నిద్రాణమై ఉండగా, మనస్సుచే లేక ఊహ యందు ఇంద్రియానుభవములు గాంచటం.
బుద్ధి మందముగా ఉండటం, వాసనలు విజృంభించుట, ఆర్తి... ఈ మూడు అటు స్వప్నమునకు, ఇటు జాగ్రత్తుకు కూడా కారణమగుచున్నాయని గ్రహించు.
జాగ్రత్తులోకి పునఃప్రవేశం -
సమాక్రౌన్తద్ధియచ్ఛిద్రో యః క్షుభోవాయునాయదా ।
పరిపశ్యతి తజ్జాగ్రదిత్యాహుర్ముని సత్మమాః ॥ (సర్గ 19, శ్లో. 34)
జీవుడు ప్రాణవాయువుచే విక్షుబ్ధమై బాహ్యశబ్దాది విషయములను కాంచుటను మునులు జాగ్రత్తని వచిస్తున్నారు. అంటే ప్రాణవాయువు నాడులందు ఇంద్రియములందు ప్రసరించు చుండగా, ‘బాహ్య వస్తువుల విషయములు' సంస్పర్శను వాసనలతో కూడి భావనలతో జోడించి అనుభవమును పొందటం.
అయితే, జ్ఞానవంతుడు, ధీమంతుడు అయిన వాడెవ్వడూ అసత్యమగు ఈ జగత్తు నందు ఎన్నడూ సత్యత్వ బుద్ధి కలిగియుండడు సుమా!
ఈ స్వప్నతుల్యమగు వ్యవహారములందు “ఇవన్నీ సత్యమే” అని భావన చేసేవాని దృష్టియే స్వయంగా.... ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక... తాపాలు పొందటానికి కారణమగుచున్నది.
ఈ ‘జాగ్రత్తు' విషయమై సత్యత్వబుద్దిని ఆశ్రయించే సంసారజీవుల స్థితి ఎన్నెన్ని దోషములకు చోటు ఇస్తోందో చెప్పటం ఎవరితరం? ఈ 'దృశ్య లేక సంసార' వ్యవహారంలో కనిపిస్తున్న ఈ విశేషములు సత్యము, నిత్యము”... అను తాదాత్మ్యమే మృతమనీ.... ఇందలి అసత్యమును అనిత్యమును ఎఱిగి, తాదాత్మ్యము చెందకుండుటే అమృతత్వమనీ కవులు చెప్పుచున్నారు.
అందుచేత అట్టి సంసార సత్యత్వదృష్టిని జయించుటను "మృత్యువును జయించుట” అని గ్రహించు.
Page:104
11. మనస్సు యొక్క రూపము
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రాఘవా! ఇప్పుడు నీకు 'జాగ్రత్- స్వప్నము-సుషుప్తు’ల స్వరూపమేమిటో కొన్ని విశేషాలు చెప్పాను కదా! ఇదంతా ఆత్మవిషయం ప్రకటించటానికి వీలుగా చెప్పాను. అంతకు మించి వాటిచే వేరే ప్రయోజనం లేదు.
ఒక ఇనుపగుండు అగ్నితో సంబంధం పెట్టుకున్నదనుకో... అప్పుడేమౌతుంది? అగ్ని యొక్క రూపమునే పొందుతుంది కదా! అదేవిధంగా ఈ చిత్తము దృఢనిశ్చయముతో ఏ పదార్థములను ఎంతగా భావిస్తుందో అంతవరకు అద్దానిరూపమునే చెందుచున్నది. “భావము-అభావము”, “గ్రహించుట-త్యజించుట”... మొదలైన దృష్టులన్నీ చైతన్యం నందే కల్పించబడుచున్నాయి. ఇక్కడ ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ ‘కల్పన’యే రూపముగా కలిగి ఉన్నాయి కాబట్టి అవి సత్యములు ఎట్లా అవుతాయి చెప్పు?
శ్రీరాముడు : కాని, అనుభవమవటం జరుగుతోంది కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఈ జీవుడు “కల్పన" (Projections of the Mind) ను ఆశ్రయించినంత కాలం ఈ దృశ్యవ్యవహారం సంప్రాప్తమై ఎదురుగా ఉండియే ఉంటోంది కూడా! ఏమరువ వీలులేదు. అందుచేత మనోచాపల్యముచే కలుగుచుండిన ఈ భావ అభావాలను, గ్రహణ త్యాగాలను “అనిర్వచనీయం" అని విజ్ఞులు అభివర్ణిస్తున్నారు. అవి మనస్సు యొక్క నిర్వచనాలను అనుసరించి ఉంటాయి. ఈ జగత్తును మనస్సే ఈ కనబడే విధంగా నిర్దేశించటంచేత ఇట్లు అనుభవమౌతోందయ్యా!
ఏది ఆత్మ కంటే తదితరమై తారసపడుతోందో అదంతా ఆ ద్రష్ట యొక్క మనస్సే! స్వప్నసదృశమే! “వ్యష్టి” రూపమున భ్రాంతి ఏర్పడటానికి కర్త ఈ మనస్సే! అనగా, మనస్సే “నేను ఒక వ్యష్టిని” అని మననం చేయుటచే వ్యష్టి ఏర్పడుతోంది. అట్లే సమష్టి రూపమున ‘జగత్ స్థితి’కి కారణమగుచున్నది కూడా మనస్సే సుమా! విశ్వమునకు కారణభూతమగు మనస్సే సర్వ
కళంకములకు మూలము.
ఓ రామా! మనస్సే పురుషుడు. కాబట్టి ఎట్లాగైనా సరే, ఈ మనస్సును శుభమార్గమున నియోగించాలి. సర్వజనులారా! ఈ మనస్సును, దీని స్వభావమును చక్కగా గ్రహించండి. దీనిని శుభమార్గమునందే ప్రయత్నపూర్వకంగా నియోగించటం ఉచితం. సర్వదా శ్రేయస్కరం కూడా.
శుక్రాచార్యుని అనుభవం ఏమిటో గమనించారు కదా! ఈ భౌతిక దేహమే పురుషుడై ఉంటే అత్యంత బుద్ధిమంతుడైన శుక్రుడు అనేక వికారములతో కూడిన పెక్కు జన్మల గూర్చిన భ్రమ ఎలా పొందాడు? కనుక, పురుషకారము అనేది సర్వదా మనస్సుకు సంబంధించినదే కాని శరీరము నిర్వర్తించేది కాదు. ఆ 'గోడ' ఎట్లాగైతే కేవలం జడమాత్రమై స్వయం నిర్ణయాధికారము లేకయే ఉంటోందో, ఈ శరీరమునకు కూడా స్వయం నిర్ణయాధికారం లేదు. మనస్సు దేనిని మననం
Page:105
చేస్తుందో అట్లే సర్వము ప్రాప్తిస్తోంది. అందుచేత ప్రయత్న పూర్వకంగా స్వల్పవిషయములన్నీ త్యజించబడుగాక! ఈ మనస్సు ఉత్తమోత్తమమైన దానియందే నియోగించబడుగాక!
శ్రీరాముడు : ఈ మనస్సును నియోగించుటకై, ఈ జగత్తు నందు అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనదేది?
శ్రీ వసిష్ఠ మహర్షి : అన్నిటికన్నా ఉత్తమోత్తమమైనది. మహత్తరమైనది “స్వస్వరూపమే”.
శ్రీ రాముడు : అట్టి స్వస్వరూపమును మనస్సుతో ధ్యానించుటకు ఎప్పుడు ఎక్కడ ఎట్లు ఉపక్రమించాలి?
శ్రీ వసిష్ఠ మహర్షి : స్వస్వరూపమును ధ్యానించుటలో, భావించుటలో మరొక ప్రదేశమునకు వెళ్ళవలసిన పనేమున్నది? సర్వజనులారా! ఆత్మ వస్తువు సర్వదా ఉపాధిరహితం. భ్రమ రహితం, అప్రమేయం, నిత్యం అయివున్నది. అట్టి ఆత్మవస్తువునే సర్వదా ధ్యానించండి. అట్టి ప్రయత్నంలో శ్రమ ఏదీ ఉండదు సుమా! “నేను సర్వదా అఖండము, జన్మరహితము అయిన ఆత్మనే”... అని భావించుటలో కష్టమేముంటుంది? మరికొంత కాలం తరువాతనో, లేక ఏదో కార్యక్రమము ముగించిన తరువాతనో ఆత్మ సంబంధించిన 'ఉపాసన' ఆరంభించాలనుకోవటం అజ్ఞాన పూర్వకమైన అభిప్రాయమని మేము గమనిస్తున్నాం.
ఇప్పుడే, ఇక్కడే, ఏది ఎట్లు ఉంటోందో అదంతా అట్లు ఉండగానే "స్వస్వరూపమును ధ్యానించుట, భావించుట” తప్పక చేయవచ్చని అందరికీ మనవి చేస్తున్నాను. జీవుడు ఏ రూపాన్ని ధ్యానిస్తే అతడు అట్టి రూపముగానే పరిణమిస్తున్నాడు. లేక, పొందుచున్నాడు. ఆత్మ యొక్క అప్రమేయత్వంను, నిర్వికల్పత్వంను ధ్యానించు జీవి ఆత్మత్వమునే అనుభవంగా పొందుచున్నాడు. శ్రీరాముడు : స్వామి! మా పై కరుణతో "ఆత్మను భావించుట" అనగా ఏమిటో మరికొంత విశేషయుక్తంగా చెప్పండి.
ద్రష్ట సం
1 E “జగత్తు” సర్వ సంకల్పములకు కర్త, cx అనబడే
ద్రష్టత్వము వహించుటకు C మునుముందే ము సందృశ్యానుభవం
ఏర్పడి & ఉండినట్టిది E సంకల్పరహితత్వము
చైతన్యము
సంకల్పసహితత్వము
Page:106
శ్రీ వసిష్ఠ మహర్షి : "సంకల్పములను రచించుట, లేక నిర్వర్తించుట” అను స్వభావముగల ఈ జీవుడు సంకల్పములు ప్రారంభం కాకముందే, ఉండి ఉన్నాడు. అట్టి సంకల్పములకు ‘ఆదిస్థితి’ యందు అతడు అనిర్వచనీయుడై, వాక్కు మొదలైన వాటికి అందనివాడై, శుద్ధతత్వస్వరూపుడై ఉండి ఉన్నాడు కదా! ఆ శుద్ధతత్వమే.. 'ఆత్మ' అను శబ్దముచే ఉద్దేశ్యించబడుతోంది. అట్టి ఆత్మ సంకల్పించు సమయము నందు కూడా... ఉండి ఉన్నది. అట్టి శుద్ధతత్వమే స్వస్వరూపము.
స్వస్వరూపభావనచే ఏర్పడు నిశ్చలత్వం, అసంగత్వములే ఆత్మ సాక్షాత్కారముగా చెప్ప బడుతోంది. అట్టి ఆత్మానుభవమునకు సర్వులు అర్హులే. ఓ జనులారా! మీరంతా బలవంతులై అందుకు అర్హత సముపార్జించు కోవాలి. అంతేగాని, "ఈ నా వర్తమానం అందుకు అడ్డు కదా!” అని భావించి ప్రవాహపతితులు కావద్దని హెచ్చరిస్తున్నాను.
అభిపతతి మనః స్థితః శరీరం నతువపురాచరితం మనః ప్రయాతి। అభిపతతి తవాత్ర తేనసత్యం సుభగమనః ప్రజహాత్వసత్యమన్యత్ ॥ (సర్గ 20, శ్లో. 9)
ఈ మనస్సు ఎక్కడుంటే అక్కడికి 'శరీరము' ఆవశ్యము పోగలదు. కాని, శరీరము ఎక్కడుంటే అక్కడికి మనస్సు పోవలెనను నియమము లేదు. మరింక ఈ శరీరము గురించి భ్రమపొందవలసిన పనేమున్నది?
ఈ శరీరము ఎక్కడ ఉండవలసివస్తోందో అక్కడే ఉండనివ్వండి. మనస్సును మాత్రం స్వస్వరూపము నందు సుస్థిరం చేయండి. ఓ రామచంద్రా! నిత్యసత్యమైయున్నట్టి ‘ఆత్మవస్తు ప్రాప్తి’ యందు మాత్రమే నీ మనస్సు నియోగించబడుగాక! అందుచేత 'అసత్యములే' అయినట్టి ఈ దేహ, ఇంద్రియాలను, తదితర భేదపూర్వకమైన భ్రమలను నీవు త్యజించివేయి. ఈ దేహ, ఇంద్రియాల పట్ల గూడుకట్టుకొని ఉన్న విశ్వాసం నుండే సర్వసంసార భ్రమలు, బంధములు మరింతగా ఏర్పడు చున్నాయిని గ్రహించు.
చైతన్యతత్వమైయున్న నీ శుద్ధ స్వరూపమునకు జడపదార్థములైనట్టి ఈ శరీరాదులను ఆపాదించి భ్రమ చెందవద్దు. “ఈ శరీరమే నేను. ఆ శరీరము మరొకరు” అను భావనలోని అనర్థమేమిటో ముందు గ్రహించు.
స్వస్వరూపతేజోమయుడవై ప్రకాశించుచూ సర్వలోకములకు శుభప్రదుడవయ్యెదవుగాక!
12. విజ్ఞానవాదము
శ్రీరాముడు : ఓ మునీంద్రా! ధర్మజ్ఞా! సముద్రంలో బడబాగ్నిలాగా, నా హృదయంలో ఇప్పుడు ఒక గొప్ప సందేహం పుట్టి కల్లోలం కలిగిస్తోంది. అదేమిటో చెపుతాను వినండి.
"బ్రహ్మం దేశ కాలాదులచే పరిచ్ఛిన్నమయ్యేది కాదు. అది సర్వదా వ్యాపకమై, నిరామయమై ఉంది”... అని మనం అనుకున్నాం కదా! అట్టి "నిష్కళంక నిర్వస్తువు" అగు
Page:107
బ్రహ్మం నందు విషయాకారముచే కలుషితమైనట్టి ఈ ‘మనస్సు’ అనబడేది ఎట్లా, ఏ కారణం చేత, ఏ రూపమున, ఎప్పటి నుండి స్థితిపొంది ఉంటోంది? ఆత్మజ్ఞులు శాస్త్రములు.. "బ్రహ్మము నందు అవిద్యా రూపమైన కళంకము ఏ కాలమందును లేదు”... అని చెప్పుచుండటం జరుగుతోంది. మరి ఈ మనస్సు ఎట్లు, ఏ కారణంగా ఉదయిస్తోంది?..., ఈ విషయం ముందు చెప్పండి. అటుపై ‘ఈ మనసును నిరోధించుటెట్లా? అనే ప్రశ్నను మరల పరిశీలించవచ్చు. ఈ ప్రశ్నపై కొంత సంవాదము జరిగింది కానీ, ఇంకా కొంత వినాలని నా అభిలాష.
శ్రీ వసిష్ఠ మహర్షి : చాలా చక్కగా, మంచి ప్రశ్నకే వచ్చావు. ఇప్పుడు నీ బుద్ధి మోక్షమును పొందుటకు సంపూర్ణమగు అర్హత పొందుచున్నదని నేను భావిస్తున్నాను. పూర్వాపరవిచారణ యందు తత్పరమైయున్న నీ బుద్ధియొక్క ప్రభావంచేత శంకరాదులు పొందిన ఉత్తమస్థితిని నీవు తప్పక పొందగలవు.
అయితే మనం ఇప్పుడు "స్థితి ప్రకరణం"లో ఉన్నాం కదా! వర్తమాన విషయవిచారణ దృష్ట్యా నీ ప్రశ్నకు ఇది తగిన సమయం కాదు. నిర్వాణ ప్రకరణంలో ప్రవేశించినప్పుడు మనం "ఆత్మకు మలినత్వం ఎట్లా వచ్చినది?" అనే ప్రశ్నను కొన్ని కోణముల నుండి పరిశీలిస్తాం. ప్రస్తుతం “ఆత్మ స్వతహాగా శుద్ధమైనది” అనే విషయం అనేక దృక్పథముల నుండి నిరూపిస్తున్నాం. “మనస్సు ఎట్లా ఉదయిస్తోంది” అనుదానిగురించి, “శుద్దాత్మానుభవం' గురించి మనం నిర్వాణ ప్రకరణంలో పరిశీలిస్తున్నప్పుడు ఈ నీ ప్రశ్న అడుగు. “శుద్ధమైన ఆత్మకు దోషమెట్లా ప్రాప్తించింది?” అనే విషయం నిర్వాణ ప్రకరణంలో సవివరంగా, విస్తారంగా చర్చించబోతున్నాం. ఇప్పటికి మాత్రం “మనస్సును శుద్ధిపరచటమెట్లా?” అనేవిషయం ముఖ్యంగా పరిశీలిస్తున్నాం.
మనం ఏ సిద్ధాంతం గురించి వర్తమానంలో విచారిస్తున్నామో అద్దానిని గురించి ఇప్పటికి చర్చించటం (అవగాహనా సౌలభ్యం దృష్ట్యా) ఉచితం కదా!
ఇప్పుడు మనం “ఉత్తమమైన అవగాహన కలిగియున్న మనస్సు” గురించి విచారిద్దాం. ఈ ప్రాణ సమూహమంతా “జన్మ-కర్మలు” అనే జాలములో చిక్కి ఆయా పాట్లు పొందుచున్నది. కారణంగా? మనస్సు కారణంగా కదా!
మనస్సే ... ప్రకృతి, కర్మ కూడా!
మనస్సు - అజ్ఞాని అవిచారణ కారణంగా "స్వతహాగా అసత్యమే” అయినట్టి అనేక భ్రమలతో కూడిన అనుభవములను పొందుచున్నాడు. అజ్ఞానముతో ఉపసహితమైన చైతన్యమును 'ప్రకృతి' అంటున్నాం. మనన ధర్మము చేత 'ప్రకృతి' అనునది ఏర్పడుచున్నది. కాబట్టి మనస్సు అంటే కూడా అదే సుమా! ఆ స్థితియందు "ప్రియత్వము ఉద్వేగము”లతో కూడిన కర్మేంద్రియ వ్యాపారములు నిర్వర్తించబడుచూ ఉంటాయి. కాబట్టి దీనినే “కర్మ” అని కూడా నిర్ణయిస్తుంటారు.
Page:108
ఈ "మనస్సు-కర్మలు-జీవుడు భగవంతుడు" అను విషయములకు భిన్న మత వాదులు చిత్ర విచిత్రములైన శాస్త్రదృష్టులను, అనేక నామరూపములను కల్పన చేసి తమ అనుయాయుల ముందు ఉంచుచున్నారు. వాటి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెపుతాను. అవన్నీ నీ ప్రశ్నకు తగిన సమాధాన సమన్వితమైన యోచనను అందిస్తాయి అనేది నా ఉద్దేశం.
“వాసనల నుండి అవగాహనలు" - 'సుగంధం' గల ప్రదేశంలో వర్తించిన వాయువు తాను సుగంధరూపమునే పొందుతుంది కదా! మననశక్తిచే చంచలమై ఉంటున్న ఈ మనస్సు, యే వాసనతో గూడి, ఎట్టి భావమును గ్రహిస్తుందో తాను అట్టి రూపమునే పొందుతూ ఉంటుంది. ఈ కారణం చేత కొందరు తమ వాసనలచే కల్పితములైన ఆయా సిద్ధాంతములను ఆయా యుక్తుల సహాయంతో నిర్ణయిస్తున్నారు.
అట్టి ‘అవగాహన’ వారు 'అత్యంత వాస్తవమైనది' గానే గాంచటం జరుగుచున్నది.
పదార్థములను భావన చేయు స్వభావము గల ఈ మనస్సు అట్టి పదార్థములతోటి తన్మయ మగుచున్నది. ఆ పదార్థ రూపమునే చెందుతోంది. మనస్సునకు వశమై వర్తించు ఆ శరీరము కూడా అదే రూపమును, అనుభవమును పొందుచున్నది.
జ్ఞానేంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించునప్పుడు ఈ కర్మేంద్రియములు కూడా ఆ విషయములందు ప్రవర్తిస్తున్నాయి. గాలిలో ధూళి ఏర్పడుచున్నట్లు, ఆత్మయందు ఈ కర్మ వ్యవహారమంతా సిద్ధిస్తోంది. కర్మేంద్రియములు నియమించబడుచుండగా, క్రియాశక్తి వ్యక్తమగుచున్నది.
కాబట్టి మనస్సు యొక్క బీజము “కర్మయే”! మరి, కర్మ యొక్క బీజమో? మనస్సే! 'పుష్పము - - పరిమళము' ఒకదానితో మరొకటి అభేదమైనట్లు ఈ కర్మ - మనస్సులు వేరు వేరు కాదు.
దృఢమైన భావనావశం చేతనే మనస్సు 'మననము' అనుదానిని స్వీకరిస్తోంది. అట్టి భావన యొక్క ప్రభావం చేత 'స్పందము' లేక 'కర్మ' అనబడు శాఖ ఉత్పన్నమవుతుంది. ఈ మనస్సే క్రియను, ఆ క్రియయొక్క ఫలములను ఆదరభావంతో సిద్ధింపజేయుచున్నది. ఆ తరువాత “ఆయా కర్మల ఫలములను పొందుచున్నాను” అను అనుభవమును స్వీకరిస్తూ వెనువెంటనే బంధమున తగుల్కొనుచున్నది.
అహమ్ త్వమ్ తత్ - - ఇప్పుడు విజ్ఞానవాదము ననసురించి 'అహమ్-త్వమ్-తత్'లను విశదీకరిస్తానుఈ మనస్సు ఏ భావనను స్వీకరిస్తుందో, ఆ భావనయే నిశ్చయమై పరిణమిస్తోంది. దేనినైతే, “ఇది శ్రేయోదాయకము - ఇది కాదు - ఇప్పుడు నేను అల్పత్వములో ఉన్నాను - ఇట్లు వీరు చెప్పి నట్లు మాత్రమే ఆచరించాలి అప్పుడు సముద్ధరించబడగలను”... అను రూపము గల భావోద్వేగము ఈ జీవుడు కలిగి ఉంటాడో... అది ఆ జీవునకు ఆ రీతిగానే సంప్రాప్తిస్తోంది.
Page:109
వాసనాదార్ద్యముచే ‘అహమ్-త్వమ్ తత్' శబ్దములకు వివిధ భావనలతో కూడిన భిన్నమైన మతనిశ్చయములు జనులచే స్వీకరించబడుచున్నాయి. ఆ నిశ్చయములను అనుసరించే వారు తమ తమ ధర్మార్థ కామమోక్షముల కొరకు ఆయా వేరు వేరు ప్రయత్నముల చేస్తూ ఉంటున్నారు. ఆ శబ్దముల కొన్ని నిర్వచనములను (కొన్ని శాస్త్రములు ప్రవచనములను) వినుకపిల సిద్ధాంతం -
1) అహం = ఇది స్వతహాగా అనేక దోషములు కలిగి ఉంటోంది. అట్టి 'అహం(నేను) లోని దోషాలను శుశ్రూష, తపస్సు, ధ్యానం మొదలైన ప్రయత్నములచే తొలగించుకోవాలి. 2) త్వమ్ (నీవు) = ఈ 'నీవు' అను రూపంలో ప్రాప్తించేదంతా అత్యంత నిర్మలము, అసంగము అయి ఉన్నది.
3) తత్ (అది) = అహం, త్వమ్ల కంటే విలక్షణమైనది. అది కోపగించుట, ప్రేమించుట, వరాదులను ఇచ్చుట మొదలైన త్రిగుణములకు సంబంధించిన వ్యవహారములను నిర్వర్తిస్తూ ఉంటుంది. సత్కర్మలను సన్మానించటం, దుష్కర్మలను శిక్షించటం నిర్వర్తిస్తూ ఉంటుంది. సగుణ బ్రహ్మవాదులు - వీరు భగవంతునకు గుణములు ఆపాదిస్తూ మరల మరల అట్టి నిశ్చయమునే ధ్రువీకరించటం జరుగుతోంది. అట్టివారు సగుణ బ్రహ్మమును ప్రవచిస్తున్నారు. తదనుకూలంగానే, శాస్త్రములు రచించబడటం, ప్రవచించబడటం జరుగుతోంది.
అనగా, ఈ జగత్తుకు ఏది ఉపాదాన కారణమో అట్టి 'తత్' (భగవంతుడు) కూడా సుఖ దుఃఖ జడాత్మకమగు జగత్తు వలె గుణాత్మకమని వారిచే ప్రతిపాదించబడుతోంది.
పరిణామవాదులు - - మరికొన్ని సిద్ధాంతముల ప్రకారం... ఈ జీవుడు చేసే ఆయా సాధనల యొక్క అంతిమ ప్రయోజనంగా ఈ 'అహమ్'... త్వమ్లోనూ, త్వమ్ వెళ్ళి 'తత్'లోనూ విలీనమై పోతోంది. చివరికి 'తత్'యే ఆద్యంతములలో శేషించి ఉంటోంది.
ఇట్లా ఇంకా ఎన్నో సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి.
ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. భిన్న సిద్ధాంతములు ప్రతిపాదించే వారిలో కొందరు, “మేము చెప్పేదే ఉపాయం. ఇది తప్ప మరింకే విధంగాను ఎవ్వరికీ మోక్షము లభించదు”- అనే నిశ్చయమును చెప్పుచున్నారు. అయితే ఆ గురువులు వారి శిష్యులందు కొంత ఏకాగ్రత, ధారణ అలవడుటకు అట్లు "ఇట్లే అనుసరించండి” అని చెప్పటం జరుగుతోంది. వారి శిష్య ప్రశిష్యుల అవగాహనలో కొంత అల్పమైన విజ్ఞాన దృష్టి ఏర్పడటం కూడా జరుగు తోంది. అప్పుడు ఒక అభిమతమును ఆశ్రయించువారు "స్వసంకల్పితమైన నియమములు” అనే భ్రమచే ఇతర ఉపాయములను విచారణలను, అవగాహనలను దూరం నుండే నిరసించటం, విభేదించటం జరుగుతోంది.
Page:110
వేరు వేరు గురువులు వేరు రీతులలో విధివిధానములు, నియమములు నిర్ణయిస్తూ, జీవిత పరమార్థములు - జ్ఞానవిజ్ఞాన విశేషములు ప్రవచిస్తున్నారు. అయితే, వారి శిష్య, ప్రశిష్యులలో కొందరు పరమార్థం ఏమిటో మరచి కేవలం విధి, విధానాలను మాత్రం అవిచారణ పూర్వకంగా ఆశ్రయిస్తూ తదితర గురువులను, ఇతర గురువులు చెప్పు జ్ఞాన, విజ్ఞాన విశేషములను మొదలే ద్వేషించటం, చేస్తున్నారు. తద్వారా కలహించుకోవటం, హింసించుకోవటం చూస్తున్నాం.
ఇదంతా బాలురు, మూర్ఖులు, రాగద్వేషపూరితులు, జాత్యహంకారులు అగు వారి వలననే అట్లు ప్రాప్తిస్తోంది. గురువులు తమ తపోధ్యానాలచే గ్రహించినది లోకక్షేమం కోరి ప్రవచిస్తుంటే, అందలి జ్ఞానసారాన్ని మానవాళి అంతా గ్రహించవచ్చు. స్వవివేకముచే పరిశీలించవచ్చు.
ఏ ఉత్తమ భావనను అంతరంగమున ఆశయపూర్వకంగా స్వీకరించి, అందుకు గాను ప్రయత్నశీలురమౌతామో అదియే ప్రయత్నముల తీవ్రతను అనుసరించి, ఆ ఆ రూపమైన ప్రయోజనమే ప్రాప్తిస్తూ ఉంటుంది.
అందుచేత భావ ఔన్నత్యము చేతనే మనస్సు కుదుట పడగలదు. ఎప్పుడు ఒకని “సర్వము ఆత్మవిన్యాసమే” అను ఆశయమునకు సానుకూలమై ఉంటుందో, అది అతనికి మరింత శోభాయ మానమని మా అభిప్రాయం.
ఇంకా కొన్ని సిద్ధాంతాలు -
వేదాంతవాదులు - వీరు శ్రుతులను (వేదములును) ప్రమాణంగా తీసుకొని 'అధ్యారోపవాద న్యాయమును’ అనుసరించి “ఈ జగత్తంతా బ్రహ్మమే. బ్రహ్మమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు”... అనే నిశ్చయమును దృఢపరచుకోవలసినదిగా ప్రవచిస్తున్నారు. "అట్టి దృఢ నిశ్చయము చేతను, శమదమాదులను నిరంతరం ఆశ్రయించుట చేతను సర్వోత్తమమగు 'ముక్తి' లభించ గలదు" అని చెప్పుచున్నారు. అందుకు విరుద్ధమగు మరి దేనిచేత కూడా ముక్తి లభించదని ప్రకటన చేస్తున్నారు. తదనుకూలంగా శాస్త్రములు ప్రవచించుచున్నారు.
అయితే వారిలో కొందరు "మేము నిర్ణయించుకున్న విధి నియమములు" మాత్రమే వాస్తవము, తదితర విషయము లేవీ "మోక్షసాధకములు కావు" అనునది వాదన పూర్వకంగా ప్రకటిస్తున్నారు. కనుకనే, ఇంతలోనే అభేద దృష్టి నుండి చ్యుతి పొందటం జరుగుతోంది.
విజ్ఞానవాదులు - “స్వబుద్ధి చేతను, శమ, దమములచేతను మాత్రమే ముక్తి లభించగలదు. మరింకే ఉపాయం లేదు"... అని ప్రతిపాదించుచు, ఈ బుద్ది సునిశితమగుటకు గాను కొన్ని నియమ, నిష్ఠలు చెప్పుచున్నారు. ఈ సిద్ధాంతమునే గ్రంథాదుల ద్వారా ప్రకటించుచున్నారు.
అర్హతాదులు - వీరూ విజ్ఞానవాదమే ప్రకటిస్తున్నారు. అయితే, స్వాభిమతమును అనుసరించి చిత్ర విచిత్రములైన దిగంబరత్వము, భిక్షాటనము మొదలైన ఆచారములను కల్పించి, తదనుగుణంగా గ్రంథములను నిర్మించి ప్రచారం చేస్తున్నారు.
Page:111
ఇంకను మరికొన్ని సిద్ధాంతముల ప్రకారం “ఈ జీవుడు బాహ్యదృష్టిచే జీవత్వము, స్వస్వరూపముచే శివత్వము వహించియున్నాడు. సర్వజీవులు ఆ శివత్వము నుండి ప్రకటిత మగుచున్న కిరణముల వంటి వారే!”... అను 'తత్త్వమ్' భావనను ప్రకటిస్తున్నాయి.
చూచావా! ఇక్కడ మనం దృష్టాంతము కొరకు రెండు మూడు సిద్ధాంతములను సంగ్రహంగా చెప్పుకున్నాం. వాస్తవానికి అనేక విచిత్రములైన సిద్దాంతములు, (భగవంతుని గురించిన) అవగాహనలు భగవదన్వేషకులచే ఆశ్రయించబడుతున్నాయి. మరికొందరు అన్వేషకులు తమ యొక్క అవగాహనను, స్వవివేకమును, పరిశీలనను ప్రక్కకు పెట్టి, ఇక కేవలం తదితర సిద్ధాంతములను ఖండించుట యందు, తిరస్కరించుట యందు మాత్రమే నిమగ్నమైయున్నారు.
ఓ రాఘవా! ఏ నిమిత్తం లేకుండానే శాంతజలమునందు అనేక బుద్బుదములు ఉత్పన్న మౌతాయి కదా! అట్లే అకారణంగా అనేక నిశ్చయములను ప్రకటించు వేరు వేరు శాస్త్రరీతులు, వాటిని ఉద్బోధించు గురువులు ఈ ప్రపంచంలో ఏర్పడటం జరిగింది. మరింకెన్నో శాస్త్రరీతులు ఏర్పడబోవుచున్నాయి.
మణులన్నిటికీ సముద్రమే నిలయం కదా! వివిధ శాస్త్రరీతులన్నిటికీ మనస్సే 'ఉనికిపట్టు'. “మా గురువు చెప్పినదే వినాలి. మరింకెవ్వరు ఏమి చెప్పినా ఎవ్వరూ వినకండి"... అని నిర్దేశించువారు, ఇతర వాదములను, అభిప్రాయములను ద్వేషించువారు కలహించుకొను వారు 'సత్' వస్తువును పొందేదెట్లా?
ఇక్కడ ఒక రహస్యం చెపుతాను విను. వేప చేదు కాదు. చెఱకు తీపి కాదు. అట్లే చంద్రుడు శీతలము కాదు. అగ్ని ఉష్ణము కాదు. ఎవడు ఏ అనుభవమును చిరకాలంగా “ఇది మధురం... ఇది అప్రియం, ఇది సుందరం, ఇది ద్వేషింపతగినది, ఇది స్వీకరించాలి, ఇది తిరస్కరించాలి” అని భావనచేస్తాడో అది అతనికి అట్లే ప్రాప్తించటం జరుగుతూ ఉంటుంది. ఆ వస్తువా, ఇక ఆ రీతిగానే అనుభవమౌతుంది. ఈ కారణంచేతనే చంద్ర-సూర్య-అగ్ని మండలములలో నివసిస్తున్న దేవతలు, యక్షులు మొదలైన జీవులకు 'శీతలము-ఉష్ణము' మొదలైన బాధలు కలగటమే లేదు. ఈ శాస్త్రరీతులు వాటి పట్ల ఏర్పడు రాగద్వేషాదులు అట్టివేనని జనులు గ్రహించెదరు గాక!
ఓ సర్వజనులారా! 'జీవితము' అనునది అత్యంత విలువైనది. అట్టి ఈ అవకాశమును ఏవేవో వాదోపవాదములతో వృథాపరచుకోరాదని మా ఉద్దేశం. సర్వజనుల శ్రేయోభిలాషులమైన మేము మా అభిప్రాయమేమిటో కూడా ప్రకటించుచున్నాము. వినండిఈ మానవుడు స్వతహాగా ఆనందమయస్వరూపుడే. అయితే, అతని స్వస్వరూపమునకు సంబంధించి సమగ్రము, ఉత్తమము అయిన 'అవగాహన' మరుగునపడి ఉంటోంది. అతని ఎరుక ఆయా రాగద్వేషాదులచే కప్పబడి, మేఘావృతమైన ఆకాశమువలె ఉంటోంది. అందుచేత జనులు నిరతిశయ బ్రహ్మానందము కొరకే యత్నించెదరు గాక! మనస్సును బ్రహ్మమయం చేయండి. తద్ద్వారా బ్రహ్మమే ప్రాప్తిస్తోంది.
Page:112
“నేను సర్వదా అఖండము, నిత్యము, నిర్మలము అయిన బ్రహ్మమునే అయి ఉన్నాను. 'నీవు అది - జగత్తు'... ఇదంతా బ్రహ్మమే. అట్టి చైతన్య బ్రహ్మమే అందరియందు, అంతట ఏకస్థమై వెలయుచున్నది” అను భావనను ఈ మనస్సు ఆశ్రయించుగాక! అట్లు ఆశ్రయించటమే “మనస్సు బ్రహ్మమయమగుట”... అయి ఉన్నది.
ఒక బాలుడు బాటలో నడుస్తూ ఏవేవో పదార్థాలు చూచి “ఇవి నాకు ప్రియమైనవి... అందుచేత ఇవి నాకు కావాలి...” అని ప్రీతి గొనుటచే అవి అవశ్యం పొందవలసినవిగా కనబడతాయి కదా! అట్లే ఈ మనస్సు కూడా అనుక్షణం అనేక పదార్థముల పట్ల ఆకర్షణ వికర్షణలను పొందుతోంది. ఫలితం? ఈ జీవునికి అనేక దుఃఖ పరంపరలు వచ్చిపడుచున్నాయి. అంతులే కుండా అసంఖ్యాకమైన 'జన్మలు' ప్రాప్తిస్తున్నాయి. ఎప్పుడైతే మనస్సు బ్రహ్మమయం అవుతుందో, ఇక తుచ్ఛములైన “దృశ్యముయొక్క ప్రాప్తిచే జనించు సుఖ దుఃఖములు” అట్టి జీవుని ఏమాత్రం క్షోభింపజేయలేవు.
అపవిత్రమసద్రూపం మోహనంభయకారణమ్ | దృశ్యమాభాసమాభోగి బంధమాభావయానఘ | (సర్గ 21, శ్లో 36)
మాయైషాసాహ్యవిద్యైషా భావనైషాభయావహా | సంవిదస్తన్మయత్వం యత్తత్కర్మేతి విదుర్బుధాః ॥ (సర్గ 21, శ్లో 37)
ఓ రాఘవా! ఈ 'దృశ్యము' యొక్క స్వభావమేమిటో సునిశితంగా పరిశీలిస్తున్నావా? ఇదంతా అపవిత్రము, అజ్ఞానదాయకము, అసద్రూపము, భయహేతువు, బంధదాయకము అయి, ఈ జీవునికి ప్రాప్తిస్తోంది. ఎందుచేత?... ఈ జీవుడు విజ్ఞానముతో కూడిన విచారణను అలవరచుకోకపోవటం చేతనే సుమా! అందుచేత, ఈ దృశ్యమును నీవు భావనయే చేయకపోతే, అది ఇంకేమి చేయగలదు చెప్పు? "అసలు ద్రష్ట దృశ్యమయమగుట... అనునదే బంధమునకు హేతువు అయినట్టి కర్మ" అని బుద్ధిమంతులు చెప్పుచూ ఉంటారు. అదియే మాయ, అదియే అవిద్య కూడా! భయప్రదమగు భావనకూడా అదియే.
‘మనస్సు' అంటే 'దృశ్యము' అనే అర్థం సుమా!
మనస్సే మోహ, అజ్ఞానములకు హేతువైయున్నది. అనేక ఆసక్తులు, ద్వంద్వములు ఈ మనస్సులో నిరంతరం పరిభ్రమిస్తున్నాయి. అట్టి బురదతో నిండియున్న ఈ మనస్సును శుద్ధం చేయాలి. సంసారపు మత్తు అంటే ఏమిటి? ఏ దృశ్యతన్మయత్వమైతే స్వభావ సిద్ధంగానే ఉదయించి అనుభవమౌతోందో... అద్దానినే 'సంసారం' అని అంటున్నాం. దృశ్యరూపత్వమే అవిద్య మరియు అజ్ఞానం కూడా! మేఘములచే కప్పబడినప్పుడు సూర్యుడు కనిపించడు కదా! ఈ దృశ్యముచే ఆవరించబడిన ఈ జీవులు కూడా పరమశ్రేయమగు స్వస్వరూపమును దర్శించలేకున్నారు.
ఈ ‘అవిద్య’ ఎట్లా ఉత్పన్నమౌతోంది?.... ఇది సంకల్పమాత్రం చేతనే ఉత్పన్నమగుచున్నది. ఒక బాలుడు ఆకాశంలో మేఘముల ఆకృతులను చూచి "అది చెట్టు. ఆ ప్రక్కన తటాకం, అక్కడ
Page:113
ఒక మృగం,”... ఈ విధంగా ఆలాపన చేస్తాడు చూచావా? అట్లాగే ఈ దృశ్యం కూడా స్వయం కృతంగా జీవునకు ప్రాప్తిస్తోంది.
శ్రీరాముడు : ఈ 'అవిద్య' లేక 'దృశ్యభావన' శమించేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : సంకల్పముల కారణంగా ఏర్పడి ఉంటున్న అవిద్య... ‘నిస్సంకల్పము’ (సంకల్పించకుండటం) అని మౌనరూపయత్నముచే శమించగలదు. సంకల్పరాహిత్యముచే భావన నశిస్తుంది. అప్పుడు భావాతీతమగు స్వస్వరూపము యొక్క అనుభవం సుస్థిరమౌతుంది. పదార్థముల పట్ల, విషయముల పట్ల అసంగమే అందుకు మార్గం.
1) 'సమాధి' (Complete cessation of thought) యొక్క దార్ద్యముచే, 2) శ్రవణ, మనన రూపమగు తత్త్వవిచారణచే - - పదార్థముల పట్ల అకృత్రిమమైన అసంగము ఏర్పడుతోంది. “సత్య దృష్టి” చేకూరి, ‘అసత్యదృష్టి' సన్నగిల్లుచుండగా 'కల్పనా రాహిత్యము స్వయముగా ఏర్పడుతోంది.
అట్టి నిర్వికల్పమునందు... స్వచ్ఛ స్వభావయుక్తము, పరమార్ధము సత్యస్వరూపము అయినట్టి 'ఆత్మభావన' సంప్రాప్తించుచున్నది. ఇక్కడ మనం 'భావన' అని అంటున్నప్పటికీ, అది భావరహితమైన స్థితియే.
అట్టి విషయరహిత పరమాత్మయందు వ్యక్తిత్వముగాని, అవ్యక్తిత్వముగాని ఉండవు. విషయ జనితములైన సుఖ దుఃఖాలు ఉండవు. అట్టి 'పరమాత్మస్థితి' జీవునిచే తన హృదయంలోనే పొంద బడుచున్నది. కేవల శుద్ధ స్వభావరూపమైన హృదయమునందు మాత్రమే ఆత్మతత్త్వము ప్రత్యక్ష మగుచున్నది. ఆత్మవస్తువు స్వయంగా అంతరంగమున అనుభవైకవేద్యమే సుమా!
13. ఆత్మబోధ ఎట్టి వారికి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జీవుడు నిష్కారణంగా ఈ దేహ, ఇంద్రియములందు “ఇవియే నేను” అనబడు అహంభావము కలిగియుంటున్నాడు. అత్యంత అనర్థహేతువైనట్టి “అహమ్ దేహమస్మి” అను భావన చేతనే ఆత్మభావన పొందబడకపోవటం జరుగుతోంది. ఎవనికైతే ఈ 'దేహ ఇంద్రి యముల’తో ఆత్మయొక్క “అభేదభావన” ఉండదో.... ఎవ్వని యందు సర్వవాసనలు తొలగి పోతాయో... అట్టి పుణ్యచరితునకు మాత్రమే పూర్ణమగు ఆత్మభావన ప్రాప్తిస్తోంది.
ఒకడు చీకటిలో ఒక త్రాడును చూచి, “ఒకవేళ ఇది త్రాడు కాదేమో? పామేమో?” అనే సందేహమును ఆశ్రయించుటచేత క్రమంగా అతనికి ఆ త్రాడుయందు పామే కదలాడుచున్నట్లు కనబడుతుంది. బంధరహితమగు చిదాకాశమే స్వరూపముగాగల ఈ జీవుడు కల్పిత వస్తువును అన్యవిధంగా కల్పన చేస్తూ స్వాత్మయందు బంధము కల్పించుకొనుచున్నాడు. “ఈ సంఘటనలతో, వ్యక్తులతో నాకు సంబంధమున్నది. అందుచేత ఇవి నాకు సుఖ దుఃఖకరములు”... అని భావన చేస్తే అది అట్లే అగుచున్నది. “చిదాకాశమే స్వరూపముగా గల నాకు ఈ భావనలతో, అట్టి
Page:114
భావనల ప్రయోజనంగా ప్రాప్తిస్తున్న ఈ 'జగత్తు'తో సంబంధమెక్కడిది?” అను భావస్థితిని ఆశ్రయిస్తేనో.. తదనుకూలంగానే అంతా ప్రాప్తిస్తోంది.
ఒకే ఆకాశము పగలు ఒకవిధంగా, రాత్రి మరొక విధంగాను కనబడుతోంది కదా! అలాగే ఆత్మకూడా భిన్న రూపములను ధరిస్తోంది.
❖
ఈ జీవుడు అనేక సంసార దుఃఖ పరంపరలలో పడి కొట్టుమిట్టాడటం నిర్వివాదాంశమే కదా! అయితే, తననుతానే అతడు గమనించుటలేదు.
యదతుచ్ఛమనాయాసమ్ అనుపాధి గత భ్రమమ్ । తత్తత్కల్పన యాతీతం తత్సుభాయైవ కల్పతే || (సర్గ. 21, శ్లో. 48) మహత్తరమై, స్వభావసిద్ధమై, ఉపాధిరహితమై, భ్రమవర్జితమై సర్వకల్పనలకు అతీతమైనట్టి ఆత్మను ఎరుగుటచేత మాత్రమే అతడు దుఃఖరహితుడు కాగలడు. ఒకడు శూన్యమగు ఒక 'గుహ'లో ప్రవేశించి "ఇక్కడ సింహము ఉండవచ్చునేమో?” అనే భయమును పొందుతాడు. అయితే, ఆ గుహను చక్కగా పరిశీలించిన తరువాతో, లేక అట్లు పరిశీలించిన వారి వివరణలను విన్న తరువాతో "ఇక్కడ సింహము మొదలైనవేవీ లేవు. ఖాళీ స్థలం మాత్రమే ఉన్నది" అని గ్రహిస్తాడు. అదేవిధంగా ఈ జీవుడు “నేను ఈ దేహమునందు బద్ధుడనై ఉన్నాను కదా” అనే భయమును పొందుచున్నాడు. సాధువాక్యముల శ్రవణం, మననం ఆశ్రయించుచుండగా, ఆత్మను బాగా ఎరుగుట చేతనే సంసారబంధము తొలగిపోతుంది.
ఒక బాలుడు పెద్ద మట్టిచెట్టు యొక్క కాండమును చూస్తూ దట్టమైన చీకటి కారణంగా “అమ్మబాబోయ్! అదిగో...! అది దయ్యమే" అని తలుస్తూ ఉంటాడు. అట్లే ఈ జీవునకు కూడా "ఈ నా దేహము - ఈ జగత్తు ఈ సంబంధ బాంధవ్యములు నాకు సంబంధించిన వారు - నా వారు కాని వారు”... మొదలైన అనేక భ్రమలు కలుగుచున్నాయి. ఆ భ్రమలన్నీ క్షణక్షణం ఒక రూపం పోగొట్టుకొని మరొక రూపం పొందుతూ పోతున్నాయి. ఓ రామా! ఇదంతా 'కల్పన’ను అనుసరించే ఏర్పడి ఉంటున్నది. కల్పనావశంచేత జీవునకు ఈ విభవ దారిద్ర్యములు, దానికి అనుకూలమైన శుభాశుభములు క్షణంలో ప్రాప్తిస్తున్నాయి. మరల అవన్నీ క్షణంలో నశిస్తున్నాయి. భావనానుసారమే పదార్థములు కూడా ఆయా ప్రయోజనములు కలుగజేస్తున్నాయి. జ్ఞానులైన మహనీయులు ఇదంతా గమనించి, 'ఈ సర్వపదార్ధములు భావనానుసారమే ఉంటున్నాయి' అను ఎరుకను గ్రహించి ఈ ప్రపంచంలో సంచరిస్తున్నారు. ఇవన్నీ కూడా జీవుల వారి దృష్టిని అనుసరించే భిన్నములుగా గోచరిస్తున్నాయి.
ఈ చిత్తము దృఢభావనచే దేనిని ఎంతకాలము ఏ విధంగా భావిస్తుందో, అది అంతకాలం అట్లే ప్రాప్తిస్తూ ఉంటుంది. ఏది సత్యం? ఏది మిథ్య ?
ఈ ప్రపంచమున సత్యము కానట్టి, మిథ్య కానట్టి వస్తువంటూ ఏదీ లేదు.
Page:115
నతదస్తియత్సత్వం, నతదస్తి నయన్మృషా | యద్యథాయేన నిర్ణీతం, తత్తథాతేన లక్ష్యతే ॥
ఎవడు ఏ ప్రకారంగా దేనిని నిర్ణయిస్తాడో అతనికి ఆ పదార్థములు అట్లే అనుభూత ములౌతూ ఉంటాయి. ఒకడు తన 'మనస్సు’చే ఆ ఎదురుగా కనబడుచున్న ఆకాశంలో ఒక 'స్త్రీ' యొక్క కల్పనను దృఢంగా చేశాడనుకో... అతడు కామాతురుడై ఆకాశంలో ఉన్న వనంలో సంచరిస్తున్న ఆ కల్పిత సుందరస్త్రీ వెంట పరుగెత్తగలడు.
అద్వైతానంద పారమార్థిక రూపం - కనుక ఓ రామచంద్రా! ఒక 'సుషుప్తి’ యందు ఉన్న వాడు ఏ విధంగా సర్వపదార్థరహితుడై ఉంటాడో, అదే విధంగా నీవు నీ సంకల్పము లందు ఉండి యున్నట్టి సర్వపదార్థములను త్యజించివేయి. సర్వవేళలందు నీ యొక్క “పారమార్థిక అద్వైతానంద రూపము” నందే స్థితి కలిగియుండుము.
ఒక ఎత్తైన ప్రదేశంలో ఒక 'మణి'ని ఉంచామనుకో... ఆ మణియందు ఎదురుగ ఉన్న కొండ ప్రతిబింబిస్తుంటే ఆ మణికి ప్రాప్తించే లాభమేమైనా ఉన్నదా? లేక, అట్లు ప్రతిబింబించక పోతే మణికి వచ్చే నష్టమేమి? ప్రతిబింబించినప్పుడు, ప్రతిబింబించనప్పుడు కూడా ఆ మణి ఒకే తీరుగా ఉంటుంది కదా! నీవు కూడా మనస్సు నుండి 'ఇచ్ఛ' అనుదానిని తొలగించివేయి. నీవు ఇచ్ఛా రహితుడవై ఉండగానే, ఈ జగత్ వ్యవహారములు నీయందు ప్రతిబింబించుగాక! నీకొచ్చే హాని ఏమి? మణి ఒక జడమైన వస్తువు కాబట్టి ఎదురుగా ఉన్న వస్తువులు తనయందు ప్రతిబింబించుట నిరోధించజాలదు. మరి నీవో? నిత్యము నిర్మలము అగు చైతన్యమే స్వరూపముగా కలిగియున్నావు కదా! అందుచేత ఇచ్చారహితంగా, అనాసక్తి పూర్వకంగా తప్పక ఉండగలవు. కొంచెము అభ్యాసానికి సిద్ధపడితే చాలు.
వాస్తవానికి 'ఇచ్ఛా సహితంగాను, ఆసక్తిపూర్వకంగాను ఉండుట' అను దానియందు శ్రమ ఏమి ఉన్నది. కనుకనే మోక్షరూపము = సర్వశ్రమలను త్యజించివేయుట అని చెప్పబడుతుంది.
ఓ రఘునందనా! "నాయందు ఏ జగత్తెతే ప్రతిబింబించుచున్నదో అదంతా మిథ్యయే”... అని నిశ్చయించుకొనుము. అట్లు నీయందు ప్రతిబింబిస్తున్న వస్తువుల, విషయముల రూపమును నీవు తాదాత్మ్యముచే పొందకుండెదవు గాక! లేదా...
ఈజగత్తు పరమాత్మకంటే అభిన్నమైనదే కదా! కనుక నాకు జగత్తుగా కనబడేదంతా పరమార్థమున బ్రహ్మమే” అను నిశ్చయమును కలిగియుండు. "అనంతము, అనాది”యగు ఆత్మ యొక్క స్వరూపమును ఆత్మసహాయం చేతనే సునిశ్చితం చేసుకొనగలం.
ఇక నీ చిత్తమునందు ప్రతిబింబించు అన్య జగత్పదార్థములు, తదితర దేహాత్మదృష్టి గల ప్రాపంచిక జీవుల అర్థవాద పలుకులు... నిన్ను రాగయుక్తం చేయకుండా జాగరూకుడవై ఉండు. ఆత్మదృష్టిని సర్వదా అలవరచుకో.
Page:116
ఒక చోట కొన్ని చిత్ర విచిత్రములైన రంగులుగల పదార్థములు ఉన్నాయి. అవన్నీ ఒక శుద్ధ మైన స్పటికంలో ప్రతిబింబిస్తున్నాయి. అయినప్పటికీ ఆ స్ఫటికంలో ఆ రంగులు ఉండి ఉన్నాయని అనలేం కదా! అదేవిధంగా, ఈ ద్వైతపదార్థాలకు సంబంధించిన రాగం మొదలైన ఎట్టి దోషాలు లేనట్టి శుద్ధ స్వరూపుడవే నీవు సుమా! అట్టి నీ యొక్క శుద్ధ స్వరూపం నందు ప్రారబ్ధ కర్మ భోగాలకు ఉచితమైనట్టి జగత్ వ్యవహారేచ్ఛ ప్రవేశిస్తే, ప్రవేశించనీ... అందుకు నీకు అభినివేశం పొందవలసిన పనేమున్నది? అయితే నీవు మాత్రం దానితో 'తాదాత్మ్యం' చెందనే వద్దు.
నీ శుద్ధ స్వస్వరూపతత్వములో మార్పు చేర్పులు ఏర్పరచగలిగినదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. అట్లే ప్రతి జీవి విషయంలో కూడా!...
14. సాక్షి చైతన్యము - జగద్యవహారము
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! సమాధిని అభ్యసించుచు, "ఈ బాహ్యభ్యంతర జగత్తుల గురించి ఏర్పడి ఉంటున్న మననమంతా మిథ్యా వ్యవహారమే” అని ఎరుగుము. అట్లు ఎరుగుటచేత క్రమంగా నీవు జగమలను, మిథ్యామననమును త్యజించివేయగలుగుతావు. అప్పుడు నీ బుద్ధి విశుద్ధరూపముగా పరిణమించుతుంది.
ఈ కనిపించే ప్రతి ఒక్క జీవుడు చైతన్యము యొక్క ప్రకటనయే అయి ఉన్నాడు కదా! చైతన్యము కాకుండా ఇక ఏదేది అనిపిస్తోందో అదంతా 'భ్రమయే' అయివున్నది. ఎప్పుడైతే చైతన్యము తప్ప వేరైన ద్రష్టల వ్యవహారమంతా త్యజించబడుచున్నదో, అట్టి విచారవంతుడగు జీవుని స్వభావం స్వయంగా నిర్మలమగుచున్నది సుమా! కనుక నీవు 'అజ్ఞాన భూమికా భేద రూపము’ అయినట్టి ఈ దృశ్యంను త్యజించివేసి జ్ఞానభూమికలందు ప్రవేశించాలి. ‘సాక్షి చైతన్యం’ నందే అనుభవమగుచున్న దృశ్యమును, ద్రష్టను కూడా వేరు వేరు చేసివేయుము. సర్వదా సాక్షి చైతన్యమే నీవు అగు. నీవై ఉండు, నీ యందలి సాక్షిచైతన్యముచే పిపీలికాది బ్రహ్మపర్యంతం (చీమ నుండి బ్రహ్మదేవుని వరకు) కూడా సాక్షిచైతన్యంగా గాంచుచుండుటచే 'ఆత్మదృష్టి' దృఢపడగలదు.
బాహ్యమునకు ప్రపంచానుకూలంగానే వర్తించు. ఏదైతే శాస్త్ర నిర్ణయములచే మరియు స్వబుద్ధిచే చేయబడటం స్వధర్మమైయున్నదో అది నిర్వర్తిస్తూ ఉండు. అజ్ఞాన దృష్టియందు ఉన్నట్టి తదితరుల సానుకూల్యతలను పరిగణిస్తూ కర్మలు చేయి. అయితే, “సర్వుల యందలి సత్యము సాక్షీ తత్వమే అయివున్నది”... అను భావనను అంతర్లీనంగా సుస్థిరపరచుకో.
ఇక “నీవు-నేను-నీ వారు నా వారు నీవి-నావి-కాలము-దూరము-స్థలము-ప్రియముఅప్రియము”... ఇవన్నీ ప్రతిబింబమాత్రంగా... అజ్ఞాన దృష్టియొక్క అనుభవములుగా గుర్తించి, వీటిని వేరుపరచివేయి. ఈ ప్రతిబింబమాత్ర ఆయా విషయములలో తాదాత్మ్యము చెందవద్దు.
‘సాక్షితత్వము’ నందే నిశ్చలుడవై సర్వదా ఉండుము. అప్పుడు ఆత్మ నిర్మలం కాగలదు.
Page:117
శ్రీరాముడు : హే మహర్షీ! ఆత్మ నిర్మలత్వము పొందటానికి మరి కొన్ని ఉపాయాలు చెప్పమని ప్రార్ధిస్తున్నాను.
శ్రీ వసిష్ఠమహర్షి : ఈ జీవుని యొక్క ఆత్మ నిర్మలానుభవము కొరకు శాస్త్రములచే, గురువులచే ప్రతిపాదించబడిన కొన్ని ఉపాయములు, లేక మార్గములను ఇక్కడ చెపుతాను విను.
1. అజాగరూకత నుండి జాగరూకత వైపు -
జాగర్తవ్యే పరేతత్త్యే జాగరూకస్యజీవతః | |
సుప్తస్య ఘన సంమోహమయే సంసారవర్త్మని॥ (సర్గ 21, శ్లో. 3)
ఆత్మతత్వ విషయమునందు సర్వదా జాగరూకుడవై ఉండాలి. అంతేకాని, మహామోహమయ మగు ఈ సంసారమార్గంలో నిదురిస్తూ ఉండరాదు. ఆత్మరూపము విషయమై జాగరూకులై ఉండుట, ఏమరుపును జయించుటలను 'యోగము' అని అంటున్నాము. “సర్వము ఆత్మయే... ఆత్మ కానిది, ఆత్మకు చెందనిది అంటూ ఎక్కడా ఏదీ ఉండజాలదు...” అను పూర్ణార్థము గ్రహిస్తూ తద్వారా నిర్మలత్వము, శుద్ధత్వమును పెంపొందించుకో..
2. అనురక్తి నుండి, విరక్తి వైపు - స్వల్ప సుఖము నుండి బ్రహ్మదేవుని సుఖపర్యంతము విరక్తి కలిగి ఉండు. సర్వదృశ్య పదార్థములపట్ల, విషయముల పట్ల 'అనురక్తి' సన్నగిల్లుచుండగా “ఒకానొక పరిపుష్ఠితో కూడిన అతీతత్వము - క్రమముక్తి” పరిఢవిల్లుతూ ఉంటుంది.
3. ఇచ్ఛా ద్వేష త్యాజ్యం - భోగకాలమునందు అనుభవమునకు వచ్చుచున్న ఆయా రసవంతమగు పదార్థములు, విషయములు, నామ రూపములు పైకి రమణీయంగా ఉంటున్నాయి. కాని, క్రమేణా తుచ్ఛమై పరిఢవించబోతున్నాయి. “ఇవన్నీ ఉంటే ఉండనీ... లేక తొలగనీ... ఇవి నావి కావు. నేను వీటిలో లేను... ఇవి నాలో లేవు. యాదృచ్ఛికంగా ఇవి ఏర్పడి, మరొకప్పటికి విడిపోతున్నాయి” అని జ్ఞానదృష్టికలవారు గ్రహిస్తున్నారు. ఇచ్ఛా ద్వేషరహితమైన “అవగాహన - అనుభవము - దృష్టి”లను ఆశ్రయించువారి ఆత్మ వినిర్మలమౌతోంది.
4. విషయములతో అసంగము - విషయములతో ఏర్పడు సంగమే విషయభావన. అట్టి భావనయే ఈ దృశ్య జగత్తు యొక్క ప్రాప్తి అయి ఉన్నది. 'విషయ భావన' అనే మంచు కరిగి పోయిందా, ఇక ఈ జీవుని ఆత్మ సునిర్మలం కాకేమౌతుంది?
సంగము - - సంగము జీవుని మలినపరచుచున్నది. సంగము నుండే తక్కిన మనోరోగముల నబడు ‘కామ-క్రోధ-లోభ-మోహములు' బయల్వెడలుచున్నాయి.
ఆకాశమున సూర్యరశ్మి ప్రసరించగానే మంచు కాస్తా కరిగిపోతుంది కదా! అజ్ఞానాకాశము నందు "ఆత్మతో ఏకత్వము” అనే సూర్యుడు ఉదయించాడా, అట్టి విజ్ఞాన సూర్యుని కిరణ ప్రభావంచే విషయములతో ఏర్పడు సంగము... అనే చీకటి తప్పక తొలగిపోతుంది. అది 'సుజ్ఞానాకాశం' గా ప్రకాశిస్తోంది.
Page:118
5. తృష్ణారాహిత్యము - తృష్ణయే లేకుంటే ఈ జీవునికి, ఆత్మభగవానునికి అంతరమే లేదు. ‘తృష్ణ' అనే తటాకంలో అసంఖ్యాకములైన “మనోరథములు” అనే తరంగములు వృద్ధి చెందు చున్నాయి. ఆ తటాకంలో 'మూఢత్వము' అనే ఏనుగు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తోంది. 'తృష్ణ యొక మరొక రూపమే మనో చాంచల్యము. తృష్ణను త్యజించుటచే, మనోచాంచల్యము జయించబడగా, అప్పుడు మనస్సు స్వయముగా శాంతించుచున్నది. అప్పుడు మాత్రమే ఆత్మ లక్షణమైనట్టి 'నిర్మలత్వము' ప్రకాశించుచున్నది.
6. వాసనాజాలమును త్రెంచివేయటం అనేక ఇతఃపూర్వపు ఆసక్తి, క్రియా విశేషములచే ఈ జీవుడు తన యొక్క వాసనాజాలము (maze of tendencies) ను నిర్మించుకొని అందులో చిక్కిన పక్షిలాగా కొట్టుకొంటున్నాడు. పెద్ద ఎండుకట్టెల ప్రోగును ఒక అగ్నికణిక సహాయంతో భస్మం చేసి వేయవచ్చు కదా! ఒక నావ గలవాడు గొప్ప లోతైన నదీ ప్రవాహమును దాటివేయగలుగుతాడు కదా! అట్లాగే "వైరాగ్యము”... అనే ఆయుధమును దగ్గర ఉంచుకొన్నవానిని ఈ సాంసారిక వాసనాజలం ఏ మాత్రం బాధించలేకపోతుంది.
“సంసారము” అనబడే వాసనాజాలము ప్రజ్ఞతో కూడిన వైరాగ్యముచే త్రెంచి వేయబడుగాక! విషయగ్రంథి విచ్ఛిన్నమొనర్చబడగా, ఆత్మ యొక్క నిర్మలత్వము, అఖండత్వము, అప్రమేయత్వము అనుక్షణికమై అనుభూతమగుచున్నది.
7. మనస్సు ఉపశమనము - చిల్లగింజలు వేస్తే నీరు నిర్మలం అవుతుంది కదా! ఈ మనస్సు నందు 'ఆత్మజ్ఞానం' అనే చిల్లగింజను ప్రవేశింపచేయాలి. 1) శాస్త్రాదులను పరిశీలనాత్మకమైన దృష్టితో విచారించటం చేత, 2) గురువులు బోధించే విషయాలను అవగాహన పూర్వకంగా గ్రహించుటచేత, 3) స్వయముగా చేయు ఆత్మానాత్మ పరిశీలన చేత 'జ్ఞానం' మనస్సులోకి ప్రవేశిస్తోంది. ప్రకాశమానం అవుతోంది.
ఈ 'మనస్సు’ను కామవర్జితం (Desirelessness) చెయ్యాలి. దీనిని విషయ గుణ అనుసంధాన రహితం చెయ్యాలి. సంసార పదార్థములైనట్టి "పుత్ర కళత్ర-గృహ-ప్రతిష్ఠాదు” లను దూరము నుంచే త్యజించి వేస్తూ “ఈ సర్వము ఆత్మయే" అను అంతరంగమందలి బోధను సుస్థిరపరచుకోవాలి. భోగ, - లాభములు అభినివేశము నుండి దృష్టిని మరల్చాలి.
అప్పుడు ఈ ‘మనస్సు’ అనే పంజరములోంచి 'అజ్ఞానము' అనే పక్షి ఎగిరిపోతుంది. 8. సందేహ ప్రవృత్తిని జయించివేయటం -
శాక్తే సందేహ దౌరాత్మ్యే గతకౌతక విభ్రమమ్ |
పరిపూర్ణాన్తరం చేతః పూర్ణేందురివరాజతే || (సర్గ 22, శ్లో. 10)
నాయనా! రామా! సందేహించుట అను దుష్ట సంస్కారమే “సంసారనివృత్తి" అను ఉత్తమ స్థితిని తాత్సారం చేయిస్తోంది. ఇట్టి "సందేహించుట” అను దోషము శమించుగాక! ఈ చిత్తమును
Page:119
‘భ్రమ-కౌతుక’ రహితం చేశామా, ఇక అంతరమున, ఇది పరిపూర్ణమైన పూర్ణచంద్రుని వలె శోభించగలడు.
విచారణను ఆశ్రయించనివాడు, శ్రద్ధలేనివాడు, అనుమానాలతో కాలయాపన చేసేవాడు వినాశనము వైపే పయనిస్తున్నాడు. సంశయాత్మునకు ఇహంలోను, పరంలోను సుఖంలేదు.
9. భేదదృష్టిని శమింపజేయటం- వాయువు శమిస్తే సముద్రము ప్రశాంతమగుచున్నది కదా! "ఇది వేరు, అది వేరు, నేను, నాది, వీరు ఇట్టి వారు, వారు అట్టి వారు”... అను భేదదృష్టులు దోషరహితమగు 'సమమ్ బ్రహ్మమ్' దృష్టిచే శమించగలదు. ఉత్తమదృష్టిని అభ్యసించుటే అందుకు ఉపాయం. “ఎవరిలోనైతే నేను ఏవేవో దోషములను చూస్తున్నానో, వారంతా నావలెనే ఆత్మయే స్వరూపముగా కలిగియున్నారు” అని మరలమరల మనస్సుకు గుర్తుచేయాలి. ఎట్లాగైనా సరే, ఏ ఉపాయం చేతనైనా సరే, “సమదృష్టి”ని సుస్థిరం చేసుకోవాలి. సమదృష్టి... అల్పత్వము నుండి ఔన్నత్యము వైపు మార్గం చూపుతుంది. ఉత్తమ సౌందర్య పూర్వకమైన అవగాహనను అట్టివాడు పుణికి పుచ్చుకుంటాడు.
సమత్వము మృగ్యమగుటచేతనే వాసనలు విజృంభిస్తున్నాయి. ఫలితంగా అంతఃకరణం అజ్ఞానాంధకారమయమగు జడత్వముచే నిండిపోయి ఉంటోంది. అట్టి మనస్సు జర్జరితమగుచు ఎక్కడెక్కడో దూరదూర ప్రదేశాలలో సంచరిస్తూ, ఏవేవో భావావేశకాలను పుణికిపుచ్చుకుంటూ,... ఆయాసమంతా తెచ్చిపెట్టుకుంటోంది.
"చీకటి సూర్యోదము” లాగా “భేదదృష్టి జ్ఞానము” ఏర్పడుచున్నాయి. జ్ఞానదృష్టి వికసిస్తూ ఉంటే, భేదదృష్టి స్వయముగా అంతరించుటకు సంసిద్ధపడుతూ ఉంటుంది.
10. అభ్యాసము - ఓ రామా! శాస్త్రములు వల్లెవేస్తూ కూడా కొందరు 'ఆత్మదృష్టి' వైపుగా దృష్టి సారించలేకపోతున్నారు. సాంసారిక ద్రష్టత్వమునే సర్వదా ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా దుః ఖాలు తొలగకపోగా, ఇంకా అధికమగుచున్నాయి. ఇట్లు ఎందుకు జరుగుతోంది? ఈ మనస్సును ఇంద్రియములను సరియైన అభ్యాసము నందు నియమించకపోవుట చేతనే సుమా! జ్ఞానంచే అభ్యాసమును పరిశుద్ధపరచాలి, ఉత్తేజపరచాలి. లేకుంటే జ్ఞానము సముపార్జించి ఏం ప్రయోజనం?
ఉత్తమ అభ్యాసములను ఆశ్రయించే జీవునియందు మాత్రమే హృదయసరోవరంలో వివేకము అనే కమలం వికసిస్తోంది. అట్టి 'వివేకకమలం' చైతన్య భాస్కరుని చూచి పులకిస్తోంది.
వివేకి అయినవాడు ఉత్తమ లక్ష్యముల నుండి ఏ పరిస్థితుల యందు చ్యుతి పొందడు. అతడు తన అభ్యాసములను దీపమువలె కాపాడుకుంటాడు. అభ్యాసమే సత్వగుణమును పెంపొందింపజేస్తుంది. చంద్రకిరణములు ఈ జగత్తును ఆహ్లాదపరుస్తున్నట్లు, సత్వగుణము ఈ బుద్ధిని సువిశాలం చేసి, ఉత్తమ అవగాహనను ప్రసరింపజేసి ఆహ్లాదపరచగలదు.
మా ఉద్దేశంలో అభ్యాసం అనగా, “గురుసేవ, ప్రేమ, దయ, దాక్షిణ్యము, శ్రవణము, మననము, నిధిధ్యాస”... మొదలైనవాటిని ఆశ్రయించటం అయి ఉన్నది.
Page:120
ఓ రామచంద్రా! ఇక పెద్దగా, వివరంగా చెప్పేదేమున్నది? వాయువు, భూమి, జలము, అగ్ని లేనట్టి ఆకాశకోశము ఏ విధంగా ఉంటుంది? ఎంతో నిర్మలంగాను, విశాలంగాను, ఉదయ అస్తమయములు లేనిదిగాను ఉంటుంది కదా! అదే విధంగా జ్ఞేయుడు (ఎరుగవలసినది ఎరిగిన వాడు) అయినట్టి ధీమంతుడు నిర్మలాకాశస్వరూపుడై, “నాకు ఉదయాస్తమయములు లేవు" అను ఎరుక కలిగి ఉంటున్నాడు. "ఖండము-అఖండము, జీవుడు - బ్రహ్మము, పరిచ్ఛిన్నముఅపరిచ్ఛిన్నము”... ఈ బేధములన్నీ అజ్ఞానము ఉన్నచోట మాత్రమే ఉంటున్నాయి.
'తత్వవిచారము'చే 'ఆత్మస్వరూప సాక్షాత్కారం' పొందినవానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర పదవులు కూడా స్వల్పమైనవిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటావా? 'సృష్టించుట' మొదలైన అధికారము లందు కూడా క్లేశము ఉండి ఉన్నది సుమా!
15. జ్ఞానుల - - అజ్ఞానుల అనుభవాలు
ఎవని చిత్తమైతే, ఈ ఆకారాదులతో కూడి ఉండినప్పటికీ, "అహంకారరహితం” అయి ఉంటుందో అట్టివానికి ఈ సంసారకల్పన ప్రాప్తించుటలేదు.
'మృగతృష్ణ' యందు ఒక మూఢమృగమునకు జలము ఉన్నట్లు కనిపిస్తుంది. జ్ఞానికి జలం కనిపిస్తుందా? లేదు. అతడు కెరటముల పరంపరలు చూస్తూ కూడా, ఇదంతా భ్రమయే, క్రీనీడ మాత్రమే కనుక ఇక్కడ జలం “ఉండజాలదు” అని గ్రహిస్తున్నాడు.
తరంగవరిమే లోకాః ప్రయాన్యాయాన్తిచేతసః | క్రోడీకుర్వన్తిచాజ్ఞంతే నజ్ఞం మరణజన్మనీ II (సర్గ 22, శ్లో. 18)
వాసనావశం చేతనే ఈ జీవులందురూ తరంగముల వలె ఉత్పన్నమగుచున్నారు. నశించు చున్నారు. ఈ జనన మరణములు, సుఖదుఃఖములు, సమృద్ధి-అసమృద్ధిలు మొదలైనవన్నీ అజ్ఞానిని తమ వశం చేసుకుంటున్నాయి. జ్ఞానినో, ఏమీ చేయలేకపోతున్నాయి. అనే
ఆవిర్భావ-తిరోభావము (రాక పోక) లతో కూడిన ఈ ప్రపంచమంతా అజ్ఞాని కొరకే, అజ్ఞానము చేతనే, అజ్ఞాన విషయంగానే - ఉదయిస్తోంది, లయిస్తోంది.
జ్ఞానికి ఈ 'జగత్తు' అనునదే ఉండి ఉండుట లేదు. మొదలే ఉదయించనట్టి దానికి నాశనమేమిటి? "ఊహలో కల్పించబడిన ఒక అరణ్యంలో ప్రవేశించి మృగములను అతి లాఘవంగా వేటాడటం” అను కార్యక్రమంలాగా, తత్వజ్ఞాని లీలా మాత్రంగా ఈ జగత్తు నందు సంచరిస్తున్నాడు. రమిస్తున్నాడు. ఇక అజ్ఞాని అంటావా, అతడు తనయొక్క స్వయంకల్పిత కౌతుకము” చే ఈ జగత్తు నందు “ఇదంతా వాస్తవమే” అనే బుద్ధిని పొందుచున్నాడు. అట్లు ‘వాస్తవము’ గా భావించబడుదానిచే బంధింపబడుచున్నాడు.
Page:121
ఒకచోట ఒక 'కుండ' ఉన్నది. అది ఉన్నా, లేక పగిలినా ఆ 'స్థలము' (Space that is occupied by the pot) కు వచ్చే లాభం గాని, నష్టం గాని ఏమైనా ఉన్నదా? ఘటమునకు ఉత్పత్తి వినాశనం ఉండవచ్చు గాక. కానీ, ఘటాకాశమునకు ఉత్పన్నమేమిటి? నాశనమేమిటి? అట్లాగే ఈ శరీరము భూషించబడు గాక, లేక దూషించబడు గాక! ఆత్మకు ఎట్టి వికారములు ఉండవు. ఆత్మజ్ఞుడు ఈ ఉత్పత్తి నాశనము లేవీ తనయందు కలిగియుండుటలేదు. "నేను ఈ శరీరమునే!" అను అల్పజ్ఞతను ఆశ్రయించువాడు మాత్రమే,... ఈ జన్మ మృత్యువులను అనుభవించుచున్నాడు సుమా! సాయంకాల సమయంలో సూర్యకిరణములు ప్రసరించుటచే విశాల భూమి యందు మృగతృష్ణ ఎటకో మటుమాయమైపోతోంది కదా! ఉత్తమ వివేకము ఉదయించగానే మిథ్యా భూత మగు ఈ దృశ్యము, వాసనలు, సంకల్పవ్యవహారములు... ఇవన్నీ తమంతటతామే నశిస్తాయి.
ఓ జనులారా! "నేనెవరు? ఈ ప్రపంచము ఎట్లు ఉత్పన్నమైనది...?” అనే విషయాలు విచారణ చేయనంత వరకు 'కారుచీకటి' వంటి మిథ్యారూపం అయివున్న ఈ "జగదాడం బరము”... అంతా ఇట్లు ప్రాప్తిస్తూనే ఉంటుంది.
ఈ దృశ్యప్రపంచము మిథ్యాభ్రమ సమూహములచేతనే ఆవిర్భవిస్తోంది. అనేక ఆపదలకు స్థానభూతమై ఉంటోంది. ఎవడైతే 'ఆత్మభావన'చే ఈ దృశ్య వ్యవహారమును నిస్సారమైనదానిగా చూస్తాడో, అతడే దీని నిజ స్వరూపమును గాంచుచున్నవాడు అవుతాడు. సత్యదృష్టికి ఇదంతా లేనిది గానే తెలియవచ్చుచున్నది. కాబట్టి "ఈ దేశ కాలాదుల వశంచేత ఉత్పన్నమయ్యే 'ఆధ్యాత్మిక
ఆధిభౌతిక అధిదైవిక.’ తాపత్రయములు, అట్లే, ఈ సమస్త దుఃఖములు శరీరమునకు సంబంధించినవి మాత్రమే. అంతేకాని ఇవన్నీ పూర్ణానంద స్వరూపుడు, ఆత్మస్వరూపుడు అగు నాకు సంబంధించినవి కావు"... అను నిశ్చయమును మీరంతా కలిగి ఉండండి. ఈ విధంగా భ్రమ రహితమైన నిశ్చయము కలవాడు మాత్రమే సత్యమును గాంచగలుగుచున్నాడు.
ఈ ప్రపంచము అంతులేనట్టి 'దిక్కులు-కాలములు' మొదలైన వాటితోను, అనేక పరిచ్ఛిన్నములతోను, 'ఉత్పత్తి - చలనము’ ఆదిగా అనేక క్రియా వ్యవహారములతోను కూడి ఉన్నది. అట్టి ఈ ప్రపంచమునందు 'అంతటా నేనే వ్యాపించి ఉన్నాను'... అను అనుభవము కలవాడే నిజమైన జ్ఞాని.
వాలగ్ర లక్షభాగాత్తు కోటిశః పరికల్పితాత్ |
అహంసూక్ష్మఇతవ్యాపీ యంపశ్యతసపశ్యతి ॥ (సర్గ 22, శ్లో. 26)
“సర్వవ్యాపకుడనై, సర్వదా ఉన్నట్టి నేను ఒక రోమము యొక్క అగ్రభాగమందలి ఒక కోటి వంతు భాగము యొక్క ఒక లక్షవ భాగము కంటే కూడా ఇంకనూ ఎంతో ఎంతో సూక్ష్మమైన వాడను”... అని ఎరుగబడే సత్యమును చూచుచున్నాడు.
ఆత్మజ్ఞుడు - ఆత్మజ్ఞుడు ఈ జీవాత్మను అసదతీతుడుగాను, భిన్నమైన దానివలె కనిపిస్తున్న ఈ జగత్తును "చైతన్యజ్యోతిమాత్రము” గాను ఎరుగుచున్నాడు.
Page:122
జగత్తును పరమాత్మకు అభిన్నంగా గాంచువాడే ఆత్మజ్ఞుడు. సర్వశక్తిమంతుడు, అసరేతుడు, అద్వితీయుడు అగు చిదాత్మ సమస్తమునందు ఉన్నట్లు చూచు దృష్టే వాస్తవ దృష్టి.
“ఆధి-వ్యాధి-భయాదులచే ఉద్విగ్నమగుచు, జనన-మరణయుక్తమై యున్న ఈ దేహము నేను కాదు”... అని ఏ బుద్ధిమంతుడు ఎరిగి ఉంటాడో, అతడే యథార్థజ్ఞానము కలవాడు.
“నా యొక్క మహిమయే పైన, క్రింద, ప్రక్కలందు అంతటా వ్యాపించియున్నది. నాకిక రెండవవాడే లేడు" అని తెలుసుకొనువాడే సమ్యక్ జ్ఞాని.
“దారంలో మణులు గ్రుచ్చబడినట్లు, నాయందే ఈ ప్రపంచమంతా గ్రుచ్చబడి ఉన్నది. ఈ అంతఃకరణము అనుదానికి కూడా కర్తను నేనే... అంతే గాని అంతఃకరణము 'నేను' కాదు.. అను అనుభవము కలవాడే పరమార్థమును ఎరిగినవాడు.
"అహంకారముగాని, దృశ్యముగాని కించిత్ కూడా ఏ క్షణంలోనూ లేనేలేవు. ఇదంతా కూడా నిరామయమగు బ్రహ్మమే అయి అయి ఉన్నదిఉన్నది. . ఇక సర్వరూపములకు అతీతుడనగు నేను భూత-భవిష్యత్-వర్తమాన కాలములందు వ్యక్తావ్యక్తముల మధ్య స్థితి కలిగి యున్నాను. సముద్రమునకు తరంగములు ఎట్లాగో, అదే విధంగా ఈ త్రిలోకములు నా యొక్క అవయవములే అయి ఉన్నాయి”... అని నిజాంతఃకరణము నందు అనుభూత మొనర్చుకొన్నవాడే సమ్యక్ దర్శి అని, పూర్ణజ్ఞాని అని చెప్పబడుచున్నాడు.
చైతన్యము యొక్క సమక్షమే లేకపోతే ఈ త్రిలోకముల వ్యవహారమంతా మృతప్రాయమే అయి ఉండేది. ఇవన్నీ చైతన్యసత్తాస్ఫూర్తి చేతనే ఉనికిని పొంది, పరిపాలించబడుచున్నాయి. ఆత్మ తత్వము దృష్ట్యా తదితరములైనవన్నీ ఏక్షణము నందూ లేనే లేవు. ఈ విషయం ఉత్తమ విచారణ సహాయంతో సత్యస్వరూపుడగు జ్ఞాని ఎరుగుచునే ఉన్నాడు సుమా! మహాత్ముల యొక్క 'దృష్టి' ఈ సాంసారిక దేహాదుల నుండి మొదలే మరల్చబడి ఉంటోంది. వారి అవగాహనలో ఈ 'నీవు-నేను’ అనునవన్నీ ఆత్మపరమే అయి చెన్నొందుచున్నాయి. అట్టి ఉత్తమ నేత్రములు కలవారే 'సంసార తాడనము’ను నిరోధించగలుగుచున్నారు. సత్యమును చూడగలుగుచున్నారు.
‘చైతన్యము' సర్వదా విషయములకు సంబంధించినది. అది 'స్వసత్తా ప్రకాశమున' జగత్ సమూహము లందు అంతటా వ్యాపించి ఉన్నది. ఆద్యంత రహితము, భైరవము అగు శరీరము గల చైతన్యమును (లేక ఆత్మను) సర్వులయందు, సర్వదా, సర్వముగా గాంచువాడే యదార్థ తత్వవేత్త. “ఈ సుఖ దుఃఖములు, ఈ శాస్త్ర - గురు - దేవతలందు ఏర్పడుచున్న శ్రద్ధ, వివేకమును నిదురలేపి ఆత్మతత్వమేమిటో పరిచయం చేసే శ్రవణ మనన క్రమములు ఇవన్నీ కూడా నిర్వచించేది, ప్రవచించేది, పరిరక్షించేది దేనిని? నా యొక్క వాస్తవ స్వరూపము గురించే! ఇవన్నీ నేనే అయి ఉన్నాను”... అను అనుభవమునందు సుస్థిరుడై ఉండువాడే యథార్థ తత్త్వదర్శి.
ఇంకా ఆ సుజ్ఞాని యొక్క అవగాహనను వర్ణించి చెపుతాను... విను.
Page:123
“ఈ జగత్తంతా నిరతిశయానందముచే పరిపూర్ణమైయున్నది. బ్రహ్మానందము అనుదాని యొక్క స్వల్ప విభాగముచే పరితప్తమైయున్నది. అట్టి ఆ సువిస్తార జగత్తు నందు ఒక అత్యంత స్వల్పమైన ప్రదేశంలో ఆ 'ఐహిక పారలౌకిక' వస్తుజాలమంతా ఉండి ఉన్నది. అందుచేత, ఇవి ఎంత స్వల్పమైనవి! ఈ భోగ్యవస్తు సముదాయం ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఇందు దుఃఖ భూయిష్టమై, త్యజించదగినది ఏది? సుఖవంతమై గ్రహించదగినది ఏది?”
అప్పుడు అట్టి వివేకము యొక్క ప్రభావంచే 'భ్రాంతి' తొలగిపోయి, ఆనందము ఉదయిస్తోంది.
66 “ఈ జగత్తును 'ఇది' అని నిర్వచించలేము. ఎవడు దేనిని ఎట్లు భావిస్తే అది అతనికి అట్లే ప్రాప్తిస్తుంది. ఇది అగమ్యమైనది. ఇట్టి దృశ్యజగత్తులో సుఖమెక్కడ? శాంతమెక్కడ? ఎందుకంటే ఇందులో సుఖశాంతులు వెతకటం నేతి బీరకాయలో నెయ్యి కొరకు వెతకటం వంటిది. నాయందు విక్షేపము ఏర్పడినప్పుడు ఈ జగత్తులో విషయాలన్నీ విక్షేప పూరితంగా ప్రాప్తిస్తున్నాయి. నేను విక్షేపరహితుడనై ఉంటే ఇది కూడా విక్షేపరహితంగానే ఉంటుంది. అందుచేత ఇదంతా స్వయంగా విక్షేపరహితంగాను, నా యొక్క ప్రకంపనముచే విక్షేప సహితంగాను ఉంటోంది"... అని తార్కిక జ్ఞానము, సమ్యక్ భావన కలిగియున్నప్పుడు, ఇక ఈ జగత్తులోని “ఇది త్యజించాలి, ఇది పొందాలి” అను రూపముగల త్యాజ్య గ్రాహ్యకల్పన అంతా నశించక ఏం చేస్తుంది చెప్పు? అట్లు ఎవరి దృష్టిలో జగత్ చంచలత్వం నశిస్తుందో, అట్టివాడే ఉత్తమ పురుషుడు.
ఏ మహాత్ముడైతే 'ఆకాశము' వలె ఏకాత్మ స్వరూపుడై ఉంటాడో, పదార్థములందు పూర్ణ భావనగా వ్యాపించి ఉంటూ కూడా, ఆయా పదార్థములను పొందకయే ఉంటాడో, (వాటి యందు అనుక్తుడు కాకయే ఉంటాడో).... అట్టి వాడు 'నిరతిశయానందము'నకు అర్హుడు అగుచున్నాడు. అతడే మహేశ్వర స్వరూపుడు.
ఓ రామచంద్రా! అట్టి మహాపురుషులు ఉన్నారు. వారు ఈ భూమిపై నిశ్చింతగా సంచరించు చున్నారు. వారు ఈ జాగ్రత్ -స్వప్న సుషుప్తులనబడే మూడు అవస్థల నుండి విముక్తులై, తమను తాము ఈ మూడింటికి వేరైన తత్త్వముగా గాంచుచున్నారు. మృత్యువునకు కూడా ప్రేమాస్పదులై, మృత్యువును కూడా ఒక దినచర్యవంటిదిగా గాంచుచున్నారు. సౌమ్యులై సర్వత్రా సమబుద్ధి కలవారై ‘తురీయావస్థ’ అనబడే ఉత్తమ పదమునందు ఉపస్థితులై ఉంటున్నారు.
అట్టి మహాత్ములు తారసపడినప్పుడు నావంటి మునులు కూడా శిరస్సు వంచి నమస్కరించుచున్నారు. మేము అట్టివారికి సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తున్నాం.
ఓ రాఘవా! ఈ బ్రహ్మాండములందు అంతటా ఒకే బ్రహ్మము వ్యాపించియున్నది. నిస్సంశయముగా నీవు ఇట్టి దృఢనిశ్చయము కలిగియుండుము. అనేక విచిత్రములు, రమణీయములు అయిన పదార్థములతో కూడిన ఈ జగత్తు యొక్క సృష్టి - స్థితి - లయములందు అపరిచ్ఛిన్నమగు ‘బ్రహ్మవృత్తి'నే సర్వదా కలిగియుండుము.
Page:124
సాక్షాత్ శివ స్వరూపుడవై, జ్ఞానవంతుడవై, జీవన్ముక్తుడవగుము. అప్పుడు అట్టి ఆత్మారాముడవగు నీకే నేను నమస్కారం చేస్తున్నాను.
16. శరీరము - - నగరము - శరీరి - రాజు
శ్రీరాముడు : ఓ మునీంద్రా ! ముక్తుడు ఈ శరీరమును, తదితర దృశ్యవిశేషములను ఎట్లు ఏ దృష్టిచే చూస్తూ ఉంటాడో చాలా విశేషాలు చెప్పారు. ముముక్షువులకు మార్గదర్శకమగు అతని దృక్పథము - అవగాహన - పరివర్తనల గురించి ఇంకనూ మరికొంత తెలియజేయండి. ముక్తి పొందిన జీవుడు శరీరమును కలిగి ఉంటాడా? లేక త్యజించివేస్తున్నాడా?
శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మమునే ఆశ్రయించి ఉంటున్న జీవుని మనం 'జీవన్ముక్తుడు' అని పిలుస్తున్నాం. అట్టి వాడు ప్రారబ్ధము (వర్తమానము కొరకు ప్రాప్తించే సంచితకర్మ వ్యవహారము) క్షయం అయ్యేవరకు వ్యవహారములను అనుసరిస్తూనే ఉంటున్నాడు. ఈ శరీరమును పాలించుచూ కూడా, దీని పుణ్యపాపములచే అంటకయే ఉంటున్నాడు. నీవు ఎప్పుడైనా కుండలు తయారుచేసే చక్రమును చూచావా? ఆ చక్రము కుండ తయారయిన తరువాత కూడా మరికొంత సేపు పరిభ్రమిస్తూ ఉంటుంది కదా! అట్లే జీవన్ముక్తుడగు పురుషుడు 'శరీరత్వము'(I am this body) ను వదలి ‘శరీరిత్వము’ను (I am the one who utilises this body) స్వీకరించినప్పటికీ, ఈ శరీరము లను ధరించియే ప్రవర్తిస్తున్నాడు. అయితే జీవన్ముక్తునకు 'శరీరము కలిగియుండుట' అనేది బంధము అగుట లేదు సుమా! ఇది భోగమోక్షములను కలుగజేయటానికే ఉపయోగ పడుతుంది. ఈ శరీరము అతనికి సుఖము కొరకే ప్రవర్తిస్తోంది. అంతేకాని దుఃఖము కొరకు కాదు. మరొక విధంగా చూస్తే, అతనికి దేహమువలన సుఖమూలేదు. లేకపోవుటచే కష్టమూ లేదు.
జ్ఞానదృష్టిని అలవరచుకొనుచున్న యోగి దుఃఖాదులచే ఏమాత్రం స్పృశించబడుటలేదు. ఈ దేహము గురించి విజ్ఞులు చెప్పు కొన్ని వివేషములను చెపుతాను... విను.
ఈ 'దేహము' అనే నగరం అనేక గుణ విశేషములు కలదై ఎంతో రమణీయంగా ఒప్పుచున్నది. అంతులేని విలాపములతో సంచరిస్తోంది. 'ఆత్మదర్శనము' చే మాత్రమే దీని సత్యాసత్యములు గ్రహించబడుచున్నాయి.
నేత్రములే దీని కిటికీలు. ఇంద్రియములే ఇందలి దీపములు. 'చేతులు' అనే విస్తృతమైన మార్గం ద్వారా ఆయా పదార్థముల ప్రాప్తిని పొందుతోంది. రోమములు' అనే లతలతో, 'తొడలు’ అనే స్థంభములతో ఒప్పుచున్నది. ఎముకల సంధులే దీని హద్దులు. కపాలము ఈ దేహనగరంలోని విశాల ప్రదేశం. వక్షస్థలము ఇందలి తటాకం వంటిది. భుజములే క్రీడాప్రదేశములు. చెవులు - నోరు ఈ నగరములోని ద్వారములు. కంఠమే ఇందలి బిలము.
-
Page:125
‘నవరంధ్రంలు' అనే నవద్వారంల నుండి ప్రాణవాయువులు ప్రవేశించటం, నిష్క్రమించటం అనుక్షణం జరుగుతోంది. ముఖంలో నివసిస్తున్న ‘నాలుక' పలువిధములైన భోజనం ఆరగిస్తోంది.
ఈ శరీరము అనే నగరం యొక్క అధోమార్గం గుండా 'మలము-మూత్రము' అనే బురద దూరంగా తొలగించబడుతోంది. 'చిత్తము' అనే ప్రదేశంలో 'అనేక చింతలు' అనే జనులు సంచరి స్తున్నారు. ఇంద్రియాలు అనే పశువులు విచ్చలవిడిగా ఈ నగరాన్ని దుర్గంధమయం చేస్తున్నాయి.
ముఖము నుండి వెలువడుచున్న చిరునవ్వులే ఇందలి పూలతోటలోని పూలు. తత్త్వజ్ఞులగు వారు తమ ‘దేహము, మనస్సు’ల గురించి సుస్పష్టముగా ఎరుగుచున్నారు. అందుచేత వారి పట్ల ఈ శరీరం శుభప్రదంగానే పరిణమిస్తోంది. ఇది వారికి మోక్షరూపమైనట్టి హితమును, శుభమును, సుఖమును కలుగజేస్తోంది.
కాని అజ్ఞానికి మాత్రం ఈ శరీరం అనేక దుఃఖాల-అశుభాల నిలయంగా ప్రాప్తిస్తోంది.
ఈ శరీరము నశిస్తున్నప్పుడు జ్ఞాని అత్యంత స్వల్పమైన విషయముగా దర్శించుచున్నాడు. అతని దృష్టిలో ఈ శరీరనాశన మాత్రంచే సత్యవస్తువు ఏదీ పోవుట లేదు. లేక ఇది నిలచి ఉంటుందా, అదీ మంచిదే! జ్ఞాని దీనిని ఉపయోగించి భోగ మోక్షములను అనాయాసంగా పొందుచున్నాడు.
ఈ శరీరము జీవునకు ఒక రథము వంటిది. దీనిని ధరించిన జీవుడు ఈ ప్రపంచంలో చమత్కారంగా కొంచెం సేపు సంచరించి ఎప్పుడో దీనిని త్యజించివేస్తున్నాడు. అట్టి కొద్ది కాలంలోనే “శబ్ద-స్పర్శ-రూప రస గంధములు”... అనే విషయములను, “స్వజనులు-పరులు -బంధువులు-మిత్రులు-అసంబంధులు-శత్రువులు”... మొదలైన పరస్పర వ్యతిరిక్తమైన సంబంధ బాంధవ్యములను పొందుచున్నాడు. అయితే అతడు జ్ఞానలక్ష్యమును, దృష్టిని కలిగియుంటేనో, ఈ శరీరము నుండి అతనికి 'మోక్షము' అనబడు 'ఉత్తమమైన సుస్థిరమైన అవగాహనతో కూడిన మనస్సుకు పరమైన...” స్థితి లభిస్తోంది. కనుక జ్ఞానికి ఈ శరీరరథము లాభదాయకమే.
ఈ శరీరనగరం 'సుఖ-దుఃఖములు' అనే క్రియలను స్వయముగా ధరిస్తోంది.
జ్ఞానికి ఉత్తమ విషయములను నేర్చుకొనుటకు, చేకూర్చుకొనుటకు ఈ శరీరం ఉపయోగి స్తోంది. ఈ శరీరంచే నిర్వర్తించబడు శాస్త్రయుక్తమైన క్రియల ద్వారా తనలో దుష్ట స్వభావాలకు అతడు చికిత్స పొందుచున్నాడు. అందుచేత 'ప్రశాంతము అనబడు నిర్లిప్త అంతరంగస్థితి, సమగ్రమగు అవగాహన"... లను లక్ష్యములను కలిగియుండి, ఈ శరీరంను ఒక ఉపకరణంగా, చేతి కఱ్ఱ వలె ఉపయోగించుకుంటున్నాడు.
ఇంద్రుడు అమరావతిలో సుఖంగా ఉన్నట్లు దుఃఖరహితుడు స్వస్థ చిత్తుడు అగు జ్ఞాని ఈ శరీరనగరమును పాలిస్తూ ఇందులో సుఖంగా ఉంటున్నాడు.
Page:126
అతని మనస్సు “నేను పుట్టాను. చచ్చుచున్నాను... ఇవన్నీ నావి... ఇవి నాకు ఉండాలి... నేను వారికంటే ప్రత్యేకత కలిగినవాడిని...” అను లోభపూరితమైన ఆవేశమును పొందుటలేదు. వివేకయుక్తమైన బుద్ధి పొందుచు, 'మోహము, అధర్మము'.. అను దుశ్చర్యలను దూరమునుండే త్యజిస్తున్నాడు. అజ్ఞానయుక్తములైన లోభ కోప మాత్సర్యాదులు అతనిపై దండెత్తలేకపోతున్నాయి. అవి అతని జ్ఞానతీక్షణతకు వెరచి బిక్కుబిక్కుమంటూ బలహీనులగు శత్రురాజువలె దూరంగా ఉండిపోతున్నాయి. సర్వ సంసార దుఃఖములకు మూలము 'ఆసక్తి'యే కదా! అట్టి ఆసక్తిని అతడు జయించివేసి ఉంటున్నాడు. కామభోగములు, సర్వ సుఖ దుఃఖవిలాపరూపమగు 'తృష్ణ'లను గుర్తించి అతడు వాటియందు తగుల్కొనుట లేదు. సర్వవేళలందు బాహ్య - అభ్యంతరములందు పరమాత్మనే దర్శించుచు “ఆధ్మాత్మిక - ఆదిభౌతికములు” అనే రెండు నదుల సంగమములందు ప్రశాంతంగా స్నానమాచరిస్తున్నాడు. ఈ ఇంద్రియములపట్ల, పైకి రమణీయంగా కనబడే విషయములపట్ల అతడు సర్వవేళల పరాన్ముఖుడై ఉంటున్నాడు. అందుచేత, అవి అతనిని నిరోధించటం గాని, కట్టడి చేయటం గాని చేయలేకపోతున్నాయి. ఏది ఎట్లా జరుగుచున్నప్పటికీ అతడు మాత్రం 'ధ్యానము' అనే అంతఃపురమునందు నిత్యము సుఖపూర్వకంగా వసిస్తూ ఉంటాడు. ఆత్మ తత్వము ఎరిగినవానికి ఈ శరీరము సుఖప్రదమే అగుచున్నది. ఎందుకంటావా? 1. భోగమోక్షములను ప్రసాదిస్తోంది కనుక 2. ఈ శరీరం ఉంటే దృశ్యం ఉంటోంది. అయితే ఈ శరీరం పోతేనో? ఏదీ కొంచెం కూడా నశించుట లేదు.
ఒక కుండ ఉన్నప్పుడుగాని లేక పగిలిననప్పుడుగాని ఘటాకాశము గాని, మహాకాశము గాని ఏమైనా ఖండించబడుచున్నాయా?... లేదే! ఈ శరీరము నశిస్తే ఇందు ప్రవేశించి అనుభవములను పొందుచున్న ఆత్మ వస్తువుకు పొందునది గాని, కోల్పోవునది గాని ఏమీ ఉండదు. జ్ఞాని ఈ దేహము కలిగియున్నప్పుడే దీని విషయమంతా గ్రహిస్తున్నాడు. వాయువు ప్రసరిస్తూ ఉండగా ఒక గోడ తారసపడితే ఆ గోడను తాకుతుంది. అక్కడ గోడలేకుంటే? తన ప్రసరణను ఇంకా కొనసాగిస్తుంది. అంతే గాని "అయ్యో! ఇక్కడ గోడ పడిపోయింది కదా...” అని తలచి వాయువు కూడా నశిస్తుందా? లేదే! అదే విధంగా శరీరం నేల కూలినా ఇందలి జీవాత్మ ఏమి కోల్పోదు. శరీరం ఏర్పడుచున్నప్పుడు క్రొత్తగా ఏదీ పొందదు.
జ్ఞాని యొక్క ఆత్మ తాను అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, ఈ శరీరమునకూడా ఉండి ప్రారబ్ధ భోగము (Fruits of actions done in the past lives) లను అనుభవిస్తూ ఉంటోంది. అంతకంతకు మును ముందే తనయందు సాక్షాత్కరించినట్టి పూర్ణానందమయమగు 'ఆత్మస్వరూపము' అను పురుషార్థమును పొందియే ఆయా సంఘటనలయందు మౌనంగా పాల్గొనుచూ ఉన్నది. అనుభవమునకు అతీతమైన ప్రజ్ఞను అవధరించి సర్వమునకు సాక్షియగుచున్నది.
రెండు నదుల సంగమము = ఆత్మ, శరీరముల సంబంధములను విజ్ఞాన దృష్టితో ఎరిగి ఉండుటయే “సంగమమందు స్నానం” గా ఇక్కడ చెప్పబడింది.
Page:127
శ్రీరాముడు : అంటే అతడు అన్నియు నిర్వర్తిస్తూ ఏమీ నిర్వర్తించనివాడే అగుచున్నాడా? శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. జ్ఞాని ఆయా అర్థక్రియాదులపట్ల ఉన్ముఖుడై ప్రారబ్ధ కర్మానుసారంగా ప్రాప్తిస్తున్న కర్తృత్వమును, కర్మత్వమును నెరవేర్చుచున్నాడు. ఈ విధంగా వ్యవహారదృష్టితో చూస్తే అతడు అంతా చేస్తూనే ఉంటాడు. అయితే, యథార్థానికి ఏమీ చెయ్యనివాడే అగుచున్నాడు. “నేను సర్వత్రా సర్వదా వ్యాపించియే ఉన్నాను” అను ఎరుకను కలిగి ఉంటూనే లీలామాత్రంగా ఈ దృశ్య కార్యక్రమాలను వినోదపూర్వకంగా పొందుచున్నాడు. 'త్యాజ్యం' అనే విమానం అధిరోహిస్తున్నాడు. చమత్కారంగా, అతి సుందరంగా, పరమశాంతియుతంగా ఈ జగత్తునందు సంచారము సలుపుచున్నాడు. 'మైత్రి' అనే ప్రియురాలితో కూడుకొనినవాడై ఉంటున్నాడు. అతనికి ఇటు అటు ‘సత్యత్వము’, ‘ఏకత్వము’ అనబడే ఇద్దరు ప్రియాతిప్రియమైన మిత్రులు వెంటనంటి ఉంటున్నారు. ఆకాశంలో ఆ సూర్యుని చూడు... అతడు వనములోని లతలను నిర్లిప్తంగా చూస్తూ “తన కిరణజాలమును ప్రసరింపజేయుట' అను ధర్మమును నిర్వర్తిస్తున్నాడు కదా! జ్ఞాని కూడా అతి దూరస్థుడై నశ్వరము, దుఃఖగ్రస్తము అగు ఈ లోకములన్నీ చూస్తున్నాడు. సర్వదిక్కులను తన యొక్క “సత్-చిత్”ల ప్రసరణముచే పూర్ణమొనర్చుచున్నాడు. సమస్త సంపదలతో కూడిన పూర్ణచంద్రునివలె అఖండ శోభాయుక్తుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. శంకరభగవానుడు కాలకూట విషం మ్రింగితే, ఆ విషం ఆయన కంఠమునకు ఆభరణమే అయి, ఆయనకు 'నీలకంఠుడు’ అను ప్రశంసను తెచ్చిపెట్టింది కదా! జ్ఞానిచే సేవించబడు కార్యక్రమములు, భోగసముదాయములు కూడా దుఃఖమును గాక సుఖమునే కలుగజేస్తున్నాయి.
“ఇతడు నిజమైన యముడు కాదు... కేవలం వేషం వేసినవాడు”.. అని తెలిసిన తరువాత ఆ వ్యక్తితో సంభాషణ వినోదమునే కలుగజేస్తుంది కాని విషాదమును కాదుకదా! అట్లాగే, "ఈ భోగములన్నీ మిథ్యారూపములే” అని తెలిసిపోయిన తరువాత ఇవి అట్టి జీవునికి దోషరహితమైన సంతోషమును చేకూర్చగలుగుతాయి.
నటులు సామూహిక నృత్యం చేస్తూ దూరంగా పోతూ ఉంటే ప్రేక్షకులు చమత్కార దృష్టితో చూస్తూ ఉంటారు కదా! జ్ఞాని కూడా ఈ స్త్రీ ధన రాజ్య పూజ్యాది వ్యవహారములన్నీ ఒక నాటకములోని సంఘటనలను చూస్తున్నట్లు, తనకు ఏమాత్రం సంబంధమే లేనట్లు అవగాహన కలిగి ఉంటాడు. బహుదూరం పోవలసిన బాటసారి మార్గమధ్యంలో తారసపడే గ్రామ సమూహములను నిర్లిప్తంగా చూస్తూ ఉంటాడు కదా! జ్ఞాని కూడా ఈ సర్వలోక వ్యవహారములను ఆసక్తిరహితంగా ఉద్వేగాదులు లేనివాడై చూస్తున్నాడు.
ఎక్కడో కొండయొక్క ఎత్తైన శిఖరమును, అక్కడి వృక్షముల వృద్ధి క్షయములను జనులు రాగరహిత దృష్టితో చూస్తూ ఉంటారు. అట్లాగే మమత్వము లేనట్టి జ్ఞాని యొక్క దృష్టి కూడా సర్వ కార్యములందు, విషయములందు సంఘటనలయందు రాగరహితమై ఒప్పుతూ ఉంటుంది.
Page:128
జ్ఞాని ప్రారబ్ధకర్మానుసారంగా ఈ ఇంద్రియములకు ప్రాప్తించే విషయములను అనుభవించ వలసివస్తే... అప్పుడు వాటిపట్ల ఏ విధమైన స్వీకార, తిరస్కార రూపమైన పట్టుదలా వహించడు. అట్లాగే, “ఇవి నేను పొందలేకపోయానే....? ఏమైనా సరే, ఇవి నేను పొందవలసిందే!" అను యత్నపూర్వక 'గ్రాహ్యభావన' ఆశ్రయించదు. “ఏదో పొందాలి"... అని చెప్పనలవి కాని తపన, ఆతృత అతనియందు ఉండదు. సదా పరిపూర్ణరూపుడై, పరిపూర్ణకాముడై దర్శనమిస్తూ ఉంటాడు. నెమలిపింఛంతో కొండను కొడితే కొండకేమైనా అవుతుందా? ఇక్కడ వచ్చి - పోయే మహర్దశలు, దుర్దశలు జ్ఞానిని ఏమాత్రం చలింపజేయజాలవు.
ఈ స్థూలశరీరము సూక్ష్మశరీరములకు మూల కారణమైన అజ్ఞానము అతనియందు
నశించిపోతుంది.
సంశాన్త సర్వసందేహో గలితాఖిల కౌతుకః |
సంక్షీణ కల్పనాదేహో జ్ఞః సమ్రా వరాజతే ॥ (సర్గ 23, శ్లో. 49)
అతడిక సంశయరహితుడై ఉంటాడు. ఈ సర్వభోగములందు అతనికి మిథ్యాత్వమే దర్శన మిస్తూ ఉంటుంది. అందుచేత సర్వకౌతుకములను వర్ణించినవాడై ఉంటాడు. ‘నాయందు ఈ స్థూల సూక్ష్మ దేహముల కల్పనకు చోటే లేదు... జనన మరణాదులు లేవు" అను బోధను ఆశ్రయించి ఉంటున్నాడు. రాజసూయ యజ్ఞఫలం పొందిన చక్రవర్తివలె శోభిస్తూ ఉంటాడు.
అయితే ఇక్కడ 'చక్రవర్తి' అనే దృష్టాంతమును జ్ఞానియొక్క “అవగాహన - పరిమోత్కృష్ట భావన”లను వివరించటానికి మాత్రమే వాడాను. యథార్థానికి, “అపారము పూర్ణము” అయివున్న మహాసముద్రంలాగా జ్ఞాని పూర్ణ స్వరూపమగు తన ఆత్మచే ఆత్మయందే శోభించుచున్నాడు.
జనులు ఒక పిచ్చివాడిని, అతని చేష్టలను చూచి నవ్వుకుంటూ ఉంటారు కదా! అనేక భోగేచ్ఛలచే క్షణక్షణం వ్యాకులచిత్తులగుచు, స్వస్వరూప సమాచారము విషయమై అసావధానత్వం వహించువారిని చూచి జ్ఞాని నవ్వుకుంటూ ఉంటాడు.
ఎవరో త్యజించి, దూరంగా విసరిన వస్తువులను ఆశ్రయించి భద్రముగా దాచుకునే వ్యక్తిని చూచి అందరం పరిహసిస్తూ ఉంటాం కదా! తుచ్ఛమైన ఆసక్తులను కలిగియుండే అజ్ఞానుల ఇంద్రియ ప్రవృత్తులను, మూర్ఖపు కౌతుకాలను చూచి జ్ఞాన దృష్టి గల యోగులు నవ్వుకోవటంలో ఆశ్చర్యమేమున్నది?
17. మనోనిగ్రహం - ఇంద్రియ నిగ్రహం
ఓ రామచంద్రా! మనం ఒక ఏనుగును అంకుశంతో నిగ్రహిస్తాం. ఈ 'మనస్సు' అనే మదపుటేనుగు “ఆత్మసుఖము” అను దానిని త్యజించి ‘ఇంద్రియవిషయములు' అనే దుష్టమార్గంలో ఎటకో పరుగులు తీస్తోంది. అట్టి ఈ మనస్సును ఏం చేయాలి? నిరోధించాలి. ఎట్లా? అందుకు చిన్న చిన్న విజ్ఞాపనలు సరిపోవు. విచారణ - - సుజ్ఞానములను నిరంతరం ఆశ్రయించాలి.
Page:129
ఈ మనస్సు అతి చంచలమైనది కదా! అందుచేత, ఇది భోగముల వైపుగా రాగ లోభపూరిత వృత్తులను పొందుతూ ఉంటోంది. అట్టి వృత్తి రూపము పొందకుండా నీవు నీ మనస్సు విషయంలో జాగరూకుడవై ఉండాలి సుమా! విషాన్ని వెడలగ్రక్కుచున్న ఒక లతనో లేక పామునో ఎట్లా దూరంగా ఉంచుతావో, అట్లాగే భోగములపట్ల ఏర్పడుచున్న వృత్తులు నిన్ను సమీపించ కుండా చూచుకోవాలి. అట్టి దుష్ట దుర్బల వృత్తులను మొదలే నిరోధిస్తూ ఉండటం మంచిది.
ఎప్పుడైతే మనస్సు చిరకాలం నిగ్రహించబడి, వృత్తులను పొందక ఉంటుందో, అప్పుడు అట్టి మనస్సులో మా బోధ కొంచెం ప్రవేశించినా చాలు, అమోఘమైన ప్రయోజనం పొందుతోంది. ఎవరి మనస్సైతే ఎల్లప్పుడూ ఆయా భోగ, రాగవృత్తులను ఆశ్రయిస్తోందో, అట్టి వారి ముందు మేము ఎంత విస్తారమైన, సవివరమైన బోధను ప్రతిపాదించినా, అదంతా చెవిటివాని ముందు శంఖము ఊదినట్లే అవుతోంది.
మహాసముద్రం తనయందు భూమినంతా నింపివేయగలగినంత జలం ఉన్నప్పటికీ, నదుల నుండి వచ్చే జలమును స్వీకరిస్తూ ఉంటుంది కదా! నిగ్రహించబడిన మనస్సుగలవారు అనేక రూపములుగా అనేక ప్రదేశముల నుండి వారి వద్దకు చేరుకున్న జ్ఞాన విషయములన్నీ సులభంగా స్వీకరించగలగుచున్నారు. అట్లు స్వీకరించి, వాటిని తమ ఉత్తమ బుద్ధిచే విచారించి మరింత సమున్నతులు కాగలుగుచున్నారు. మనస్సు నిలకడలేనిచోటికి వచ్చి చేరే జ్ఞాన సమాచారం నిష్ప్రయోజనమే అవుతోంది.
నిగ్రహించబడిన మనస్సు అత్యంత సులభంగా తృప్తిని, ఆనందమును, సంతోషమును పొందుతోంది.
ఓ రాఘవా! ఉత్తమమైన ఆత్మజ్ఞానము ఈ జీవుని యందు వికసించకుండా నిరోధిస్తున్నది ఏది? ఇంద్రియములతో ఏర్పడుచున్న తాదాత్మ్యమే సుమా! ఇంద్రియానుభవముల పట్ల స్వయముగా కల్పించుకొనిన మోహమే ఈ జీవుని అనేక యోనులందు త్రిప్పుచున్నది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రమలను పొందింపచేస్తోంది. ఇక ఈ జీవుడు ఒక ఉపాధి నుండి ఇంకొకదానికి పరుగులు తీస్తూనే ఉన్నాడు.
అందుచేత చేతిని చేతితో నలిపి, దంతములను దంతములతో కొరికి, అవయవములను అవయవములతో ఆక్రమించి... ఎట్లాగైనా సరే, సర్వప్రయత్నములతో ఈ ఇంద్రియములను మాత్రం జయించాలి.
చమత్కారమైన విషయమేమంటే, ఈ ప్రపంచంలో కొందరు అనేక విషయములందు పండితులై ఉండి కూడా, అనేక విజయోత్సాహములతో ప్రపంచమును ఆశ్చర్యపరుస్తూ కూడా, చివరికి ఈ 'ఇంద్రియములు' అనే శత్రువులకు క్షణంలో దాసానుదాసులగుచున్నారే! ఈ ఇంద్రియములే మొట్టమొదటగా జయించబడవలసిన శత్రువులు. ఏతావతి ధరణీతలే సుభగాస్తే సాధుచేతనాః పురుషాః |
పురుషకలాసు చ గణ్యా నజితాయే చేతసా స్వేన ॥ (సర్గ 23, శ్లో. 60)
Page:130
ఈ భూమి మొత్తం మీద ఇంద్రియములను జయించినవారే భాగ్యవంతులు. అట్టి వారు మాత్రమే సావధానముతో కూడిన చిత్తమును సంపాదించగలుగుచున్నారు. అట్టి 'చిత్తము' యొక్క ప్రభావముచే అతి కుశలముగా ఈ సంసారమును జయించి వేసి, స్వస్థచిత్తులగుచున్నారు.
ఓ సర్వజనులారా! “మా దృష్టిలో వీరు మంచివారు కాదు... వారు గొప్పవారు కాదు... ఈ వ్యక్తిలో ఇట్టి దోషాలు ఉన్నాయి...” మొదలైన పరుల దోషములను ఎంచు ప్రవృత్తులను కాస్త కట్టిపెట్టండి. "వారు మా శత్రువులు... వీరిని మా కండబలంతో, బుద్ధిబలంతో నిర్జించ గలం... ఇకపై వీళ్ళ వీళ్ళ సంగతి చూడాలి! ఇక చూస్తాం....” అని మననం చేస్తూ మీరు పరుగులు తీస్తున్నది ఎటు వైపు? మీ హృదయ కుహరంలోనే "దుష్టసంకల్పములు, విషయ వాసనలు” అనే రెండు కాలకూట విషసర్పాలు సంచరిస్తూ ఈ జన్మ కర్మలను విషపూరితం చేస్తున్నాయి. ఇంటిలోనే శత్రువులను పెట్టుకొని ఎక్కడో ఉన్న ఎవరో శత్రువుల గురించి ఎందుకో వేగిరపాటు? ఎవని హృదయంలో అయితే 'దుష్టమనస్సు' అనే సర్పం వినాశనం పొందుతుందో, అట్టి వాడు స్వస్వరూప సాక్షాత్కారమును అతి సులభంగా పొందుచున్నాడు. నిర్మలాంతఃకరణుడు అగుచున్నాడు.
అందుచేత మీరంతా "ఈ ఇంద్రియముల వేగమును నిరోధించటం ఎట్లా? ఈ మనస్సును ఏ సన్మార్గపు ఆచరణచే పరిశుద్ధ పరచుకోవాలి?" అనే విషయాలు మరలమరల పరిశీలించండి. శాస్త్రాదులు అందుకు ఉపకరించాలనే ఉద్దేశంతోనే మీ ముందు ప్రతిపాదించబడుచున్నాయని గ్రహించండి.
18. ఉపేక్ష పనికి రాదు
శ్రీ వసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! ఈ ఇంద్రియములను చూస్తున్నావా! ఇవి 'తృష్ణ' చే నిండియున్నవై, మహానరకప్రదములు అగుచున్నాయి.
ఈ ‘ఇంద్రియములు’ అనే శత్రువులను జయించాలంటే ఓర్పు-నేర్పు - శ్రద్ధ- ఈ మూడూ
అవసరం.
కృతఘ్నుడు తాను ఎవరి యొక్క సహాయం పొందాడో వారినే బాధిస్తాడు కదా! ఈ ఇంద్రియాలు కూడా తమకు ఆశ్రయమైనట్టి దేహమునే శిథిలపరచుటకు, నశింపజేయుటకు సిగ్గు లేకుండా సిద్ధపడుచున్నాయి. పాపధనం కూడబెట్టడంలో 'మహాదిట్ట' అయి ఉంటున్నాయి.
ఇంటి ప్రక్కనే బలవంతుడైన శత్రువు ఉంటే ఎవరికి శాంతి ఉంటుంది? ఈ ఇంద్రియములు జీవుని ప్రశాంతతకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. అయ్యో! ఈ ఇంద్రియములు జీవుని ఎంతగా క్షోభపెడుతున్నాయో చెప్పలేం. ఇవి విషయములను ఆపేక్షించుచు ‘పొందవలసినవి, చేయ వలసినవి’ అనే రెక్కలు కలిగి 'దేహం' అనే గూటిలో ప్రవేశించి మరల మరల విజృంభిస్తున్నాయే!
Page:131
‘వివేకము' అనే వలపన్ని ఈ ఇంద్రియ పక్షులను పట్టి వశం చేసుకోవాలి. అట్టివాడు మాత్రమే అచ్ఛేద్యమగు శాంతస్వరూపుడు అగుచున్నాడు. వివేకులు సమగ్రమగు ‘అవగాహన’ అనే నిలకడ కలవారై పైపైకి మాత్రమే రమణీయంగా ఉండే ఈ ఇంద్రియ విషయము లందు ఏ మాత్రం ప్రీతిని గాని, కౌతుకమును గాని పొందకుండా ఉంటున్నారు. ఇంద్రియములను ఓడించి వేసి, తమ చిత్తమును స్వాధీనము చేసుకున్నవారై 'మట్టి' మొదలైన పంచభూత సమ్మేళనముచే నిర్మించబడిన ఈ స్వశరీరమును ఒక ఉపకరణమాత్రమైనదిగా చూస్తున్నారు. అందుకు ఫలితంగా ఆ వివేకులు పరమసుఖమునే పొందుచున్నారు. అట్టి సుఖమును గొప్ప సామ్రాజ్యమును ఏలుతున్న చక్రవర్తులు కూడా పొందలేకపోతున్నారు.
ఎవడైతే ఈ ఇంద్రియములను తన భృత్యులుగా చేసుకుంటాడో (తాను వాటికి భృత్యుడు కాడో...) ‘దుష్ట మనస్సు' అనే శత్రువును జయించివేస్తాడో... అట్టి వాని పరిశుద్ధమగు బుద్ధి 'వసంతకాలంలోని లతలు' వలె వృద్ధి చెందుతోంది. మేము చేయు బోధలు అతని పట్ల రసమయమై అతి పవిత్రతను సంతరించుకుంటున్నాయి.
శ్రీరాముడు : స్వామి! ఈ భోగవాసనలు నశించేది ఎట్లా?
శ్రీ వసిష్ఠమహర్షి : ఎవరినైనా ఉద్దరించగలిగేది వారి యొక్క 'అభ్యాసము’ మరియు వారి ‘వైరాగ్యపూరితమైన విచారణ' అని గ్రహించు.
సర్వప్రయత్నములచే ఈ చిత్తము యొక్క గర్వమును నశింపజేయాలి.
ఇంద్రియ శత్రువులను జయించటానికి అభ్యాసము, దైవీగుణములను ఆశ్రయించుట ఉపాయమైయున్నది. ఉత్తమ అభ్యాసం ఆశ్రయించేవారు తమ భోగవాసనలను స్వయంగా నశింప జేసుకోగలగుచున్నారు. ఇందులో సందేహము లేదు. అభ్యాసమును ఆశ్రయించకుండా, "మేము ఉద్ధరించబడటం ఎలా?” అని ఖాళీచేతులతో గురువును ఎంతగా ప్రశ్నిస్తే ఏం ప్రయోజనం?
ఓ రామచంద్రా! 'ఏకం' అయినట్టి “బ్రహ్మతత్త్వం”ను అభ్యసించుట చేత మనస్సు క్రమంగా జయింపబడగలదు. మనస్సు జయింపబడనంత కాలం 'అజ్ఞానం' అనే గాడాంధకారం ఉండనే ఉంటుంది. ఆ చీకటి ఉన్నంతసేపు వాసనలు జుట్టు విరగబోసుకున్న పిశాచాలలా విజృంభిస్తూనే
ఉంటాయి.
“నేను స్వల్పుడను... శరీరమాత్రుడను... చావుపుట్టుకల మధ్య మాత్రమే ఉన్నవాడను”... అను స్వల్పత్వమును నీవు త్యజించు. మనస్సునందు ఆత్మకు సంబంధించిన సమాచారము చేతను, వివేకపూరితమైన పరిశీలనాదులచేతను నింపివేయి. వివేకవంతుడవై ఉండు. అవివేకివి కావద్దు. “నా గతి ఇంతే... నే బాగుపడటమేమిటి?... నేను ఉద్ధరింపబడజాలను... ఎందుకంటే నేను అల్పుడను కదా”... ఇట్టి అవివేకమును, ఆ అవివేకమునకు సహకరించు వాక్యక్రమములను, భావనలను దూరంగా నెట్టివేయి.
Page:132
వివేకి యొక్క మనస్సు. తాను గ్రహించిన లక్ష్యం వైపుగా కార్యక్రమాలుగా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి అది అతనికి గొప్ప సేవకుడు.
అది అతనిని సత్కార్యములవైపు ప్రేరణ కలిగిస్తుంది. కనుక మంచి మిత్రుడు. ‘ఇంద్రియములు' అనే శత్రువులపై దాడిచేసి అణచివేస్తుంది. కనుక గొప్ప సామంత రాజు. ప్రేమభావము కలిగి ఉంటుంది. అందుచేత అత్యంత ప్రియురాలగు
పాలించి, ఆ జీవుని అనేక దుఃఖములు, ప్రమాదాల నుండి రక్షిస్తూంటుంది. కా కాబట్టి తండ్రి. ఈ విధంగా వివేకి విషయంలో అతని మనస్సు అతనికి క్షేమమునే కలుగజేస్తోంది.
'ఈ మనస్సు అనుల్లంఘ్యనీయమైన శాసనము కలిగి ఉంటోంది. అయితే దాని యొక్క వాస్తవరూపము చైతన్యము. అది చైతన్యము కంటే వేరైనది కాదు. 'స్నేహము వివేకము ఉత్తమ బుద్ధి'లచే దానిని వశం చేసుకోవాలి..." అని మనకు శాస్త్రములు బోధిస్తున్నాయి. చైతన్యము యొక్క స్వయంకల్పనయే ఈ మనస్సుకు మూలము. సాధన-ఉపాసనలు కొనసాగు చుండగా, ఈ మనస్సు తన యొక్క మనోరూపమును త్యజించి “చైతన్య మాత్రము”గా శేషించు చున్నది. తత్త్వజ్ఞానసిద్ధిని ప్రసాదించి, మరుక్షణం తాను అదృశ్యమగుచున్నది.
శాస్త్రదృష్టిచే ఈ జీవితము అనే గని పరిశీలించబడగా, సౌభాగ్యవశంచేత, “మనస్సు యొక్క స్వభావమునకు సంబంధించిన సమాచారము” అనే మణి ఈ జీవునికి లభిస్తోంది. అట్టి ఈ మనస్సు 'ఆచార్యుల పాఠములు - సహపాఠకులతో కూడి చేయబడిన విచారణ' అను వాటి సహాయం చేత స్వానుభవ పర్యంతము (upto one's own absolute sense of experience) విచారించబడగా ‘నిధిధ్యాస' అనే ఉత్తమ కార్యక్రమం ప్రాప్తిస్తోంది. అప్పుడు ఈ మనస్సు జ్ఞానంచే సుప్రబోధం అగుచు సప్తభూమికలను అనుశ్రుతం చేసుకుంటోంది. అప్పుడు మిక్కిలి ప్రశాంతతో శోభించుచు లోక కళ్యాణకారకమే అవుతోంది.
సరిదిద్దబడుచున్న మనస్సు - ఈ మనస్సును మనం సరిదిద్దుకున్నామా, ఇక ఇది 'సాధన చతుష్టయం’ మొదలుకొని తత్త్వసాక్షాత్కారము వరకు ఉత్తమ కర్మలను మనచేత నిర్వర్తింపజేస్తుంది. ‘జన్మలు' అనే అత్యంత ప్రాచీనమైన వృక్షాన్ని మొదలంట ఖండింపజేస్తూ, నిరతిశయానందమును ప్రసాదించుచున్నది. ఇది తనకు తానే సమర్పించుకొని ఈ జీవునకు 'ఆత్మభావన' అనే ఒక గొప్ప ప్రయోజనమును ప్రసాదించుచున్నది.
కనుక ఓ సర్వజనులారా! మహత్తరమై ఈ మనస్సును చక్కగా నియోగించండి. అప్పుడు ‘ఆత్మోద్ధరణ’ ప్రసాదించుటలో ఇంతకు మించిన శ్రేయోదాయకమైన దంటూ ఇంకేదీ ఉండదు. బురదతో నిండిన కాళ్ళతో ఎవరైనా ఇంటిలోకి ప్రవేశిస్తారా? మీ మనస్సులను ‘వివేకం’ అనే జలంతో పరిశుద్ధపరచుకోకుండా ఈ దృశ్యం నుండి ఆంతరంగంలోకి ప్రవేశిస్తే, దుఃఖాదులే
తారసపడతాయి సుమా!
Page:133
మనస్సే బంధము.... మనస్సే మోక్షము - ఓ రామచంద్రా! వివేకరహితులగువారు, మూర్ఖులు మాత్రమే అనేక ఉత్పాతములతో కూడి ఉన్న ఈ సంసారభూములందు సంచరిస్తూ సుదీర్ఘమైన ప్రయాణాలు చేయటానికి ఉద్యుక్తులౌతున్నారు. నీవు మాత్రం వివేకయుక్తుడవు అయి, ఈ సంసారమునందు చిక్కకుండేందుకే యోచించు. భయంకరమైన వ్యాధి వచ్చి పడుతుంటే, దానికి చికిత్స గురించి యోచించకుండా ఎవరైనా ఉంటారా? ఓ రామా! అనేక అనర్థములు
సంసార మాయాముదితామ్ అనర్థశతసంకులామ్ ।
మా మహామోహమిహికామ్ ఇమాం త్వమవధీరయ॥ (సర్గ 24, శ్లో. 17)
తనయందు ఉంచుకొని, నీ ముందు కపటంగా వ్యక్తమగుచున్న ఈ సాంసారికమాయను ఉపేక్షించవద్దు.
“దామ-వ్యాళ-కటన్యాయము” అనే మూర్ఖత్వం పొందవద్దు. “భీమ-భాస-దృఢన్యాయము" ను స్వీకరించి వివేకివి కమ్ము.
అప్పుడు 'దుఃఖరాహిత్యము' అనునది నీ చేతిలోని విషయమే అవుతుంది. 'ఈ దృశ్య భూతమగు శరీరమే నేను' అను రూపముగల మిథ్యానిశ్చయమును పూర్తిగా త్యజించు. ఈ మిథ్యా వస్తువులన్నింటికీ భిన్నమైనట్టి 'సత్యము' అగు ఆత్మవస్తువు ఆశ్రయించు. నీవు రావచ్చు... పోవచ్చు... తినవచ్చు... తిరుగవచ్చు... అయితే సర్వదా అమనస్కుడవై ఉండు. ఎట్టి బంధమున తగుల్కొనవద్దు.
అప్పుడు నీవు ముక్తుడవే అవుతావు.
Page:134
IV. దామ వ్యాళ కటన్యాయం
1. శంబరాసుర సృష్టి
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “ఈ ప్రపంచమునందు విహరిస్తున్న అనేకమంది జనులకు శాంతిని ప్రసాదించేది ఎట్లా?”... అను లోకపిత భావమును నీవు కలిగియున్నావు. శమదమములు నీయందు ఉన్నాయి. మోక్షము లక్ష్యముగా కలిగియున్న మహాశయుడవు. అట్టి నీకు దామ-వ్యాళ-కటన్యాయము ఉచితము కాదు సుమా! కనుక భీమ భాస దృఢ న్యాయము నందు సుస్థితుడవై, శోకరహితుడవై ఉండాలి. అదియే ఉచితం.
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ సంసారమును విస్తరింపజేసుకుంటూ అనేక దుఃఖములను ఆహ్వానించుకుంటున్న మమ్ములను మీ వాక్యములు సముద్ధరిస్తున్నాయి.
“దామ-వ్యాళ-కట న్యాయము” అనుసరించవద్దని మీరు మరల మరల హెచ్చరిస్తున్నారు కదా! మీరు చెప్పిన రెండు న్యాయములు ఏమిటో వివరించండి. 'భీమ భాస దృఢ న్యాయం' మమ్ములను ఎట్లా శోకరహితులుగా చేస్తుంది? రెండు న్యాయముల గురించి సవిస్తరంగా చెప్పటం చేత మేము ప్రబోధితులం కాగలం. సక్రమమైన మార్గమును ఎన్నుకుంటాం.
శ్రీ వసిష్ఠ మహర్షి : సరే ముందుగా “దామ వ్యాళ కట న్యాయం” అనే పదప్రయోగం వెనుక గల ఇతిహాసం చెపుతాను. విను.
దామ వ్యాళ కటులు - ఒకప్పుడు పాతాళలోకమును 'శంబరాసురుడు' అను పేరుగల దైత్యరాజు పాలిస్తూ ఉండేవాడు. మాయను కల్పించుటలో అతనితో సమానమైన మాంత్రికుడు మరొకడు లేడు. తన మాయచే ఆకాశమునందు నగరములను, సుందరమైన ఉద్యానవనములను నిర్మించి, తన జాతి వారికి ఇస్తూ ఉండేవాడు. కృత్రిమంగా సూర్యచంద్రులను నిర్మించి, తద్వారా ఋతువులను నియమించి స్వజనులకు ఆహ్లాదం కలిగిస్తూ ఉండేవాడు. అతని పాలనలో దానవకులం అనేక ఐశ్వర్యములతో తులతూగుతూ ఉండేది.
అతని అంతఃపురంలో అప్సరసలను మించిన అందంగల స్త్రీలు మధురంగా గానములు చేస్తూ ఉండేవారు. అతని క్రీడావనంలో సృష్టిలో మరెక్కడా లభ్యంకాని చిత్రవిచిత్రములైన వృక్షములు, పూతీగలు ఉండేవి. అతడు “కర్తని” అనే యంత్రము కలిగి ఉండి, ఇంద్రుడిని కూడా అత్యంత భయపెట్టుతూ ఉండేవాడు. క్రీడ కొరకు రచించిన మట్టి శివుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ శివుని సహాయంతో చక్రధరుడగు విష్ణుభగవానుని కూడా ఓడిస్తూ ఉండేవాడు. ఒక సమయంలో అతడు ఆకాశమునందు తన లోకవాసుల కొరకు నూరు చంద్రులను సృష్టించి పరవశింపచేశాడు.
Page:135
మాయతో ఐరావతం సృష్టించుకున్నాడు. అది ఇంద్రలోక ఐరావతం కంటే వేలరెట్ల తేజస్సుతో వెలుగొందేది. సమస్త సంపదలచే, సర్వైశ్వర్యాలతో, ఎవ్వరినైనా సరే జయింప గలిగిన వాడై విరాజిల్లుతూ ఉండేవాడు. కఠినమైన శాసనములతో సామంత రాజులను పాలిస్తూ ఉండే వాడు. భయంకర ఆకృతిగల శంబరాసురునికి దేవతలను కూడా నిర్జించివేయగల గొప్ప సైన్యం ఉండేది.
అయితే ఆ రాక్షసుడు ఎటైన వెళ్ళి ఉండటం జరిగినప్పుడో, లేక అతడు ఆదమరచి దీర్ఘకాలంగా నిదురిస్తున్నప్పుడో ఆ ఏమరపాటు సమయమును ఉపయోగించుకొని దేవతలు తమ మాయాప్రయోగంతో అనేకమంది శంబరుని అనుచరులను దునుమాడుతూ ఉండేవారు.
శంబరుడు దేవతల కపటయుద్ధ ప్రయోగాన్ని గమనించాడు. అతడు గొప్ప మాయావి కదా! “ఇప్పుడేం చేయాలి?”... అని బహుతీవ్రంగా యోచించి ఒక ఉపాయం పన్నాడు. సముద్రము తరంగమును ఉత్పన్నం చేస్తుంది చూచావా? అట్లా అతడు చపలబుద్ధి గలవారు, వీరులు అయిన కొందరు రాక్షస సైనికులను సృష్టించాడు. వారిపై అజమాయిషీకి ముగ్గురు సేనాపతులను సృష్టించాడు. కాని దేవతలు మంచి సమయం చూచి, శంబరాసురుడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఆ సేనాపతులను సైన్యమును కూడా సంహరించారు.
ఈ మాటు శంబరునకు చాలా కోపం వచ్చింది. “ఈ దేవతలను అంత తేలికగా వదలి పెట్టకూడదు. వీరిని, వీరు నివసించే స్వర్గమును సర్వనాశనం చేయవలసిందే” - అని నిశ్చయించు కున్నాడు. తన బలగంతో అమరావతిపై దండెత్తటానికి బయలుదేరాడు. ఈ వార్త ఎట్లాగో దేవతల చెవుల వరకు వెళ్ళింది. శంబరాసురుడు అమరావతి ప్రవేశించకముందే దేవతలు స్వర్గమును వదలి ఎక్కడో దూరప్రదేశానికి పారిపోయి తలదాచుకున్నారు. స్వర్గలక్ష్మి క్షుద్రదేవతా సమూహం చేత ఆక్రమించబడి రోదన చేయసాగింది. అక్కడి అప్సరసలు కన్నీరు కార్చారు. శంబరుడు స్వర్గం లోని సుందరమైన వస్తువులన్నీ తన వెంట ఎత్తుకుపోతూ అమరావతిని శూన్య ప్రదేశంగా మార్చాడు. పట్టణమంతా తన సైనికులచే తగులబెట్టించాడు. భీకరంగా నినాదాలు చేసుకుంటూ స్వస్థానం అయినట్టి పాతాళలోకం చేరాడు.
ఈ విధంగా దేవ-దానవుల మధ్య వైరం అధికం కాసాగింది. దేవతలు స్వర్గమును వీడి ఎక్కడెక్కడో రహస్య ప్రదేశాలలో దాగుకొనవలసివచ్చింది. ఆ తరువాత దేవతలంతా ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై గొప్ప వ్యూహమును రచించి, ప్రయత్నపరులు అయ్యారు.
అప్పుడు శంబరాసురుడు "మొండి-క్రోధ -ధృముడు" అనే ముగ్గురు సేనాపతులను సృష్టించాడు. శంబరుడు తపస్సుకు వెళ్ళిన సమయం చూచి, మొండి-క్రోధ-ధృముడు అను పేర్లు గల ముగ్గురు సేనాపతులను దేవతలు హతమార్చివేశారు. శంబరుడు వచ్చేసరికి అక్కడ కనబడ కుండా, అదృశ్యమైపోయారు. అప్పుడు శంబరాసురునికి భలే కోపం వచ్చింది...! శంబరాసురుడు: ఓ కీటకామాత్ర జీవులగు దేవతలారా! నేను ఏమరుపాటుగా ఉండటం చూచి నా సేనాపతులను సంహరిస్తారా? నేను వచ్చేసరికి పిరికివాళ్ళై పారిపోయి, నాకు తెలియని చోట
Page:136
దాగారు కదూ? సరే! ఈ మాటు నా మహత్తరమగు మాయా శక్తిచే గొప్ప సేనాపతులను ముగ్గురిని సృష్టిస్తాను.
ఇట్లు పలికి, అప్పటికప్పుడే రాక్షసజన సృష్టికి సంబంధించిన మంత్రం ఉచ్చరించ నారంభించాడు. తత్ సంబంధించిన తంత్రం నిర్వర్తిస్తూ ఇట్లు పలికాడు.
శంబరాసురుడు : నాచే సృష్టించబడుచున్న ముగ్గురు సేనాపతులారా! మీరు గొప్ప తెలివి తేటలు గలవారు, గొప్ప యుద్ధ విశారదులు అగుదురు గాక! రూపరహితుడగు కాలుడు మూర్తిమంతుడైతే ఎంత భయంకరంగా ఉంటాడో, మీరు అంత బీభత్స స్వరూపులై ఉండెదరు గాక! అతి బలశాలురు, మాయా శక్తి సంపన్నులు అయి ఉండెదరు గాక! ఒక్కొక్కరు ఒక పర్వతం వలె గొప్ప శరీరములు కలిగి ఉంటారు. మీ స్వభావములను అనుసరించి మీకు ఈ పేర్లు పెడుతున్నాను – 1. దాముడు = ఎంతటి శత్రువులనైనా సరే, అణచివేయగలిగినవాడు.
2. వ్యాళుడు = సర్పమువలె ఆక్రమించువాడు.
3. కటుడు: శత్రువుల సర్వశస్త్రాస్త్రముల నుండి స్వసైన్యమును రక్షింపగలిగినవాడు.
ఆ ముగ్గురికి ఇతఃపూర్వపు జన్మలు గాని, కర్మలు గాని లేవు. ఇదే వారి యొక్క మొదటి జన్మ. అందుచేత వారి యందు 'రాగము-ద్వేషము-అహంకారము-మమకారము’ - - అనేవి లేనే లేవు. వారు ‘చేతనము’ అను ధర్మము మాత్రము కలిగి ఉండేవారు. భయం గాని, అభిమానం గాని లేవు. “మరణిస్తామేమో! పారిపోదాం" అను వికల్పము వారియందు లేనేలేదు. “చిన్మాత్రము యొక్క సన్నిధానం మాత్రంచేత దేహము ప్రవర్తించుట” అను రాగ - కౌతుక రహితమైన ప్రతిస్పందన మాత్రం వాళ్ళు కలిగియున్నారు. చూచావా రామా! 'కర్మజీవుడే’ అయివున్నట్టి ఆ శంబరాసురుడు తన కౌశల్యం చేత 'సంకల్పవృత్తి'ని హస్తలాఘవంగా ఉపయోగించాడు. అంతర్యామియగు శుద్ధ చైతన్యమును 'భావన'చే ఆరాధించుటచే ఆ దామ - వ్యాళ కటులు ఉత్పన్నమైనారు. శ్రీరాముడు : అతనిచే వాళ్ళు ఎలా కల్పించబడ్డారు. అది అతనికి ఎలా సాధ్యం?
శ్రీ వసిష్ఠ మహర్షి : వివరంగా చెప్పాలంటే, అతడు తపస్సుచే సాధించియున్న ఏకాగ్రత చేతనే సుసాధ్యమగుచున్నది. అతడు దృఢమైన చిత్తంతో ఈ విధంగా 'సంకల్పం' చేయటం జరిగింది.
"అంతర్యామి, చైతన్యస్వరూపడను అగు నేను చైతన్యమే స్వరూపముగా కలిగియున్న విలక్షణ మైన రూప, స్వభావాలు గల ముగ్గురు రాక్షసయోధులను సంకల్పిస్తున్నాను. అట్లు నాచే సృష్టించ బడుచున్న ఈ ముగ్గురు గొప్ప లక్షణములు, శక్తి యుక్తులు కలిగియుండెదరు గాక! సాక్షి చైతన్యం చేత ఉత్తేజితులై రాక్షస విజయం, దేవతల అపజయం అనే లక్ష్యం కలిగి ప్రవర్తించెదరు గాక!” ఇట్టి ఆ రాక్షసుని సంకల్పశక్తియే ఆ ముగ్గురు సేనాపతుల జన్మలకు కారణమైనది.
ఆ దామవ్యాళకటులకు "మేము భోగములు పొందాలి” అనే ఆశయాలు లేవు. ఉత్పన్నమైన ఆ ముగ్గురు కాకతాళీయన్యాయంచేత రాక్షస సేనాపతులుగా తమకు ప్రాప్తించిన ఆయా క్రియలను
Page:137
అంధపారంపర్యముగా అనుసరించసాగారు. గాఢనిద్ర పట్టేముందు బాలుడు ప్రక్కలో పడుకొని అసంకల్పితంగానే తన అంగములు కదలుస్తూ ఉంటాడు. చూచావా! వారు ముగ్గురు అట్లే వాసనారహితులై, ఆత్మాభిమానవర్జితులై ఆయాచేష్టలను ప్రకటిస్తూ ఉండేవారు.
దేవతలతో యుద్ధం - ఇంతలోనే దేవతలతో యుద్ధం చేయవలసివచ్చింది. ఆ ముగ్గురు యుద్ధభూమిలో ఉండగా " ఈ ఈ శత్రువులను మేమే చంపాం... మేము బలవంతులం... ఇది మా వలననే ఇట్లు జరుగుతోంది”... అను భావనయే పొందేవారు కాదు. వాళ్ళకి యుద్ధం చేయటమే తెలుసు. అంతేగాని, “అరే, ఈ శత్రువులు ఇంత అకస్మాత్తుగా మా పై వచ్చిపడ్డారే! ఇప్పుడు ఏమి గతి? మేము చస్తామేమో?”... అనే శంక వారిలో లేదు. అందుచేత యుద్ధభూమి నుండి ఎప్పుడు ఎందుకు పారిపోవాలో వారికి తెలియదు. జీవనము-మరణము, గెలుపు-ఓటమి, సంగ్రామం విశ్రాంతి, ప్రతిష్ఠ-అప్రతిష్ఠ అనువాటి భేదమునకు సంబంధించిన మననము వారిలో ఏర్పడ లేదు. తమ పిడికిలి దెబ్బతో పెద్దకొండనైనా పిప్పిచేయగలమని వాళ్ళ నమ్మిక. పిరికితనమనునదే లేకుండా శత్రువులను ఎదుర్కొని నేలకూల్చారు. దేవతలు వారి ధాటికి ఆగలేకపోయారు. వెనుకకు తిరిగి పారిపోవటం ప్రారంభించారు. అది తెలిసి, శంబరాసురుడు పెద్దగా నవ్వుతూ “ఆహాఁ! నాచే రచించబడిన ఈ ముగ్గురు అసురుల రక్షణలో దానవజాతి కీర్తి ఇనుమడిస్తోంది కదా...!” అని గర్వం పొందాడు. “ఓ సేనానాయకులారా! నికృష్టజీవులు, మోసగాళ్ళు అయిన ఆ దేవతలను వదలకండి. వారిని అందినవారిని అందినట్లే మట్టుపెట్టండి" అని ఉసిగొలిపాడు.
దామ వ్యాళ కటులతో కూడిన దానవసైన్యం దేవతల వెంటబడింది. అప్పుడు దేవతల రాక్షసుల సంగ్రామం ఆకాశంలోను భూమి మీదా ప్రళయంలాగా దుస్సహంగా జరిగింది. పర్వతాలు చూర్ణం కాసాగాయి. పరస్పరం ప్రయోగించిన శస్త్రాస్త్రముల ధాటికి దిక్కులు పిక్కటి ల్లాయి. 'ఘర ఝర-భర' శబ్దములచే ఆకాశం నిండిపోయింది. మాయారచితమైనట్టి అగ్నివృష్టి, మేఘవృష్టి, పర్వతవృష్టి యుద్ధభూమిలో ప్రయోగించబడ్డాయి. మహాయోధులగు అనేకమంది ఆ యుద్ధంలో మరణించటం జరిగింది. కాని ఏం లాభం? అగ్నికి ఆజ్యం తోడైనట్లు, నేల కూలిన రాక్షస సైనికులు శుక్రాచార్యుని 'సంజీవని మహావిద్య'చే ఉజ్జీవితులయ్యారు. ఇంకేముంది? ‘సిద్ధులు-సాధ్యులు’ మొదలైనవారితో కూడిన సురగణం అసుర భయానికి చెల్లాచెదరైపోయింది.
2. మమకారావిష్కరణ
ఆ విధంగా పారిపోయిన దేవతలంతా దానవుల దృష్టిలోంచి తప్పించుకొని ఎక్కడో ఒక రహస్య ప్రదేశంలో సమావేశమయ్యారు.
ఇంద్రుడు : ఓ దేవతలారా! మనం ఎంతటి ఘోరసంగ్రామమం చూచాము! మనలో అనేక మంది వీరులు మట్టికరిచారు. దాముడు మన పలాయనం చూచి సింహనాదాలు చేశాడు. వ్యాళుడు తన
Page:138
కబంధహస్తాలతో దేవతాస్థానములను ధ్వంసం చేస్తున్నాడు. ఇక కటుడి భయంకరమైన యుద్ధ విన్యాసం వర్ణనాతీతం. వీరికి ఇంతటి శక్తియుక్తులు ఎట్లా వచ్చాయి? మనం వీరి ముందు నిలువ లేకపోతున్నామే! ఇక మన గతి ఏమిటి?
+
దామ - వ్యాళ - కటులు విజయోత్సాహంతో సింహనాదాలు చేస్తూ దేవతల కొరకై ఎంత గానో వెతికి వేసారి ‘పిరికిపందలు! ఎక్కడికి పారిపోయారో?' అని తలచారు. వారి జాడ కనుగొన లేకపోయారు. విజయోత్సాహంతో తమ ప్రభువు శంబరాసురుని వద్దరు వెళ్ళి తమ విజయ పరంపరలను విన్నవించుకున్నారు. పాతాళమంతటా ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి.
రహస్య స్థావరంలో సమావేశమైన దేవతలు మిక్కిలి, భిన్నులయ్యారు. 'శంబరుని నిరోధించుటకు ఉపాయం ఏమిటి?” అని ఎంతో యోచించారు. ఉపాయమేదీ తట్టలేదు. “దిక్కు లేని వారికా భగవంతుడే కదా, గతి! అందుచేత మన పితామహుడగు బ్రహ్మదేవుని ప్రార్థిద్దాం” అని నిర్ణయించుకొని వారంతా భక్తితో పితామహునికి ప్రణామం చేశారు. క్షణంలో వారందరి మధ్యలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడా దేవతలు బ్రహ్మదేవునితో దామ-వ్యాళ కటుల ఉత్పత్తి క్రమం గురించి, వాళ్ళు చేస్తున్న అనర్థముల గురించి పూసగ్రుచ్చినట్లు విన్నవించుకున్నారు. భగవంతుడగు బ్రహ్మదేవుడు సావధానంగా అంతా విన్నాడు. కొంచెము సేపు మౌనం వహించాడు. చిరునవ్వుతో దేవతా సైన్యమునకు ధైర్యం చెప్పుచూ ఇట్లు పలికాడు.
బ్రహ్మదేవుడు : ఓ దేవతలారా! కొంతకాలం తరువాత సర్వాత్మకుడగు విష్ణుదేవుని చేతులలో ఈ శంబరాసురుడు హతం కాగలడు. అంతవరకు మీరు వేచి ఉండక తప్పదు. అయితే ఈ లోగా ఈ దామ వ్యాళ కటులను నిరోధించటం ఎంతైనా అవసరం. అందుకు ఒకే ఒక మార్గం నాకు కనబడుతోంది. వారికి తమ దేహము పట్ల అభిమానము కలిగేటట్లు చేయాలి.
ఇప్పుడు మీరు వారితో యుద్ధం చేయటానికి రంగంలో ప్రవేశించండి. యుద్ధం చేస్తూ పారి పోతూ ఉండండి. ఆ విధంగా పదే పదే చేయండి. వారు అనేకసార్లు 'గెలుచుట' అను అభ్యాసానికి వశమవుతారు. క్రమంగా దురభిమానానికి, లోభానికి లోనవుతారు. ఒక అద్దంలో ముఖం ప్రతిబింబిస్తున్నట్లు వారి అంతఃకరణములో అహంకారం ప్రతిబింబించగలదు. ఎందుకంటే...
ఇప్పుడు మాత్రం వారియందు 'వాసన' అనునది కించిత్ కూడా లేదు.
"సుఖము, గౌరవము, ఆశ" అనునవి ఇప్పుడు వారియందు ఏర్పడుట లేదు. అందుచేత మీ బలపరాక్రమములు వారి ముందు కొరగాకుండా పోతున్నాయి. అహంకారము, మమకారము అనేవి లేని వారిని జయింప గలిగినది ఈ లోకంలో ఏదీ లేదు. వారిలో అహంకారము యొక్క ఛాయ ప్రవేశించిందా,.. ఇక వారిని మీరు సులభంగా జయించి వేయగలరు. నేలపైనగల గింజలను తినటానికి వెళ్ళిన పక్షులు వలయొక్క దారమునకు చిక్కుకుంటాయి చూచారా! ఈ
Page:139
జీవులు 'వాసన' అను సూత్రపుతాడునందు చిక్కుకుంటున్నారు. 'ఆశలు' అను పాశములందు తగుల్కొని, క్షణంలో వశీభూతులగుచున్నారు. ఎవరియందైతే వాసనలు సంపూర్ణంగా నశించు చున్నాయో... ఇక వారిని నిరోధించగలిగేదేది? దేనిపట్లా కూడా అనురక్తి లేనివారిని కార్య విముఖులుగా చెయ్యలేము. సుఖముచే 'ప్రసన్నము' పొందక, దుఃఖముచే కృశించక ఉండేవారిని జయించుట దుస్సాధ్యమైన విషయమే. 'వాసన' అనే త్రాడుచే కట్టబడిన జీవుడు... అతడు మహానుభావుడైనా, శక్తిమంతుడైనా, అనేక విషయములు తెలిసినవాడు అయినా... చివరికి అతడు ఒక బాలునిచే కూడా జయింపవేయబడగలడు.
కాబట్టి బిడ్డలారా! “ఈ దేహేంద్రియాలే నేను. ఈ జనులు, ధనం... ఇవన్నీ నావి” మొదలైన కల్పనలు చేయువాడే సమస్త ఆపదలకు పాత్రుడు అగుచున్నాడు. ఈ దామ - వ్యాళ - - కటులలో అట్టి కల్పనలు లేవు.
సర్వజ్ఞుడు, సర్వవ్యాపియు అయినట్టి ఆత్మతత్త్వమును గ్రహించకుండా “నేను పరిమితము -
పరిచ్ఛిన్నము అయినట్టి ఈ దేహాదులకు, దేహముచే ఏర్పడుచున్న సంబంధములకు చెందిన వాడనే కదా! ఈ తదితరులు కూడా అట్టివారే” అని తలచువాడు మోహమును పొందుచున్నాడు. మూర్ఖత్వమును ఆశ్రయించు వాడగుచున్నాడు.
దేహాత్మ బుద్ధి కలిగి వర్తించువాడు 'జననము మరణము-బాల్యము-వార్ధక్యము' అనునవన్నీ తన స్వరూపముపై ఆపాదించుకుంటున్నాడు. అనంతము, అప్రమేయము అగు ఆత్మను "శరీర మాత్రం”గా కల్పన చేసేవాడు తనయొక్క ఆత్మను తానే అల్పమైనదిగా చూస్తున్నాడు.
ఓ దేవతలారా! ఈ మూడు లోకములలో కూడా 'ఆత్మ' కంటే వేరైన వస్తువేమున్నది? లేదు. కనుక ‘ఆసక్తి' అను బంధాన్ని పొందుట అనుచితమే అవుతుంది. “అసలు ఈ సర్వదుఃఖాలకు మూలకారణమేమిటి?” అను ప్రశ్నను జ్ఞానదృష్టితో తర్కించినపుడు, అసద్వస్తువునందు సత్యత్వ బుద్ధి కలిగియుండి, అసత్ విషయములపై నమ్మకంతో వ్యవహరించుటయే” అని విజ్ఞులు గ్రహిస్తున్నారు.
ఈ దామ - వ్యాళ - కటులకు ప్రపంచము యొక్క స్థితి పట్ల “ఇది సత్యమే” అను బుద్ధి ఏ మాత్రం లేదు. అందుచేత వారిని మీ మామూలు బలపరాక్రమములతో జయించుట దుర్లభమే. దేవతలు : పితామహా! మరి మా గతి ఏమిటి?
శ్రీ బ్రహ్మదేవుడు : మీరంతా ఒక పని చేయండి... మీరు ఓడిపోయినట్లుగా వారిముందు మరల మరల నటించండి. వారికి జయ అపజయముల పట్ల, శరీర - మమత అహంకారముల
పట్ల అభిమానం, అభిజాత్యం ఏర్పడేటట్లు చేస్తూ పోండి.
ఇంద్రుడు : హే మహామతీ! అమరావతిని కోల్పోయి మేమంతా దీనులమయ్యాం. ఈ దీనత్వం తొలగేది ఎట్లా?
Page:140
శ్రీ బ్రహ్మదేవుడు : సకల దుఃఖములకు కారణం దేహాత్మ బుద్ధియే. “ఈ నా దేహమునకు ఏమైనా అయినదా, అంతే... ఇక నా పని అయిపోయినట్లే”... అనునదే దేహాత్మబుద్ధి, మరియు దేహాభిమానం. అట్టి “అసత్య" మగు వాసన ఎవని అంతఃకరణమునందు ఉంటుందో, అతడు ఆ జనన-మరణ రూపమగు దీనత్వమునకు లోనగుచున్నాడని గ్రహించండి. అట్టి వాడు 'నేను జయించబడుచున్నాను" అను భావోద్రేకం పొందుచున్నాడు. “ఈ దేహమునకు విలక్షణమైన అప్రమేయమగు ఆత్మనే నేను” అను భావన ఒక దోమకు ఉన్నా సరే, ఆ దోమ సుమేరు పర్వతంవలె అచలంగా, అచంచలంగా ఉండగలదనుటలో ఏమాత్రం సందేహం లేదు.
ఏ వాసన ఎచట ఉంటుందో అది అచట స్థూలత్వం పొందుతూ ఉంటుంది.
'ధర్మి' ఉన్న చోటే ధర్మము, 'భావించువాడు' ఉన్నచోటే భావన ఏర్పడుచున్నాయి. అందుచేత ఎవరెవరికి ఏదేది సంభవిస్తున్నా అదంతా భావన, వాసన, ధర్మము అను మూడింటినీ అనుసరించే ఉంటున్నాయి. నాయనా ఇంద్రా! కనుక, నీ దీనత్వమునకు కారణమేమో నీవే సూక్ష్మబుధ్ధితో గ్రహించు.
ఇంద్రదేవా! ఈ దామ వ్యాళ కటులకు సంబంధించిన వర్తమాన విషయానికి వద్దాం. ఎట్లాగైనా సరే, వీరి యొక్క అంతఃకరణములలో “ఈ జయాపజయములన్నీ మావి. ఈ ప్రసిద్ధమై కనబడుచున్న దేహాదులే మేము” అను వాసన కలిగేటట్లు చేయాలి.
ఓ బిడ్డలారా! ఈ జీవుని యొక్క సమస్త విపత్తులు, సమస్త భావాభావదశలు 'తృష్ణ' అనే కంటకవృక్షము నుండి బయలుదేరుతున్నాయి. వాసనాతంతువులచే బద్ధులైన వారికి మాత్రమే "మేము దీనికి సొంతదారులము" అనే విపరీత జ్ఞానం ఉదయిస్తోంది.
వాసనలు వృద్ధి చెందుచున్న కొలదీ దుఃఖములు ప్రాప్తిస్తూనే ఉంటాయి. వాసనలు సన్నగిల్లితే అది పరమసుఖమును ప్రసాదిస్తూ ఉంటుంది.
ధీరో_ప్యతి బహుజ్జోపి కులజోపి మహానపి |
తృష్ణయా బధ్యతే జన్తుః సింహః శృంఖల యాయథా ॥ || (సర్గ 27, శ్లో. 32)
ఒకడు గొప్ప ధీరుడు కావచ్చు... అనేక శాస్త్ర విషయాలు తెలుసుకొని ఉండవచ్చు, అనర్గళముగా అనేక శాస్త్రవాక్కులు ఉటంకిస్తూ ఉపన్యసించవచ్చు. గొప్ప కులములో జన్మించి ఉండవచ్చు, మహామహుడు కావచ్చు.... కాని ఏం లాభం? అతడు తృష్ణ, వాసనలకు వశమైనాడా - అల్పత్వము ఉండియే తీరుతోంది. “దేహం” అనే వృక్షంపైగల "హృదయకమలం” అనే గూటిలో ఈ “జీవుడు” అనే పక్షి ప్రవేశించి కిలకిలారవాలు చేస్తూ ప్రశాంతంగా ఉండగా, 'తృష్ణ' అనే వల క్రింద “ఇంద్రియ విషయాలు" అనే ధాన్యపు గింజలను చల్లి 'మాయ' అనే బోయవాడు చాటుగా నక్కి ఎదురుచూస్తున్నాడు. ఈ జీవులు అమాయకంగా ఆ వలపై వ్రాలుచున్నారు. ఇంకేముంది? మాయ అనే వేటగాడు మెడవంచి ఈ జీవులలో అనేకమందిని “దుఃఖ పరంపరలు” అనే బుట్టలో
Page:141
కుక్కి ఉంచుచున్నాడు. ఒక పక్షి దారముచే బంధింపబడి వివశ అయినప్పుడు ఒక అజ్ఞానబాలుడు కూడా దానిని పట్టి అటు ఇటు ఈడవగలడు కదా! 'తృష్ణ' అనే త్రాడుచే బంధింపబడిన ఈ జీవుడు స్వల్ప సంఘటనలచే, చిన్న చిన్న మాటలచే కూడా ఎంతగానో వేసట చెందుచున్నాడే!
ఈ దామ - వ్యాళ - కటులలో అట్టి తృష్ణను తట్టి నిదురలేపారో, ఇక వారిని మీరు తప్పక
జయించగలరు.
ఇప్పుడు ఈ శస్త్రాస్త్రములను ఉపయోగించి ఆ దామ-వ్యాళ కటులపై ఎంతగా యుద్ధం చేయటానికి ఉపక్రమించినా, అదంతా వ్యర్థమే అవుతుంది. కాబట్టి ఏవైనా ఉపాయాలతో వీరి యందు వాసనావృత్తిని, అభిమానమును అధికం చేయండి. ఎందుకంటే మీ ఈ శత్రువులకు వర్తమానంలో 'స్త్రీ-ధన-ప్రియవస్తు-ప్రఖ్యాతి' వంటి శుక్రనీతి విశేషముల పట్ల ఆకాంక్ష లేదు. కేవలం యుద్ధము యొక్క అభ్యాసవశం చేత ప్రమత్తులై సంకల్పంచే. వారిని అహంకారమయ మగు వాసనలను ఆశ్రయించేటట్లు చేసి, తద్వారా వారి జయించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వాసనాబీజమే లేకుంటే, తదితరములైన ఉపాయాలు వారిపై ఫలించవు. పనిచేయవు. ఇంద్రుడు : ‘అహంకారవాసన' అంటే మీ ఉద్దేశమేమిటి?
బ్రహ్మదేవుడు : "ఆహాఁ! మేము ఎంతటి పరాక్రమము గలవారము! ఎంత తెలివిగలవారము! ఇతరుల కంటే మేమే గొప్పవారం! ఇంతటి గొప్పవారమయినట్టి మా కీర్తి - ప్రతిష్ఠలు ఇంకా ఎంతో ప్రకాశించుగాక! ఈ శరీరము, ఈ తదితరులు మా పట్ల చేయు స్తోత్రములు ఇట్లే మాకు ఉండు గాక!.... అనే మమకారం వారిలో వృద్ధి కావాలి. 'నాది' అనునది లేనిచోట అహంకారమే ఉండ జాలదని నిశ్శంకగా చెప్పవచ్చు. ఎప్పుడైతే, “మేము గొప్పవారము కదా!” అనే అభిమానం వృద్ధి చెందుతుందో, అప్పుడు మరుక్షణం “ఇట్టి గౌరవమన్ననలు మేము కోల్పోతామేమో!” అనే అధైర్యము, నిస్సత్తువ వెంటనంటి ఉంటాయి. అప్పుడు మీరు వారిని ఇతఃపూర్వపు రాక్షస సైనికులవలెనే నిర్జించివేయగలుగుతారు. వారు ముగ్గురు వాసనలను ఆశ్రయించిన మరుక్షణం వారి పరాజయమునకు, పతనమునకు నాంది పలికినట్లే.
అందుచేతనే సుజ్ఞానులగు ఉత్తములు వాసనలను త్యజించు ప్రయత్నంలో శాస్త్రాదులను ఆశ్రయిస్తున్నారు. విధి - విధానాదులను నిర్వర్తిస్తున్నారు.
కాబట్టి, దేవతలారా! అభ్యాసవశంచేత ఆ ముగ్గురు వాసనాసహితులైయ్యేంత వరకు యుక్తి పూర్వకంగా యుద్ధం చేయండి. “ఓడి పోవడం - పొగడటం”... అను ఉపాయాలతో సంసారదోష వ్యవహారనియుక్తులు అయ్యేట్లు చేయండి. వాసనాబద్ధులైన తరువాత వారే మీకు వశులు అవుతారు. వాసనలచే బద్ధులు అయినవారెవ్వరూ అజేయులై ఉండగలరా? లేనేలేదు. పరిస్థితులు అతిత్వరలో వాసనాబద్ధులకు - అపజయము రుచి చూపటానికి సంసిద్ధమౌతూనే ఉంటాయి.
స్వవాసనా బలంచేతనే క్షణిక, విపరీతార్థ రూపమగు ఈ జగత్తు ఇంతటి ప్రభావము, దీర్ఘానుభవత్వమును పొందుతోంది సుమా!
Page:142
ఈ జగత్తు వాసనారూపమే అయివున్నది! ఓ బిడ్డలారా! దేవతలారా! సర్వజనులారా! మీరంతా మీ వాసనలకు వర్తమానమునందే సరిఅయిన చికిత్సను ఆశ్రయించండి... అని హెచ్చరిస్తున్నాను. వాసనా బీజములను తొలగించుకొని, నిత్యవిజయులు కండి.
ఇట్లు పలికి భగవంతుడగు బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. దేవతలు ఆ చోటు వదలి తమ తమ స్థానములకు చేరారు.
3. పునః యుద్ధం
బ్రహ్మదేవుని వాక్యములు మరల మరల పునశ్చరణ చేసుకుంటూ, దేవతలు తమ తమ రహస్య స్థానములలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఒక శుభముహూర్తంలో యుద్ధ సన్నిద్ధులై దుందుభులు మ్రోగించారు. మరల దేవ దానవ యుద్ధం ప్రారంభం అయింది.
మిక్కిలి భయంకరమైన ఆ యుద్ధం "ఆత్మ చైతన్యమున జగత్తురూపంలో వికారము ఇట్టి సంఘర్షణగానే ప్రారంభమవుతోంది కాబోలు” అన్నట్లుగా దుస్తరమై సాగింది. కొంతసేపు దేవతలు తమ మాయను ప్రయోగిస్తూ యుద్ధం చేస్తూ వచ్చారు. ఇంతలోనే పలాయనం చిత్తగించసాగారు. మరొకప్పుడు దానవులతో సంధి చేసుకుంటున్నారు.
ధైర్యంగా యుద్ధం చేయటం. అంతర్జానం కావటం. శరణాగతి కోరటం.
ఈ విధంగా అనేక యుద్ధాలు జరిగాయి. మొదటి యుద్ధం 30 సంవత్సరములు జరిగింది. రెండవది ఐదు సంవత్సరములు, మూడవది పండ్రెండు రోజులు.
ఇంతలో ఆ దామ - వ్యాళ - కటులు, తదితర సైనికులు ఇట్లు యోచించసాగారు. "ఆహాఁ! ఈ లోకప్రసిద్ధులైన దేవతా వీరులు కూడా మమ్ము "శరణు శరణు" అంటూ వేడుకొనుచున్నారే! మంచిది. అవునులే... మా ముందు ఎవ్వరైనా సరే, ఎంతటివారు? వీరంతా ఎంత స్వల్పమైన వారు! మేము మహాపరాక్రమవంతులం. మాకు ఏవేవో వస్తువులను దానం చేస్తూ మా నుండి 'క్షమ'ను అర్థిస్తున్నారు కదా!”
ఈ రీతిగా ఏదో మాత్సర్యముతో కూడిన అహంకారం అంతరంగమున ఎక్కడి నుండో బయలుదేరింది. అట్టి అహంకారము యొక్క దృఢాభ్యాసంచేత వారు క్రమంగా వాసనాగ్రస్థు లయ్యారు. అనేక యుక్తులచే దేవతలు చేసిన ప్రయత్నములు వారిలో దంభమును, దర్పమును, అభిమానమును పెంపొందించసాగాయి.
అహంకారం నందు వారికి ఆత్మబుద్ధి ('నేను అహంకారమును' అను భావన కలిగింది... “మేము గొప్పవారము.” “ఈ గొప్పతనము మాకు ఎప్పటికీ ఉండుగాక!” “ఇదంతా అనుభవించుటకు మేము జీవించి ఉండలేకపోతే ఎట్లా...?” “మేము జీవించినంత కాలం ధనప్రాప్తి కలుగుగాక! ఈ దేవతలను ఇట్లాగే ఓడించుచు, వీరివద్ద అనేక వస్తుజాలములను
Page:143
దానముగా పొందెదము గాక!" అని తలచసాగారు. క్రమంగా ఏదో తెలియరాని లోభము, అభిజాత్యము పునాదిగాగల దైన్యము, దీనత్వము వారియందు చోటు చేసుకున్నాయి.
మొట్టమొదట 'ఇది అవస్య ప్రవృత్తి' - - 'ఇది నిషిద్ధ ప్రవృత్తి' (ఇది ఇట్లు ఉండుగాక - అది అట్లు ఉండకూడదు... అను ప్రవృత్తి)కి సంబంధించి కించిత్ వాసన ఏర్పడింది. "మా దేహము రోగరహితము, భోగసమర్థము అయితేనే కదా మేము కలకాలం లోక ప్రసిద్ధులమై ఉండగలిగేది!” అను మోహముతో గూడిన వాసనచే వారు గ్రస్థులయ్యారు. 'ఆశ' అను పాశమున బంధింపబడి క్రమంగా ఒళ్ళు దాచుకోవటం అలవాటు చేసుకోసాగారు.
ఒకప్పుడు అహంకారరహితులై భాసించిన ఆ దామ-వ్యాళ-కటులు ఇప్పుడు త్రాడును చూచి ‘పాము’ అని భ్రమించేవారి వలె, 'చావు వద్దు, బ్రతకాలి' అను రూపముగల ఒకానొక రాగమును, తత్సంబంధమైన అనేక కల్పనలను పెంపొందించుకున్నారు.
క్రొత్తక్రొత్త ఆశలు, తృష్ణలు చిగుర్చాయి. "ఆపాదమస్తకము మా ఈ దేహము సుస్థిరంగా ఉండేది ఎట్లా?" అనే నూతన వేదన వారిలో ప్రారంభమైంది. మా శరీరాలు బాగా ఉండాలి... ఈ ధనాదులన్నీ మా సుఖము కొరకే కదా...” అని అనుకుంటూ, అనుకుంటూ క్రమక్రమంగా బద్ధచిత్తులు అయినారు. వారి మునుపటి ధైర్యం కాస్తా కొంచంకొంచంగా క్షయించసాగింది. వాసనాసహితులవటం చేత శరీరబలం తగ్గటం ఆరంభించింది. ఇంతకు ముందు ఉండి ఉన్న పరాక్రమం, శత్రువులను సంహరించాలనే దీక్ష లోపించాయి. 'సమర్థత' సన్నగిల్లింది. 'దీక్ష' కొనసాగేచోట మాత్రమే 'దక్షత' కొనసాగుతుంది కదా!
అహంకారముతో కూడినయున్నట్టి వారికి, అప్పుడు, భయంకర సంసారము'ను ప్రాప్తింప జేసే స్త్రీ-అన్న-పాన-భోగములందు రాగము కౌతుకము లోభము హెచ్చింది. ఇక ముగ్గురిలో ప్రతి ఒక్కరు “వీడు ఎంతగా శ్రమిస్తాడు? కొంచెమే కదా! మరి నేను ఎందుకు శ్రమించాలి?” అను లోభమునకు సంబంధించిన సాపేక్షతను పొందసాగారు. మహోత్సాహమంతా నశించి "ఒకవేళ ఈ యుద్ధంలో చస్తామేమో?" అని మరల మరల అనుమానించసాగారు. కేవలం దేహరక్షణ మాత్రమే వాంఛించుచూ, మరణము పట్ల భయభీతులై ఉన్నారు. అప్పటి నుండి, ఇంధనము క్షీణించినప్పటి అగ్నివలె వారి బలం సన్నగిల్లింది. శత్రువులగు దేవతల ముందర నిలువలేక పోయారు. శరీరమునందు అక్కడక్కడ గాయాలు అవటం చూచి బెంబేలెత్తిపోయారు. వారు కూడా సామాన్య సైనికులవలెనే ప్రవర్తించేవారు.
కొంతకాలానికి దేవతల విజృంభణను తట్టుకోలేక దైత్యులంతా భయంతో ఆకాశము నుండి క్రిందకు పడ్డారు. అనేకమంది దానవుల శరీరాలు విచ్ఛిన్నం కాసాగాయి.
ఇట్లు సైన్యమంతా నేలకూలటం, నశించటం, శంబరాసురుని దృష్టికి వచ్చింది. ప్రళయాగ్నివలె మండిపడుతూ 'ఆ దామ-వ్యాళ కటులు ఎక్కడ...?” అని ఘీంకరించాడు. అయితే ఆ ముగ్గురు శంబరుని ఎదుటపడటానికి భయపడ్డారు. పాతాళంలోని 'నరకము'ను
Page:144
పాలించు కొందరు సామంతులను వారు శరణువేడారు. అక్కడ! శరణాగతులై, అభయం పొంది, అక్కడి రాజకన్యలను వివాహం ఆడి రోజులు గడపసాగారు. అనేక దుష్టవాసనలను గ్రహించి దీర్ఘకాలం గడిపారు. “ఈమె నా ప్రియురాలు - ఇది నా ప్రభుత్వము"... అని తలచుచు, దృఢ బంధమున తగుల్కొనినవారై రోజులు గడపసాగారు.
నరకలోకమునకు అధిపతి యమధర్మరాజు. ఒకానొకరోజు ఆయన ఏవో మహానరక కార్యముల గురించి విచారించటానికి నిజేచ్ఛను అనుసరించి ఆ ప్రదేశానికి వచ్చాడు. అతడు నరక లోక చక్రవర్తి అని తెలియక సామాన్య సైనికుడని తలచి ఆ ముగ్గురు వినమ్రులు అవక పోగా... తిరస్కారభావంతో దూషించటం, ఎగతాళి చేయటం, గేలిచేయటం జరిగింది. అప్పుడా యముడు వారిని కనుసైగమాత్రంతో “మహారౌరవం” మొదలగు నరక భూములలో పడత్రోయించాడు.
అక్కడి రేరవ-వాయువులచే వారు దగ్ధం కావించబడ్డారు. ఈ జీవుడు శరీరము త్యజించినా అతని వాసనలు అతనిని విడువవుకదా! అంతరంగమునందలి క్రూరవాసనల ప్రభావం చేత ఒక కిరాతరాజు సేవకులుగా జన్మించారు. ఆ జన్మలోవారు “వధించుట-బంధించుట” అను హింసా పూరిత క్రియలు నిర్వర్తిస్తూ ఉండేవారు. ఆ తరువాత జన్మలో వాళ్ళు కాకులు అయ్యారు. అక్కడి నుండి గ్రద్ధలై పుట్టారు. ఆ తరువాత చిలక, కుక్క, మేక, కీటకము మొదలైన అనేక జన్మలెత్తారు. ప్రస్తుతం వారు కాశ్మీరదేవాలయంలో గల ఒక చిన్న చెరువులో చేపలరూపంలో నివసించు చున్నారు. బురదలో చిక్కి దీర్ఘకాలంగా ఉంటూ వారు మరణించుటలేదు. జీవించుటలేదు.
చూచావా? వారు అనేక జన్మపరంపరలను మరల మరల అనుభవించారు. వారి భవిష్యత్తులోకి తొంగిచూచినప్పుడు వారు ఇంకా ఏవేవో అనుభవించబోవుచున్నారని తెలుస్తోంది. సముద్రంలో తరంగాలవలె వాళ్ళు ఉత్పన్నమగుచున్నారు, నశించుచున్నారు. ఆ విధంగా సంసార తరంగమున చిక్కుకుని, వాసనాతంతువులచే ప్రేరితులు అగుచు ఆ ముగ్గురు ఏ మాత్రం శాంతిని పొందలేకపోవుచున్నారు. అందుచేత, రామా! “నీవు దామ - వ్యాళ - - కట న్యాయం ఆశ్రయించ వద్దు" అని హెచ్చరించటం జరిగింది. వాసనల యొక్క దారుణమైన అనర్థమును అందరు గ్రహించటానికే ఈ దృష్టాంతమంతా నీకు చెప్పాను.
4. ‘అహమ్' కారము దేనికి సంబంధించినది?
శ్రీరాముడు : ఆహాఁ! అవివేకం చేత, అనంతమైన సంసార దుఃఖములను అనుభవించటానికే ఈ చిత్తము పరవళ్ళు త్రొక్కుతూ, 'నేను - నాది' అను ఆపదను గ్రహిస్తోంది కదా! ఆ దామ - వ్యాళ
కటుల గతి ఎంత చిత్రంగా పరిణమించింది! 'దేవతలు' అంతటి వారిని కూడా భయపెట్ట గలిగినట్టి శంబరాసురుని సైన్యమునకు సేనాధిపతులై ఉండటం ఎక్కడ?... బురద నీటిలో చిక్కి సూర్యతాపమునకు తపించే చేపల జన్మ ఎక్కడ...? అహంకార రహితమగు 'చైతన్య సత్వము’
Page:145
యొక్క ఉత్తమ మహిమాతిశయము ఎచ్చట...? ఒక అడవిలోని ఆటవిక రాజుకు సేవచేస్తూ స్వల్పకార్యములను నిర్వర్తించు సేవకజనులవట మెచ్చట? ఇచ్చ, వాంఛ, ఉద్వేగంలోని 'యుద్ధం చేయుట' అను ధర్మమును పాలించుట ఎక్కడ...? మిథ్యావాసనల ఆవేశముచే పరిగ్రహింపబడి దుష్టమగు అనేక సంకుచిత వ్యాపకములందు చిక్కుకొనుట ఎంతటి ఘోరమైన విషయం!
శ్రీ వసిష్ఠ మహర్షి : నిజమే! అనేక, శాఖోపశాఖలుగా విస్తరించియున్న ఈ 'సంసారవిషలత' అనేది ‘అహంకారము' అను అంకురము నుండే విస్తరించి వ్యాపించుచున్నది. కనుక రామా! ఈ అహంకారమును హృదయము నుండి తుడిచివేయాలి.
అసలు ఈ అహంకారమును మిథ్యయే అయివున్నది. ఎందుకంటావా?
‘యిదం' అను ప్రత్యయముచే శాస్త్రములు సూచిస్తున్నట్టి ఈ కనబడే 'దృశ్యము' జడమే కదా! దీనికి స్వయంప్రతిపత్తి ఎక్కడున్నది? ఇది 'అహంకారము' అను పదార్థమునకు సూచకం కాజాలదు కదా! కాబట్టి 'అహంకారము' దృశ్యమునకు సంబంధించినది... దృశ్యముచే ఏర్పాటు చేయబడుచున్నది.... అని అనటానికి వీలులేదు.
‘చైతన్యము’ ఇది సర్వమునకు సాక్షిరూపము అయివున్నది కదా! సర్వసాక్షిమాత్రము నందు అహంకారము ఘటిల్లుటకు అవకాశమెక్కడిది? కాబట్టి 'అహంకారము' అనబడేది అటు దృక్ (The perceiver) కు, సంబంధించినది కాదు.
కనుక ‘అహంకారం’ అనబడేది దృక్ (ఆత్మ) దృశ్యములకు (Object) కూడా సంబంధించినది కాదు. ఆరెండింటికీ భిన్నమే అయివున్నది. ఆ రెండు తప్పితే ఇక్కడ మరింకేమీ వాస్తవానికి లేదు. అందుకే... “అహంకారము అనేది ఉండటానికి స్థానమే లేదు...” అను నిశ్చయమును జ్ఞానులు ప్రవచిస్తున్నారు. అందుచేత, “అహంకారము అనబడేదేది ఎక్కడా లేదు... అను జ్ఞేయమును ఆశ్రయించి, సుఖస్వరూపడవు కమ్ము. లేనివస్తువగు అహంకారమును తొలగించుట ఏమిటి? అందుచేత, “నేను ఇంకా అహంకారమును తొలగించుకోవలసియున్నది” అనునది భ్రమచేతనే "అసంగతము - అనవసరము” అగు శ్రమగా ప్రాప్తించుచున్నదని గ్రహించు.
'పరమార్థము' (The highest essence of Self) యొక్క రూపము వాస్తవానికి ఆనంద మయము, త్రివిధ తాపరహితము అయివున్నది. అయినప్పటికీ, అహంకారము అనబడు భ్రమ యొక్క కల్పనచే ఆచ్ఛాదితమగుటచే 'లేదేమో' అను చమత్కారము కలిగించి, అదృశ్యరూపముగా కనబడుచున్నది. అనగా, ఈ జీవుని దృష్టికి .. “దోషరహితము, సర్వత్రా సర్వము నందు ప్రసరించియున్నది”... అగు స్వస్వరూపము దృశ్యమానమగుటలేదు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇంకేముంటుంది చెప్పు? జన్మరహితము, నామరూపరహితము అగు తనను తానే అతడు గ్రహించుటలేదు. గురువులమగు మేము వచ్చి "ఓయీ! జీవుడా! నీ రూపము ఇట్టిది" అని గుర్తు చేయవలసివచ్చుచున్నది. అయినా ఇతడు వినీ వినకుండా పచార్లు చేస్తున్నాడు.
+
Page:146
ఆ ముగ్గురు దానవసేనానాయకులు 'అహంకారం' అనే పిశాచంచే పీడింపబడిన వారగు చున్నారు. కదా! వాస్తవానికి వారు దర్పణములోని ప్రతిబింబిత వస్తువులలాగా అసద్రూపులే అయి వున్నారు. అయితే మాయ యొక్క మహత్మ్యముచే సత్తాను పొందారు. ఏవేవో ఉపాధులలో ప్రవేశించారు. ఇప్పుడు చేపల ఉపాధులు పొంది ఒక మురికి గుంటలో తచ్చాడుతూ ఆకలికి అలమటిస్తున్నారు. వారి యాతనలు వర్ణనాతీతం.
శ్రీ రాముడు : మహాత్మా! ఆ ముగ్గురు దామ-వ్యాళ కటులు శంబరాసురుని మనోకల్పనా రూపులే కదా! అసద్వస్తునకు 'ఉనికి' గాని, సద్వస్తువుకు 'లేమి' గాని సంభవించవు కదా! * మరి అసద్రూపులగు ఆ దామ - వ్యాళ - కటుల ఉనికి ఎట్లా ఏర్పడింది? ఎట్లా జన్మపరంపరాదులకు దారి తీసిందో నేను గ్రహించలేకున్నాను. ఇందలి చమత్కారమేమైయున్నదో వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు చెప్పింది నిజమే. అసద్వస్తువుకు ఉనికి ఎక్కడా సంభవించదు. కాని అల్పము, అసత్యము అయినది ఒకానొక బృహత్ వస్తువుగా కనబడటం జరుగుతోంది.
ఇక అసలైన బృహత్ వస్తువు అత్యంత సూక్ష్మమై, దృష్టికి లభించనిదై ఉంటోంది. 'లేనిది' ఉన్నదానివలె, 'ఉన్నది' లేనిదానివలె అగుపడుచున్నాయి!
అసలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అసద్వస్తువు సద్వస్తువుగా అగుచున్నదో చెప్పు? సద్వస్తువు సద్వస్తువుగానే ఉంటోంది. అసద్వస్తువు అసత్తే.
ఎటొచ్చీ వాటిని విడదీయుదృష్టిని అనుసరించి చీకటి - - వెలుగులవలె జ్ఞాన - అజ్ఞానములు ఏర్పడుచున్నాయి.
శ్రీరాముడు : హే మహర్షీ! మరల నా సంశయమును చెపుతాను వినండి. మీరు, నేను, తదితర సభ్యులు ఇక్కడ ఉండి, ఈ సభలో ఒకానొక విషయం గురించి సంభాషించుకుంటున్నాం కదా! మనందరియొక్క ‘సత్త' (Existence)ప్రత్యక్షముగా సిద్ధించుచున్నది.
ఇక ఆ దామ - వ్యాళ - కటులనే ముగ్గురు దానవసేనానాయకులు మాయచే కల్పించబడిన వారే కదా! కనుక వారు స్వప్నములో కనిపించే జనులవలె అసద్రూపులే మరి! అట్టి అసద్రూపులు అహంకారములను, జన్మపరంపరలను, స్వకీయమైన ఇచ్ఛను పొందటమేమిటో వివరించండి. శ్రీ వసిష్ఠ మహర్షి : మాయామయులగు ఆ ముగ్గురు దానవ సేనానాయకులు 'అసద్రూపులు' అనే మాట నేను ఒప్పుకుంటాను. అయితే ఇక్కడ ఒక చమత్కారం ఉన్నది. ఒకడు మృగతృష్ణలో "ఇది జలమే కదా" అను అనుభూతి పొందుచున్నాడనుకో... అతనికి అక్కడ జలము ఉన్నట్లే కనిపిస్తోంది కదా! ఆ రీతిగానే వాళ్ళు అసద్రూపులు అయినప్పటికీ సత్యంవలె భాసించుచున్నారు.
నా సతో విద్యతేభావో నాభావో విద్యతేసతః |
‘సత్త’కు ‘ఉండకపోవడం' అనేది లేదు. 'అసత్తు'కు ఉనికి లేదు. మాయ = యామా = ఏదైతే లేకయే ఉన్నదో ...
Page:147
అదే విధంగా సురులు, అసురులు, దానవులు - వీరంతా మిథ్యా రూపముగానే భాసిస్తున్నారు. వారంతాయే కాదు, నీవు, నేను, తదితర సభ్యులు... మనమంతా కూడా ఈ జీవరూపము దృష్ట్యా మిథ్యారూపముగానే విజృంభింస్తున్నాము, పోవుచున్నాము, వచ్చుచున్నాము. 'నేను రాముడను’ అను వ్యష్టిత్వమునకు సంబంధించిన భావన, 'నేను వసిష్ఠుడను' అనబడు శరీరభావన కూడా మిథ్యారూపములే అయివున్నాయి.
శ్రీరాముడు : ఈ "నేను - మీరు - - తదితరులైన ఇక్కడి సభికులు”... అవన్నీ వివిధ రీతులుగా అనుభూతములై ప్రాప్తిస్తున్నాయి కదా! మరి ' ఇవి లేవు' అనునది ఎట్లు సమంజసము?
శ్రీ వసిష్ఠ మహర్షి : "స్వప్నమునందలి స్వమరణము” అను దృష్టాంతమును మరల ఇక్కడ ఉపయోగించి చెప్పుచున్నాను, విను. ఒకడు అప్పుడే నిదురలేచి ప్రక్కవానితో, "మిత్రమా! నాకు ఇప్పుడు ఒక దీర్ఘమైన కలవచ్చిందోయ్! అందులో నేను చనిపోయాను. ఒక నలుగురు వ్యక్తులు నన్ను మోసుకుపోతున్నారు....” అంటూ ఉన్నాడు. వెంటనే ఆ ప్రక్కవాడు “అట్లాగా! బాగున్నది. అయితే, స్నేహితుడా, ఆ స్వప్నం ఎవరికి? అదంతా ఎవరి కల్పన?” అని ప్రశ్నించాడు. అప్పుడు మొదటివాడు, “భలేవాడివేనయ్యా! అది నా స్వప్నమే... అందుచేత నా కల్పనయే” అన్నాడు. ఇక రెండవాడు, “నీ యొక్క కల్పనలో, నీవే చనిపోతే ఇక స్వప్నం ఎవరికి? స్వప్నమే ఉండజాలనప్పుడు ఆ నలుగురు మనుష్యులు ఎవరు?” అని విశ్లేషణము చేయ ప్రారంభించాడట!
అట్లాగే, ఈ కనబడే అనేకమంది జీవులు, అనేక శరీరములు అను రూపమున ఉండి ఉంటున్నదంతా మిథ్య, అసద్రూపము అయి ఉన్నాయి.
స్వప్నమునకు సంబంధించినదే మరొక దృష్టాంతము చెపుతాను. విను. ఒకడు తన కలలో ఎప్పుడో చనిపోయిన తన బంధువును చూచాడనుకో... ఆ బంధువును 'చూచుట' అను అనుభూతి అతనికి సత్యముగానే ప్రాప్తిస్తోంది కదా! అయినాకూడా అతడు చూచినది అసద్రూపమునే కదా! అట్లాగే, 'అతడు మరణించాడు' అను జ్ఞానము కూడా అసద్రూపమే అయివున్నదని ప్రజ్ఞా వంతులగు జ్ఞానులు గ్రహించుచున్నారు. ఎందుకంటావా? ఈ కనబడే జగత్తు ఇందలి సంబంధ బాంధవ్యములచే ఏర్పడు ప్రియాప్రియములు 'మిత్ర అమిత్రములు ఇవన్నీ స్వప్నమాత్రము, మాయామాత్రమే అయివున్నాయి.
“ఈ జగత్తు సత్యమే” అను దృఢనిశ్చయంగల జీవుడు మాత్రం ఇందులోని నిత్యానిత్యముల చమత్కారమును గ్రహించలేకపోతున్నాడు. కళ్లు మూసుకున్న వారు ఎదురుగా ఉన్నదేదీ చూడనట్లు, పరమ మూఢత్వం వహించినవాడు “మార్పు చెందుచున్నది; మార్పుచెందనిది” అను రెండింటినీ విడదీయలేకపోతున్నాడు.
'పరమార్థ విచారణ' అనే అభ్యాసం లేకపోతే ఈ జగత్తుకు సంబంధించిన... “ఇదంతా వాస్తవమే”... అను అనుభవం అంత తేలికగా తొలగదు. తత్త్వవిచారణ లేనివాడెవ్వడూ వాస్తవ మేమిటో గ్రహించలేకపోతున్నాడు. అట్లు నిత్యానిత్యవివేకము పొందుటచే లభించు ప్రయోజన
Page:148
మేమిటో గుర్తించలేకపోతున్నాడు. అందుచేతనే...“బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్యయే” అనేది ప్రతిపాదించ బడుచున్నప్పుడు అజ్ఞాని అపహాస్యంగానే గాంచుచున్నాడు.
ఒకడు మత్తుగా కల్లు తాగి ఉన్నాడు. మరొకడు ఎట్టి మత్తుపానీయం సేవించలేదు. ఈ ఇద్దరి యొక్క ప్రపంచ దర్శనంలో మేళవం లభిస్తోందా? లేదు. అంధకారం - ప్రకాశాలకు, ఛాయ - ఎండతాపములకు ఐక్యత సిద్ధించదు కదా! అట్లాగే జ్ఞాని - అజ్ఞాని ఒకే ప్రదేశమున ఉన్నప్పటికీ, వారి దృష్టి ఏమాత్రం ఏకత్వము పొందుటలేదు. ఒక శవమును చూచి, "ఓ శవమా! కాసేపు అటూ ఇటూ నడువవచ్చును కదా!” అంటే నడుస్తుందా? పిలిస్తే పలుకుతుందా? లేదు. అజ్ఞాని ముందు ఆత్మ - అనాత్మ విశ్లేషణ అనేకసార్లు “చెవిటివాని ముందు శంఖానాదమే” అగుచున్నది. అతడు సత్యమగు సాక్షి స్వరూపమునందు నిలకడ పొందలేకపోవుచున్నాడు. మనస్సు, బుద్ధి మొదలైన వాటి రూపములో బాహ్యభ్యంతరములందు ద్వైత ప్రపంచము యొక్క అనుభూతినే అవిచారణపరుడగు జీవుడు పొందుచున్నాడు. ఎంత బోధించినప్పటికీ అతడు తన అంతరంగంలో ద్వైత ప్రపంచాన్ని నిషేధించలేక పోవుచున్నాడు.
"ఈ జగత్తంతా బ్రహ్మమే” అనే కధనం అజ్ఞానిపట్ల ఏమాత్రం యోగ్యం అగుట లేదు. ఒకడు తపస్సు, బ్రహ్మవిద్య యొక్క అభ్యాసం, ఉదార గుణములు... మొదలైనవి ఆశ్రయించక పోతే సంసారదృష్టి ఉండనే ఉంటుంది. "జగత్తుసత్యమే”... అనునది అనుభూతమొనర్చుకొనువాని ముందు బ్రహ్మం గురించిన వాక్యాలు ఎట్లా వికసిస్తాయి చెప్పు? కనుక, కొంచమైనను జ్ఞానం గల వానికి మాత్రమే "ఈ జగత్తు మిథ్య, ఇదంతా బ్రహ్మమే అయివుంది” అనే కథనం శోభిస్తోంది.
అదే విధంగా ఒక పూర్ణజ్ఞానికి అనేక చర్చలతో కూడినట్టి ఈ విధమైన బోధ అసంగతమే అవుతోంది. “అహంకారమే అసత్యమైనది” అని ఎరిగిన తరువాత అట్టివానికి ఇక దృష్టాంతములతో కూడిన ‘బోధ’ ఎందుకు? అందుచేత, మార్గమధ్యంలోని ముముక్షువు యొక్క ఉపయోగము కొరకే ఈ సంవాదములు, ఈ శాస్త్రప్రవచనములు ఉద్దేశించబడి ఉంటోంది.
శ్రీరాముడు : జ్ఞాని ఈ దృశ్యమును చూస్తున్నప్పుడు దీనినంతటినీ అతడు ఎట్లా, ఏవిధంగా, ఏరూపంగా అవగాహన చేసుకుంటున్నాడు?
శ్రీ వసిష్ఠ మహర్షి : జ్ఞాని యొక్క అనుభవంలో ఈ సర్వము ద్రష్టయగు తనతో సహా... బ్రహ్మమే అయి ఉంటున్నది. ఇక అతని స్వానుభవము నందు “ఇది పరిహసింపతగ్గది, పరిత్యజించ తగ్గది.... అనునది ఏదీ ఉండుటలేదు సర్వము బ్రహ్మము నందు స్వభావసిద్ధముగానే ఏర్పడి ఉంటున్నప్పటికీ, తరంగములన్నీ జలమే అయినట్లు ఇక్కడ బ్రహ్మముకంటే వేరుగా ఎక్కడా ఏదీ ఉండదని ఎరుక కలిగి ఉంటున్నాడు. అతడు ఏదీ గ్రహించడు. త్యజించడు.
"పరమాత్మ కంటే వేరుగా నేను ఏమియు కాను. 'బంగారము'నకు 'ఉంగరత్వము' అనేది ఒక ప్రతీతి (Something popular but not true) మాత్రమే! సాక్షిస్వరూపుడనగు నా యందు అహంకారము యొక్క ఉనికి కూడా మిథ్యే"... అని జ్ఞాని సుస్పష్టముగా గ్రహిస్తున్నాడు. జల
Page:149
తరంగమును చూస్తూ, “ఇది సువర్ణమై ఉండవచ్చు" అని ఎవడైనా భావిస్తాడా? అట్లే జ్ఞానికి ఈ జగత్తుపట్ల సత్యత్వబుద్ధి కలుగుటలేదు. అజ్ఞానికో... పరమార్థవస్తువగు బ్రహ్మము నందు 'అట్టిది ఏదీ లేదేమో' అను అభావము సంభవిస్తోంది. ఫలితమేమిటి? అజ్ఞాని 'మిథ్యయే' అగు అహంకారముతో తనను తాను.. మేఘములు ఆకాశమును కప్పుతున్నట్లుగా... కప్పివేసు కుంటున్నాడు. మిథ్యాహంకారమయుడు అగుచున్నాడు. జ్ఞానియో, 'సత్య-నిత్య-ఏకాత్మమయుడు’ అగుచున్నాడు. వీరిద్దరి స్వభావం మరొక రీతిగా మరొకరెవరూ చేయలేరు.
ఏ వస్తువు ఎద్దానియొక్క 'మయమై ఉంటుందో అది ఆ రూపమునే చెందుతుంది గాని,
మరొక రూపము కాదు.
ఇంతకీ ‘రాముడు’ అనగా ఎవరు? వసిష్ఠుడు అనగా ఎవరు? 'నేను ఈ శరీరమును’ అనేది పిచ్చిమాట అని అనవలసిందే. అందుచేత, మనం ఈ శరీరములచే ఒకరికి మరొకరం ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ ఒకరి వాస్తవమగు ఆత్మరూపం మరొకరి భౌతికమైన కళ్ళకు కనిపించేది కాదు. బాహ్యమునకు కనుపించే ఈ మన రూపాలు తత్త్వదృష్టికి సత్యమయినవి కావు. 'యుక్తి'ని అనుసరించి చూచినప్పుడు ప్రజ్ఞయే స్వరూపముగాగల మనము శరీరముగా మారినామా? లేదు. శరీరము మనకు ఉపకరణము మాత్రమే! మనము శరీరిగా శరీరమునకు వేరై ఉన్నాము. శాస్త్ర కారులు, జ్ఞానులు ఈ విషయం ధృవీకరించుచూ, “నాయనా! నీవు జన్మరహితుడవు... అఖండుడవు.. నిత్యుడవు... శాశ్వతుడవు...” అని ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు.
చిదాకాశము ఒక్కటే...“నిరంజనము (దోషరహితము), జ్ఞానస్వరూపము వేదాంత శాస్త్ర దృష్టిచే సత్యము”... అయి ఉన్నది. అది సర్వవ్యాపకము. మేము దానిని అనేక విచారణల ద్వారా పరిశీలించిన తరువాత “అది ఉత్పత్తి, వినాశరహితమగు సద్వస్తువు, సర్వజీవుల యొక్క వాస్తవ రూపము”... అని గ్రహిస్తున్నాం.
ఈ జగత్తంతా శాంతము, శూన్యత్వ రహితము అగు ఆ సద్వస్తువుచేతనే పూర్ణమైయున్నది. అట్టి ఆ చిదాకాశమునందే... అసత్యము, విరుద్ధరూపము అయినట్టి... ఈ సృష్టి అంతా భాసించుచున్నది. కంటి దోషముచే బాధపడుచున్న వానికి సహజంగానే ఆకాశంలో వెంట్రుకల వంటి ఆకారములు కనిపిస్తూ ఉంటాయి కదా! అజ్ఞానదృష్టి కలిగియున్నపుడు ఈ 'సృష్టి' అనేది పరమాత్మ యందు అనుభవమగుచున్నది. సత్యాత్మ ఏ భావపరంపరలు పొందుతుందో... అట్టి భావనను అనుసరించే ‘అనుభవము’ ఉంటోంది. అనుభవం ఎట్లా ఉంటే చిదాకాశము కూడా అట్లే శీఘ్రముగా సారూప్యమగుచున్నది. సత్యాత్మ యొక్క దృష్టి బలంచేతనే ఏదైనా ఎట్లైనా ఏర్పడు తుంది. “ఇదంతా అసత్యము' అనునది కూడా సత్యాత్మ దృష్టిచే క్షణములో ఏర్పడగలదు. శ్రీరాముడు : స్వామి! ఇందులో ఏది సత్యం? ఏది అసత్యం?
Page:150
శ్రీ వసిష్ఠ మహర్షి :
న సత్యమస్తి నాసత్యమితి తస్మాజగత్రయే
యద్యథా వేత్తి చిద్రూపం తత్తథోదేత్య సంశయమ్ || (సర్గ 31, శ్లో 36)
ఈ మూడు లోకములలో “సత్యమైనది' గాని 'అసత్యమైనది' గాని ఏదీ లేదు. అయితే చిద్రూపము లేక సత్యాత్మ దేనిని ఎట్లు ఏ దృష్టిచే గాంచునో, అది అట్లే ఉదయించుచున్నది.
ఆ దాముడు-కటుడు-వ్యాళుడు అనువారు ఎట్లా వ్యక్తమయ్యారో, ఈ జీవము-శరీరముల దృష్ట్యా జీవులందరూ అట్లే వ్యక్తం అయ్యారు. కేవలం వారి గురించే వికల్పములు ఎందుకు? ఈ కనబడే మన ప్రదర్శన కూడా అట్టిదే. కనుక ఇందు సత్యాసత్యములేమి ఉంటాయి? "నిరాకారము, సర్వవ్యాపకము, అనంతము” అగు చిదాకాశమున చైతన్యము ఏ రూపమున ఉదయిస్తుందో రూపముగానే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. చైతన్యమే ఎచ్చట దాముడు మొ॥వారి రూపమున స్వయముగా స్ఫురించిందో, అచట అట్లే, నాయొక్క నీ యొక్క రూపమున స్ఫురించటం, రూపానుభవం పొందటం, సుసంపన్నం కావటం జరుగుతోంది.
ఎడారిలో మనం చూస్తున్నది కిరణములనే అయినప్పటికీ, “ఇది (మృగతృష్ణా) జలం" అంటున్నాం కదా! నిరాకారమగు చిదాకాశము తనయొక్క 'స్వప్న ప్రతిభాస'కు 'జగత్తు' అనే పేరు పెట్టిపిలుస్తోంది. చిదాకాశము బాహ్యపదార్థములను పొందుచూ 'పరిగ్రహణము' అను వృత్తిని కలిగియుండగా అప్పుడు ఫలిస్తున్నదానినే 'దృశ్యము' అనే పేరుతో పిలుస్తున్నాం. అదే చిదాకాశం తన స్వయం ప్రతిపత్తిని భావించుచు, 'బాహ్యపదార్థరాహిత్యము'ను, 'సర్వ విషయాతీతము'ను గాంచుచున్నప్పుడో,... అప్పటి ప్రయోజనమును 'మోక్షము' అని అంటున్నాం.
'ఇది దృశ్యము - ఇది మోక్షము' అను సంజ్ఞలు నిర్వచిస్తోంది, ప్రసాదిస్తున్నది కూడా ఎవ్వరో తెలుసా? అద్వితీయ చైతన్యమే. యథార్థానికి చిదాకాశము ఏ సమయమందును ప్రబుద్ధమగుట లేదు... అప్రబుద్ధమగుటలేదు. చిదాకాశము ఒకప్పుడు ఎట్లా ఉండి ఉండేదో... ఇప్పుడూ అట్లే ఉన్నది. ఇక ఎప్పటికీ అట్లే ఉంటున్నది.
ఈ దృశ్యమంతా చిదాకాశమే అయి, సృష్టి వైభవమంతా మోక్షరూపమే అయి ఉండగా, ఇక పర్యాయ శబ్దములవంటి జగత్ - బ్రహ్మములకు భేదమెక్కడ చెప్పు?
ఆత్మయే ఒకప్పుడు అవిద్యతో కూడుకుని ఉంటున్నది. అప్పుడు అప్పటి తన పరమార్థ స్వరూపమునే జగత్తుగా ఎరుగుచున్నది. ఆకాశములో వెంట్రుకాకారములు లేకుండానే, తిమిర రోగము ఉన్న కళ్ళు గలవానికి ఏవేవో వెంట్రుకాకారములు కనబడటం జరుగుచున్నది కదా! పరమార్థమున ఈ దృశ్యప్రపంచం గాని, శరీరాదులు గాని లేవు. చిదాకాశమే ఆయారూపములుగా స్థితి కలిగియున్నది.
Page:151
1. ఆధ్యారోపదృష్టి (ఇది ఉన్నది అను దృష్టిచే ఈ సర్వము యొక్క వాస్తవరూపము బ్రహ్మమే! చిదాకాశమునందు అంతయు సర్వదా సంభవమే! కనుక “ఈ సర్వము ఉండియే ఉన్నది" అని చెప్పబడుచున్నది.
2. ఆరోపదృష్టి (ఇది లేదు అను దృష్టి) చే - ఈ "నేను - నీవు జగత్పదార్థములు' మొదలైన వాటికి బ్రహ్మము కానట్టి ఉనికియే ఉండి ఉండుటలేదు. 'జగత్తు-బ్రహ్మము'... అనబడు రెండింటి యందు కూడా శాంతము, భేదరహితము అగు ఒకే పూర్ణరూపము ఉండి యున్నది. కనుక 'నేను-నీవు' అనునవన్నీ అవాస్తవమై, అవాస్తవిక దృష్టికి మాత్రమే తారసపడుతున్నాయి.
కాబట్టి రామా! నీవు సర్వశోక భయములను త్యజించివేయుము. సర్వదా పరిపూర్ణ స్వరూపుడవై ఉండు. నీయొక్క పరిపూర్ణ చైతన్యతత్త్వం ఒక స్ఫటికశిల యొక్క మధ్యభాగంలాగా చిదనము, ప్రశాంతము, అత్యంత స్వచ్ఛము అయి ఉన్నది. కలలో నదులు-పర్వతాలు జనులు ప్రతిబింబిస్తున్నప్పుడు, అట్లు ప్రతిబింబితములై కనబడే వేరు వేరు వస్తువులలో “ఒక గోడ - మేకు మనిషి” లకు గల భేదమేమున్నది.
"ఇది ఉన్నది - ఇది లేదు” అనే భేదదృష్టి చైతన్యమునందు లేనేలేదు. నీకు ఎక్కడైనా వేరు వేరైన ప్రతీతి కనిపిస్తే “చైతన్యము ఇట్లు వేరు వేరు ప్రతీతులచే ఇచ్చట ఇట్లు ప్రకాశించుచున్నది” అని గ్రహించి, అటుపై, సర్వదా నిశ్చింతుడవై ఏది ఎట్లు ఉచితమో అట్లే నిర్వర్తించుము.
5. సదాచారము - ప్రయోజనము
శ్రీరాముడు : ఒక బాలుడు అటు చీకట్లోకి చూచి, “ఇక్కడ ఏదో భూతపిశాచాలు ఉన్నాయి” అని తలచి, భయముతో పిశాచులు పరిభ్రమణమును అనుభవించటం జరుగుతుంది చూడండి! ఆరీతిగా, అజ్ఞుల దృష్టికి మాత్రమే “దాముడు - కటుడు - - వ్యాళుడు - నేను - - నీవు"... ఇవన్నీ తోచుచున్నాయన్నమాట! ఇవన్నీ స్వసత్తాస్వరూపమే అయివున్నాయి కదా! ఇదంతా ఎంత చమత్కారంగా ఉన్నది! సరే, మునీంద్రా! "యథార్థానికి మిథ్యాస్వరూపములే”... అయినట్టి ఆ
ముగ్గురి దుఃఖములు ఎప్పటికి శమిస్తాయి? బురదగుంటలో చేపల రూపంలో ఆ ముగ్గురికి ముందుముందు ఏమి కానున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : 'ఓహో! ఆ దామ-కట-వ్యాళుల భవిష్యత్తు కథ ఏమిటో చెప్పమంటావా? అయితే విను. ఆ ముగ్గురి కుటుంబమునకు చెందినట్టి కొందరు యముని వద్ద కింకరులై ఉన్నారు. వారు దామ - కట - - వ్యాళుల ముక్తి కొరకు యముని ప్రార్థన చేస్తారు. అప్పుడాముగ్గురు తగిన సమయంలో తమ చరిత్రలను ఇతరుల నుండి వినటం జరుగుతుంది. వారి సర్వసందేహములు అప్పటికి తొలగుతాయి. ఫలితంగా ముక్తులు కాగలరు.
శ్రీరాముడు : మీరు చెప్పే విశేషాలు మరికొంత వివరంగా వినాలని ఉన్నది. వారు తమ తమ వృత్తాంతములను ఎప్పుడు, ఎక్కడ, ఎవరివద్ద వినటం జరుగుతుంది? వారు మరల ఎట్లా దుఃఖ
Page:152
రహితులు కాగలుగుతారు. మీరు భూత-భవిష్యత్ వర్తమానములు ఎరిగినవారు కదా! ఆ
ముగ్గురి గురించి భవిష్యత్తులో కానున్నదేమిటో చెప్పండి! ప్రస్తుతం వారు చేపల ఉపాధులు కలిగియున్నారు కదా! ముందుముందు ఏమి కాబోవుచున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : సరే. ఆ వివరాలు చెపుతాను. వినువారు ప్రస్తుతం కాశ్మీరదేశంలో గల బురదతో కూడిన ఒక చిన్న తటాకంలో చేపలుగా జీవిస్తున్నారు. అదే ప్రదేశంలో అనేకసార్లు అట్లే చేపలుగా జన్మలు ఎత్తుతారు. ఒక సమయంలో మండు వేసవిలో కొన్ని దున్నపోతులు ఆ తటాకంలోకి ప్రవేశిస్తాయి. ఆ తటాకమును ధ్వంసం చేస్తాయి. దున్నపోతుల తాడనమునకు ఆ ముగ్గురి ఉపాధులు వినాశనమౌతాయి. పద్మ సరోవరంలో వారు మూడు సారస పక్షులై జన్మిస్తారు. ఆ మూడు పక్షులు అనేక చోట్ల భోగములను అనుభవిస్తూ సంచరిస్తూ ఉంటాయి.
ఆ ఉపాధులలో వారికి కొంత ప్రశాంతత దొరుకుతుంది. క్రమంగా వివేచన చేస్తూ శుద్ధత్వమును పొందుతారు. ఒకడు వివేక దృష్టిచే ఈ సర్వమును గాంచుచున్నాడనుకో... అప్పుడు త్రిగుణములు (సత్వగుణము, రజోగుణం, తమోగుణం) భిన్నభిన్నంగా తెలియవస్తాయి కదా!
అట్లే వారు ముగ్గురియందు వేరువేరు కారణాలచే వివేక బుద్ధి ఉదయిస్తుంది.
వ్యాళుడు - కాశ్మీర దేశంలో 'అధిష్ఠానము' అను పేరుగల ఒక నగరం ఉన్నది. ఆ అధిష్ఠాన నగరం మధ్యప్రదేశంలో 'ప్రద్యుమ్న' అనే పేరుతో పిలువబడే ఒక శిఖరం ఉన్నది. ఆ కొండ శిఖరంపైగల ఒక ఇంటిలోని గోడపగులులో వ్యాళుడు పిచ్చుక అయి నివసిస్తాడు. ఒక గూడు కట్టుకుని అర్థరహితమైన శబ్దాలు చేస్తూ ఉంటాడు.
దాముడు - ఆ అధిష్ఠాన నగరమును 'యశస్కరదేవుడు' అనే పేరుగల రాజు పరిపాలిస్తూ ఉండగలడు. ఆ రాజు యొక్క అంతఃపురములో అనేక స్తంభాలు ఉండి ఉన్నాయి. వాటిలోని ఒక స్తంబము యొక్క వెనుక భాగంలోగల ఒక రంధ్రంలో ఒక దోమ అయి 'ఝుయ్' మని శబ్దం చేస్తూ దాముడు కాలం గడుపుతూ ఉంటాడు.
కటుడు - ఆ అధిష్ఠాన రాజ్యపు మహామంత్రి పేరు నరసింహుడు. అతడు బంధ-మోక్షములు రెండు గ్రహించియున్నవాడు. ఆ మంత్రియొక్క గృహంలోని పంజరంలో చిలక అయి ‘సారిక' అనే పేరుతో పిలువబడుతూ ఉంటాడు.
ఆ నృసింహమంత్రి తాను కొన్ని శ్లోకములుగా రచించియున్న దామ-వ్యాళ-కటుల చరిత్ర పఠిస్తూ ఉంటాడు. సారిక అనే పేరుతో చిలక రూపమున ఉన్న కటుడు నృసింహమంత్రి యొక్క ఆ గానమును అనేకసార్లు వింటాడు. సర్వమును అవగాహన చేసుకుంటాడు. విజ్ఞానదృష్టిని పొందుతాడు. అంతరంగమున ఏర్పడు బుద్ధి పరిపక్వత యొక్క ప్రభావం చేత శంబరాసురునిచే కల్పించబడినట్టి తన జీవరూపమును త్యజించటం జరుగుతుంది. 'సంసారము' అను దానిని సమూలంగా నశింపజేసే ఉత్తమోత్తమమగు 'మోక్షము'ను పొందుతాడు. అట్లే రాజమందిరములో
Page:153
ఉన్న దోమ(దాముడు), 'ప్రద్యుమ్న' అను కొండపై ఉన్న పిచ్చుక (వ్యాళుడు) ఆయా జనులు దామ-వ్యాళ-కటోపాఖ్యానం గానం చేస్తున్నప్పుడు, తమ పూర్వ చరిత్రను విని పరమోత్తమమగు నిర్వాణపదమును పొందుతారు.
❖
ఓ రామా! ఈ విధంగా దామ - - వ్యాళ - కటుల యొక్క వృత్తాంతమంతా విన్నావు కదా! దీనిని బట్టి నీవు గ్రహిస్తున్నదేమిటి?... “నామ రూపములతో కూడిన ఈ ప్రపంచమంతా శూన్య రూపము, మాయామాత్రము అయివున్నది'... అనునది గమనించు. ఒక్కొక్క బాటసారి మృగతృష్ణను చూచి "అవి జలములోని తరంగములే... కనుక అక్కడ పుష్కలంగా జలం ఉన్నది...” అను భావమును పొందుతూ ఉంటాడు కదా! అజ్ఞానము చేతనే ఈ జీవులు అనేకమైన భ్రమలను పొందుచున్నారు. అజ్ఞానము ఈ జీవుని 'అత్యున్నత స్థితి' నుండి 'అధఃపాతాళము’నకు క్రుంగునట్లు చేస్తోంది. అతడు అల్పత్వములో పడత్రోయబడుచున్నాడనునది గమనించబడుగాక!
అజ్ఞానులగు మూఢులు దామ-వ్యాళ కటులవలె పతనము పొందుచున్నారు.
శ్రీరాముడు : అవును మహర్షీ! లేకపోతే, తమ కనుసైగలచే పర్వతములైనను నుగ్గునుగ్గు చేయగలవారి పరాక్రమములెక్కడ? రాజస్తంభముపైన వ్రాలే ఒక దోమ బ్రతుకు ఎక్కడ? సూర్య చంద్రులను కూడా నిరోధించగల మేధస్సు ఎక్కడ? ఒక ఇంటి చూరులో మ్రగ్గి ఉండే పిచ్చుక ఎక్కడ? చూడగానే దేవతలు భయపడి పరుగెత్తే బలపరాక్రమములెక్కడ? ఒక పంజరంలో ఇరుక్కున్న చిలుక ఎక్కడ?
6. శ్రద్ధ - ప్రయత్నములు
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ ప్రియజనులారా! శాస్త్రాదులచే, మహాత్ములచే ప్రవచించబడుచున్న ఉత్తమ సాధనలను ఆశ్రయించండి. ఏదైనా నియమపూర్వకంగా నిర్వహించబడినప్పుడే తప్పక సఫలం అవటం జరుగుతుంది. ఈ లౌకికములైన “ధనసంపాదన” మొదలైన ప్రాపంచిక సాధన విషయములలో గాని, పారలౌకిక విషయాలైనట్టి "శుభలక్ష్యములతో గూడిన ప్రయత్నములు, మోక్షమార్గ సేవనము”... మొదలైన విషయములందు గాని సర్వత్రాగాని తదనుకూలమైన ప్రయత్నమే ఫలప్రదమగుచున్నది.
అందుచేత రామా! మోక్షఫలము కొరకై శుభప్రయత్నములను మాత్రం నీవు ఏ క్షణమందును విడువనే వద్దు.
"శుభప్రయత్నమే ఉత్తమ ప్రయోజనములను ప్రసాదిస్తుంది" అని అనటానికి అనేక పౌరాణికమైన (పురాణములలో చెప్పబడిన) దృష్టాంతాలు ఉన్నాయి. 'శిలాదుడు' అనే ముని ఉన్నాడు. ఆయనకు ఎంతకాలానికీ సంతానం కలుగకపోవడం చేత, ఆయన శివుని కటాక్షము
Page:154
కొరకు గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై గొప్ప భక్తి గల ఒక కుమారుని ప్రసాదించాడు. పేరు నందికేశ్వరుడు. కాని ఆ నందికేశ్వరుడు అల్పమైన ఆయుష్షు కలవాడు. అప్పుడు సద్గురువుల ఆజ్ఞను అనుసరించి నందికేశ్వరుడు ఒక సరోవరంలో శివలింగమును ప్రతిక్షేపించి ఏకాగ్రతతో, భక్తితో అర్చించాడు. శివుని అనుగ్రహానికి పాత్రుడై, మృత్యువును కూడా జయించాడు చూచావా! ఆ నందికేశ్వరుడు తన యొక్క శుభప్రయత్నములచేతనే పరమ శివుని కరచరణాలను ఆశ్రయించి, మృత్యువును జయించి, తన తల్లిదండ్రులకు అంతులేని ఆనందాన్ని కలిగించాడు. (లింగపురాణమ్)
బలి మొదలైన దానవులు గొప్ప స్వప్రయత్నముచేతనే సర్వైశ్వర్యసంపన్నులగు దేవతలను మర్దించగలిగారు. (వామన పురాణం). మరుత్తరాజు మొదలైన మహాత్ములంతా స్వప్రయత్నము చేతనే ఆయా ఔన్నత్యములను సాధించారు. 'సంవర్తుడు' అనే మహర్షి తన యొక్క శుభ ప్రయత్నముల ప్రభావం చేత బ్రహ్మదేవునిగా ప్రభవించి, మరో సురాసురులను సృష్టింగలిగాడు.
ఓ రాఘవా మరింకెవరెవరివో దృష్టాంతాలు మనకు దేనికి...? ఈ సభలో మనందరి కనుల ముందు కోటి సూర్యుల తేజముతో వెలుగొందుచున్న ఈ విశ్వామిత్ర మహర్షిని చూచావా? ఇతడు జన్మతః ఒక మామూలు రాజు. ఆ తరువాత ఆ రాజ్యమును తృణప్రాయంగా త్యజించి మహా ప్రయత్నశీలుడై గొప్ప తపస్సును ఆచరించాడు. మహా కష్ట సాధ్యమైనట్టి “బ్రాహ్మణత్వము'ను కూడా సముపార్జించాడు. రాజర్షి అయి, నాతో కలహించి, మరింత ప్రయత్న శీలుడై ఇప్పుడు బ్రహ్మర్షిగా వెలుగొందుచున్నారు.
అట్లాగే, ‘ఉపమన్యుడు’ గురించి విన్నావు కదా? అతడు ఒకప్పుడు అత్యంత మంద భాగ్య స్థితిని పొందియున్నాడు. నిరుపేద అయి పిండి కలిపిన నీరు కూడా లభించక, ఏదో దొరికింది తిని ఆకలి తీర్చుకునేవాడు. అట్టి ఉపమన్యుడు తన యొక్క శుభప్రయత్నములచే క్షీరసముద్రమునే
పొందగలిగాడు.
'శ్వేతుడు' అను మరొకడు తన యొక్క 'భక్తి' ప్రభావంచేత ముల్లోకములను సంహరించు స్వభావముగల యముని సంతసింపజేసి మృత్యువును జయించగలిగాడు.
'సావిత్రి' అనే పేరుగల రాజకన్య 'మంగళగౌరీవ్రతము' మొదలగు తన శుభప్రయత్నముల ప్రభావం చేత గొప్ప వాక్చతురతను ప్రదర్శించి తన భర్త సత్యవంతుని ప్రాణములను యమ ధర్మరాజు హస్తములనుండి తిరిగి పొందగలిగింది.
సశాస్త్రీయంగా నిర్వర్తించబడిన శుభప్రయత్నముల ఫలములు సుస్పష్టములు, అమోఘాలు అయి ఉన్నాయి. కాబట్టి రామా! నీవు సర్వోత్తమమగు మోక్షము గురించే సర్వదా ప్రయత్నశీలుడవై
ఉండటం ఉచితం సుమా!
నాయనా! రామా! ఈ జీవుడు అనుక్షణం "జననము-మరణము, సుఖము-దుఃఖము”... మొదలైన అనేక అసంఖ్యాకములగు భ్రాంతులన్నీ పొందుచున్నాడు. అట్టి భ్రాంతులన్నీ
Page:155
సమూలంగా పెకలించబడాలంటే, అందుకు ఒక్క ఆత్మజ్ఞానము మాత్రమే దివ్యమైన ఔషధం. అట్టి ఆత్మజ్ఞానం కొరకు అన్వేషణా పూరితమైన ప్రయత్నము నిరంతరం జరుగుచూ ఉండాలి.
అసలు, ఈ ‘బుద్ధి’ చేయుచున్నదేమిటో గమనిస్తున్నావా? ఇది సమగ్రత్వము, పూర్ణత్వము, ప్రశాంతత్వము ప్రసాదించగలిగినట్టి ఆత్మ సమాచారమును ఉపేక్షిస్తోంది. 'క్షుధ, అసంతృప్తి, తృష్ణ, కామం' మొదలైన ఆపదలను పరిగ్రహించే స్వభావాన్ని ప్రయత్న పూర్వకంగా ఆశ్రయిస్తోంది. ఎంతో ప్రయాసపడి, చివరికి రోగకారకము కాగల పదార్థములన్నీ సంపాదించి దాచిపెట్టు కుంటోంది. ఇట్టి ప్రమాదభరితమగు సందర్భంలో విజ్ఞుడైన వాడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు. శ్రీరాముడు : అట్టి ఈ దుష్టబుద్ధిని నిరోధించటం, నియమించటం ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ విషయములలో గల దోషమేమిటో పరిశీలించగల ఉత్తమ దృష్టి కొరకై ప్రయత్నం, అన్వేషణ సాగించాలి. శుభప్రయత్నములు మరల మరల పట్టుదలతో ఆశ్రయించాలి. "ఆఁ! ఈ శుభప్రయత్నములు శ్రమతో కూడుకొనియున్నట్టి వ్యవహారం కదా! ఇప్పుడెట్లా సాధ్యం? ఈ వస్తుజనితమైన ఆనందములను కోల్పోయి మేము ఏం సాధిస్తాం? ముందు ముందు ఇంతకు మించినదేదో పొందుతామని నమ్మకమేమిటి?”... అనునట్టి అల్పదృష్టితో కూడుకొని, ప్రయత్న మాంద్యమును ఆశ్రయించేవారిని ఎవరు కాపాడగలరు? ఈ జీవుడు ఏవేవో జడభావనలకు ఆశ్రయమిస్తూ ఆత్మ విషయమై తాత్సారం చేస్తున్నాడు. నాయనలారా! "వైరాగ్యమును అభ్యసించుట" అను శ్రమకు మీరు సిద్ధంగా లేకపోతే... బాధారహితము, మహత్తరము అగు ‘సచ్చిదానందము' యొక్క లేశము కూడా ఎట్లా లభిస్తుంది చెప్పండి? శ్రమించకుండా ఈ జగత్తులో ఎవరు ఏది పొందగలరు?
శమము, పరబ్రహ్మము - 'బ్రహ్మము' అనగా ఏమిటి? అది ఎప్పుడో ఎక్కడో ఎట్లో తారసపడే విషయమా? కానే కాదు. ఇంద్రియనిగ్రహముచే పరిపూర్ణమైన చిదాత్మ స్వరూపమగు బ్రహ్మమే పరబ్రహ్మము సుమా! అట్టి ఇంద్రియ నిగ్రహమునే 'శమము' (Withdrawal from sensory avocations) అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ 'సంసారం' అనే అనర్థము దీని మూలకారణ సహితంగా నివర్తింపబడాలంటే “శమం” ను ఆశ్రయించాలి. గొప్ప అనర్థముల నుండి కాపాడ గలదు కాబట్టి “శమమే పరమ పురుషార్థం. సర్వ ఉత్తమ ప్రయత్నముల ప్రయోజనం శమం”అని మహనీయులు చెప్పుచున్నారు. 'శమము', 'బ్రహ్మము' అనబడు రెండూ ఒక్కటే సుమా! ఇందులో శమము అనునది శంకరునిగా (శం+కరుడు=బ్రహ్మానందమును కలుగజేయు వాడు) ఎరుగు. ఓ రామా! అభిమానమును త్యజించినవాడవై, నిత్యము శమమునే ఆశ్రయిస్తూ ఉండు. శాశ్వతమగు మోక్షప్రాప్తికి యోగ్యమైన ఉత్తమ జన్మ కర్మల గురించే ఈ జీవుడు ప్రయత్నశీలుడు కావాలి.
సత్పురుషుల సేవ - 'నేను సర్వాత్మ స్వరూపుడను' అను ధ్యాననిష్ఠతో కూడిన ఎరుకను సుస్థీరీ కరించుకున్నట్టి మహనీయులు ఈ భూమిపై అక్కడక్కడ ఉన్నారు. అట్టి సజ్జనులను సేవించాలి. “సత్పురుషులను సేవించుట” అను అభ్యాసము గలవారు ఈ సంసార సాగరమును అవలీలగా దాటివేయుచున్నారు.
Page:156
న తపాంసి న తీర్థాని నశాస్త్రాణి జయన్తి చ ।
సంసార సాగరోత్తారే సజ్జనాసేవనం వినా ॥ (సర్గ 33, శ్లో. 14)
సత్పురుష సేవనము లేనిచో తప, తీర్థ, శాస్త్రాదులేవియు సంసారసాగరమును దాటింప శక్యములుగావు.
ఎవని యందైతే లోభ మోహ-క్రోధములు రోజు రోజుకూ తగ్గుతూ ఉంటాయో, ఎవడు తనకు విధించిన కార్యములందు శాస్త్రానుకూలంగా వర్తిస్తూ, అకర్తృత్వము వహిస్తూ ఉంటాడో, అతడే సజ్జనుడు.
7. దృశ్యము యొక్క అత్యంత - - అభావము
సజ్జన సాంగత్యము చేయుచూ రాగా, ఆత్మవేత్తలగు వారి సంపర్గముచే, ఈ జీవునకు ఈ దృశ్యము యొక్క అభావము లభిస్తుంది. దృశ్యముకంటే అతీతమై దృశ్యము చేరజాలనట్టి స్వస్థితి అనుభవమౌతుంది. అట్టి వానియందు పరమాత్మయే శేషిస్తుంది. అతనికి ఇక ఏ అన్యభావమూ, దేని పట్ల కూడా కలుగదు. అతడు పరమాత్మయందే ఏకమై, లీనమై ఉంటాడు.
యథార్థానికి ఈ దృశ్యము ఏ సమయమునందును ఉత్పన్నము కానేలేదు. ఇక ముందు కూడా ఇది ఉండబోవుట లేదు. మరి వర్తమానంలో మాత్రం ఇది 'ఉన్నది' ఎట్లా అవుతుంది? అందుచేత బ్రహ్మమును ఎరిగినప్పుడు ఏదీ, దేనిచేత కూడా బాధింపబడుట లేదు. "బ్రహ్మమును ఎరిగినవాడు జగత్తును త్యజిస్తాడు...” అను వాక్యమును సునిశిత బుద్ధితో "అతడు ఈ సర్వము బ్రహ్మముగానే దర్శిస్తాడు...” అని అర్థం చేసుకోవాలి. ఇక బ్రహ్మభావమును కలిగియుండుటచేత నష్టమేమున్నది? "నేను బ్రహ్మమునే” అను అవగాహనను "భవిష్యత్తులో సాధించవలసిన విషయం”గా దర్శించవలసిన పనేమున్నది?
ఈ జగత్తు ఉత్పత్తియే అయి ఉండలేదు... అను సత్యమును ఉత్పత్తి ప్రకరణంలో అనేక యుక్తుల సహాయంతో నిరూపించాము కదా! ఇప్పుడు కూడా అదే ప్రతిపాదిస్తున్నాను. శ్రీరాముడు : హే మహర్షీ! ఈ త్రిలోక సంబంధమైన 'చిదాకాశము' గురించి సుస్పష్టమొనర్చమని వేడుకొనుచున్నాను. 'చిదాకాశము' అనుదానిపట్ల విజ్ఞుల అనుభవం, దృష్టి ఎట్లా ఉంటోందో మరి కొంత చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ త్రిలోక సంబంధమగు చిదాకాశము శాంతము, నిర్మలము పరమార్థ రూపము అయివున్నది. అఖండమగు నా యొక్క నీ యొక్క సర్వులయొక్క వాస్తవతత్త్వమే కదా! ఇక “నేను శాంతుడను-నిర్మలుడను-పరమార్థరూపమును, అఖండుడను-వాస్తవతత్త్వమును”... అను భావనను అభ్యసించటానికి వెనుతీయవలసిన పనేమున్నది? “నా యొక్క స్వస్వరూపము ఈ త్రిలోకములకు సంబంధించక, సంబంధించీ కూడా ఉంటున్న చిదాకాశమే” అని నిరభ్యంతరంగా గ్రహించబడవచ్చును. విజ్ఞులు అట్టి అనుభవమునే సర్వదా, సర్వత్రా పొందుచున్నారు.
Page:157
శ్రీరాముడు : అయితే మునీంద్రా! ఈ ఆకాశము మొదలైన దృశ్యపదార్థములు, అవి అనుభవ మగుచున్న ఈ ఇంద్రియాలు... ఇవన్నీ మాయాజనితము అయి ఉన్నాయంటారా? ఇవన్నీ ఎక్కడి నుండి ఏ విధంగా జనించాయి? సత్తు నుండా? అసత్తు నుండా? లేక మాయ నుండా? శ్రీ వసిష్ఠ మహర్షి : సత్తు అగు ఆత్మ వికారరహితము. అందుచేత ఆత్మ నుండి 'ఆకాశము' మొదలైనవి ఉద్భవించటం అసంగతమైన విషయం.
'అసత్తు అనునది స్వయముగా లేనిదే కదా! లేనిదానిలో నుంచి ఆకాశము, భూమి మొదలైనవి ఎట్లా ఉద్భవిస్తాయి?.... అందుచేత రెండు పక్షములు యుక్తములు కావు.
ఇక ఇవి 'మాయ' నుండి కలిగాయని అనుకుంటే... మాయ అనగా 'మిథ్య' అనియే కదా! మిథ్య నుండి మిథ్య అయినవే సంభవించగలవు. ఇట్లు ఈ ఆకాశాదుల ఉత్పత్తియే సంభవించుట
కుదురునది కాదు.
కాబట్టి, “కల్పితం, చంచలం అగు జీవాత్మ యొక్క సంకల్ప దర్పణము నందు ప్రతిబింబించే చైతన్యమే ఇదంతా” అని అనక తప్పదు.... ప్రతిబింబిత చైతన్యమే ఈ జగత్తును కల్పించుచున్నది. చైతన్యము దేనిని ఎట్లు కల్పన చేయుచున్నదో అట్లు ఆ కల్పననే 'జగత్తు' రూపముగా అనుభవించుచున్నది.
ఈ ముల్లోకముల కల్పన అంతా కూడా “చైతన్యము” అను సూర్యుని కిరణముల సమూహమే అయివున్నది. కిరణములకు, సూర్యునికి భేదమేమున్నది? లేదు కదా!
8. అహంకారము యొక్క రూపము
ఈ సర్వవికల్పములు మిథ్యయే కాబట్టి "ఈ ముల్లోకములందలి అనుభవం నిర్వికల్పమగు పరబ్రహ్మస్వరూపమే”... అని చెప్పబడుతోంది. చైతన్యము స్వతహాగా “నిర్వికల్పమే” అయినప్పటికీ సవికల్పత్వమును చమత్కారముగా కలిగి ఉంటోంది. అట్టి సవికల్పమగు చైతన్యవృత్తి యొక్క “కనులు తెరచుట, మూయుట” అను బాహ్యచమత్కృతులే ఈ 'జగత్తు' అను అనుభవము యొక్క ఉత్పత్తి - - వినాశనములు అయి ఉన్నాయి సుమా!
పరమార్థమగు చిదాకాశమున “అపరిజ్ఞాతమగు అహంకారము” అనే మాలిన్యము, లేక అవిద్య ఒక “గారడి సంఘటన” వలె ఉండి ఉంటోంది.
పరిజ్ఞాతమగు అహంకారము (సర్వము గ్రహించి, సత్యదృష్టిని అంతర్లీనంగా దర్శించు జీవుడు) స్వయముగా చిదాకాశమే అయివున్నది. కాబట్టి అహంకారమును పరిజ్ఞాతం (జ్ఞాన మయం) చేస్తే ఈ దృశ్యసత్త బ్రహ్మముగానే గ్రహించబడుతోంది.
అపరిజ్ఞాతం చేస్తున్నప్పుడో, బ్రహ్మసతకంటే వేరే ఉన్నదానివలె భ్రమను కలిగించుచున్నది.
Page:158
ఇట్టి సంసారవ్యాధికి (అహంకారమును బ్రహ్మము కంటే వేరైన దానివలె పొందుట అను వ్యాధికి) ఔషధం ఒక్కటే. అది, ఈ అహంకారము యొక్క యథార్థస్వరూపం ఎరుగుటయే. హృదయావదహంభావో వారిదః ప్రవిజృంభతే ॥
తానద్వికాసమాయాలి తృష్ణాకుటజమజ్జరీ ॥ (శ్లో. 30, సర్గ 33)
దీనిని యథార్థ స్వరూపమేమిటో తెలుసుకున్నామా... ఇంకేమున్నది? ఇది ఏ విధంగానూ ఉండజాలదని తెలిసిపోతుంది. జలము జలములో కలిసిపోతున్నట్లు, పరిజ్ఞాతము అయినట్టి అహంకారం చిదాకాశముతో ఏకత్వము పొందుతోంది.
అహంకారం, దృశ్యము - ఓ రామచంద్రా! "అహంకారం అనగా ఏమిటి?" అనే విషయం -
మేము ఎంతగానో పరిశీలించాము. నేను నీవు-అతడు-ఇతడు మొదలైన వాటితో కూడుకున్న ఈ దృశ్య వ్యవహారమంతా పరిశీలించి చూస్తే, "ఈ దృశ్యము స్వతహాగా లేదు. కానీ, 'భావన'ను లేక, ‘ద్రష్ట’ను ఆశ్రయించుకొని అట్టి భావనానుసారంగా ఉన్నట్లు మాత్రం ప్రాప్తి స్తోంది" అని సిద్ధాంతీ కరించాం. ఇక్కడ సర్వేసర్వత్రా చిదాకాశమే ఉన్నది కాని, 'దృశ్యము' అనబడేదేదీ ఎక్కడా లేదు. ‘అహంకారము’ అనబడేదేదీ చిదాకాశము నుండి వేరైనదిగా లేదు. వివేకులు, అభయస్వరూపులు అగు జ్ఞానుల దృష్టిలో అహంకారమే 'లేనిది' అగుచున్నప్పుడు, ఇక అది ఒకరిని బాధించుట ఏమి? పిశాచమే ఉండజాలదని గ్రహించిన తరువాత, అట్టి పిశాచం యొక్క చర్యలకు ఉవ్విళ్ళూరు వారెవరు? భయపడువారెవరు? అయితే అల్పజ్ఞులగు బాలురకు “పిశాచం లేదు” అని ఎన్నిమార్లు చెప్పినా వారిలో కొందరికి పిశాచబుద్ధి తొలగకయేపోవచ్చు కదా! ఎంతగా బోధించినప్పటికీ ఆత్మ యందు ఇంకను నిలకడ ఏర్పడని జీవునకు 'అహంకారము లేదు' అనునది అవగత మగుటలేదు. ఇంకను సంశయబుద్ధి శేషించుచునే ఉంటోంది.
ఎంత వరకైతే ఈ చైతన్యము 'అహంకారము' చే కప్పబడి ఉంటోందో అంతవరకు స్వయం స్వరూపమగు అద్వితీయ ఆత్మతత్త్వము అనుభవమున ప్రకాశించదు. ఎప్పుడైతే ఈ జీవునికి అహంకారము యొక్క అసలు రూపం అవగతమౌతుందో, అట్టి అహంకారము యొక్క విజ్ఞాన దృష్టికి ఇక ఈ 'స్వర్గము-నరకము-మోక్షము' మొదలైన కల్పనలు ఉంటాయా? ఉండవు.
అహంకార మేఘం, హృదయాకాశం అహంకార మేఘం హృదయాకాశంలో సంచరించు చున్నంత సేపు “ఇంకా ఏదో పొందవలసి ఉన్నది...” అను రూపముగల తృష్ణ అనే కొండమల్లె వృద్ధి చెందుతూనే ఉంటుంది. చైతన్య సూర్యుని అహంకార మేఘం కప్పి ఉంచుట చేత, ఇక అజ్ఞాన అంధకారమే వ్యాపిస్తూ ఉంటుంది. సుజ్ఞానము యొక్క ప్రకాశము మరుగునపడి ఉంటుంది. ఫలితమేమిటి?” రోదన - ద్వేషం - నిర్దాక్షిణ్యం - నిస్పృహ - అభినివేశం - మదమాత్సర్యాలు”... ఇవన్నీ తాండవిస్తూ ఉండటం. చీకటి ఉన్నచోటే గబ్బిలములు మొదలైనవి కాపురములు చేస్తూ ఉంటాయి కదా! బాలుడు తన భ్రమచే “పిశాచము” అనబడు, అసలు లేనట్టి, ఒకానొక దానిని కల్పించుకొని, పొందుతూ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. “నన్ను ఆ భూతం నుండి కాపాడండి. నాకు ‘తోడు’ ఉండండి” అంటూ తదితరులను అర్థిస్తాడు. అట్లాగే, ఈ అహంకారము అనబడునది
Page:159
స్వతహాగా అసత్తే అయినప్పటికీ, కల్పించబడి మరీ పొందబడుతోంది. అట్టి కల్పన దుఃఖం కొరకే ఏర్పడుచున్నది. ఎందుకంటే, అహంకారము యొక్క కల్పనచే సుఖించువారు ఎవ్వరూ ఉండరు.
అహంకారము, సంసార భ్రమలు! - చీకట్లో పడివున్న ఒక వంకర టింకర త్రాడును చూచి “అమ్మబాబోయ్! ఇది పామే!” అను బుద్ధి ఏర్పడుతోంది చూచావా? అభిమానం చేత కలుషితమైన అంతఃకరణము నందు ఈ “అహంకారం” అనబడేది కల్పించబడుతోంది. ఇక అట్టి అహంకారం సర్వసంసార భ్రమలు కలుగజేస్తోంది.
"ఈ దేహమే నేను; ఈ ఇంద్రియములు నావి, నేను ఈ దేహపరిమితుడను, ఈ దేహము ముగించబడితే, అది నా ముగింపే అగుచున్నది...” ఇటువంటి మనోమోహముల కంటే వేరుగా అనర్థములు ఈ ప్రపంచంలో ఇతఃపూర్వం లేవు. ఇక ముందు ఉండబోవు. "ఈ ప్రపంచంలో జీవునికి అనేక రూపములైన దుఃఖములన్నీ ఎక్కడి నుండి ప్రాప్తిస్తున్నాయి?” అనే విషయమును మేము ఎంతగానో పరిశీలించాం. “ఇదంతా అహంకార చక్రం యొక్క విజృంభణం, పరిణామం అయివున్నది”... అని ప్రకటిస్తున్నాం. 'అహంకారము' అనే విషవృక్షమును 'శుద్ధమైన మనస్సు’ అనే గొప్ప యంత్రము సహాయంతో కూకటి వ్రేళ్ళతో సహా పెకలించివేయాలి. అప్పుడు 'ఆత్మ' అనే సుక్షేత్రంలో సంసారనాశకరమగు 'జ్ఞానబీజము' అంకురిస్తుంది. అది మహావృక్షమై... “నేను అఖండుడను, నిత్యుడను” అను ఎరుక రూపంలో ఉండే మహాఫలమును ప్రసాదిస్తుంది.
నాది, నేను - ‘అహంకారము' అనే వృక్షమునకు “నాది నేను” అనునవే రెండు శాఖలు. అట్టి నేను, నాది అనునవి ఇంద్రియవిషయముల పట్ల 'ప్రియ, అప్రియములు' అను వాటిని మూలంగా కలిగి ఉంటున్నాయి. అవియే వాసనలు. ఈ వాసనలు జీవుని యందు తత్వవిచారణను సన్నగిల్ల చేస్తున్నాయి. అత్యంత శ్రమతో కూడుకొనిన అనేక జన్మపరంపరలను ఈ జీవుడు పొందేట్లు చేస్తున్నాయి. జలంలో తరంగాల వలె ఈ జన్మ కర్మలు అతి చంచలములై, చివరికి అతి తుచ్ఛముగా పరిణమిస్తున్నాయి.
కాబట్టి రామచంద్రా! నీవు యథార్థానికి ఆత్మయే స్వరూపముగా కలిగి ఉన్నావు. అట్టి నీకు అహంభావమేమిటి? అది నిన్ను సంకోచింపజేయటమో, బంధించటమో ఏమిటి? నీవు అహం భావ రహితుడవే సుమా! అట్లే ప్రతిజీవుని విషయం కూడా. అయినప్పటికీ అహంభావము ఆత్మను కప్పివేయుచున్నది. ఫలితంగా ఈ జీవుడు స్వయంగా ఈ సంసారచక్ర పరిభ్రమణమును తనకు ఆపాదించుకొనుచు, దుఃఖములతో కూడిన అనుభవములన్నీ పొందుచున్నాడు. “ఆత్మ స్వరూపుడ నగు నాకు ఏ సమయమందునూ జన్మ కర్మలు లేవు" అను ఎరుకను ఏమరచుచున్నాడు.
‘జన్మ’ అనే అరణ్యంలో 'అహంకారం' అనే అంధకారం వ్యాపించి ఉన్నంతవరకు ‘దుఃఖము’ అనే మదించిన పిశాచము విజృంభిస్తూనే ఉంటుంది. ఈ అహంకారపిశాచము మామూలు 'పిండి-పిడక' మంత్రములచే వదిలేది కాదని అందరిని హెచ్చరిస్తున్నాను.
Page:160
9. అహంకారము - నివారణోపాయం
శ్రీరాముడు : మహాత్మా! ఈ అహంకారం వృద్ధి పొందకుండా ఉండే ఉపాయమేమిటి? ఈ సంసారము భయమును కలుగజేస్తోంది. ఇట్టి భయనివృత్తి కొరకు వివిధ జనులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఉపాయాలను సవివరంగా చెప్పవలసినదని ప్రార్థిస్తున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : సర్వజనుల పట్ల నీకు గల అవ్యాజమైన ప్రేమను మేము గమనిస్తున్నాము. అందుచేతనే, ఈ జీవుని యొక్క భయము, దుఃఖముల నివృత్తికొరకే ఈ ఆత్మ శాస్త్రమును మా యొక్క అనుభవసారంగా ప్రతిపాదిస్తున్నాం. ఈ సందర్భములో నీ ప్రశ్న అత్యంత సముచితం. అందుచేత నీ ప్రశ్నకు సమయోచితమైన కొన్ని విశేషాలు ఇక్కడ సమాధానంగా చెప్పుతాను. వినుఆత్మధ్యానం - ఆత్మ ఒక నిర్మలమైన అద్దము వంటిది. చిన్మాత్రమే స్వరూపముగా కలిగియున్నది. అట్టి శుద్ధ చిన్మాత్రమగు ఆత్మయొక్క స్వభావమును నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు అహంకారం వృద్ధి పొందకుండా ఉండగలదు.
విరాగం - "దృశ్యరూపంగా ప్రాప్తిస్తున్న ఈ ఇంద్రజాల సదృశ్యమైనదంతా మిథ్యయే కదా! వీటి పట్ల నాకు రాగమెందుకు? ద్వేషమెందుకు?”
ఇట్టి 'మననము' లేక 'చింతన' నిరంతరం ఒనర్చుట చేత అహంకారం వృద్ధి కాకుండా ఉంటుంది. ఎవనియందైతే "ఈ దృశ్యం వాస్తవం” అను అనుభవం గాని, “నాది... నాకే ఉండాలి" అనునట్టి వేదనగాని ఉండదో, ఎవడైతే సర్వస్థితి గతులందు ప్రశాంతచిత్తుడై వ్యవహరిస్తాడో... అట్టి వాని యందు అహంకారము తప్పక రూపుమాయగలదు.
దృశ్య వ్యవహారం నుండి స్వస్వరూపాన్ని వేరు చేసి ఉంచటం
ద్రష్ట దర్శనము దృశ్యము
Perceiver Perception Object
నేను చిత్తు జగత్త
Knower Knowing The known
పై త్రిపుటి సర్వదా ఎదరుగా ఏర్పడి ఉంటున్నది కదా! అయితే, ఒకని యందు ప్రజ్ఞ, ప్రయత్నముల ప్రభావం చేత, “ఇది గ్రహించాలి. ఇది త్యజించాలి" అను త్యాజ్య గ్రాహ్య దృష్టులు నశించుచున్నాయి. అప్పుడు అట్టివాని యందు “సమత్వము” అనబడు మధుర స్వభావం ప్రవృద్ధమౌతోంది. అహంకారము స్వయముగానే క్షీణించుచున్నది. “నా హం, ఇదంతా నేను కాదు. నేను దేనికీ కర్తను కాదు. నా వాస్తవతత్త్వము దేనికీ కర్తగానీ, భోక్తగాని అయ్యేది కాదు...” అను భావనచేతనే అహంకారము నిర్జించబడుతోంది.
ఎచ్చటైతే అంతఃకరణము నందు భేదదృష్టి లేక భేదభావన సన్నగిల్లుతూ వస్తుందో, అక్కడ అహంకారము తన తావును కోల్పోతూ ఉంటుంది.
Page:161
శ్రీరాముడు : తండ్రీ! ఇతఃపూర్వం మీరు సమాధానం ఇచ్చి ఉన్నప్పటికీ, మరల అట్టి ప్రశ్ననే అడుగుచున్నాను. ప్రశ్న ఒక్కటే అయినప్పటికీ, మీరు అనేక కోణముల నుండి సమాధానం ఇస్తున్నారు. కనుక మాకు మీ వాక్యములు అత్యంత ప్రయోజనకరంగానే ఉంటున్నాయి.
అసలీ అహంకారము యొక్క స్వరూపమేమిటి? ఈ 'అహంకారము' అనబడునది ఈ జగత్తునందు, స్వప్నమునందు, మనోరథములందు ఏ రూపము కలిగి ఉంటోంది?
1) దేహమునకు సంబంధించిన అహంకారము.
2) దేహమునకు విలక్షణమైన 'బుద్ధి' యందు ఏర్పడి ఉంటున్న అహంకారము.
ఈ రెండు అహంకారముల గురించి వివరించండి.
వివిధ రూపములైన ఈ అహంకారములు త్యజించబడేది ఎట్లా? అట్లు త్యజించుటచే కలుగు ప్రయోజనమేమిటి? ఈ అహంకారములను ఎన్ని తీరులుగా విభజించవచ్చు? ఈ విషయాలు ప్రవచించమని ప్రార్థిస్తున్నాను.
10. త్రివిధ అహంకారములు
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ లోకంలో మూడు రకములైన అహంకారాలు ఉన్నాయి1) “ఈ సర్వము నేనే” 2) “ఇందులోని ఏదీ నేను కాదు” 3) " ఈ దేహమే నేను”.
1. అహమేవ ఇదమ్ సర్వమ్... ఈ సర్వము “నేనే" -
అహం సర్వమిదం విశ్వం పరమాత్మాహమచ్యుతః I నాన్యదస్తేతి పరమా విజ్ఞేయా సా హ్యహంకృతః | మోక్షాయైషా న బస్ధాయ జీవన్ముక్తస్య విద్యతే ॥ (సర్గ 33, శ్లో. 50)
"ఈ జగత్తంతా నిండియున్నట్టి కార్యరూపుము, కారణరూపము, నాశరహితము అగు ఆ పరమాత్మను నేనే. నాకు అన్యముగా 'జగత్తు' అనబడునది వేరే ఎక్కడా లేదు. నేను భావించుట చేతనే జగత్తు ఉంటోంది. భావనను, భావాతీతుడను కూడా నేనే. నాచే ఎదురుగా చూడబడుచున్న వారంతా నా యొక్క “సత్-చిత్” కిరణపుంజములే...!”
ఈ అహంకారము సర్వోత్తమమైనది. ఇది మోక్షమునే కలుగజేస్తోంది. ఇట్టి భావన బంధము అవదు. ఇట్టి అహంకారము జీవన్ముక్తులయందు పరిపూర్ణత సంతరించుకుని ఉంటుంది.
2. కేవల పరిశుద్ధ సాక్షీస్వరూపమహమ్- ఈ సర్వమునకు విలక్షణమైనట్టి పరిశుద్ధమగు 'కేవలసాక్షీ' స్వరూపమును నేను.
"ఈ జగత్తులో కనబడే సర్వ దృశ్యవస్తువులకంటే కూడా విలక్షణమైనవాడను. సర్వమునకు సాక్షితత్వమును, శుద్ధుడను. అప్రమేయమును అయివున్నాను. కనుక ఇందు నేను ఏదీ కాదు...!
Page:162
ఈ కనబడేది, తారసపడేది - అంతా స్వప్నసదృశ్యకము కాగా, నేను మాత్రము సత్యమును, నిత్యమును...!”. స్వప్నద్రష్ట స్వప్నముకంటే వేరేకదా! ఈ జగత్తు నాకు అట్టిదే!
ఇది కూడా శుభాహంకారమే అవుతుంది. జీవన్ముక్తులచే ఆశ్రయించబడుచూ, మోక్ష భావనయందు సుస్థీకరింపజేస్తుంది. అయితే "సప్తమ భూమిక” యందు ప్రవేశించినట్టివానికి పై రెండు అహంకారములూ కూడా కేవలం "క్రిందిమెట్లు”గానే తెలియవస్తూ ఉంటాయి.
3. ఇదమ్ దేహ-మే వాహమ్ ఈ కళ్లకు కనబడే పాంచభౌతిక దేహము మాత్రమే నేను, “ఈ చేతులు, కాళ్లతో కూడుకున్న దేహమే నా స్వరూపము - ఈ దేహమును అనుసరించి మాత్రమే నేను ఉండటం జరుగుతోంది. దేహమునకు వేరుగాగాని, అతీతముగాగాని నేను లేను...!”
ఇట్టి లౌకికమైన నిశ్చయము తుచ్ఛమైనది. నీచమైనది కూడా. ఇది ప్రబల శత్రువు కాబట్టి సర్వదా త్యజింపతగినదే!
'నేను ఈ దేహమును' అను రూపముగల అహంకారము అనేక రకములుగా విపత్కరమైనది. బలవత్తరమైన శత్రువు వంటిది కూడా! ఈ “దేహమేవా హమ్” భావరూపమగు అహంకారము ఆత్మయందు స్వభావంగానే అనాది కాలం నుండి సంసక్తమై యున్నది. హస్తము నందు 'హస్తలాఘవము' దాగియ్నుట్లు ఆత్మయందు "జగత్తు యొక్క కల్పన చేయుట, పొందుట” అను చమత్కారం నిక్షిప్తమై ఉంటోంది. అయితే అది అపసవ్యము, అవాస్తవము అవటం చేత, “నేను శరీరమును” అను భావన పొందుచున్న ఈ జీవుడు ఎక్కడా ఒకచోట నిలువలేక పోవుచున్నాడు.
HH
అయ్యో! అనేక దుర్వాసనలందు సర్వదా ప్రవృత్తమగుచున్నట్టి 'బుద్ధి'గల ఈ జీవుడు నిరంతరము అనేక విపత్తులలో కూలుచున్నాడే! మహాత్ములగువారు పరిశుద్ధము, అఖండము, అప్రమేయము అగు ‘అహమ్'ను ఆశ్రయించి, అటుపై ఈ జగత్తులో సంచారం చేస్తున్నారు.
“ఈ సర్వము నేనే అయినప్పటికీ, నేను ఈ దృశ్యమునకు సంబంధించినట్టి ఏదీ కాను”... అను రెండువైపుల పదునుగల కత్తితో 'నేను దేహమాత్రుడను దేహపరిమితుడను” అను భావ రూపమున ఉంటున్న 'లౌకికాహంకార దోషమును' ఆ సుజ్ఞానులు విచ్ఛిన్నం చేసివేయగలుగు చున్నారు. “దేహమేవాహమ్” అను దానిని “సర్వాత్మా హమ్” అనుదానిలో లయం చేస్తూ ఈ దేహ భావము నుండి నిస్సంశయపూర్వకంగా విముక్తిని పొందుచున్నారు.
“నేను దేహమును” - అను భావనచే మూడవ అహంకారము దృఢపడుచున్నది. అదియే -
బంధమగుచున్నది. “సర్వులలో సమానంగా ఉండి ఉన్న ఆత్మ చక్రవర్తిని నేనే” అను అహంకారం చేత తుచ్ఛత్వము జయించబడాలి. 'నేను దేహమును కాను”... అను నిశ్చయముచే మొదటి రెండు మహాహంకారాలు సుసాధ్యమౌతాయి.
Page:163
ఆ తరువాత క్రమంగా మొదటి రెండు అహంకారములకు సంబంధించిన శ్రమను కూడా మహాత్ములు త్యజించివేస్తున్నారు.
'మౌనము-ప్రశాంతము-నిర్మలము' అగు స్వస్వరూపము మాత్రం శుద్ధమై శేషించుచున్నది. ఏ విధంగా అయితే లౌకికంగా కనిపిస్తున్న “దేహమే నేను" అనే భావన స్థిరపడిందో, తదితర అహంకారములు కూడా అట్టి ఏదో ఒక లేక, కొన్ని మార్గముల ద్వారా అలవరచుకోవాలి. ఏదైనా, అభ్యాసము చేతనే సుస్థిరత పొందుచున్నది. దుష్టమగు దేహాహంకారమును తలచుకొంటే చాలు... దుఃఖములన్నీ వచ్చిపడుచున్నాయి.
దామ వ్యాళ కటులకు కలిగిన దుర్దశలను గమనించావు కదా!
దేహాహంకారమును త్యజించినవాడు తనకు తానే హితము చేసుకుంటున్నాడు.
శ్రీరాముడు : లౌకికమైన 'దేహాహంకారము'ను పరిత్యజించిన మానవుడు ఎట్లా వర్తిస్తున్నాడు? అతడు తనకు తానే ఎట్లా హితం చేసుకుంటున్నాడు? మరి కొంత వివరించండి.
శ్రీ వసిష్ఠమహర్షి : ‘ఈ సర్వము నేనే అయి వున్నాను... నేను మరొకటేదీ ఏ క్షణంలోనూ అగుట లేదు” అను భావములను స్వీకరించుటయే దేహాహంకారవ్యాధికి ఔషధమైయున్నది. "శ్రద్ధఅభ్యాసము-గురుసేవ’లచే తమ తమ ప్రయత్నములను తీవ్రతరం చేస్తున్నవారికి అది సుసాధ్యమే అవుతుంది. అట్టి ఉత్తమ భావన వృద్ధిపొందుచుండగా, అది ఆ జీవుని పరబ్రహ్మ ప్రాప్తికి సంసిద్ధునిగా చేయుచున్నది.
మొదటి రెండు అహంకారములు ఉత్తమదృష్టితో ఆశ్రయించటమనేది ఇప్పుడే ఇక్కడ నిర్వర్తించవచ్చు సుమా! అయితే... సర్వ అహంకారములు రాహిత్యముచేతనే సర్వోత్తమమగు బ్రహ్మపదము అధిరోహించబడుతోంది.
ఓ సర్వజనులారా! మీరు పరబ్రహ్మము గురించిన బోధకు తగిన వారు కావాలంటే ముందుగా 'నేనీ పాంచభౌతిక దేహమును' అను భావరూపమగు దుష్ట ఆశ్రయమును త్యజించాలి. "నేను ఈ దేహపరిమితుడను' అనునది ఒక పరిమితమైన, సంకుచితమైన, అపరిపక్వ మైన, అసమగ్రమైన అవగాహన - అని, దానిని అధిగమించుటే సుఖము, శ్రేయస్కరము, ఉత్తమము అని మేము సర్వులకు గుర్తు చేస్తున్నాం. ఒకడు ఈ ప్రపంచమున వ్యవహరిస్తూ ఉండ వచ్చు. లేదా ఇదంతా త్యజించి ఒకచోట ఒంటరితనమును ఆశ్రయించి కాలము గడుపుతూ ఉండ వచ్చు. ఏది ఏమైనా అతడు స్థూలముగా ప్రాప్తిస్తున్న ఈ లౌకిక దేహాహంకారమును తత్త్వవిచారణ సహాయంచే జయించాడా... ఇక అతనికి 'పతనము' అనబడు ఊసు కూడా ఉండదు. అట్టి అహంకారము శమించుచుండగా పూర్ణతృప్తుడగుచున్న మానవుడు ఈ భోగములన్నిటినీ నిర్లిప్తంగా (వాటితో అనురాగ విరాగాది భావనలు చేయకుండానే చూస్తూ ఉంటాడు. భోగములు
Page:164
రుచించకపోవుటచే ఇక 'మోక్షము' అను శ్రేయస్సు వచ్చి ఎదురుగా నిలచి ఉంటుంది. మనస్సులోని అంధకారమువంటి ఈ 'అహంకారము' తొలగిన తరువాత ఇక పూర్ణానందమగు మోక్షస్థితికి వేరే ప్రతిబంధకాలు ఏమి ఉంటాయి?
అహంకార అనుసంధాన వర్జనాదేవ రాఘవ ॥
పౌరుషేణ ప్రయత్నాశ్చ తీర్యతే భవసాగరః ॥ (సర్గ 33, శో&. 70.)
అహంకారము వర్ణించుటచేతను, ధైర్యమును అవలంబించి శాస్త్రశ్రవణము మొదలైన పురుష ప్రయత్నమును ఆశ్రయించుట చేతను ఈ సంసారము తప్పక దాటివేయబడగలదు.
కనుక, మొట్టమొదట... “ఈ జగత్తంతా నేనే. కాబట్టి అంతయు నా స్వరూపమే”.... అను నిశ్చయము కలిగి యుండుము. ఆ తరువాత... “దేహాదులు నేను కాదు. ఒక దేహము కలిగి ఉన్నప్పుడు ఆ దేహమునకు మాత్రమే సంబంధించిన ధన-పుత్ర-మిత్రాది వ్యవహారములు కూడా నావి కావు... నాకు అనేక దేహములు ఏర్పడవచ్చు గాక... నేను ఏ ఒక్క దేహమును కాదు” అని భావించుటచే ప్రతిబంధకములన్నీ తొలగిపోతాయి.
అప్పుడు అట్టి ఉత్తముడు “పరిశుద్ధాత్మ”ను పొందు త్రోవలో ఉంటాడు. క్రమంగా సప్తమ భూమిక యందు స్థితి కలిగి ఉంటాడు. ఇక అతడు స్వయంగా అపరిచ్ఛిన్నమగు పరిపూర్ణాత్మ స్వరూపుడై “విదేహకైవల్యప్రాప్తిని కూడా పొందుచున్నాడు.
11. భీమ - భాస - దృఢ న్యాయం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఇక మనం ఆ శంబరాసురుని కథకు వద్దాం. దామ వ్యాళ కటులు ఆ విధంగా నశించారు కదా! వారితోపాటే గొప్ప దైత్య సైన్యమంతా నశించింది. కొన్ని సంవత్సరములు అట్లాగే గడిచాయి. ఒక రోజు శంబరాసురుడు ఒక చోట సుఖాసీనుడై ఇట్లు యోచించసాగాడు.
66 “ఈ దామవ్యాళకటులను నా మాయాశక్తిని ఉపయోగించి సృష్టించాను. కాని, ఏం లాభం? వారు తమ మూర్ఖత్వముచే మిథ్యయగు అల్పాహంకారమును, దురహంకారమును ఆశ్రయించారే! ఆ మిథ్యా కల్పనయే వారి వినాశనమునకు దారి తీసింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ దేవతాధములను నేను లేని సమయంలో నిరోధించుట ఎట్లా? సరే, ఇంత కన్నా విలక్షణమైన ముగ్గురు సైన్యాధిపతులను ఈ మాటు సృష్టిస్తాను.
... వారు గొప్ప వివేకవంతులై ఉంటారు గాక! మిథ్యా విషయములైన అభిమానము, స్వోత్కర్ష (self praise), సన్మానాదులపట్ల కోరిక, గౌరవ మర్యాదల పట్ల లోభం వారికి ఏ మాత్రం ఉంచకుండు గాక! ... వారిలో తత్త్వజ్ఞానం వెల్లివిరియుటచే మిథ్యాభావరహితులై ఉంటారు!"... ఈ విధమైన విశేషణములకూడిన భావతరంగం సృజియించాడు.
Page:165
సముద్రంలో బుద్బుదములు ఏర్పడుతూ ఉంటాయి చూచావా? ఆ రీతిగా, అతని యొక్క బుద్ధి, మాయాకౌశలము... రెండూ ఏకమై భీముడు, భాసుడు, దృఢుడు అనే ముగ్గురు రాక్షసులను సృష్టించాయి. ఆ ముగ్గురు సర్వజ్ఞులు. తెలుసుకొనవలసిన పరబ్రహ్మము గురించి ఎరిగి ఉన్నారు. దేని పట్లా కూడా వారికి రాగము గాని, ద్వేషములుగాని లేవు. ప్రాప్తించిన కార్యమును నిర్వర్తించా లనే శుభ బుద్ధి మాత్రం వారియందు ఉన్నది. పవిత్రమైన, పాపరహితమైన అంతఃకరణముతో ఈ జగత్తు నంతా తృణప్రాయంగా చూస్తూ ఉండేవారు.
వారు దేవతలతో అనేక సంవత్సరములు పోరాడారు.
ఆ ముగ్గురు ఏ మాత్రం అహంకారమును పొందుటలేదు. “నాది ఇది”... మొదలైన భావనలతో కూడిన వాసనలు వారి అంతఃకరణమున ఉదయించి మరుక్షణం... "ఈ ప్రపంచం మిటి? మా స్వరూపమేమిటి?” - అను విచారణను ఆశ్రయించేవారు. అట్టి విచారణచే అసత్తుల్య మైన “నేను,” - “నాది” అను భావనలను వెడలగొట్టేవారు. దేవతల స్వోత్కర్షకారక వాక్యాలు, వస్తుజాల సంబంధమైన ప్రలోభాలు ఆ భీమ-భాస దృఢులను సమీపించలేకపోయాయి.
"ఈ దేహము అసత్యమే కదా!... మరి ఈ దేవతలు? ... వీరు అసత్యరూపులే...! మేము ఎవరము? ఈ జగత్తు యొక్క స్థితి ఏమిటి? ఇదంతా స్వప్నసదృశమే కదా! ఇందులో నిత్యమైన దేది? మార్పు చెందబోతున్నదేది? ఈ జీవుల సంబంధములు ఎట్టివి...?”
ఇట్టి విచారణ చేస్తూ ఉండేవారు. ఇక వారి హృదయంలో ఏమాత్రం భయాదులు ఉత్పన్నమయ్యేవి కావు.
ఈ శరీరము మిథ్యయే. కనుక ఇది లేనిదే. శుద్ధ చైతన్యము మాత్రమే సత్యము. అదియే ఆత్మ యొక్క స్థితి. మేముగాని, ఈ దేవతలుగాని, తదితరులుగాని యథార్థానికి లేము. ఇదంతా ఆత్మమయం! ....అని సుదృఢంగా నిశ్చయించుకొని, అప్పుడు యుద్ధానికి బయలుదేరేవారు. శ్రీరాముడు : ఆ భీమ భాస దృఢులు అవగాహన చమత్కారంగా ఉంది. వారి తత్పరత, బుద్ధి ఎట్టిది?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. వారు అహంకార వర్జితులు. శ్రీరాముడు : అనగా...?
శ్రీ వసిష్ఠ మహర్షి : వారికి "మేము ముసలితనమును, మృత్యువును పొందుతామేమో? ఈ దేహం, దేహ సంబంధాల గతి ఏమిటి?... అను వేసట లేదు. జడమగు దేహానికి, చైతన్యమే స్వరూపంగా గల తమకు... గల వాస్తవ అవాస్తవ సంబంధములేమిటో వారు గ్రహించి యున్నారు. భూత భవిష్యత్తుల గురించిన సర్వ ఆశ, ఆర్తులను ప్రక్కకునెట్టి, కేవలం ఎప్పటికప్పుడు ప్రాప్తించే వర్తమానము నందు చేయవలసియున్నట్టి కార్యములు గురించి మాత్రం శక్తిని, బుద్ధిని, యుక్తిని
Page:166
వినియోగించేవారు. మహాధీరతతో వర్తమానమును మాత్రం అనుసరించి వర్తించుచుండేవారు. నిత్యమూ ఆసక్తిరహితమైన బుద్ధి కలిగి ఉండేవారు. “మేము వీరిని వధిస్తున్నాము...” అనే అభిమానము గాని, అహంకారము గాని వారియందు లేదు. అందుచేత వారు వధింపని వారే అగుచున్నారు. 'వాసనలు' అనే జాలములో వారు చిక్కుకొనుటలేదు. 'సర్వదా నేను కృతకృత్యుడనే... అకర్తనే”... అను ఎరుక కలిగి ఉంటున్నారు. “ఇది ప్రభువుకు సంబంధించిన కార్యము కనుక నిర్ణయానిర్ణయములు మాకు సంబంధించినవి కావు. నియమము యొక్క పాలన కొరకై మేము ఇది తప్పక నిర్వర్తించవలసియున్నది. కనుక అట్లే ఆచరించెదము గాక”... అను అప్రమేయత్వముతో కూడిన భావనమాత్రం కలిగి ఉంటున్నారు. వీతరాగులై, ద్వేషరహితులై, నిరంతరం సమదృష్టి కలిగియుండి, 'యుద్ధము' అను కార్యక్రమములో తత్పరులై యున్నారు.
వారు దేవతా సైన్యమును అతి సులభంగా హరించివేశారు. భోక్త భోగ్యవస్తువును అనుభవించినట్లు వారు యుద్ధమును ప్రదర్శించారు. అప్పుడు దేవతా సైన్యం నిస్సహాయులై పరుగెత్తి క్షీరసాగరంలో శయనించియున్న శ్రీ మన్నారాయణుని శరణువేడారు. విష్ణువు వారికి శరణాగతి ప్రసాదించి, “బిడ్డలారా! ఆ భీమ-భాస-దృఢులు జయింపబడలేరు. అయితే మీరు వెళ్ళి శ్వేత ద్వీపంలో ప్రవేశించి సుఖంగా ఉంటూ ఉండండి. మరి కొంతకాలము అయిన తరువాత ఆ శంబారాసురుని విషయం నేను చూచుకుంటాను” అని చెప్పి వారిని పంపించివేశాడు. తగిన సమయంలో విష్ణుభగవానుడు శంబరాసురునిపై దండెత్తి తన చక్రాయుధంతో అతనిని సైన్య సమేతంగా మట్టుపెట్టాడు. సృష్టిలో నిర్వర్తిస్తున్న సానుకూల్యమగు పాత్రను దృష్టిలో పెట్టుకొని దేవతలను కాపాడాడు. నారాయణునిచే హతులైన శంబరాసురుడు విష్ణులోకం చేరాడు.
అప్పుడు జరిగిన ఘోర సంగ్రామంలో, ఆ భగవానుడు భీమ-భాస-దృఢులకు విదేహ కైవల్యం ప్రసాదించాడు. ఆ ముగ్గురు రాక్షసులు వాసనారహితులు కదా! అందుచేత వారికి “పునర్జన్మలు” అనే గతి లభించనేలేదు. శాంతమనస్కులై, కేవలం స్వస్వరూపమగు ఆత్మయందు
పరిఢవిల్లారు.
12. వాసనారాహిత్యము
తస్మాద్వాసనయా బద్ధం ముక్తం నిర్వాసనం మనః | రామ నిర్వాసనీభావ మాహరస్వ వివేకతః (సర్గ 34 శ్లో. 27)
చూచావా, రామచంద్రా! వాసనాసహితమగు మనస్సు “బద్ధము” అగుచున్నది. వాసనా రహితమగు మనస్సో,... ముక్తినే పొందుచున్నది. కనుక నీవు అవశ్యం 'వాసనారాహిత్యము'ను సంపాదించుకో.
సత్యవస్తువును బాగుగా విచారించుటచే వాసనలను నివర్తించగలవు.
Page:167
చమురు హరించిన తరువాత దీపం ప్రశమనం పొందుతుంది కదా! వాసనలు నశించాయా, ఇక, చిత్తమే ఉండదు. చిత్తములేని చోట సుఖం ఎక్కడ? దుఃఖం ఎక్కడ? ఆశ ఎక్కడ? మోహం ఎక్కడ?
సమ్యక్ దర్శనం, అవాస్తవ దర్శనం - ఇప్పుడిక్కడ దృశ్యకల్పన చేస్తున్నది ఎవరు?... పరిపూర్ణ మగు 'ఆత్మ' దృశ్యకల్పన చేస్తోందా?.... ఈ మాట కొంచెము కూడా సత్యము కాదు.
తాను పరిపూర్ణమై యుండి, దోషరహితమగు శుద్ధ చైతన్యం అయివుండి ఆయా కల్పనాదులు చేయుటచే వచ్చే ప్రయోజనమేమున్నది?
లేక మనస్సు చేస్తోందా? మనస్సు జడమైనదే కదా! దానిచే పనిచేయించాలంటే అందుకు మరొకటేదో ఉండి ఉండాలి. దానికి స్వతంత్రం ఎక్కడ ఉన్నది? లేదు.
కాబట్టి "దృశ్యాకరమగు భావన భ్రమచేతను, స్వస్వరూపము యొక్క విస్మరణ చేతను ఏర్పడుచున్నది"... అను సిద్ధాంతీకరింపబడుచున్నది. ఒకడు దీపపు కాంతికి ఎదురుగా నిలుచున్నాడనుకో.. కాంతి ప్రసరణమునకు తానే అడ్డుగా ఉండుటచే 'నీడ' అనునది ఏర్పడుతోంది కదా! స్వస్వరూపము యొక్క విస్మరణము చేతనే దృశ్యము ఘనీభూతమై ప్రాప్తించుచున్నది. అందుచేత - “నేను భావాతీతుడను" అను గ్రాహ్యమును కలిగియుండుము.
చిన్మాత్ర స్వరూపమగు పరమాత్మయే అంతటా గాంచుచుండుము. అప్పుడు... ఆ పరమాత్మ స్వరూపమే సర్వత్రా ఉన్నది. ఆ పరమాత్మ యొక్క కళయే నాయందు కూడా సర్వదా జ్ఞ్వాజ్వాల్య మానంగా వెలుగుచున్నది"... అని గ్రహిస్తావు. అప్పుడు 'సమ్యక్ దర్శనము' ప్రాప్తిస్తుంది. అదియే ముక్తి. అసమ్యక్ దర్శనమే బంధము.
వస్తుశూన్యమైన చిత్తము - ఈ జగత్తంతా ఆత్మయే అయి ఉండగా, ఇక ఎవడు ఎచట దేనిని భావిస్తాడు చెప్పు? అందుచేత సత్యవస్తువు విచారించు. అప్పుడు 'చిత్తము-వాసన'... అనబడు రెండూ కూడా వాటి శబ్దార్దములతో సహా విలీనమైపోతాయి. వాటి విలీనమే 'పరమపదము' అయి ఉన్నది. కనుక, త్రిపుటి,* అద్దాని భావనాసంస్కారము కూడా భ్రమపూర్వకమైన 'అవస్థ' నుండే ఏర్పడుచున్నాయని గ్రహించు.
వాసనతో కూడిన చిత్తమే ఈ జగత్తునందు స్థితి కలిగియుండి, సంచారం చేస్తోంది. లేదా, వాసనాగ్రస్థమగు చిత్తమునందు మాత్రమే ఈ జగత్తు అనబడునది ఉండిఉంటోంది. అట్టి చిత్తము మాత్రమే బద్ధమగుచున్నది. చిత్తము వాసనారహితమయినప్పుడు ‘ఇతడు జీవన్ముక్తుడు” అని అంటున్నాం.
చిత్తమే కుండ-గుడ్డ-నీవు-నేను మొదలైన సర్వ జగత్ పదార్థరూపాలుగా స్థితి పొందివుంది. ఒక బాలుడు చీకటిలో ఏదో ఆకారము చూచి... “ఇది దయ్యము కాదు కదా? అవును..
త్రిపుటి చూచువాడు చూడబడునుది చూచుట ద్రష్ట దృశ్యము - దర్శనము
Page:168
అనుమానం లేదు... ఇది దయ్యమే!” అని భయమును పొందటం వంటిదే ఈ జగత్తును పొందుట కూడా! "ఓయీ, బాలుడా, అది దయ్యం కాదు. ఈ రోజు ఉదయం నీవు ఆడుకుంటున్నప్పుడు చూచిన స్తంభము మాత్రమే అది. ఇక వెత చెందవలసిన పనేమున్నది?"... అని అతని తండ్రి బోధించినప్పుడు ఆ బాలుని యందు బేతాళభావము శమించిపోతోంది కదా! సద్గురువులగు పూర్ణాత్మజ్ఞానులు, “బిడ్డలారా! ఈ జగత్తు, ఇందలి సంఘటనలు, పదార్థములు ఇవన్నీ వాస్తవం కావు. సత్యస్వరూపులగు మిమ్ములను బంధింపగలిగేది ఇక్కడ ఏమి ఉన్నది? ఏదీ లేదు” అని ప్రకటిస్తున్నారు. అనేక దృష్టాంతముల సహాయంచే బోధిస్తున్నారు. అప్పుడీ జీవులలో కొందరు శ్రద్ధ, ఆసక్తులతో విని, మననము చేసి, పరీక్షించి సత్యమేమిటో అవగతం చేసుకుంటున్నారు. ఈ జగత్తును పదార్థరహిత దృష్టితో చూస్తున్నారు. అనగా, తమ చిత్తమును వస్తు శూన్యం చేస్తున్నారు. శేషించిన పదమపదమగు ఆత్మయందు నిశ్చలమై ఉంటున్నారు.
“దామ వ్యాళ కట న్యాయం"..... “భీమ భాస దృఢ న్యాయము" -
దేహాత్మభావముగా పరిణమించిన ఈ చిత్తమునకు ఇప్పుడే ఇక్కడే సరి అయిన చికిత్స చేయాలి. భీమ-భాస-దృఢులవలె దానిని ఆత్మాకారముగా పరిణమింపజేయాలి. ఆపై నీవు నిశ్చలుడవై, ఎట్టి వికారములు పొందక, చేయవలసి వచ్చుచున్న దానిని నిస్సంగబుద్ధితో, కర్తృత్వాభిమానరహితుడవై చేస్తూ ఉండు. నిర్లిప్తుడవై “ఇచ్చట కనిపిస్తున్న దేహములు సత్యము కాదు... ఈ దృశ్యము కూడా సత్యము కాదు... సర్వదా సర్వత్రా సర్వము నందు సర్వులయందు ఆత్మమాత్రమే సత్యము” అని భావించి నిశ్చింతుడవగుము. ఒకప్పుడు నా తండ్రి బ్రహ్మదేవుడు ఈ ఉభయన్యాయముల గురించి హెచ్చరిక చేసియున్నారు. అదంతా ఇప్పుడు నీ ముందు ఉంచాను.
“మీరంతా భీమ-భాస-దృఢ న్యాయమే అనుసరించండి" అని ప్రియ శిష్యుడవగు నిన్ను నిమిత్తంగా చేసుకుని... అమృతానందమే వాస్తవ స్వరూపముగా గల సర్వజనులకు... ప్రతిపాది స్తున్నాను. ఓ ప్రియజనులారా! మీరంతా మహాబుద్ధిమంతులు కావాలి సుమా! సర్వత్రా అసంసక్త బుద్ధి కలిగి వర్తించుటచే “దృఢశోభ” అనే ఐశ్వర్యం లభించగలదు. ఈ సంసారం సుఖ దుఃఖాలచే పరిపూర్ణమై, అనేక జన్మ-కర్మలను నిర్మించి జీవునికి ప్రసాదిస్తోంది. త్రివిధమైన తాపములు అనుభవింపజేస్తోంది.
ఇది సమూలంగా విచ్ఛిన్నం కావాలంటే 'నేను ఆత్మ స్వరూపుడను' అను అవిచ్ఛిన్నమగు సమరసభావన ఒక్కటే ఉపాయం.
Page:169
V. దామవ్యాళకటోపాఖ్యానం: విషయ విచారణ
(మనస్సు)
1. మనస్సు - ఉపశమనము
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! ఈ మనస్సును గమనిస్తున్నావా? ఇది అత్యంత ఉత్సాహంగా ఉరకలు వేస్తూ విషయములవైపుకే పరుగులు తీయుచున్నది. ఈ సంసారము జీవుని పట్ల విజృంభించటానికి కారణం మనస్సే సుమా! ఫలితమేమిటి? ఈ జీవుడు సమస్త దుఃఖములను, ఆపదలను నిరంతరం పొందుచున్నాడు.
ఇందుకు ఉపాయం మనోనిగ్రహమే అయివున్నది. ఇప్పుడు జ్ఞానము యొక్క సర్వస్వమును ఒక వాక్యంలో చెపుతాను... ఇది విని ధారణను ఆశ్రయించెదవు గాక!
"భోగేచ్ఛా మాత్రకోబంధః తత్యాగో మోక్ష ఉచ్యతే”
విషయభోగములందు ఇచ్చ ఏర్పడి ఉండుటయే బంధము. అట్టి ఇచ్ఛను పరిత్యజించుటయే మోక్షము.
అనేక పాఠములచే పని ఏమున్నది? ఈ ఒక్క విషయం ఆచరించు, చాలు. అది ఏమంటే... "ఈ ప్రపంచమున ఏ వస్తువు ప్రీతివంతముగా తోచుచూ ఉంటుందో, అట్టి విషయమును లేక వస్తువును విషమువలె, అగ్ని వలె చూడటం.”
మరల మరల విచారణ చేస్తే " ఈ విషయ భోగములు ప్రమాదమునకే, అనగా, దుఃఖము అను అంతిమ ప్రయోజనమునకే దారి తీస్తాయి” అనే విషయం తెలిసిరాగలదు. అందుచేత ముందుగానే అట్టి నిశ్చయమును కలిగియుండుము. భోగవాసనలు త్యజించివేయి. భోగవాసనా త్యాగపూర్వకంగా విషయములు సేవిస్తే, అప్పుడు అవి సుఖప్రదములే అవుతాయి.
ముళ్ళ తీగవిత్తు నుండి ముళ్ళ తీగపొద పుట్టుచున్నది కదా! వాసనాగ్రస్థమగు బుద్ధి నుండి 'రాగము’ మొదలైన అనేక దోషములు ఉత్పన్నం అవుతున్నాయి.
ఎవరి బుద్ధి అయితే అట్టి వాసనాజాలంతో తగులుకోకుండా, రాగ, ద్వేష రహితంగా, అచంచలంగా ఉంటున్నదో, అట్టి బుద్ధి మాత్రమే పరమశాంతిని పొందుతోంది. శాంతి మొదలైన శుభగుణసమన్వితము, దుఃఖ ఉద్రేక రహితము, శుభప్రదము అగు బుద్ధి జ్ఞానము వైపు, సమాధివైపు పయనించుచున్నది. ఫలితంగా 'మోక్షము' అనే ఫలమును ఉత్పన్నం చేస్తోంది.
Page:170
ఓ రామా! ఈ సర్వము ‘భావము’ నందే ఉదయించటం జరుగుతోంది సుమా! కనుక ఉత్తమ భావనానుసంధానం చేతనే మనస్సు ప్రశాంతత పొందుచున్నది. ఉత్తమ భావములు ఉన్న చోట 'అజ్ఞానం' అనే దట్టమైన మేఘము క్రమంగా నశించగలదు. సౌజన్యము శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెందగలదు. వివేకము సూర్యతేజమువలె ప్రకాశించగలదు. అట్టివాడు ఆత్మవస్తువును పొందుతాడు. ఆత్మ లాభముచే హృదయము నందు ధైర్యము, ప్రశాంతత, పరమానందము వృద్ధి పొందుచున్నాయి. ఆ జీవుడు కృతార్థుడగుచున్నాడు.
ఇట్టి మార్గంలో అత్యంత శోభను కలుగజేయగలిగేది సత్సాంగత్యము. వివేకము వృద్ధి అగుచుండగా ఏకాగ్రత అనుదాని నుండి 'సచ్చిదానందము' అనే శ్రేష్ఠరసము ప్రవహిస్తూ ఉంటుంది. ఆత్మను గురించిన అవగాహన ధృడపడుచుండగా, ఇక అట్టి వాని మనస్సు నిర్ద్వంద్వం, నిష్కామం, ఉపద్రవరహితం అగుచున్నది. క్రమంగా తన చపలత్వమును త్యజిస్తోంది. శోక మోహ భయ వర్జితము అవుతోంది. సంశయరహితమగుచున్నది.
ఇచ్ఛా దోషరాహిత్యము - ఓ రాఘవా! "నేను విషయాలను, వైచిత్ర్యములను దర్శించాలి... పొందాలి”... అను ఇచ్ఛను ఈ మనస్సు ఎల్లప్పుడూ కలిగి ఉంటోంది. “నేను ఏదో పొందాలి...” అను భావోద్వేగమును నీ మనస్సు నుండి తొలగించివేయి. అప్పుడు ఈ మోహ కల్పనాజాలమంతా దానంతట అదే తొలగిపోతుంది. ఈ మనస్సు నిర్లిప్తము, ఆశావర్జితముగా చేయాలి. 'ప్రవృత్తి' అనుదాని పట్ల ప్రమేయరాహిత్యము, సంసర్గరాహిత్యము అలవాటు చేయాలి. మానసిక చింతలను “పూర్ణాత్మా హమ్” భావనచే క్రమక్రమంగా జయించివేయాలి. ఈ మనస్సు శోకరహితమై, స్వచ్ఛమై విషయములపట్ల ఆసక్తులను వదలినదై ప్రకాశించునుగాక!
ఎప్పుడైతే ఈ 'మనస్సు’ అనునది పలువిధాలైన మనోరథములతో, తృష్ణతో, సంశయాలతో నిండి ఉండటం జరుగుతుందో, ఇక ఆ జీవుని “నేను ఈ దేహమునకు సంబంధించినవాడను” అను రూపమున ఉండే “స్థూలదేహభావము” అనే దయ్యము పట్టుకుంటుంది.
ఈ మనస్సు నుండి స్థూలత్వమును పారద్రోలగలిగావా... ఇక అది ఈశ్వర స్వరూపము అగుచున్నది. అప్పుడు "ప్రత్యగాత్మత్వము” అనబడు జీవన్ముక్తిని సాధించిపెట్టగలదు. అందుచేత ఈ మనస్సును స్వసామర్థ్యము - - నిగ్రహము నందు నియమించు. అప్పుడది తనకు ఏ మార్గము దుఃఖభరితమో, ఏ మార్గము అనుసరణీయమో, ఏది 'స్వస్వరూపానందము'ను ప్రసాదించగలదో గ్రహిస్తుంది. క్రమంగా "సాధ్యాసాధ్యములు, స్వపరములు” మొదలగు వికల్పములను త్యజించు చున్నది. అంటే ఆ తరువాత కల్పితమైనట్టి తన రూపాన్ని కూడా తృణప్రాయంగా త్యజించివేస్తుంది. ఈ మనస్సు నశించేది ఎట్లా? అసలు, మనోనాశనము అనగా ఏమి?
మనసో2భ్యుదయో నాశో మనోనాశోమహోదయః I
జ్ఞ మనోనాశమభ్యేతి మనోజ్ఞన్య వివర్ధతీ ॥ (సర్గ 35, శ్లో 18)
మనస్సు విషయాదులందు ప్రవర్తించకుండా ఉన్నదా, వినాశనము పొందుచున్నట్లే. మనో
Page:171
నాశనమే (మనస్సు యొక్క దృశ్య విషయ రాహిత్యమే) ఆత్మలాభము యొక్క ఉదయము సుమా! బ్రహజ్ఞాని యొక్క మనస్సు క్రమంగా, పూర్తిగా వినాశనము పొందుచున్నది. (లేక, దృశ్య విషయములన్నిటినీ ఆత్మచమత్కారంగా దర్శిస్తోంది).
అజ్ఞాని యొక్క మనస్సో, సర్వదా వృద్ధియే చెందుతోంది. నాయనా! రామా! ఈ జగచ్చక్రమంతా మనోమాత్రమే అయివున్నది. ఈ పర్వతములు - - దేవతలు -
శత్రువులు - మిత్రులు - ఇదంతా మనస్సే అయివున్నది.
వికల్పములచే దృష్టి-అవగాహన మలినము కాగా, అప్పుడు ఆ చిద్వస్తువుకు సంభవిస్తున్న స్వస్వరూపమునకు సంబంధించిన విస్మరణమే మనస్సు.
ఈ జీవుని సంసారములోకి నెట్టివేయుచున్నట్టి మనస్సే వాసన. వాసనావశం చేత మనస్సులోకి విషయములు ప్రవేశిస్తున్నాయి. అప్పుడు ఆ సమయంలో చిద్వస్తువు పరిచ్ఛిన్నము వలె తోచుచున్నది. వ్యవహారయోగ్యత - సంసర్గము వికల్పములచే మాలిన్యము పొందుచున్నది. అట్టి దోషముతో కూడుకున్న భావన పొందుచున్న బ్రహ్మమే ఈ జీవుడు. ఈ జీవుడు విషయము లందు పడి, వాటిని చిరకాలము అభ్యసించుటచే అభిమానము పొందుచున్నాడు. అజ్ఞత్వము (లేక) స్వస్వరూపవిస్మరణను పొందుచున్నాడు. వికల్పములచే మోహితుడై, సారభూతమగు ఆత్మ సుఖమును పోగొట్టుకొని నిస్సారభూతుడగుచున్నాడు. అప్పుడాతని బాహ్యవిషయాను సంధాన రూపమైనట్టి వ్యతిరిక్త చింతనలే మనస్సు రూపమున కల్పన గావించబడుచున్నాయి.
ఆత్మ యొక్క రూపమేమిటి?- శుద్దమగు ఆత్మ జీవ రూపము కాదు. ఈ శరీర రూపము కూడా కాదు. రక్తమాంసాది రూపము కానే కాదు.
ఈ శరీరాదులన్నీ పరిచ్ఛిన్నములై, జడములై ఉన్నాయి కదా! ఆత్మ సర్వదా ఆకాశము వలె నిర్లిప్తమై, అనిర్వచనీయమై ఉంటోంది. అరటి బోదెను ఛేదించిన అక్కడ దళములు గాక ఇంకేమి ఉంటాయి? ఈ దేహమును విచ్ఛిత్తి చేసినప్పుడు కూడా ఇందు 'రక్తము-మాంసము-బొమికలు” తప్పితే వేరే ఏమీ లభించవు. అట్లాగే, వాస్తవానికి... ఈ భౌతిక దేహము 'జీవుడు’ కాదు.
మనస్సే జీవుడు...! -
మనో జీవో నరం విద్ధి తదేవాకారమాగతమ్ | ఆత్మనాత్మానమాదత్తే స్వవికల్పాత్మకల్పితమ్ ॥ (శో 25, సర్గ 35)
మనస్సే ఆకారం పొందుతోంది. అదే వికల్పములన్నింటినీ పొందుతోంది. అదే మరొకప్పుడు మరల తన యొక్క ఆత్మను తానే గ్రహిస్తోంది. ఆత్మార్పణ యజ్ఞకార్యం నిర్వర్తిస్తోంది.
పట్టుపురుగు తన జాలమును తానే నిర్మించుకుంటూ __ఉంటుంది చూచావా? స్వవాసనావశం చేత ఈ జీవుడు తన వికల్పములచే స్వీయబంధము కొరకై జాలమును నిర్మించు
Page:172
కుంటున్నాడు. భ్రమమయమగు ఈ మనస్సు ఒక దేహమును త్యజించిన తరువాత మరల వేరైన దేశకాలములందు వేరైన దేహమును ధరించుచున్నది. మనస్సు ఏఏ వాసనలు కలిగి ఉంటుందో... వాటిని అనుసరించే, తదనురూపంగానే శరీరములు ఉత్పన్నములగుచున్నాయి. ఒకడు నిదురిస్తున్నాడనుకో... అతడు తన చిత్తములో ఏమేమి కలిగి ఉంటాడో దానిని అనుసరించే స్వప్నమును పొందటం జరుగుతుంది కదా! ఏ విత్తునాటితే, అట్టి చెట్టే వస్తుంది. ముందుముందు వచ్చే దేహములు కూడా అట్లే ప్రాప్తిస్తున్నాయి. ఈ వర్తమాన శరీరము కూడా అట్టిదే.
ఉత్తమ వాసనలు గల చిత్తము ఉత్తరోత్తర మహత్తరరూపమునే పొందబోవుచున్నది. నీచ వాసనలు గల చిత్తము ముందు ముందు నీచ జన్మల యొక్క అనుభవమును పొందబోవుచున్నది.
అందుచేత జీవుడు ఎప్పటికప్పుడు తన సంకల్పాలను, ఆసక్తులను పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. తన మనస్సు యొక్క దోషములేమిటో గమనించుకుంటూ ఉండాలి. శరీరము యొక్క ఆరోగ్యం ఎంతగా అవసరమో, అంతకన్నా ఎక్కువగా ముందుగా ఈ మనస్సుకు సరిఅయిన చికిత్స చేసుకోవాలి. అయ్యో! సృష్టిలో ప్రవేశించియున్న అనేకమంది జీవులు తమ మనస్సుకొరకై చికిత్సను ఆశ్రయించుటలేదు. పైగా ప్రలోభాదులకే ఆశ్రయం ఇస్తున్నారు!
అతి స్వల్పవిషయములైనట్టి స్త్రీ-ధనం-ఇంద్రియానుభవాలు, పేరు ప్రతిష్ఠలు మొదలైన స్వల్పకాల పరిమిత వ్యవహారములకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఆత్మ జ్ఞాన విషయంలో అజాగరూకులై ఉంటున్నారు.
"నేను దేనికి సంబంధించినవాడను? దేనికి సంబంధించని వాడను? ఏది అయి ఉన్నాను? ఏది కాకయే ఉన్నాను?...” అని వారు సద్విమర్శ చేయరేం? పిశాచముల గురించి వాసన గల వాడు రాత్రి స్వప్నంలో పిశాచములను చూస్తాడు కదా! క్షుద్రవాసనాయుక్తమగు ఈ చిత్తము నీచత్వమునే పొందుచున్నది. ఒక సరోవరంలోని అతి కాలుష్యముగల జలంలో దుర్వాసనలు ఉండకుండా ఉంటాయా? అతి నిర్మలమగు జలంలో అరుచి ఉంటుందా? మనస్సు మిక్కిలి మలిన మైతే... అది చేసే పనులు వాటి ప్రయోజనాలు దోషపూరితంగానూ, దుఃఖకరంగానూ ఉంటాయి. మనస్సు నైష్కర్మ్యముచే, వాసనారాహిత్యముచే, సమగ్రమగు సమరసభావనచే నిర్మలంగా ఉన్నదనుకో... అప్పుడు దాని కార్యములు, ప్రయోజనములు శుభకరంగానే ఉంటాయి. శ్రీరాముడు: తండ్రీ! ఈ జీవుడు దోషమును గ్రహించి కూడా పూర్వ సంస్కార బలంచేత వాసన, దుఃఖాదులు బలవత్తరముగా పొందటం జరుగుతోంది. మరటువంటప్పుడు అతని గతి ఏమిటి? మీరు చెప్పిన ఔన్నత్యము సుస్థిరీకరించుకోవటం ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి: చంద్రుడు క్షయిస్తున్నా “నేను మరల పూర్ణుడను కాగలను" అనే ఆశ త్యజించడు కదా! నిర్మల చిత్తుడైనవాడు దారిద్య్రము మొదలైనవాటిచే పీడింపబడుచున్నప్పటికీ శాంతి, మనః సమాధానరూపకమగు ఉత్తమగతిని విడచిపెట్టడు.
బంధమెవరికి? ముక్తి ఎవరికి?
Page:173
యథార్థానికి ఇక్కడ బంధముగాని, మోక్షముగాని, లేవు. బంధ, అబంధములయొక్క
భావము లేదు. ఇంద్రజాలంలో జరుగుతుంది చూచావా? అట్లాగే మాయయే మిథ్యారూపమున ఉదయించి, లయించుచున్నది.
సర్వైవ బ్రహ్మసత్తేయ మిత్యేషా పరమార్థతా
పరిస్ఫురతి నిఃసారః సంసారో యమసన్మయః (శ్లో 37, సర్గ 35)
“అంతయు బ్రహ్మము”... అనునదే పరమార్థ సత్యము. ఇక ఈ జగత్తంటావా, ఇది నిస్సారము, అసన్మయము అయి స్ఫురిస్తుంది.
“నేను అంతము (లేక) నాశనము కలవాడను, అల్పుడను” అనే దుష్టభావముచే కలుగు చున్న వికల్పములను ఈ జీవుడు త్యజించాలి. అట్టి స్వల్పత్వము తొలగిపోవాలంటే ఆత్మ భావించ బడాలి. "నేను అనంతుడను. శాశ్వతుడను, అఖండుడను, సర్వకల్పనలు నావే.. అంతే కానీ అవి నేను కాదు" అను రూపముగల నిశ్చయముచే స్వల్పత్వము తనంతటతానే నశించుచున్నది.
ఓయి! జీవుడా! సర్వవ్యాపకము, నిర్మలము, ఆత్మ స్వరూపము అయి ఉన్న నీవు “నేను దేహ మాత్రుడను” అని అనుకొనుటచేతనే అన్ని దుఃఖములు వచ్చి పడుచున్నాయి. ఈ ప్రపంచమంతా స్వవికల్పకల్పితము మాత్రమే సుమా! నీ స్వరూపమునకు నీవే స్వల్పత్వము ఆపాదించుటచే, అట్టి భావనయే సర్వవిధ బంధముగా పరిణమించుచున్నదని గ్రహించు.
వాస్తవానికి “నీవు-నేను-జగత్తు”... మొదలైనదంతా కూడా బంధ మోక్ష రహితము, ద్వైత అద్వైతా వర్జితము అగు బ్రహ్మసత్తయే అయివున్నది. ఇది ఏమాత్రం సందేహింప అవసరం లేని పరమార్థసత్యము. అయితే ఈ జీవుడు ఆ పరమార్థసత్యమును దర్శించుటలేదు. కొందరు ధీరులు, నిర్మలహృదయులు మాత్రం ఈ దృశ్య రూపంతో కూడిన తమ యొక్క మనోబుద్ది అహంకారాలను పరిశుద్ధం చేసుకుంటున్నారు. ఆయా ప్రయత్నములచే ఆసక్తిరహితులు, అమనస్కులు అగుచున్నారు. అట్టివారు ఈ అధికారదేహముతోనే బ్రహ్మమును దర్శించగలుగు చున్నారు.
తెల్లటి గుడ్డ ఏ రంగునైనా సహజంగా, చక్కగా స్వీకరించగలుగుతుంది కదా!
సమత్వము, సమాధి అభ్యసించుచూరాగా, అప్పుడు 'ధర్మవృద్ధి' అనే నిర్మలజలంలో పరిశుభ్రం కావించబడిన మనస్సు బ్రహ్మసంబంధమగు దృష్టిని అతిశీఘ్రంగా గ్రహించుచున్నది.
ఆత్మను భావించుచూ బుద్ధిని అధిగమించాలి - "అంతా ఆత్మయే అయివున్నది”... అను సర్వాత్మకమగు భావనచే "ఇది త్యజించాలి... అది గ్రహించాలి...” అను పట్టుదలతో కూడిన బుద్ధి శమిస్తోంది. ఆపై నీవు ఈ బంధ మోక్షముల దృష్టి కూడా పూర్తిగా పరిత్యజించవచ్చు. అట్టి స్థితిలో ఒక స్వచ్ఛమైన స్ఫటికములో ప్రతిబింబించే దృశ్యములాగా, నీయందు ఈ జగత్తు ప్రతిభాసమాత్రంగా (Merely like a refraction) అనుభమవుతూ ఉంటుంది. శాస్త్రశ్రవణాదులచే, వైరాగ్యపూర్వకమగు అభ్యాసముచే శుద్ధమొనర్చబడిన బుద్ధిగలవాడు ఈ శరీరమును, శరీరముతో
Page:174
ఏర్పడుచున్న సంబంధ బాంధవ్యములను, ఈ జగత్తును ఆ విధంగా ప్రతిభాసమాత్రంగా దర్శించగలుగున్నాడు.
చమత్కారం ఏమిటంటే... ఈ మనస్సు పదార్థములతో తదాత్మ్యము పొంది ఏకరూపము పొందుచున్నప్పుడు అట్టి సమయంలో ఆత్మతో సారూప్యము (Oneness) పొందలేకపోతోంది. శ్రీరాముడు: మీరు చెప్పునది వాస్తవమే. మరి మేము ఎప్పటికైనా ఆత్మతో ఏకరూపత్వము పొందగలమంటారా? మేము ఈ సాంసారిక దృష్టులను వదిలించుకునేది ఎట్లా చెప్పండి? స్ఫటికంలో దృశ్యంవలె, ఈ దృశ్యమును స్వస్వరూపాంతర్గతంగా సందర్శించేది ఎట్లా?
శ్రీ వసిష్ఠ మహర్షి: నాయనా! రామా! ఆధ్యాత్మ క్షేత్రంలో నిరాశ నిస్పృహలకు స్థానం లేదు. “అసత్యదృష్టిని నేను ప్రయత్నబలంచే తప్పక జయించగలను”... అను ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఈ మనస్సు బాహ్యాభ్యంతర దృష్టులన్నింటినీ జయించి, ఆత్మయందు లీనమైనదా... ఇక సర్వోత్కృష్టమగు బ్రహ్మపదమును పొందినట్లే సుమా! అట్లు పొందినవారు అనేకులు ఉన్నారు. కొంచెం వివేకముతో ప్రయత్నం చేస్తూ ఉంటే అది ప్రతి ఒక్కరికి తప్పక సుసాధ్యమే.
2. మనస్సు యొక్క రూప విశ్లేషణము
శ్రీ వసిష్ఠ మహర్షి: ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ దృశ్యమంతా మిథ్యయే అయివున్నది. అట్టి దృశ్య మయమవటమే మనస్సు యొక్క రూపం. అంతేగాని, మనస్సుకు వేరుగా రూపమంటూ ఏదీ లేదు.
తర్క శాస్త్రమును అనుసరించి... ఏదైనా మొట్టమొదట చిట్టచివరా 'అసత్తే’ అయి ఉంటుందనుకో... అది మధ్యలోకూడా అసత్తే. ఈ సిద్ధాంతము ననుసరించి మనస్సు ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకుండా పోవుచున్నది. కనుక, మనస్సు అసద్రూపమే అయివున్నది. మనస్సును అసద్రూపంగా ఎరుగనివానికి తనయందే దుఃఖములన్నీ ప్రాప్తిస్తూ ఉంటాయి సుమా!
మనస్సు ఒకప్పుడు ఉండటం, మరొకప్పుడు లేకపోవటం.... అనుదాని దృష్టాంతం! నిద్రా సమయంలో, పరమోత్కృష్ట మోక్షస్థితిలో ఈ జీవుడు మనోరాహిత్యమును పొందుచున్నాడు కదా! కనుక మనస్సు ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు ఉండనిదే అగుచున్నది.
అసద్రూపం - స్వతహాగా అవాస్తవమై, భ్రమ ఉన్నప్పుడు ప్రాప్తించేదేదైతే ఉన్నదో, అది “అసద్రూపము” అను శబ్దముచే చెప్పబడుతోంది.
“ఈ జగత్తంతా ఆత్మస్వరూపమే” అనే ఎరుక (లేక) భావన కలిగియుండకపోతే ఈ దృశ్యము దుఃఖప్రదమే అవుతుంది.
“అంతయు ఆత్మయే”... అను జ్ఞానముచే భోగ మోక్షములు రెండూ పొందబడగలవు.
Page:175
“జలము వేరు... ఈ తరంగములు వేరు" అనునట్టి వాసనతో కూడిన బుద్ధితో అజ్ఞానము
“జలతరంగములు రెండూ కూడా ఒక్కటే”... అనునట్టి ఏకత్వబుద్ధియే జ్ఞానము. ఒక నీటి బొట్టు
- నీరు వేరువేరు ఎట్లా అవుతాయి? నీరు... నీటి బొట్లలో, నీటిబొట్టు... నీటిలో ఉండియే
-
ఉన్నాయి.
శ్రీ రాముడు: మరి ఈ హేయము (త్యజించవలసినది ఏమిటి? ఉపాదేయము (స్వీకరించవలసినది) ఏమిటి? ఈ నానాత్వమంతా ఎట్లా ఏర్పడుచున్నది.
శ్రీ వసిష్ఠమహర్షి: స్వగతమైన అవగాహన దృష్టిదోషముచే ప్రాప్తిస్తున్న ఈ నానాత్వమంతా స్వతహాగా అసద్రూపమే. అనగా స్వయముగా లేదు. కాని ఉన్నట్లు కనబడుచున్నది. జననమరణ రూపమున గల దుఃఖమంతా భావనను అనుసరించే ప్రాప్తిస్తున్నాయి. ఈ హేయ ఉపాధేయములు అభావించబడినాయనుకో... అప్పుడు శేషించునది ఏమిటి?.... అనంతరూపమగు ఆత్మయే.
‘మనస్సు' అనబడునది సంకల్పములచే కల్పించబడినది మాత్రమే. కాబట్టి అసత్తుగాక మరింకేమి? 'అసత్తు' అయిన వస్తువు నశించుటచే ఎవరికి ఏమి నష్టం చెప్పు? స్వప్నంలో కనబడుచున్న పదిమంది మరణిస్తే ఎవరు దేనిని కోల్పోవుచున్నారు?
నీకు ఇప్పుడే పరిచయం అయిన ఒకడు ఉన్నాడనుకో... అతడు నిన్ను, నీవు అతనిని ఉదాసీనంగా, రాగద్వేషరహితంగా చూచుకుంటూ ఉంటారు కదా! అట్లాగే పదార్థ రూపం ఎరిగిన వాడు ఈ పాంచభౌతిక దేహమును అట్టి దేహంతో కల్పించబడుచున్న సంబంధ బాంధవ్యములను అత్యంత ఉదాసీనంగా చూస్తూ ఉంటాడు. ఇక అది ఎరుగనివాడో ఎదురుగా ఉన్నదానిని సత్యము గాను, నిత్యము గాను, ప్రియమైనదాని గాను... మొదలైన ఆయా కల్పనలతో చూస్తూ, తాదాత్మ్యం చెందుచున్నాడు.
ద్రష్ట దృశ్యము
ద్రష్టగాని, దృశ్యముగాని లేనట్టి 'దృక్' స్వరూపము
శ్రీరాముడు: స్వామి! నా యొక్క ( ఈ జీవుని యొక్క వాస్తవస్వరూపం అవగతమగుటకు దృష్టాంతపూర్వకమైన విశేషములు చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి
తదనేది శివం జ్ఞానం యన్మధ్యం ద్రష్టృదృశ్యయోః
తస్మిన్సత్యే మనః శాస్త్రం పాంసుర్వాయుక్షయే యథా॥ (సర్గ 35, శ్లో 55)
“దృష్ట... దృశ్యము”ల మధ్యగల 'దృక్' రూపమే నీ స్వరూపము అయివున్నది... అని గ్రహించు. ఆ దృక్ూపము అనాది, అనంతమగు శివస్వరూపము. అదియే నిరతిశయానంద
Page:176
కరమగు ఆత్మయొక్క జ్ఞాన స్వరూపం కూడా. వాయువు శమిస్తే ధూళి కూడా శమించినట్లు, ప్రయత్నశీలుడు అగుచున్న వాని యొక్క మనస్సు అధిష్ఠానమగు ఆత్మయందే శమించుచున్నది.
మనస్సు శమించుటచే శరీరాలు కూడా శాంతించుచున్నాయి. అప్పుడు అవిద్యావరణం (లేక) సంసారం అనే మంచు కురియదు. వాసనలు శమించగానే స్వస్వరూపమునందు మనస్సు యొక్క నిలకడ ప్రాప్తిస్తోంది.
అజ్ఞానమే హృదయమునందు 'భయము' అనే మకిలిని పుట్టిస్తోంది. అజ్ఞానము తొలగితే తృష్ణ కూడా తొలగుచున్నది. రాగం మొదలైనవన్నీ సన్నగిల్లుచున్నాయి. ఇంద్రియభావన వెనుకకు మరలుతోంది. మోహం త్యజించబడగా నీవు జాజ్వల్యమానుడవై వెలుగుతూ ఉంటావు. అప్పుడు, దేహమునకు సంబంధించిన క్షుద్రభావములు ఊసుకూడా ఉండదు. సంకల్పములు ఉండవు. నీ యందే నీకు ‘ఆత్మస్వరూపము' అను ఆకాశము ప్రత్యక్షముగా స్ఫురించగలదు. "అట్టి మహోదయ సంపన్నుడవగు నీ యొక్క స్వచ్ఛ ప్రకాశమును వర్ణించుటకు వాక్యములు చాలవు”.
తృష్ణ త్యజించినట్టివాని హృదయము విమోహమై, వివేకయుక్తమై, పాశ వర్జితమై, తమోగుణ రజోగుణ రహితమై శోభిస్తోంది. చిత్తము పూర్ణవిమలత్వము పొందుతోంది. “ఆత్మజ్ఞానము” అను ఫలమును పొందినట్టి ఆ వివేకి తన సంచారమనే ఈ పృథ్విని పవిత్రం చేస్తున్నాడు. అహంకార రహితమగు అట్టి వానికి ఈ బ్రహ్మాండమంతా ఆత్మప్రకాశయుక్తంగాను, స్వచ్ఛ శీతల ఛాయా సహితంగాను కనబడుతోంది. కనుక నీ యొక్క బుద్ధి విస్తరిల్లుటకొరకు, మనోనిర్మలత్వము కొరకు “కర్మలు నిర్వర్తించుట” అను యజ్ఞమును నిర్వర్తించు.
ఓ రామా! మలినము, చంచలము అయిన ‘అహంకారము'ను హృదయము నుండి పార ద్రోలివేయి. మరుక్షణం అపరిచ్ఛిన్నుడు, సర్వవ్యాపకుడు, సర్వేశుడు, వాసనారహితుడు, శాంత చిత్తుడు అగు ఆ ఆత్మదేవుడు నీ హృదయమున స్వయముగా ప్రభువై విరాజిల్లుతాడు.
'తత్త్వవిచారణ’చే 'ఆత్మ' అను జ్యోతి ప్రాప్తించగా, సమస్తదోషములు తొలగిపోతాయి. అట్టి ఆత్మ స్వరూపడగు జీవుడు ఈ జననమరణములలో, ఐహిక పారలౌకిక స్థితులలో ఉద్వేగరహితుడై ఉంటున్నాడు. అతడు స్వదేహనగరంలో తాపత్రయరహితుడై విలాసంగా విహరిస్తున్నాడు.
3. 'చిత్' ఆదిత్యుడు - స్వరూప స్వభావములు
శ్రీరాముడు: మహాత్మా! విశ్వమునకు అతీతమైనట్టి ఆ చిదాత్మయందు ఈ ప్రపంచమంతా ఎట్లు స్థితిని పొందియున్నది? నా జ్ఞానాభివృద్ధి కొరకై, ఈ విషయములో, "జ్ఞానుల అవగాహన” ఏమిటో విశదపరచండి.
శ్రీ వసిష్ఠ మహర్షి: ప్రశాంతముగా ఉన్న సముద్రజలంలోనే, తరువాత, తరువాత.... ఉత్పన్నం కాబోయే తరంగాలు, వాటివాటి ఆకారాదులు అభేదపూర్వకంగా ఉన్నాయి కదా! అదే విధంగా ఈ సృష్టి కూడా ఇట్టి సృష్టికి పూర్వము చిదాత్మయందే ఉండి ఉన్నది.
Page:177
ఆకాశము అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ, తన యొక్క 'సూక్ష్మత్వము' కారణంగా అది కంటికి కనబడకయే ఉంటోంది. అతి సూక్ష్మమగు ఆత్మ కూడా 'సర్వవ్యాపి' అయినప్పటికీ మనస్సుకు అగోచరంగా ఉంటోంది.
నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో ఒక స్పటికశిల ఉన్నదనుకో... ఆ శిలయందు ఎదురుగా దూరంగా ఉన్నట్టి దృశ్యము ప్రతిబింబిస్తోంది... అందులో ప్రతిబింబించేదంతా సత్తుగాని అసత్తు గాని (ఉన్నది లేక లేనిది) కాకుండానే అనిర్వచనీయమైయున్నది కదా! ఆ స్ఫటికంలో దృశ్యం లాగానే ఆత్మయందు ఈ సృష్టి ఉన్నది.
ఆకాశమునందు ఆ మేఘములను చూడు... మేఘములు ఉన్నదెక్కడ? ఆకాశమునందే కదా! అట్లు మేఘములకు ఆకాశమే ఆధారభూతమైనప్పటికీ, ఆకాశము మేఘములచే స్పృశించ బడుతోందా? లేదు. ఆ పరాచైతన్యం తనయందున్న ఈ సృష్టులన్నిటికీ ఆధారభూతమై ఉంటోంది. కాని ఈ సృష్టులచే అది ఏమాత్రం స్పృశించబడుటలేదు.
చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవి తటాకజలంలో ప్రతిబింబరూపంగా అగుపిస్తూంటాయి కదా! ఈ శరీరమునందు ఉన్నట్టి ఆత్మ ప్రతిబింబరూపమున ఈ రీతిగా వ్యక్తమగుచూ ఉంటుంది.
చిదాత్మ సర్వసంజ్ఞలకు, సంకల్పములకు సంబంధించినది. నాశరహితమైనది. "జీవించుట, విషయాలు” మొదలైన సంజ్ఞలన్నీ చిదాత్మయందే కల్పించబడుచున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, వేదజ్ఞులు ఈ ఆత్మ గురించి చెప్పేటప్పుడు - - అది ఆకాశముకంటే అత్యంత స్వచ్ఛమైనది.. నిష్కళంకమైనది... కళాసహితము, కళారహితము కూడా”... అని చెప్పుచున్నారు. అయినా కూడా, వారు ఆత్మను జగత్తుకు అభిన్నమైనదానిగా వర్ణించటం జరుగుతోంది.
సముద్రంలో తరంగాలను చూడు. వేరు వేరు తరంగాలు వేరువేరుగా గోచరిస్తూ ఉంటాయి. కాని అవన్నీ జలమే కదా! జలము కంటే అధికంగా తరంగములలో ఇంకేమున్నది? 'చైతన్యము అనే మహాసముద్రంలో 'నీది, నాది' అను రూపమున అనేకత్వము స్ఫురించవచ్చు గాక! అయిన ప్పటికీ చైతన్యమునకు భిన్నంగా ఈ ప్రపంచమున ఏదీ ప్రకాశించుటలేదు. ఏదీ లేదు కూడా...! ఈ చైతన్యము ఏదైనా విషయమును అనుభవించుచున్నప్పుడు, అది వాస్తవానికి తన యందే, తన రూపమునే అట్లు అనుభవించుట జరుగుచున్నది.
చైతన్యము సర్వదా ఆత్మ స్వరూపముననే స్థితి కలిగి ఉంటున్నది. అజ్ఞులు మాత్రమే "ఈ జగత్తు ఆత్మకంటే వేరు” అను అభిప్రాయమును కలిగి ఉంటున్నారు.
జ్ఞానుల దృష్టికి... మిథ్యా స్వభావముగల ప్రపంచము ద్రష్టయొక్క కల్పనయే అయి వున్నది. “కల్పన” అనునది ఆ కల్పనచేయువాని చమత్కార వ్యవహారమే అయినట్లు, ఈజగత్తు ఆత్మకు అభిన్నమై, ఆత్మయొక్క చమత్కార వ్యవహారమై వెలయుచున్నది.
Page:178
- చైతన్యము సర్వదా కేవల ప్రకాశస్వరూపమైనది.
- చైతన్యము స్వభావానుసారమే సూర్య, చంద్రులను ప్రకాశింపజేస్తోంది. స్వభావంగానే ఈ
జీవుల జన్మ మరణాది కర్మలకు కారణమై ఒప్పుచున్నది. - ఇది ఎప్పుడూ నశించదు. ఉత్పన్నమవదు.
లేవదు. కూర్చోదు. వచ్చుట లేదు. పోవుటలేదు.
దానికి ‘ఈ స్థానము, ఆ స్థానము' అనునది ఉండదు. - అది సర్వత్రా వ్యాపించి, ఏకరూపమై యున్నది.
నిత్యనిర్మలమగు చైతన్యము (లేక ఆత్మ, లేక బ్రహ్మము) సర్వదా తన స్వరూపముననే వ్యవస్థితమైయున్నది...! ఉదాహరణకు జీవుడు ఎట్టి భావాదులను పొందుచున్నప్పటికీ తనను తాను త్యజిస్తున్నాడా? లేదు కదా! ఈ చైతన్యము తన సత్యస్వరూపము దృష్ట్యా మార్పు చేర్పులు లేకయే ఉంటోంది. కాని, ఒకడు త్రాడునందు పామును చూస్తున్నట్లు ఈ ప్రపంచరూపమున వివర్తభాగము మాత్రం పొందుచున్నది. అగ్ని 'తేజస్సు' రూపమున జలం 'ప్రవాహం' రూపమున స్ఫురిస్తోంది చూచావా? అట్లే, చైతన్యము సృష్టి విలాసరూపమున స్ఫురిస్తోంది.
చిదాత్మ 'సృష్టి రచన' అను స్వభావముతో కూడుకొనినదై ఉంటోంది. అదే సమయంలో, సర్వవ్యాపి కూడా అయి ఉంటోంది. స్వప్నద్రష్ట 'స్వప్నమును రచించుట' అను చమత్కారమును కలిగియుండి, స్వప్నంలో “సర్వవ్యాపి” అయి ఉన్నాడు కదా! ఇదికూడా అట్లే!
యథార్థానికి చిదాత్మ ప్రకాశమయమే... కాని వ్యవహారదృష్ట్యా అప్రకాశమయంగా తోచుచున్నది. అది నిత్య నిర్మలము, సంశయరహితమూ అయినప్పటికీ.. దృశ్యములో తారసపడే కార్య కారణముల దృష్ట్యా సంశయసహితము అగుచున్నది. అవిద్యాకారణం చేత అవిద్య యందు కృత్రిమ రూపముగా ప్రతిబింబించుచున్నది. అట్లు ప్రతిబింబించుచున్నప్పుడు తన యొక్క అనంత రూపమును ఏమరచుచున్నది. అంత మాత్రమే గాని, అది తన అనంతత్వమును ఏ మాత్రం కోల్పోవుట లేదు. 'అహంభావము' అను స్వల్పత్వమును మననరూపముగా పరిగ్రహించి, క్రమంగా ‘జీవత్వప్రాప్తి’ని పొందుచున్నది. పదార్థముల పట్ల అనేకత్వము దృఢపడగా ఈ ప్రపంచ కల్పన మంతా అనుభవించుచున్నది. 'ఇది కలదు, ఇది లేదు, ఇది కావలెను, ఇది తొలగవలెను, ఇది ఇట్లు ఉండవలెను, అది అట్లా ఎందుకుండాలి....” అనునట్టి ఇష్ట, అనిష్టములను, స్వీకార తిరస్కారమును పొందుచున్నది. దీనినే 'దేహాత్మభావము' అని అంటున్నాం. ఈ చిదాత్మ అనేకాలైన విహితకర్మలు, నిషిద్ధకర్మలు అనేక శారీరక మానసిక క్రియలు మొదలైనవాటి ద్వారా ఈ ప్రపంచ మంతటినీ తన యొక్క ‘భోగ్యవస్తువు’గా పొందుచున్నది. కాని, చిదాత్మ ఏదీ ఒనర్చుట లేదు.
ఆహాఁ! చైతన్యము యొక్క మహిమ చూచావా? అదియే తనయందు స్వయముగా 'జగత్తు' అను అంకురరూపముగా ఉన్నతిని పొందుచూ కూడా, స్వస్వరూపస్థితి త్యజించకయే ఉంటోంది.
Page:179
అదియే ఈ రూపవంతములైన పదార్థములు ఏర్పడి ఉండటానికి వీలుగా రూపరహితము, అమూర్తివంతము అగు ఆకాశము యొక్క కల్పనను అంగీకరిస్తోంది.
అది ‘ఇచ్చ' భావనలు పొందకపోతే ఈ 'జగత్తు' అనబడేదే వృద్ధి పొంది ఉండేది కాదు. జగత్తు అనే అంకురమును చైతన్యమే తనయొక్క ప్రకాశముచే, స్పందనచే పెంచి పరిపోషించు చున్నది. చైతన్యమే వాస్తవస్వరూపముగా గల ఓ రామా! చైతన్యమే సర్వదా సర్వమునకు కారణమని గ్రహించు.
ఈ ‘జగత్తు’ అనుదానిని పృథ్వీధర్మం చేతను, అగ్నిధర్మం చేతను, వాయుధర్మం చేతను, జల ధర్మం చేతను పరిపోషించుచున్నది చైతన్య రూపమగు చిదాత్మయే. “కాలము యొక్క కల్పన, సూర్యకిరణతత్వము, ధాన్యముల ఉత్పత్తి"... ఇవన్నీ కూడా చైతన్యము యొక్క ప్రభావమే. అదే పుష్పాలలో 'గంధం’ గాను, మట్టిలో రసరూపంగాను, వృక్షంలో ఫలత్వం గాను ప్రవర్తిస్తోంది.
ఈ జగత్తులో సర్వవస్తువుల రూపమున చైతన్యము సుప్రకటితమగుచున్నది.
వసంతకాలంలో పుష్పములందలి పుప్పొడి, గ్రీష్మకాలమునందలి సూర్యతేజోవిభవము, వర్షాకాలంలో నీలమేఘ ప్రదర్శనము, శరదృతువులో ఫలదీకరణము, హేమంతంలో మంచు, శిశిర ఋతువులో శీతలవాయువులు... అంతా కూడా చైతన్యము యొక్క విభవములే సుమా!
ఓ రామచంద్రా! కాలం ఎప్పుడైనా “దినం-సంవత్సరం-యుగం" అను రూపమున గల తన యొక్క నియతిని త్యజిస్తోందా? లేదు కదా! నదులలో తరంగముల రూపమున జలం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నది కదా! అదే విధంగా సృష్టి సమూహములన్నీ గమనశీలము కలిగి ఉంటున్నాయి. ఈ "బ్రహ్మాండముల ఆవిర్భావం - తిరోభావం" అనే నియతి ఇట్లే వర్తించుచున్నది. -
అనంత సంఖ్యలో జీవరాసులు వచ్చి, ఉండి, పోవుచున్న ఈ పృథివి ఇట్లే నియతిని అనుసరించి ‘ప్రళయము’ వరకు స్థితి కలిగి ఉంటోంది. పదునాలుగు భువనములందూ పదునాలుగు జీవ జాతులు, అనేకములైన ఆచార విచారములు, వివిధ వేష భాషలు ఉంటున్నాయి... వ్యష్టి జీవుల దృష్ట్యా అనుక్షణం ఉత్పత్తి విలయములు ఏర్పడుచూనే ఉన్నాయి.
ఇదంతా చైతన్యము యొక్క విలాసమే. అయితే తత్త్వజ్ఞానికి ఈ జనన మరణ ప్రవాహమంతా లేనిదిగానే కానవచ్చుచున్నది.
ఇక్కడ దీనులగు అనేకమంది జనులు పూర్వజన్మలకు సంబంధించిన సంకల్ప వాసనాదు లచే వివిధములైన మనోరథములను చేపట్టుచున్నారు. అంతేగాని, వారు స్వస్వరూపమును విచారించుటలేదు. స్వస్వరూపము పట్ల దట్టముగా ఏర్పడిన అజ్ఞానవశంచేత మోహముతో కూడి ఏర్పడిన 'ఉన్మత్తత' కలవారై ఈ లోకమున జన్మిస్తున్నారు, మరణిస్తున్నారు. మరల పర లోకములకు వెళ్లుచున్నారు. ఇంతలో 'స్థావరము' మొదలైన మహానిద్రాపరవశములగు స్థితులను
Page:180
పొందుచున్నారు. భోగముల పట్ల గల అభిలాష కారణంగా ఐహిక పారలౌకికములైన శ్రమతో కూడిన అనేక ధర్మ అధర్మములను స్వీకరిస్తున్నారు. ఏవేవో పురుషార్థములు వారిని స్పృశిస్తున్నాయి పోతున్నాయి. ఈ జనన మరణాల ద్వారా అవిశ్రాంతంగా సంసారంలో పరిభ్రమిస్తున్నారు.
4. విముక్తి
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామా! ఈ విధంగా స్థిరాకృతిగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండ సమూహములన్నీ బ్రహ్మమునందే మరల మరల ఉద్భవించి, లయిస్తున్నాయి. పరస్పర కారణ భావము (ఒకదానికి మరొకటి కారణం అయినట్లు భావము పొందుట) కలిగి ఉంటున్న ఈ జగత్తులన్నీ తమ అధిష్ఠానమైనట్టి చైతన్యమునందే ప్రకటితమగుచున్నాయి. పూర్ణభావన యొక్క ప్రభావంచే లయించుచున్నాయి.
లోతైన తటాకంలో అడుగున ప్రవహిస్తున్న జలము యొక్క చలనము బాహ్యమునకు కనబడదు కదా! “సత్-అసత్" రూపమున చైతన్యమే అన్నివైపులా, అంతటా ప్రకాశించు చున్నప్పటికీ, అది వ్యక్తము కాకుండానే ఉంటోంది. 'ఎండవేడిమి' కారణంగా మృగతృష్ణ ఏర్పడుతోంది. అందులో జలము ఉన్నట్లు దాహముతో ఉన్న మృగములకు తోచుచూ ఉంటోంది. అట్లే చిదాత్మయందు ఈ సృష్టులన్నీ గోచరిస్తున్నాయి. చిత్సారము అయినట్టి చిదాత్మయే 'ఇచ్చ-భ్రమ’ల వశంచేత తనను తాను అన్యవిధంగాను, అచిత్తుగాను గాంచుచున్నది.
జగత్తు ఉన్నదా? లేదా? - ఈ జగత్తు సత్తు కాదు. అసత్తు కూడా కాదు. ఇది చైతన్యము నందు స్థితి కలిగియుండలేదు. చైతన్యమునకు వేరుగా ఈ జగత్తు లేదు. ఒక దృష్టాంతము చెపుతాను. బంగారపు ఆభరణము ఉన్నది... అందులో ఆభరణము బంగారము కంటే వేరుగా ఉన్నదా? ఆభరణమంతా నిండియున్నది బంగారమే కదా! మరి “ఇది గొలుసు ఇది ఉంగరము” అను వేరు వేరు ఆకారములు, నామరూపముల మాట ఏమిటి? ఉంగరము - గొలుసు ఒక్కటేనా? వేరువేరా? 1."రెండింటిలోను ఉన్నది బంగారమే కనుక రెండూ ఒక్కటే”; 2. “వేరు వేరు నామములు, ఉపయోగములు ఉన్నాయి కనుక రెండూ వేరువేరు”... అను రెండు అభిప్రాయముల వేరు వేరు దృష్టులచే అంగీకారమే అవుతాయి. బంగారమునందు ఆభరణములు అనునది భిన్న, అభిన్నముగా ఉంటున్నట్లే, బ్రహ్మమునందు 'నేను, నీవు' మొదలైన వ్యవహారమంతా మాయా దృష్టికి ప్రదర్శితం అవుతోంది. అందుచేత ఈ జగత్స్వరూపమంతా అనిర్వచనీయమై ఒప్పుచున్నది.
దేనిచే నీవు శబ్ద-స్పర్శ-రూప రస గంధములను ఎరుగుచున్నావో అట్టి ఆత్మయే సర్వత్రా వ్యాపించియున్నది.
సర్వవ్యాప్తి, నిర్మలము అగు ఆత్మయందు ఏకత్వమేమిటి? అనేకత్వమేమిటి? రెండూ లేవు. ఉన్నట్లు ఉంటే, 'అది అవిద్యచేతనే' అని గ్రహించబడుగాక! యథార్థానికి ఆ పరమాత్మయందు
Page:181
'మరొక కల్పన' అంటూ ఏదీ లేదు. ఇక ఈ పదార్థముల పట్ల ఏర్పడుచున్న భావాభావములు, శుభాశుభములు విషయమేమిటంటావా?... ఇవన్నీ వాసనావశంచేతనే కల్పించబడుచున్నాయి.
తత్త్వ దృష్టిచే సర్వము ఆత్మయే. కనుక ఆత్మయందే అంతా కల్పించబడుతోంది. అట్టి కల్పనయే జగదనుభవంగా ఆత్మచే పొందబడుతోంది.
ఆత్మకు అన్యమైనదేది? - ఓ సర్వజనులారా! ఆత్మకంటే వేరుగా ఎక్కడైనా, ఎప్పుడైనా ఏదైనా పదార్థము ఉంటే, దానియందు కోర్కె ఉండటం సహజమే అవుతుంది. తనకు అన్యముగా ఏ పదార్థం సంభవించుటకే వీలులేనప్పుడు ఆత్మదేనిని ఇచ్ఛగిస్తుంది? దేనిని ద్వేషిస్తుంది? ఆత్మకు ఇచ్ఛా ద్వేషములు కృత్రిమము, అజ్ఞాతకల్పితము మాత్రమే గాని, సహజం మాత్రం కాదు. సర్వం 'తానే’ అయి ఉండగా అది దేనిని స్మరిస్తుంది? దేనిని విస్మరిస్తుంది? దేనిని నిర్మిస్తుంది? దేనిని త్యజిస్తుంది? ఏ భవిష్యత్తు ఫలం కొరకు ప్రవృత్తమౌతుంది? కనుక “ఈ సృష్టి మొదలైనదంతా ఆత్మ యందు అవిద్యచేతనే కల్పించబడుచున్నది" అని గ్రహించండి. “ఇష్టము, అనిష్టము”... మొదలైన వికల్పములన్నీ ఆత్మను స్పృశించవు. 'ఇచ్ఛ' యొక్క అవాస్తవికత గ్రహించబడగా, కర్త-క్రియ -కర్మముల ఏకత్వము సంభవించుచున్నది. అప్పుడు “ఆత్మ ఏమీ చేయునది కాదు”... అని గ్రహించబడుచున్నది.
ఆత్మ దేనికీ ఆధారము కాదు. అది దేనిపైనా ఆధారపడి ఉండదు. కనుక “దానికి ఆధారం గాని ఆధేయము గాని లేవు" అని ప్రకటించబడుచున్నది. దానికి ఆశ్రయమంటూ ఏదీ లేదు. ద్వితీయ కల్పనయే ఆత్మయందు అసంభవం కనుక, అది దేనికీ ఆశ్రయం కూడా కాదు. ఇచ్ఛా రహితమగు ఆత్మయందు సకర్మత్వం (A sense of being a DOER) గాని, నైష్కర్మ్యత్వం (A sense of being a NON-DOER) గాని లేవు. ఆత్మకు భిన్నముగా సాఫల్యము ఒనగూర్చు కల్పనయే మరొకటి లేదు. అట్టి కల్పనను చూస్తున్న ఇంకెవరో మరొకరు లేరు. కనుక నీవు సమస్త సంతాప జ్వరముల నుండి విముక్తుడవు కమ్ము. విముక్తుడవై, ఆపై ఏది ఎట్లు చేయవలయునో ఇప్పటి వలెనే యథాతథముగా నిర్వర్తిస్తూ ఉండు. ద్వంద్వాతీతుడవై కర్తృత్వములోని అకర్తృత్వమును దర్శించు.
ఓ రామచంద్రా! “ఇది నేను చేయుచున్నాను” అను కర్తృత్వాభిమానముచే నీవు పొందునదేమిటో చెప్పు? ఈ దృశ్యమంతా భౌతిక పదార్థమయము కాకుండా మరింకేదీ ఎక్కడా లేదు కదా! కాబట్టి కర్తృత్వాభిమానమంతా త్యజించి నిశ్చింతుడవై ఉండవచ్చు సుమా! స్వస్వరూపమగు వాస్తవతత్త్వానకు అకర్తృత్వమే సహజమగుచున్నది. కాని కర్తృత్వాభిమానం కాదు.
అందుచేత, సర్వమునకు 'అకర్తవు అగుము. వాయువుచే చలింపబడని సముద్రంలాగా, మేఘరహితమగు ఆకాశంలాగా, కడుపునిండుగా ఆహారం తిని సరోవర జలం త్రాగి తిరిగివస్తున్న సింహంలాగా స్వస్థుడవు, నిర్మలుడవు, గంభీరస్వభావుడగు, మౌనశీలుడవు అయివుండుము. హృదయమును పదార్థరహితం చేయి. “ఇది నేను చేశానే...? ఇది చేయలేకపోయానే...?” అను తలపులన్నీ ఆత్మత్వము నందు లయింపజేసి వేయుము.
Page:182
ఆత్మయే అయివున్న నీవు... ఆత్మ స్వభావుడవై.. ఆత్మలో నిలకడ కలిగియుండుటలో కష్టమేమున్నది?
శ్రీరాముడు: మహర్షీ! ఏ సాధనములచే అపరిచ్ఛిన్నమగు సుఖము, పూర్ణకామత్వము సిద్ధిస్తాయి? శ్రీ వసిష్ఠ మహర్షి: అందుకు సాధనం, మార్గం, లక్ష్యం కూడా "ఆత్మయందు సుస్థిరుడవగుట”... అయి ఉన్నది. అట్టి స్వస్వరూపమునందలి “సుస్థిరము”లోని సుఖప్రాప్తి... ఇక అనేక ప్రయత్నములచేత గాని, అనేక లోకములలో పరిభ్రమించుటచేత గాని ఈ జీవునకు లభించేది కాదు. అందుకు మార్గం ఇప్పటికిప్పుడు స్వస్వరూపము గురించి విచారణ చేయటమే.
కనుక నీ స్వస్వరూపమును స్వబుద్ధితో విచారించుము. బాహ్య పదార్థములవైపు పరుగులు తీయు నీ దృష్టిని నిరోధించి, ఆత్మవైపు మళ్ళించు. “అంతయు ఆత్మయే కదా!” అను
పరిగ్రహణము కలిగియుండుము.
యథార్థానికి నీవు సర్వప్రపంచ మిత్రుడవు. పరమార్థదృష్టిచే సర్వదా పూర్ణుడవే అయి ఉన్నావు. సుఖస్వరూపమగు చిదాత్మవే నీవు. అంతే గాని తుచ్ఛమగు ఈ శరీరమనోబుద్ధులు నీవు కావు.
ఓ సర్వజనులారా! మీలోని ప్రతి ఒక్కరియొక్క వాస్తవ స్వరూపము అట్టిదే సుమా!
5. అనాసక్తబుద్ధి
శ్రీరాముడు: హే మహాత్మా! జ్ఞానులకు కూడా కర్తృత్వములు, స్వీకరించవలసినవి, త్యజించ వలసినవి మొదలైనవి ఉంటాయంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఏదో ఒక కర్మ నిర్వర్తించనివారంటూ ఎక్కడైనా ఉంటారా? ఉండరు. జ్ఞానులు లౌకికమైన కర్మ చేయవచ్చు లేక చేయకుండవచ్చు. ఏది ఏమైనా “ఇది నేను చూస్తున్నాను... లేక... ఇది నేను త్యజించుచున్నాను.... చేయుటలేదు” అను కర్తృత్వాభిమానం ఏ మాత్రం ఉండదు. వారిలో కొందరు సుఖభోగఫలములను పొందవలసి ఉండవచ్చు..., లేక సాధన భూతములగు ఆయా కర్మలందు నియమితులై ఉండవచ్చు..., లేదా, సమాధి యొక్క వేరు వేరు భూమికలలోని ఒకదాని యందు ఉండి ఉండవచ్చు. ఏది ఏమైనా “దీనికి నేను కర్తను... ఇది నాకు సంబంధించినది”... అను ఉద్వేగం ఏమాత్రం వారియందు ఉండదు. వ్యవహారరీత్యా ప్రవర్తించినప్పటికీ వారు ప్రకటించు కర్తృత్వము వ్యవహార సానుకూల్యమునకు సంబంధించినదే గాని, అభిమానమునకు సంబంధించినది కాదు. కాని అజ్ఞానుల వ్యవహారం మాత్రం అందుకు వేరుగా ఉంటుంది.
శ్రీరాముడు: జ్ఞానులకు కర్తృత్వమే ఉండదని అంటున్నాం కదా. కానీ వారు కూడా తదితరులవలెనే కర్మలు నిర్వర్తిస్తూనే ఉంటారు కదా?
Page:183
శ్రీ వసిష్ఠ మహర్షి: జ్ఞానులలో గోచరించే అకర్తృత్వము గురించి అజ్ఞానులలో ఉంటున్న కర్మబంధము గురించి కొన్ని విశేషాలు తెలియజేస్తాను. విను.
ఏ క్రియ అయితే ఈ జీవుని అంతకరణంలో "నేను చేయుచున్నాను... దీని కర్త (లేక) కర్మ నాకు సంబంధించినవే” అను మనోవృత్తి 'నిశ్చయము'తో కూడినదై జీవునియందు ఉంటుందో, అట్టి కర్మకు మాత్రమే అతడు కర్తృత్వము పొంది ఉంటున్నాడు. అనగా “నేను దీనికి కారణమగు చున్నాను”... అను రూపముగల ఉపాదేయబుద్ధి ఉంటేనే కర్మ ఉన్నట్లు. దీనినే 'వాసన' అని కూడా అంటున్నాం.
ఈ మనుజుడు వాసనలను అనుసరించే ఆయా క్రియలను ఒనర్చుచున్నాడు. క్రియలను అనుసరించే 'ఫలభోగానుభవం' సంభవమగుచున్నది.
6ఇష్టములు
) als
ఫల
య భోగములు వాసనలు 33 య
అయిష్టములు
క్రియలను అనుసరించే అందు ఇచ్ఛ తోడగుచుండగా ఫలభోక్తృత్వము (నేను ఈ కర్మఫలమును అనుభవించెదను గాక... అను భావన) ఏర్పడుచున్నది.
వాసనలను అనుసరించే మనుజుడు క్రియలను ఒనర్చుచున్నాడు.
వాసనల ప్రభావం ఒకడు ఈ స్థూల ఇంద్రియములచే కర్మలు చేయవచ్చు... చేయకపోవచ్చు. అతడు ఎట్టి వాసనలు కలిగి ఉంటాడో... అట్టి వాసనలను అనుసరించే అతని మనస్సు స్వర్గ-నరకములందు సుఖ - దుఃఖములను అనుభవించటం జరుగుతోంది.
ఒకడు కర్మలు చేసినా, చేయకపోయినా... అతడు 'ఆసక్తి' కలిగి ఉంటే మాత్రం అతనికి కర్తృత్వము కలుగుచూనే ఉంటుంది.
తత్వజ్ఞానికో...? - తత్వజ్ఞానికి వాసనలు ఉండుటలేదు. కనుక కర్మలపట్ల ఆసక్తి ఉండుటలేదు. ఆసక్తి లేనిచోట కర్తృత్వము కూడా ఉండదు.
ఆసక్తి, వాసనలు, కర్తృత్వము, ఈ మూడూ అవినాభావ సంబంధం కలిగి ఉంటున్నాయి. తత్వజ్ఞాని కర్మలు చేస్తున్నప్పటికీ... ఫలానుసంధానం చేయడు. ఆసక్తిని హృదయంలో ప్రవేశింపనీయకుండా, కేవలం శరీరచేష్టామాత్రంగా ఆయా కర్మలు గావించుచున్నాడు. ఏవైనా ఫలములు ప్రాప్తిస్తున్నప్పుడు “ఇవి నాకు సుఖకరములు... లేక దుఃఖకరములు”... అను
Page:184
కల్పనను అతడు ఆశ్రయించుటలేదు. 'అంతయు ఆత్మయే కదా....” అను ఎరుకను అతడు కలిగి ఉంటున్నాడు. కర్మలు ఆచరిస్తూ కూడా అతడు వాటియందు నిమగ్నచిత్తుడు అగుటలేదు. మనోయత్కరోతి... తత్కృతంభవతి, యున్న కరోతి... తన్నకృతంభవతి అతో మనయేవకర్తృ... న దేహః ॥
ఓ రామచంద్రా! మరల చెప్పుచున్నాను. ఈ జగత్తులో ఎవడైనా మనస్సుతో చేసినది మాత్రమే 'చేయబడినది' అగుచున్నది. మనస్సుతో చేయబడనిది... “చేయబడనిది” గానే
ఉంటోంది.
కాబట్టి మనస్సే సర్వకర్మల యొక్క 'కర్త'. అంతేగాని, ఈ దేహము దేనికీ కర్త కాదు. చిత్తాదేవాయం సంసార ఆగతశ్చిత్తమయ ఏవ ॥ చిత్తమాత్రం చిత్త ఏవ స్థిత ఇతీ విజ్ఞాతమ్ ॥ (సర్గ 38, శ్లో 8)
ఈ ప్రపంచమంతా మనస్సునందే ఆవిర్భవిస్తోంది. మనోమయం, మనోమాత్రం ఈ ప్రపంచమంతా. మనస్సునందే స్థితి కలిగి ఉంటోంది. కనుక ఈ కనబడేదంతా నీయొక్క చిత్తమే కాని మరింకేమీ కాదు. ఈ విషయం మనం ఇంతకుముందు నిర్ధారించుకున్నాం కదా!
సర్వవిషయములు, సర్వవిషయ వృత్తులు శమించాయనుకో... లేక, సర్వవృత్తులు సద్వాసనలతో ('సత్' కు సంబంధించిన భావనలతో నిండియున్నాయనుకో... అప్పుడు అనుభవ మగుచూ ఉండేది ఏది? సర్వవిధ వృత్తులకు స్థానభూతమైయున్న జీవచైతన్యమే కదా! ‘ఎండలు’ తీవ్రంగా ఉన్నప్పుడు మృగతృష్ణ యొక్క భ్రమ ఏర్పడుతోంది. మేఘాలు వచ్చి, వర్షించాయనుకో... ఇక మృగతృష్ణా జలమెక్కడ? ఆ జలము పట్ల ఆసక్తి ఏమి ఉంటుంది?
ఆత్మ జ్ఞానము పొందిన మనస్సు పరమశాంతినే పొందుతోంది. శ్రీరాముడు: అప్పటి వారి మనస్సు యొక్క రూపం ఏమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి: ప్రచండ సూర్యతేజస్సులో మంచుగడ్డ కరిగిపోవుచుండగా, ఆ మంచుగడ్డ యొక్క దృశ్యాకారం ఏమౌతుంది? హరించుకుపోతుంది కదా! మనస్సు కూడా 'తురీయస్థితి” యొక్క ప్రాప్తిచే బ్రహ్మరూపమే అగుచున్నది.
మూర్ఖుని మనస్సు మూర్ఖమగు దున్నపోతు బురదలో ప్రవేశించి, అందులో -
ఇరుక్కుంటుంది. మూర్ఖుడగు అజ్ఞానియొక్క మనస్సు కూడా స్వల్ప అశాశ్వత విషయములందు తగుల్కొంటోంది. విషయ భోగభూములనే అవలోకించుచున్నది గాని, తత్స్వరూపమగు ఆత్మను గాంచుటనే లేదు. జ్ఞానియొక్క మనస్సో... వాసనామయమగు క్రియలందు తగుల్కొనుటలేదు.
ఏది మనస్సుచే పొందబడిందో... అది మాత్రమే పొందబడినట్లు - ఒకడు మనస్సుతో పొందినదే ‘పొందబడినది' అగుచున్నది. మనస్సుచే స్వీకరించబడనప్పుడు, అతడు అద్దానిని పొందనట్లే
Page:185
అగుచున్నది. శరీరముచే పొంది, మనస్సుచే పొందబడనప్పుడు “అది ఆ జీవుడు పొందుట లేదు”... అని సిద్ధాంతీకరించబడుచున్నది.
ఇందుకు ఒక దృష్టాంతము చెపుతాను విను.
ఒకడు - ఒక సుఖప్రదమైన 'శయ్య'పై చక్కగా నిదురించుచున్నాడు. ఒక గోతిలో పడిపోతు న్నట్లు స్వప్నము పొందుచున్నాడు. అతడు “నేను గోతిలో పడిపోతున్నాను... నన్ను రక్షించండి” అని కేకలు వేస్తున్నాడు. ముచ్చెమటలు పోస్తున్నాయి. పెదవులు వణుకుచున్నాయి. చూచావా, రామా! అతడు సుఖంగా పరుపుపై ప్రశాంతమైన ముద్రలో భౌతికంగా ఉండి ఉన్నప్పటికీ, అతని మనస్సు మాత్రం బీభత్సములగు అనుభవములను పొందుతోంది. కనుక, అతడు గోతిలో పడుచున్నవాడే అగుచున్నాడు.
మరొకని విషయానికి వద్దాం - అతడు పరమశాంతచిత్తుడు. "ఆత్మా హమ్” అను ఎరుక గలవాడు. అనేక స్వప్రయత్నముల ఔన్నత్యముచే, జ్ఞానవిషయమై సద్గురువుల వద్ద వినియున్న విశేషముల ప్రభావంచేత పూర్ణమగు 'శాంతి' అను శమస్థితిని పొందియున్నాడు... ఒకరోజు అతడు ఒక పెద్ద గుంటలోకి జారిపడుచున్నాడు. అయినప్పటికీ అ “నేను అఖండము, శరీరాదులకు అతీతము అగు ఆత్మనే కదా! నాకు శరీరముల రాకపోకలు బాహ్యస్థమైన వ్యవహారమే. కనుక నేను ఏ మార్పు చేర్పులు లేనట్టి నిత్యోదితమగు పరబ్రహ్మమును”... అను దృఢ భావనను ఆశ్రయించి ఉన్నాడు...
అతడు 'నేను సుస్థిరుడనే' అను భావనయే పొందుచున్నాడు. అందుచేత శరీరం యొక్క పతనం ఆతడు పొందకయే ఉన్నాడు. చూచావా! అతడి మనస్సు పతనంతో ఏకత్వం పొంద కుండుటచేత అతనికి అనుభవము లేకయే ఉంటోంది. దీనిని బట్టి మనకు తెలియున దేమిటి?
మొదటివాడు గోతిలో పడనప్పటికీ, పడుచున్నట్లు అనుభవాన్ని మాత్రం పొందుచున్నాడు కనుక, కర్తృత్వము, భోకృత్వము తెచ్చిపెట్టుకొని అనుభవిస్తున్నాడు. రెండవవాడు పడుచున్నప్పటికీ అకర్తయే అగుచున్నాడు. ఈ చిత్తము ఏ విధంగా ఉంటే, పురుషుడు అట్లాగే ఉంటాడు సుమా!
ప్రియ, అప్రియములు ... సుఖ దుఃఖములు - ఓ రాఘవా! నీవు కర్మలు చేస్తూ ఉండవచ్చు... లేక, చేయకుండా ఉండవచ్చు గాక! నీ చిత్తం మాత్రం ఆ కర్మలలో ప్రియం, అప్రియం, కర్తృత్వం, భోక్తృత్వముల రూపమున మగ్నంకాకుండా చూచుకో! ఎందుచేతనంటావా? ఈ జగత్తులో ఆత్మతత్వం ఒక్కటి తప్ప మరింకేపదార్థము సత్యము కాదు. మరి ఈ చిత్తము ఎందులోనైనా ఆసక్తిగొనవలసిన పనేమున్నది? తద్వారా లభించేదేమున్నది? ఈ జగత్తు, దీనియందు అంతర్గతమై యున్న సర్వ పదార్థములు... ఇవన్నీ కూడా శుద్ధ చైతన్యము యొక్క 'అభాస' (illusion) మాత్రమే సుమా!
జ్ఞేయమగు ఆత్మను అనుభవపూర్వకంగా ఎరుగని వానికే “సుఖదుఃఖములు' అనే భ్రమలు ఉంటాయి. ఆత్మకంటే వేరుగా ఆధార, ఆధేయములు లేవు సుమా! “నా స్వరూపము ఈ కర్త, భోక్త
Page:186
మొదలైన సర్వ పదార్థములకంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఆకాశమువలె సర్వవ్యాపక మైనది”... అని జ్ఞాని ఎరుగుచున్నాడు. అట్టి నిశ్చయమును సడలించగలిగినదేదీ ఈ జగత్తు నందు అతడు గాంచుట లేదు. క్రమంగా 'ఈ జగత్తంతా నా స్వరూపమే' అనే భావనను కూడా పొందుచున్నాడు. ఇట్టి నిశ్చయ భావములు సుదృఢపడగా “సర్వ భూతములను ప్రకాశింప జేయునట్టి సర్వవ్యాపమగు ఆత్మయే నేను" అను అనుభవం ఉత్పన్నమౌతోంది. “నేను సుఖ దుఃఖాలకు స్థానభూతుడను గాను"... అను దుఃఖరహిత స్థితి అతి సహజంగా అవలంబించ బడుతోంది. ఇక అతడు ప్రారబ్ధకర్మలను అనుసరించి లీలామాత్రంగా సర్వ వ్యవహారములందు పాల్గొనుచున్నాడు. వర్తించుచున్నాడు. వాటిచే కలుగు ప్రత్యేకత ఏదీ అతనికుండదు. తన ఆత్మ యందే ఈ సర్వమును, ఈ సర్వమునందు తన ఆత్మనే దర్శించేవానికి ఇక ప్రియ-అప్రియము లేమి? సుఖ-దుఃఖములేమి?
జ్ఞాని యొక్క మనస్సు - జ్ఞానియొక్క మనస్సు ఆపదలు ప్రాప్తిస్తున్న సమయంలో కూడా ఈ ప్రపంచమును శోభాయమానం చేస్తూ ఉన్నది. మనస్సు కంటే వేరుగా సుఖదుఃఖములు ఎక్కడ ఉన్నాయి? వాసనారహితమగు చిత్తము కలిగియుండుటచే జ్ఞాని సర్వదా 'అకర్త'గానే తనను తాను దర్శించుచున్నాడు. అనుభవములు అతని పట్ల అప్రభావితముగానే ఉంటున్నాయి. ఈ కాళ్ళూ చేతుల కదలికల వ్యవహారమంతా అతనియందు ప్రవేశించకయే, బాహ్యముననే ఉంటోంది.
సర్వకర్మలకు, సర్వచేష్టలకు, సర్వభావములకు, సర్వలోకములకు, సర్వగతులకు బీజము ఈ మనస్సే. అట్టి మనస్సు అనే బీజం త్యజించబడితే, కర్మలు కూడా స్వయముగా లయించగలవు.
మనస్సు ఆత్మజ్ఞానముచే మ్రింగివేయబడినప్పుడు మాత్రమే దుఃఖములు తొలగగలవు. పుణ్యపాపములు కూడా అప్పుడు విలయం పొందుతాయి. "ఆత్మకంటే వేరైనదంటూ ఎక్కడా లేదు” అని గ్రహించియున్న జ్ఞాని... ఈ శారీరక వాచక-మానసిక కర్మలచే ఆక్రమించ బడినప్పటికీ... వాటికి తాను మాత్రం వశీభూతుడు కాడు.
లీలా వినోదం - ఒక బాలుడు ఒక చోట కూర్చుని ఉండి తన మనస్సు నందు ఒక గొప్ప నగరమును,ఆ నగరములోని వీధులను, ఆ వీథులలోని ఆట వస్తువుల ప్రదర్శనమును ఊహా మాత్రంగా పొందుచూ ఉంటాడు. ఇంతలో అమ్మ పిలుపు విని అక్కడి నుండి లేస్తూ ఆ సంకల్ప మహానగరమును క్షణంలో త్యజించివేస్తాడు. “మనోనగరంగా పొందబడినదంతా వాస్తవంగా లేదు” అను ఎరుకచేతనే కదా, అతనియందు దానిని త్యజించు సమయంలో ఎట్టి క్షోభ యేర్పడుట లేదు! నగరము, నగర వినాశనము కూడా అతడు ఊహామాత్రంగానే పొందుచున్నాడు. అట్లాగే ఆత్మ కూడా కర్మలు చేస్తున్నపటికీ పరమార్థదృష్టిలో ఏమియూ చేయకయే ఉంటోంది. లీలా మాత్రంగా ఒక సమయంలో దుఃఖములను అనుభవించుచు, మరొకప్పుడు “ఇదేదీ నాకు దుఃఖం కాజాలదు”... అని గమనించుచున్నది.
ఆత్మ దేనిని దుఃఖమని తనకు తానే నిర్వచించుకుంటోందో... అది దుఃఖకరమే అగుచున్నది.
Page:187
'ఇవేవీ నాకు దుఃఖకరములు కావు” అది భావించుకొనుప్పుడో, (లేక
నిర్వచించునప్పుడో) దానికి దుఃఖము కలుగజేయగలిగేది ఈ జగత్తులో ఏదీ లేదు.
అయితే ఒకడు వస్త్రములు ధరించుచున్నంత మాత్రంచేత అతడు వస్త్రములు అగుచున్నాడా? దుఃఖములు పొందుట జరిగినను, ఆత్మ దుఃఖ రూపముగా పరిణమించుటలేదు సుమా!
హేయ - ఉపాదేయములు (త్యజించటం స్వీకరించటం) వ్యవహారయోగ్యములుగా అగుచున్న ఈ ఎదురుగా ఉండే సర్వపదార్థముల యందు వాస్తవానికి హేయత్వము గాని, ఉపాధేయత్వము గాని లేవు (Nothing is repulsive or attractive by itself). అట్టి చమత్కారమంతా చోటు చేసుకుని ఉంటున్నది బుద్ధిలోనే.
హేయత్వము - త్యజింపవలసియున్నది.
ఉపాదేయత్వము - స్వీకరింపవలసియున్నది.
“నేను త్యజించాలి” అనుకున్న వస్తువు “స్వతహాగా దుఃఖకారకము" - అని అనటానికి వీలు లేదు. ఎందుకంటే, అది ఒకప్పుడు స్వీకరించబడినదే కదా!
ఏదైనా సరే, స్వీకరించుటచేతనే దుఃఖము సంభవిస్తోంది. స్వీకరించని వానికి ఆ
విషయముతో సంబంధమే ఉండదు. ఇక దుఃఖమేముంటుంది?
ఎప్పటికైనాసరే, ఉపాదేయరాహిత్యము చేతనే (లేక 'గ్రహించుట' అనునది నిరోధించ బడుటచేతనే) దుఃఖము జయించవేయబడుతోంది. అయినా, ఆత్మకంటే వేరుగా ఏదీ లేనప్పుడు స్వీకరించబడేది (ఉపాదేయము) మాత్రం ఎందుకు దుఃఖింపజేయాలి? కనుక 'అవిజ్ఞాన పూర్వకమైన దృష్టిచేతనే దుఃఖాదులు వచ్చిపడుచున్నాయి... అంతేగాని హేయ - ఉపాధేయములు (త్యాజ్య గ్రాహ్యములు) స్వయముగా దుఃఖకరములు కావు"... అని గ్రహించు.
ఆత్మ అకర్త, అభోక్త అయి ఉన్నదని మనం అనుకున్నాం. అవిద్య కారణంగానే అద్దాని యందు కర్తృత్వ - భోక్తృత్వములు ఆరోపించబడుచున్నాయి. అట్టి అధ్యారోపమే అనుభవమునకు కూడా కారణమగుచున్నది. అకర్తా భావనచే క్రమంగా ఆత్మ యొక్క వాస్తవ స్వభావం అనుభూతమౌతోంది.
శ్రీరాముడు: ఈ కర్మలు త్యజించటం, అకర్తగా అవటం సాధ్యమేనా?
శ్రీ వసిష్ఠమహర్షి: నిజమే, శరీరధారి కర్మలను ఎట్లా త్యజించటం? శరీర నిర్వహణకు అవశ్యకర్మలు ఉండనే ఉంటాయి. అయితే 'సమ్యక్ దర్శనము' అనే బలంచేత 'కర్మలు చేయువాడను” అను భావన అధిగమించబడుతోంది. కర్మలు త్యజించుట అంటే తనను తాను సర్వకర్మలకు అతీతమైన 'ఆత్మ'గా ఎరుగుటయే. ఓ రామా! నీవు మొట్టమొదటగా సత్యవస్తువు గురించి విచారించు. అట్లు విచారించినప్పుడు “శుద్ధమగు ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు”... అని నీవే గ్రహిస్తావు.
Page:188
ఇంద్రియ దృష్టి - కొందరు ఇంద్రియార్థములగు విషయము లందు (శబ్ద స్పర్శ రూప రస గంధము లందు) రాగ ద్వేషాదులు కలిగి ఉంటున్నారు. వాటి కొరకై పుణ్యపాపములు ఆచరించు చున్నారు. అదృష్టములు (దృష్టము కానిది) అగు పుణ్యపాపములచే వివశులై ఆత్మౌన్నత్యమును గ్రహించలేక పోవుచున్నారు. అట్టి “వివశత్వబుద్ధి” గలవారి దృష్టియందు మాత్రమే ఈ కర్తృత్వ భోక్తృత్వముల ప్రతీతి అంతా సంభవించుచున్నది. ఆత్మజ్ఞానులలో అట్టి వివశత్వబుద్ధికి చోటు లభించుటయే లేదు.
ఎవరి చిత్తమైతే సంసారమునందు సక్తము కాకుండా, ఆత్మవిచారణయందు మాత్రమే మగ్నమై ఉంటుందో, అట్టి తత్త్వవేత్తలకు మోక్షము అనుదాని ప్రస్తావన యొక్క అవసరమే ఉండదు. "ఇది బంధము, ఇది మోక్షము" అను ప్రహసనమంతా సంసారము నందు ఆసక్తిగల అజ్ఞానుల కొరకు, అజ్ఞానము తొలగించుకోవటానికి సాధనంగా మాత్రమే అయి వున్నది. జ్ఞానియందు శుద్ధాత్మతత్త్వము అత్యంత సహజంగా, కేవలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. వాస్తవానికి అజ్ఞాని యందు కూడా అట్లే ప్రకాశిస్తోంది.
జ్ఞాని సర్వదా ఏమియు చేయనివాడై ఉంటున్నాడు. అజ్ఞాని ఇంద్రియ వ్యవహారములను ఆత్మకు ప్రతిపాదించి "నేను చేయువాడను” అను భావమునకు లోనగుచున్నాడు.
ద్రష్టకు అభిన్నమైన ఆత్మతత్త్వము తన యొక్క సర్వస్వరూపత్వమును తనకు తానే "ప్రకటించుకొనుట, ప్రకటించుకోకపోవుట" రెండూ నిర్వహిస్తోంది.
న బంధో9 స్తి న మోక్షోస్తి నాబందోస్తి న బంధనమ్ | అప్రబోధాదిదం దుఃఖం ప్రబోధాత్ప్రవిలీయతే ॥ (శ్లో. 22, సర్గ 38) యథార్థానికి బంధముగాని మోక్షముగాని లేవు. బంధమును కల్పించగల కారణమూ లేదు. మరి దుఃఖము ఎందు కలుగుతోంది? అజ్ఞానము, అవిచారణల కారణంగానే సుమా!
అట్లు కలుగుచున్న దుఃఖం జ్ఞానంచే నశించగలదు. బంధ-మోక్షాలు మిథ్యారూపంగానే కల్పించబడుచున్నాయి. కాబట్టి రామా! సర్వమును సర్వదా త్యజించగలిగినవాడవై ఉండుము. ధీరుడవగుము. అహంకారం పారద్రోలివేయి. అనాసక్తబుద్ధిచే సర్వసాక్షిత్వం అవధరించియుండు!
6. మోక్షసన్యాసం
శ్రీరాముడు: ఓ మహాత్మా! మీరు చెప్పుచున్నదానిని బట్టి “బంధ-మోక్షములు అనబడేవి అసంభవం. కేవలం పరబ్రహ్మము మాత్రమే సత్యము” అని అర్థమగుచున్నది. అయితే గోడ లేకుండానే ఎక్కడైనా లిఖించబడిన చిత్రం ఉంటుందా? ఈ సృష్టి అంతా ఏర్పడుతున్నది ఎక్కడ? బంధమే లేనప్పుడు మాకు కలుగుచున్న దుఃఖాదుల సంగతి ఏమిటి?
Page:189
శ్రీ వసిష్ఠ మహర్షి: బ్రహ్మమే ఈ 'సర్వజగత్తు' రూపమున వివర్తభావము పొందుచున్నది. అది సర్వశక్తిమంతమైనది. కార్యశక్తులన్నీ బ్రహ్మము యొక్క సంకల్పం చేత బ్రహ్మమునందే ఏర్పడి ఉంటున్నాయి. అద్దాని ఊహాశక్తి మాత్రం చేత జగత్ ప్రవృత్తి అంతా ఏర్పడి భాసించుచున్నది. దానియందు ఉనికి, అసత్తు, ఉనికిరహితం. ద్విత్వఏకత్వములు, ఏకత్వ-అనేకత్వములు, ఆది అంతములు... ఇట్టి వివిధ కల్పనలన్నీ స్వయంకల్పితానుసారమే రూపమును దిద్దుకుంటున్నాయి. శక్తిహీనమైన దానియందు ఇవన్నీ ఏర్పడగలవా...? లేదు. అయితే ఈ ఉనికి మొదలైనవన్నీ కూడా ఆత్మ కంటే అన్యమైనవి కావు. సముద్రజలంలో తరంగములు, బుడగలు, సుడులు, ఆవృత్తములు మొదలైనవన్నీ ఏర్పడుచున్నాయి కదా! అట్లు వ్యక్తమగుచున్నవన్నీ జలముకంటే వేరైనవా? కావే!
చిదాత్మ మొట్టమొదట చిత్తముతో కూడిన జీవరూపమును చెందుచున్నది. అప్పుడు వాసనామయ... మనోమయశక్తులన్నీ తనయందే ప్రకాశమొనర్చుచున్నది. ఆ శక్తులన్నిటినీ అనేక రీతులలో ప్రకటితం చేస్తోంది. ఆ ప్రకటనలే నామరూపములతో కూడిన ఆ సృష్టియొక్క అనుభవమైయున్నది. ఉపభోగం (Diversed experiencing)చే వాటినన్నిటినీ (ఈ అనేకంగా కనిపి స్తున్న సృష్టిశక్తులన్నిటినీ) ధరిస్తూ మరల ఎప్పటికో తిరోభావముచే సర్వం త్యజించి వేయుచున్నది. బ్రహ్మము నుండే...! -
లోకాః పరాద్ ఉపయాన్తి తస్మిం స్థిత్వా విశస్తి అలమ్ |
తన్మయా ఏవ సతతం తరంగా ఇవ సాగరే ॥ (శ్లో 7, సర్గ 39)
ఈ జీవులందరి వివిధ దృష్టుల ఉత్పత్తి బ్రహ్మము నుండే ఏర్పడుచున్నది. బయలు దేరుచున్నది. అట్లాగే సమస్త పదార్థముల ఉత్పత్తి కూడా నిరంతరం బ్రహ్మమునుండే కలుగు చున్నాయి. ఆ పరమాత్మ నుండే సమస్తము ఉద్భవిస్తోంది. పరమాత్మయందే ప్రవర్తిస్తోంది మరల పరమాత్మ యందే లయమగుచున్నది. సముద్రములో ఉత్పత్తి అగుచున్న తరంగములు మరల ఎప్పటికైనా సముద్రమందే లయమగుచున్నాయి కదా!
ఈ సర్వము నిరంతరము ఆ పరమాత్మయందే తన్మయమై ఒప్పుచున్నాయి. మట్టిచే తయారు చేయబడిన అనేక బొమ్మలు మట్టిచేతనే తన్మయమై ఉంటున్నాయి కదా!
7. నిత్యము నందు అనిత్యం
శ్రీరాముడు: హే మహాత్మా! మీ వాక్యములు గ్రహించుట మాకు కొంచెము కష్టమైనదిగా ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటారా?.. అగ్నిలో శీతలత్వం (చల్లదనం) ఉంటుందా, ఉండదు. జలంలో దహనశక్తి ఎక్కడన్నా సంభవిస్తుందా? సంభవించదే!
చైతన్యములో జడత్వం ఉంటుందా? ఎట్లా ఉంటుంది?
Page:190
అదృశ్యమగు బ్రహ్మమునందు దృశ్యము ఉండుట ఏమిటి? నిత్యమగు పరమాత్మయందు ఈ అనిత్యత్వమంతా ఏర్పడటం సమంజసమెట్లా అవుతుంది? కనుక, మీరు చెప్పిన వాక్యము, “సమస్త పదార్థముల యొక్క ఉత్పత్తి -స్థితి-లయములు బ్రహ్మము నందే చోటు చేసుకుని ఉంటున్నాయి...” అను దానికి తాత్పర్యమేమిటో నేను గ్రహించలేకపోతున్నాను.
ఇంద్రియములకు, మనస్సుకు కూడా వేరై, అతీతమై ఉంటున్న బ్రహ్మమెక్కడ?... క్షణ భంగురమగు ఈ పదార్థజాలమెచట? ఇది బ్రహ్మము నందు ఏర్పడుట ఏమిటి?
సరే, మీరు చెప్పినట్లు ఈ జగత్తు యొక్క నామరూపములు కాసేపు బ్రహ్మము నందే ఉత్పన్నమైనాయని అనుకొందాం. అట్లా అయితే ఈ జగత్తులో తారసపడుచున్న ప్రతి ఒక్క పదార్థము బ్రహ్మము యొక్క లక్షణము కలిగి ఉండాలి! ఈ పదార్థములన్నీ సత్-చిత్ ఆనంద మయము, శాశ్వతము, అఖండము అయి ఉండాలి కదా! దీపంలోంచి పుట్టినది దీపము వలెనే ఉంటోంది. మనుజుని నుండి మనుజుడు, గోధుమల నుండి గోధుమలు కలుగుచున్నాయికదా!
ఇదంతా బ్రహ్మము నుండి పుట్టుచున్నప్పుడు, బ్రహ్మమువలెనే ఉండాలి. కాని ఇక్కడి పరిస్థితి ఏమిటి? ఇక్కడి పదార్థములన్నీ నాశసహితమై, పరిమితమై, దుఃఖజనకమై ఎందుకు ఉంటున్నాయి? ఈ జగత్తు నిర్వికారమగు బ్రహ్మం నుండి కలిగితే, ఇవన్నీ నిర్వికారంగానే ఉండాలి.
“లేదు... ఈ జగత్తు ఆత్మకంటే భిన్నంగా వికారవంతమై యున్నది. కాని కాని ఇది
బ్రహ్మమునుండే పుట్టింది”... అని అంటారా? అనగా, బ్రహ్మము 'జగద్భావము' కలిగి ఉండాలి కదా? మరి అది 'భావాతీతము త్రిగుణరహితము' అని ఎందుకు చెప్పబడినట్లు?
మీరు చెప్పినట్లు “ఈ జీవులు... వారి వింత దృష్టులు... ఈ పదార్థజాలము”... ఇవన్నీ బ్రహ్మం నుండే, లేక పరమాత్మనుండే ఉత్పన్నమైనాయని అనుకుందాం... అప్పుడు “పరమేశ్వరుడు వస్తుదృష్టిని జీవులలో కలిగిస్తూ ఉంటాడు"... అను కళంకం ఆపాదించబడినట్లే కదా!
ఇంత విచారణ విన్న తరువాత నా ప్రశ్నలలో ఏదైనా లోపము ఉంటే నన్ను క్షమించండి. శ్రీ వసిష్ఠ మహర్షి: ఓహో! చాలా మంచి ప్రశ్ననే వేశావు. నీ సందేహములన్నిటికీ మేము ఇస్తున్న సమాధానం వినుజలమునకు ఆకారమున్నదా? లేదు. కాని మనకు సముద్రములోని తరంగమునకు ఆకారము కనిపించుచున్నది కదా! ఆ ఆకారము వాస్తవమైనదేనా? కాదు.
అట్లే ఈ సమస్తము బ్రహ్మమునందు స్ఫురించుచున్నది. సముద్రజలంలో తరంగరూపమున కనిపిస్తున్నప్పుడు, 'తరంగము' అను రూపంగా అక్కడ ఎట్టి ఘనత్వము లేదు కదా! బ్రహ్మమునందు జగత్తుకు సంబంధించిన మాలిన్యము లేశమాత్రం కూడా లేదు.
అగ్నియందు ఉష్ణత్వము తప్ప మరింకేమి ఉంటుంది?
ఈ ప్రపంచమునందు బ్రహ్మముకంటే భిన్నమైన, ఏ కల్పనా ఎక్కడా లేదు.
Page:191
శ్రీరాముడు: మహర్షీ! బ్రహ్మము దుఃఖరహితము, నిర్ద్వందము కూడా! మరి దాని నుండి కలిగిన ఈ జగత్తు దుఃఖమయముగా, ద్వంద్వసహితంగా ఎందుకు ఉన్నది? తండ్రీ! మీ వాక్యార్థము లేమిటో నాకు ఇప్పటికీ బోధపడుటలేదు. మా ఉద్దేశమేమిటో నేను గ్రహించలేకపోవుచున్నాను.
భగవంతుడు వసిష్ఠ మహర్షి రామునియొక్క ఈ ప్రశ్నను మౌనంగా విన్నారు. ప్రశాంత మైన చిత్తముతో ఆతని రెండు ప్రశ్నల పూర్వాపరములను పరిశీలిస్తూనే తనయందు ఇట్లు
యోచించసాగారు.
శ్రీ వసిష్ఠ మహర్షి: (తన అంతరంగంలో) “ఈ రామచంద్రుని బుద్ధి ఇంకను పూర్ణ ప్రకాశము పొందినట్లు లేదే? కొంచెము నైర్మల్యము ఇంకను మిగిలియే ఉన్నట్లున్నది. ఇప్పుడు ఇతని బుద్ధిని ఆత్మవస్తువునందు సూటిగా ప్రవేశింపజేయాలి. అప్పుడు ఇతనిలో ఇంకా ఏర్పడి ఉంటున్న సంశయములకు చికిత్స జరుగగలదు. ఎవరి బుద్ధి అయితే పరిపక్వత కలిగియుండదో అట్టి వాడు... “ఈ జగత్తు బ్రహ్మమే'... అను వాక్యమునకు అర్థమును గ్రహించలేదు.
ఎవరైతే పరిపక్వమైన బుద్ధితో జగద్భావము త్యజిస్తాడో, చిదేకరసమగు ఆత్మతత్వమును మాత్రమే దర్శించగల సమర్థత కలిగి ఉంటాడో... అట్టివాడు మాత్రమే “జ్ఞాతజ్ఞేయుడు’.* అట్టి ధీమంతుడు మాత్రమే “సర్వం బ్రహ్మమే” అను మోక్షప్రవచనము యొక్క పరాకాష్ఠకు తగినవాడ గుచున్నాడు. అట్టి మహాత్ములు ఆ పదార్థాదులందు దోషబుద్ధి పొందుటలేదు. వారు సర్వపరిమిత దృష్టులు అధిగమించి ఉంటున్నారు. అందుచేత ఇందలి సర్వాత్మకత్వము వారికి తప్పక అవగతమ గుచున్నది.
ఈ జగత్పదార్థముల ఉనికి, వినాశనములకు, అప్రమేయమగు ఆ ఆత్మతత్వమునకు.... ఈ రెండింటికీ కూడా ఆత్మజ్ఞానికి విరోధమేమీ కనిపించుటలేదు. అందుచేత ఈ రామచంద్రునికి నేను ఈ జగత్తులో కనబడే వస్తువులయొక్క దృశ్యము యొక్క వాస్తవతత్వమేమిటో బోధిస్తాను. అప్పుడు గాని ఇతనికి ఉత్తమ విశ్రాంతి లభించదు.
దృశ్య ప్రపంచమును ప్రాప్తింపజేయగల 'భోగదృష్టి' కలిగి ఉన్నంతకాలం ఈ జీవుడు దృశ్యంలోని ఏవేవో విషయములను భావిస్తూనే ఉంటాడు గాని, మహావాక్యముల యొక్క అర్థమును గ్రహించగలుగుతాడా? లేదు. పైగా, అనుక్షణం తత్త్వజ్ఞానము నుండి 'చ్యుతి' పొందుతూనే ఉంటాడు.
బుద్ధి పరిపక్వత పొందనప్పుడు “నాయనా! నీతోనూ, నాతోసహా ఈ సర్వము బ్రహ్మమే”... అని చెప్పితే మాత్రం ఏం లాభం? విషయభోగేచ్ఛ ఉన్నంతవరకు బ్రహ్మమును ప్రతిపాదించు వాక్యములు చిలుకపలుకులవలెనే ఉంటూ ఉంటాయి. భోగేచ్ఛ నశించిందా, అప్పుడు క్రమంగా అజ్ఞానం తొలగటం, “ఈ సర్వము ఆత్మ స్వరూపుడనగు నా మహిమయే" అను ఎరుక ఏర్పడటం ఒక్కసారే జరుగుతూ ఉంటాయి.
జ్ఞాతజ్ఞేయుడు = ఏదైతే తెలుసుకొనవలసియున్నదో అది తెలుసుకొనినవాడు.